Tuesday, December 8, 2015

స్టార్టప్ మానియా

ప్రపంచంలో ఎక్కడాలేని స్టార్టప్ మానియా మనదేశంలో కనిపిస్తోంది. ఉద్యోగాల్ని అర్థించకుండా.. కల్పించాలన్న ప్రభుత్వాల పిలుపు యువతపై బాగా ప్రభావం చూపింది. ఏమాత్రం అనుభవం లేకుండానే ఈ రంగంలోకి దిగుతూ బోర్లా పడుతున్నారు. అదే చక్కని వ్యాపార వ్యూహాలతో ముందుకెళ్లే కంపెనీలు మంచి లాభాల్నే చవిచూస్తున్నాయి.

మనదేశంలో స్టార్టప్ కంపెనీల్లో పదిశాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. వ్యాపారంలో అనుభవం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. టాప్ బిజినెస్ స్కూళ్లు, ఐఐటీ, ఐఐఎంల్లో చదువుకున్న వాళ్లయినా సరే.. నేరుగా వ్యాపారంలో దిగితే నష్టపోతున్న వారు అనేకం. అదే కొన్నాళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత వస్తున్న వారు మాత్రం ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా తక్కువ. స్టార్టప్ ల కోసం యూత్ తహతహలాడేందుకు కారణం ఈ-కామర్స్ బూమే. నాలుగైదేళ్లు వెనక్కి వెళ్తే టెలికాం రంగంలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్.. ఇలా అన్ని కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేవి. నెలనెలా కోట్లలో కొత్త సిమ్ కార్డులు సేల్ అవుతుండేవి. కారణం.. కంపెనీల ఆఫర్ల కోసమే తీసుకునేవాళ్లు ఎక్కువ. ఆఫర్ అయిపోగానే వాటిని పక్కన పడేసేవాళ్లు. అంటే వాపు చూసి బలుపు అనుకున్నాయి అప్పట్లో టెలికం కంపెనీలు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఈకామర్స్ రంగంలో కనిపిస్తోంది.

ప్రస్తుతం భారత ఈకామర్స్ మార్కెట్ విలువ దాదాపు రెండు లక్షల కోట్లు. 2020 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని గోల్డ్ మాన్ శాక్స్ అంచనా. టాప్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్ కార్ట్ సేల్స్ చూస్తే 2013-14కన్నా 14-15వ ఆర్థిక సంవత్సరంలో మూడింతలు  పెరిగాయి. కానీ పైసా లాభం రాలేదు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2వేల కోట్లు నష్టపోయింది. అంతకుముందు ఏడాది నష్టం 715 కోట్లు.  సేల్స్ పెరుగుతున్నకొద్దీ నష్టాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే దీనికి కారణం. డిస్కౌంట్లు, ప్యాకేజింగ్, రవాణా, ఉద్యోగుల జీతాలు, వెబ్ సైట్ నిర్వహణ, లేటెస్ట్ టెక్నాలజీ వాడకం.. ఇలా అన్నీ ఖర్చులే. ఆదాయ మార్గాలు మాత్రం సెల్లర్స్ నుంచి వచ్చే కమీషన్, కస్టమర్ డేటా, లాయల్ కస్టమర్స్ కొనుగోళ్లు. అన్ని వెబ్ సైట్లదీ ఇదే పరిస్థితా అంటే అదేంలేదు. ఇందుకు అమెజాన్, ఈబే లాంటి కంపెనీలే నిదర్శనం. బహుళజాతి ఆన్ లైన్ మార్కెట్ సంస్థలైన అమెజాన్, ఈబే, అలీబాబా చక్కని లాభాల్ని ఆర్జిస్తుండటం విశేషం. కారణం.. వాటికి పటిష్టమైన బ్యాక్ ఎండ్ వ్యవస్థ ఉండటం ఒకటైతే.. ఒక్కసారిగా లాభాలు ఆర్జించే దగ్గరి దారుల్ని వెతకవవి. ఎంత డిస్కౌంట్ ఇవ్వొచ్చో అంతే ఇస్తాయి. అదే వాటిని ఇంతటి పోటీ ప్రపంచంలోనూ మేటి ఈకామర్స్ కంపెనీలుగా నిలబెట్టాయి.

వెబ్ సైట్లు, యాప్ లంటూ టెక్నాలజీకి, కస్టమర్లను ఎట్రాక్ట్ చెయ్యడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్న మన కంపెనీలు.. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టట్లేదన్నది నిపుణుల విశ్లేషణ. వాట్సాప్ లాంటి కంపెనీలు ఖాతాదారుల అభిరుచులు, ఆలోచనలను తెలుసుకుని.. వాటిని విశ్లేషించి విక్రయించడం ద్వారా భారీ ఆదాయం ఆర్జిస్తున్నాయి. కానీ మన ఈకామర్స్ సైట్ల దగ్గరా కోట్లలో కస్టమర్లున్నా.. వారు ఏమేం కొంటారో తెలిసినా.. ఆ డేటాని విశ్లేషించలేకపోతున్నాయి. పైగా యాడ్ రెవెన్యూని పెంచుకోవడంలోనూ వెనుకబడ్డాయి. అందుకే చివరికి ఉద్యోగుల్ని తొలగిస్తూ.. ఆపరేషన్స్ క్లోజ్ చేస్తూ అబాసుపాలవుతున్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా... అనుభవం... అనుభవ రాహిత్యం మధ్య తేడా గమనించకుండా వ్యాపార రంగంలో అడుగు పెడితే చేతులు కాలడం ఖాయమన్నది ఈ కామర్స్‌ బిజినెస్‌ను చూస్తే అర్థమవుతుంది.

ఆన్‌లైన్ బూమ్‌తో తంటా

యూత్ ఎక్కువగా ఉన్న మన దేశంలో ఆన్ లైన్ బూమ్ తెచ్చిన తంటా అంతాఇంతా కాదు. సంప్రదాయ వ్యాపారాన్ని దెబ్బతీస్తూ యావద్దేశాన్ని ఈ-కామర్స్ వైపు ఆకర్షిస్తోంది. ఐతే సరైన ప్లాన్ లేక.. గంపెడాశలతో వచ్చిన చాలా స్టార్టప్ కంపెనీలు ఏడాది తిరక్కముందే చాపచుట్టేస్తున్నాయి. చిన్నాచితకా వెబ్ సైట్లే కాదు.. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి టాప్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లకూ నష్టాలు తప్పలేదు.

ఆన్ లైన్ బూమ్ మనదేశంలో వ్యాపార పోకడల్ని పూర్తిగా మార్చేసింది. గుండు పిన్ను మొదలు కార్ల వరకూ ఇప్పుడేది కావాలన్నా ఆన్ లైన్లో కొనుక్కోవచ్చు. కొన్ని కంపెనీలు సొంతంగా.. వాటి ఉత్పత్తుల కోసమే ఆన్ లైన్ మార్కెట్లో ప్రవేశిస్తే.. అంగళ్లను పోలిన వ్యాపార విధానంలో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, ఆస్క్ మీ బజార్, పేటీఎం లాంటివి అమ్మకాల్లో అదరగొడుతున్నాయి.

బిగ్  బిలియన్ డే, వీకెండ్ ఆఫర్స్, ఫెస్టివల్ డేస్.. ఇలా తోచిన ఆలోచనని అమలు చేస్తూ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇన్ని వెబ్ సైట్లలో దేంట్లో కొనాలో అన్న అయోమయం మీకెందుకంటూ.. ఎక్కడ తక్కువ ధర ఉందో చెప్పేందుకు మరో వెబ్ సైట్.. ఇలా వ్యాపారమంతా ఆన్ లైన్ అయిపోయింది. అదే వాటికి చేటు తెస్తోంది. అంతా ఒక్క క్లిక్ తోనే తెలిసిపోతుంది. ఇది ఓ విధంగా కస్టమర్లకు వరంలా మారినా.. కంపెనీలకు ప్రతికూలంగా తయారైంది. కస్టమర్లను నిలుపుకోవడం ఇప్పుడు ఈకామర్స్ కంపెనీలకు సవాల్‌గా మారింది.

బూమ్ ని చూసి మొదట్లో ఈ-కామర్స్ సైట్లకు వందలు, వేల కోట్ల పెట్టుబడులు వరదలా వచ్చిపడ్డాయి. విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థలతోపాటు దేశీయంగానూ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడికి ఛాన్స్ వస్తే చాలన్నట్లు వ్యవహరించారు. ఒక్కసారిగా వచ్చిపడ్డ నిధుల్ని చూసి చాలా కంపెనీలు వాటి వ్యాపారాన్ని వేగంగా విస్తరించాయి. ప్రాడక్ట్ పోర్ట్ ఫోలియోతోపాటు తమ వెబ్ సైట్లో అమ్ముకునే రిటైలర్ల సంఖ్యనీ గణనీయంగా పెంచుకున్నాయి. ఇందుకోసం వేలమంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. దీంతో దశాబ్దాలుగా మెట్టూ మెట్టూ ఎక్కుతూ వచ్చిన టాటా, బిర్లా, రిలయన్స్ లాంటి కంపెనీల మార్కెట్ విలువ సైతం వీటిముందు దిగదుడుపైంది. ఒక్కరోజే ఆరొందల కోట్ల అమ్మకాలు జరిగితే ఏటా ఎంతుండాలి.. లాభమెంత వస్తుంది.. ఐదేళ్లు, పదేళ్లు.. ఇలా భవిష్యత్తు లాభాల్ని పేపర్ పై పెట్టడంతో ఈ-కామర్స్ కంపెనీల మార్కెట్ విలువ లక్షల కోట్లకు చేరింది. అంతా గుడ్ విలే.. కానీ విలువ మాత్రం వేలు, లక్షల కోట్లలనే ఉంది. దీన్ని చూసి కొత్త స్టార్టప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్లాన్ ని పేపర్ పెట్టడం, నిధులు రాబట్టడం.. అనుకుందే తడవు నెలలోపే స్టార్ట్ చెయ్యడం జరిగిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఆ తర్వాతే వాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. మొదట్లో కస్టమర్ ని రాబట్టుకోవడానికి రిటైలర్ రేట్ మీద మరికొంత డిస్కౌంట్ ఇచ్చిన కంపెనీలు.. తర్వాత వారిని నిలబెట్టుకోవడానికి కూడా మళ్లీ మళ్లీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోంది. అంటే తయారీ ధరకన్నా తక్కువ ధరకే అమ్ముతున్నారన్నమాట. వాటికితోడు ప్యాకింగ్, డెలివరీ అదనపు ఖర్చులు ఎలాగూ ఉన్నాయి. ఇంతా చేసినా కస్టమర్లు సెలెక్టివ్ గా కొన్ని ఉత్పత్తులు మాత్రమే  ఎక్కువగా కొంటున్నారు. అవికూడా కంపెనీలకు తక్కువ మార్జిన్లు వచ్చే ఉత్పత్తులే. ఎక్కవు కమీషన్ ఉండే ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితేనే నష్టాల్ని తగ్గించుకోవచ్చన్నది వాటి వ్యూహం. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. దీంతో నిర్వహణ కష్టంగా మారింది. కొత్త నిధులు రాక, ఇక డిస్కౌంట్లు ఇచ్చేపరిస్థితి లేక.. చాలా కంపెనీలు చేతులెత్తేశాయి. కొంతమంది ఎంతకో అంతకు వెబ్ సైట్లను అమ్మేసుకుంటుండగా.. ఇంకొంతమంది కార్యకలాపాలను పూర్తిగా ఆపేశారు. ఈ ప్రభావం రెడీమేడ్ ఫుడ్, గ్రాసరీ రంగంలోని వెబ్ సైట్లపై ఎక్కువగా పడింది. ఫుడ్ పాండా, స్విగ్గీ, జొమాటో.. ఇలా ఎన్నో సైట్లు మనకు దగ్గర్లోని రెస్టారెంట్లను వెతికి పెట్టడమే కాక.. ఆర్డరిస్తే అరగంటలో రెస్టారెంట్ రేటు కన్నా తక్కువకే ఇంటికి తెచ్చిస్తున్నాయి. రెస్టారెంట్ల నుంచి వచ్చే 10-15శాతం కమీషన్ ట్రాన్స్ పోర్టేషన్ కే పోతుంది. మరి ఉద్యోగి శాలరీ, వెబ్ సైట్ నిర్వహణ, ప్రకటనల ఖర్చులు.. ఇలా చూస్తే ఏ విధంగానూ లాభం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అటు ట్యాక్సీ క్యాబ్స్ కోసం వచ్చిన ఓలా, ఉబర్ లాంటి కంపెనీలు గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి.

ఇక కిరాణా సరకుల రంగంలో ఉన్న గ్రాసరీ వెబ్ సైట్లదీ మరీ దీనగాధ అని చెప్పాలి. డిస్కౌంట్లు, కూపన్స్ అంటూ ఇంటర్నెట్లో విచ్చలవిడి ప్రచారమే వాటి కొంపముంచుతోంది. ఇలాంటి ఎత్తుగడల్ని ఎలా సొమ్ము చేసుకోవచ్చో బాగా తెలిసిన మన నెటిజన్లు.. ఫ్రీ కూపన్స్ వరకే వాటి దగ్గర కొనుగోలు చేస్తున్నారు. మిగతా వాటికోసం ఇంటి దగ్గర్లోని దుకాణాలకు, హోల్ సేల్ షాపులకు వెళ్తున్నారు. అందుకే చాలా వెబ్ సైట్లు ఒకట్రెండు నెలల్లో వందల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. భవిష్యత్తు లాభాల్ని చూసి వీటిలో పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. లాభం మాట దేవుడెరుగు అసలొస్తే చాలన్నట్లు తమ వాటాల్ని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కస్టమర్లకు వరం.. కంపెనీలకు నష్టాలు

ఏ వస్తువైనా తయారీ ధరకు దొరుకుతుందా? పైసా లాభం లేకుండా ఎవరైనా అమ్ముతారా? సంప్రదాయ వ్యాపారంలో ఈ పరిస్థితి ఎక్కడా ఉండదు. ఒక్కో మెట్టు ఎక్కితేనే పైకెళ్లేది.. ఒకేసారి ఆకాశానికి నిచ్చెనెయ్యాలని చూస్తే ఏమవుతుంది? ఈ తప్పే ఇండియన్ ఈ-కామర్స్ ని ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టేసింది. భవిష్యత్తు లాభాల్ని బేరీజు వేసుకొని వర్తమానంలో నష్టాల్ని కోరి కొనితెచ్చుకుంటున్నాయి.

అతి సర్వత్రా వర్జేయత్.. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ఏ వ్యాపారంలోనైనా ప్రాథమిక సూత్రం ఒకటి ఉంటుంది. లాభాల విషయం పక్కనబెడితే నష్టం రాకుండా అమ్ముకోవాలి. కానీ స్టార్టప్ ల పేరుతో రోజుకో ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ పుట్టుకొచ్చి.. పూర్తి వ్యతిరేక విధానంలో వ్యాపారం చేస్తున్నాయి. నష్టమొచ్చినా సరే కస్టమర్ ని ఆకర్షించాలన్న సూత్రంతో ముందుకెళ్తున్నాయి. కస్టమర్ బేస్ పెరిగితే లాభాలు వాటంతటవే వస్తాయన్నది ఈ-కామర్స్ కంపెనీల వ్యూహం. అందుకే కొనుగోలుదారులను పెంచుకోవడమే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులోనూ వైవిధ్యం కనిపిస్తోంది. ఆఫర్లకోసం వీకెండ్స్, పండగల దాకా ఎందుకు ఎదురుచూపులు ఇదుగో తీసుకోండంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి.

కొన్ని కంపెనీలైతే కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు మరో అడుగు ముందుకేసి రూపాయికే అంటూ ఊదరగొడుతున్నాయి. మరికొన్ని ఈ-కాం వెబ్ సైట్లు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే వందల రూపాయల విలువైన కూపన్స్ ఫ్రీగా ఇస్తున్నాయి. మనదేశంలో ఇప్పుడిదో వ్యాధిలా మారింది. లాయల్టీ కస్టమర్లుగా మార్చుకుంటే జీవిత కాలం ఆదాయం పొందొచ్చన్నది వాటి ఆలోచన. ఇదే వాటి కొంప ముంచుతోంది. వాటి దూరాలోచనే దురాలోచనగా మారి నష్టాలపాలు జేస్తోంది.

ఒక్కో కస్టమర్ ని ఆకర్షించడానికి ఈ-కామర్స్ వెబ్ సైట్లు సగటున 200 నుంచి 500 రూపాయల దాకా ఖర్చు చేస్తున్నట్లు ఓ అంచనా. ఆన్ లైన్ కొనుగోళ్ల సగటు ఆర్డర్ విలువ నాలుగొందలకు మించట్లేదని ఓ అధ్యయనంలో తేలింది. రోజురోజుకూ కొనుగోలు దారుల సంఖ్య, ఆన్ లైన్ మార్కెట్ సైజ్ పెరుగుతోందే తప్ప.. సగటు కొనుగోలు విలువ మాత్రం వందల్లోనే ఉంటుంది. అటు ఎక్కువ అమ్ముడయ్యే చాలా ఉత్పత్తులపై ఈ కంపెనీలకొచ్చే కమీషన్ పది శాతానికి మించట్లేదు. అంటే ఒక కస్టమర్ కు ఇచ్చిన డిస్కౌంట్ ని రాబట్టుకోవాలంటే మళ్లీ అతను మరో 10-12 సార్లయినా అదే వెబ్ సైట్లో కొనుగోలు చెయ్యాలి. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. కస్టమర్లేం తెలివి తక్కువవాళ్లు కాదుకదా.. ఏ వెబ్ సైట్లో తక్కువ ధర ఉందో తెలిపే మై స్మార్ట్ ప్రైస్ డాట్ కామ్ లాంటి వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఎక్కడ తక్కువుంటే అక్కడే కొంటారు.. అది ఫ్లిప్ కార్ట్ అయితేంటి, స్నాప్ డీల్ అయితేంటి? ఆన్ లైన్లో ఎక్కడా ఎమ్మార్పీ మీద ఐదు, పదిశాతానికి మించి డిస్కౌంట్ రావట్లేదని గ్రహిస్తే.. ఆఫ్ లైన్ లో సంప్రదాయ రిటైల్ షాపులకు వెళ్లి కొనుక్కుంటున్నారు. పైగా కొత్తగా పుట్టుకొచ్చే కంపెనీలు సైతం ఒకేసారి పాతవాటికి పోటీ ఇవ్వాలని చూస్తున్నాయి. ఇందుకోసం కూపన్లు, ఫ్రీగిఫ్ట్ లు, సినిమా టికెట్ల పేరుతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇదే వాటిని బొక్కబొర్లా పడేస్తోంది.

Monday, November 9, 2015

ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?

కర్టెసీ : Sakshi

బంగారంతో మనది విడ దీయరాని బంధం. అందుకేనేమో! వినియోగంలో చైనానూ మించిపోయారు మనవాళ్లు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో భారీ విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పెపైచ్చు దేశాభివృద్ధికి ఈ బంగారం పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించింది. ఒకటి బంగారం బాండ్లు. రెండు నాణేలు. మూడు బంగారం డిపాజిట్.

ఈ మూడింటి లక్ష్యం ఒక్కటే. బంగారం కొనుగోలు చేయాలన్న భారతీయుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే... అందుకోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం... విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం... ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం. ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరతాయనేది పక్కనబెడితే... అసలు ఈ పథకాలు ఎవరికి పనికొస్తాయి? లాభమెంత? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఫైనాన్షియల్ ప్లానర్ ‘అనిల్ రెగో’ చేస్తున్న ఈ విశ్లేషణ.

* అందుబాటులోకి కొత్త బంగారు పథకాలు  
* పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ బాండ్లు
* ఇంట్లో భారీ బంగారం ఉన్నవారికి డిపాజిట్ స్కీమ్ 
* చిన్న మదుపరులకు ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లే బెటర్
* కావాలనుకుంటే కొనుక్కోవటానికి నాణేలు కూడా

కొత్త కొత్తగా గోల్డ్ బాండ్లు...
గోల్డ్ బాండ్లను జారీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ఇది పరిమిత కాల పథకం. అంటే ఈ నెల 5న ఆరంభమైంది. 20వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు 20వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు జారీ చేస్తున్న ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఉంటుంది. బాండ్లకు, ఈ వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది.

గ్రాము విలువను ప్రభుత్వం రూ.2,684గా నిర్ణయించింది. అంటే బాండ్లు ఎవరు కొన్నా ఈ ధరకే కొనాల్సి ఉంటుంది. కనీసం రెండు గ్రాముల్ని, గరిష్ఠంగా 500 గ్రాముల్ని కొనుగోలు చేయొచ్చు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.

సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై  ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్‌బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు.

ఎక్కడ కొనుగోలు చేయాలి?
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లకు కూడా దరఖాస్తులు తీసుకుని బ్యాంకుల్లో అందజేయటానికి అనుమతి ఉంది.

ఎవరికి లాభం?
వడ్డీ కూడా వస్తుంది కనక... బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు నేరుగా బం గారం కొనకుండా ఈ బాండ్లు కొనవచ్చు. వీటిని పేపర్ రూపంలోను, డీమ్యాట్ రూపంలోను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ రకంగా కొనుగోలు చేసినపుడు దీన్ని దాచుకోవటం చాలా ఈజీ. పెపైచ్చు తరుగులాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించి నగదు చేసుకోవచ్చు.

నష్టాలున్నాయా?
బాండ్లతో నష్టాలున్నాయని చెప్పలేం. అయితే బంగారం ధరలోని హెచ్చుతగ్గులు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత బంగారం ధర తగ్గితే మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఈ స్కీమను ప్రకటించినపుడు... అప్పటి ధరను పరిగణనలోకి తీసుకుని గ్రాము ధరను రూ.2,684గా నిర్ణయించింది.

కాకపోతే నవంబరు 5న ఈ స్కీమ్ ఆరంభించేనాడు ముంబై బులియన్ మార్కెట్లో గ్రాము ధర రూ.26,025గా ఉంది. అంటే దాదాపు 660 రూపాయలు తగ్గినట్లు. ఇది 2.75 శాతానికన్నా ఎక్కువే. అంటే తొలి ఏడాది ఇస్తామన్న వడ్డీ ఈ రకంగా పోయినట్లన్న మాట. ఇలాంటి రిస్కులుంటాయని గమనించాలి.

గోల్డ్ ఈటీఎఫ్‌లు/ మ్యూచ్‌వల్ ఫండ్లు
ఇవేవీ కొత్తగా ఆరంభించినవి కావు. కాకపోతే బంగారంలో మదుపు చేసే పథకాల గురించి తెలుసుకుంటున్నాం కనక గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు), గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల (ఎంఎఫ్‌లు) గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లంటే బంగారం ధరను బట్టి ఆ ధరకే ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఫండ్లన్న మాట.

షేర్ల మాదిరే వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయటం, విక్రయించటం చేయొచ్చు. దీన్లో కనీస పెట్టుబడి రూ.5వేలు. డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. అయితే దీన్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్‌మెంట్ కుదరదు. ప్రస్తుతం 13 సంస్థల వరకూ ఈటీఎఫ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అదే గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లకైతే డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. నెలకు రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ పద్ధతిలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్..
ప్రభుత్వం దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌గా పిలుస్తోంది. అంటే బంగారాన్ని డబ్బు చేసుకునే పథకమన్నమాట. దీనిప్రకారం మన దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాల్ని డిపాజిట్ చేస్తే అక్కడ రాళ్లు, ఇతరత్రా తరుగు తీసేసి, దాన్ని కరిగించి నిపుణులు దాని బరువెంతో లెక్కిస్తారు.

ఒకవేళ బంగారు నాణేలు, బార్లు డిపాజిట్ చేస్తే వాటి బరువును అక్కడే చెబుతారు. ఆ బరువును పేర్కొంటూ మీకొక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెనక్కి తీసుకునేటపుడు ఆ సర్టిఫికెట్‌ను అందజేస్తే దాన్లో పేర్కొన్న బరువు గల బంగారాన్ని మీకిస్తారు. అంతేతప్ప మీ ఆభరణాలను తిరిగివ్వరు. అదనపు ఆకర్షణేంటంటే దీనిపై వడ్డీ కూడా ఇస్తున్నారు.

ఈ వడ్డీ 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకూ ఉంటుంది. నిజానికిదేమీ తొలిసారి అందిస్తున్న పథకం కాదు. చాలా కాలం కిందటే ఎస్‌బీఐ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత బంగారాన్నయినా డిపాజిట్ చేయొచ్చు. దీనికి పరిమితి లేదు. 1999 నాటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కూడా ఇలాంటి మినహాయింపులు ఉంటాయనే భావిస్తున్నారు.

ఎవరికి లాభం?
ఆభరణాల రూపంలో కాకుండా బార్ల రూపంలోనో, నాణేల రూపంలోనో ఇంట్లో బంగారం ఉన్నవారికి ఇలాంటి పథకాలు లాభదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని భద్రంగా దాచుకోవటం కూడా సమస్యే. అదే బ్యాంకులో అయితే భద్రత సమస్య ఉండదు. పెపైచ్చు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆదాయమూ రాదు. బ్యాంకులో ఉంటే ఏటా వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులో కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.

నష్టాలు ఉన్నాయా?
బంగారం ఉన్నవారు డిపాజిట్ చేస్తే మంచిది తప్ప బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న వారు దాన్ని కొని డిపాజిట్ చేయటం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తరవాత ధర తగ్గితే ఆ మేరకు నష్టపోవాల్సి ఉంటుందని గమనించాలి.

కేంద్రం తాజాగా అశోకచక్ర చిహ్నంతో బంగారు నాణేలను కూడా విడుదల చేసింది. ఎంఎంటీసీ ఔట్‌లెట్లలో ఇవి లభ్యమవుతాయి. నాణేలు కొనాలనుకున్నవారికి కేంద్రమే అందిస్తోంది కనక ఇవి ఉపయుక్తమని చెప్పాలి. వీటిని ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించినా ఏకమొత్తంలో మదుపు; ధర తగ్గితే రిస్కు ఉంటాయి.

ఎవరికి ఏ పథకం లాభం?
గోల్డ్ ఈటీఎఫ్/ గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్స్  : ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేవారికి,  రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసేవారికి (సిప్)
 గోల్డ్ బాండు : ప్రభుత్వ మద్దతున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి; భవిష్యత్తులో బంగారం కొనా లనుకున్నవారికి
 గోల్డ్ డిపాజిట్ పథకం : నేరుగా బంగారం ఉండి, దాన్ని అదే రూపంలో తమ వద్ద ఉంచుకోకూడదని భావించేవారికి

ఉదాహరణకు ఈ మూడు పథకాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకు సమానమైన బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం...

ఈ పట్టిక చూస్తే ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఎంఎఫ్‌లకన్నా గోల్డ్ డిపాజిట్ స్కీమ్, బాండ్లపైనే ఎక్కువ రాబడి వస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం... వడ్డీ. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతిలో గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసినపుడు మిగతా వాటికన్నా ఎక్కుకే రాబడి రావచ్చు. ఎందుకంటే ధరలు పెరిగినా, తగ్గినా ఆ ధరలకే యూనిట్లు లభిస్తాయి కనక సగటు ధర తక్కువే ఉంటుంది.

లాభమూ బాగానే ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు బాగా పడిపోయినా ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ బాండ్లు, డిపాజిట్ స్కీమ్‌తో పోలిస్తే సిప్ పద్ధతిలో నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అయితే పై స్కీముల్లో వడ్డీ రేట్లు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. అందుకని బాగా డబ్బులుండి ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేదాద్దమనుకున్న వారికి, ఇంట్లో ఆభరణాలు కాకుండా అదనపు బంగారం ఉన్నవారికి మాత్రం పై రెండు స్కీములూ ఆకర్షణీయమేనని చెప్పొచ్చు.

Friday, July 10, 2015

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలు

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలు

                    గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు పతనమవుతాయో అంచనావేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడి పెట్టే కంటే... కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇలాంటి హెచ్చుతగ్గుల మార్కెట్లలో చిన్న ఇన్వెస్టర్లకు ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలతో చక్కని రాబడులను అందిస్తోంది.
                    మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో పెట్టుకొని ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ డైనమిక్ ఫండ్ ను ప్రవేశపెట్టింది.  డైనమిక్ ఫండ్ అనేది పూర్తిగా ఈక్విటీ పథకమే అయినా దీని పనితీరు భిన్నంగా ఉంటుంది. మార్కెట్లు పతనమైనప్పుడల్లా కొనుగోలు చేసి గరిష్టస్థాయికి చేరుకున్నప్పుడల్లా విక్రయిస్తుంటాయి. దీని వలన దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చక్కని లాభాలు వస్తాయి. 2002 అక్టోబర్ 31న ప్రారంభమైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్.... ప్రస్తుతం 59 స్టాక్స్ ను హోల్డ్ చేస్తోంది. 0.76 కంటే తక్కువగా బీటా ఫండ్ ను కలిగి ఉన్న ఈ ఫండ్ తొలి ఏడాది 7.96 శాతం రిటర్న్స్ ఇచ్చింది. తొలి మూడేళ్ళలో  ఏటా సగటున 19.59 శాతం,  ఐదేళ్ళలో 12.45 శాతం, ఏడేళ్ళలో 15.35 శాతం, పదేళ్ళలో 19.37 శాతం రిటర్న్స్ నిచ్చింది, ఇప్పటి వరకు ఏటా సగటున 25.62శాతం లాభాలను అందించింది. 2002లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 18 లక్షల 10 వేల 669 రూపాయలకు పెరిగింది.
                     బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీ రాబడితో పాటు డెట్  పథకాల రక్షణనూ పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌‍డ్ అడ్వాంటేజ్ ఫండ్.  2009 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ ఫండ్ కూడా ఇన్వెస్టర్లకు చక్కని రిటర్స్ ఇస్తోంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, హెచ్‌‍సీఎల్ టెక్నాలజీస్‌‍తో పాటు మొత్తం 64 కంపెనీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది.  అత్యుత్తమ కంపెనీలపైనే దృష్టి పెడుతోన్న ఈ ఫండ్..  తొలి ఏడాది 15.75 శాతం రాబడినిచ్చింది. తొలి మూడేళ్ళలో ఏటా సగటున 19.87 శాతం, ఐదేళ్ళలో 14.54 శాతం, ఏడేళ్ళలో సగటున 14.59 శాతం రిటర్న్స్ నిచ్చింది. 2006లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌‍డ్ అడ్వాంటేజ్  ఫండ్‌లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 2 లక్షల 58 వేల రూపాయలు. ఈ ఫండ్ ద్వారా వచ్చిన రిటర్న్స్‌కు పన్నుపరంగా కూడా ప్రయోజనం ఉంటుంది.
                     ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ లో చక్కని రిటర్న్స్ ఇస్తోంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్. 2008లో ప్రారంభమైన ఈ ఫండ్...   HDFC బ్యాంక్,  ICICI  బ్యాంక్,  ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్,  HCL టెక్నాలజీస్ తో పాటు మొత్తం 49 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. మెరుగైన కంపెనీలనే దృష్టి పెడుతోన్న ఈ ఫండ్..  తొలి ఏడాది 15.94 శాతం రాబడినిచ్చింది. తొలి మూడేళ్ళలో ఏటా సగటున 21.57 శాతం, ఐదేళ్ళలో 14.41శాతం, ఏడేళ్ళలో ఏటా సగటున 17.60 శాతం రిటర్న్స్ నిచ్చింది.  2008 నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ సగటున ఏటా 16.19  శాతం రాబడిని అందించింది. 2008లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 2 లక్షల 91 వేల 6 వందల రూపాయలుగా ఉంది.
                    మీ పోర్ట్ ఫోలియోలో తప్పనిసరిగా ఉంచుకోదగ్గ మరో ఫండ్... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్. ఇది వాల్యూ ఓరియెంటెండ్ ఫండ్. 2004లో ప్రారంభమైన ఈ ఫండ్ చక్కని ట్రాక్ రికార్డ్ ను కలిగి ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 65 నుంచి 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తోంది. ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, విప్రోతో పాటు మొత్తం 61 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. తొలి ఏడాది 27.83 శాతం రాబడినిచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్... తొలి మూడేళ్ళలో ఏటా సగటున 31.58 శాతం, ఐదేళ్ళలో 19.39శాతం, ఏడేళ్ళలో సగటున 24.58 శాతం రిటర్న్స్ నిచ్చింది. 2004 నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ సగటున ఏటా 24.95 శాతం రాబడిని అందించింది. 2004లో  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 11 లక్షల 34 వేల ఒక వంద రూపాయలుగా ఉంది.

Tuesday, December 30, 2014

వ్యాపార రంగానికి సరికొత్త జోష్.. (2014 రౌండప్)

  (సాక్షి సౌజన్యంతో)
Sakshi | Updated: December 30, 2014 05:31 (IST)
వ్యాపార రంగానికి సరికొత్త జోష్..
హైదరాబాద్ : ఎన్నో ఆశలు రేపుతున్న వ్యాపార రంగం కొత్త సంవత్సరంలోకి సరికొత్త జోష్ తో అడుగుపెడుతోంది. దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త సర్కారు సంస్కరణల బాట పట్టడం.. స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ విశ్వాసం చిగురించింది. మరోపక్క, అంతర్జాతీయంగా చమురు ధరలు నేలకు దిగి రావడం కూడా మనకు చేదోడుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మరింత పైకి ఎగిసిన చమురు ధరలు.. చివరికొచ్చేసరికి దిగిరావడం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయి.

తగ్గిన చమురు ధరలు
ఈ ఏడాది జూన్ నుంచీ చమురు ధరలు గణనీయంగా పడిపోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల అంశంగా మారింది. జూన్‌లో 110 డాలర్ల స్థాయిలో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు డిసెంబర్ నాటికి 60 డాలర్ల స్థాయికి పడిపోయాయి. పెట్రోల్ డీజిల్, ధరలు డిసెంబర్ లో రెండు సార్లు తగ్గడంతో వినియోగదారులకు వరంగా మారాయి. పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదో సారి తగ్గగా,  డీజిల్ ధర గత అక్టోబర్‌నుంచి వరుసగా నాలుగోసారి తగ్గడం గమనార్హం. అయితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న చమురు ధరలు ఎప్పుడు స్థిరత్వం పొందుతాయనే అంశంపై మాత్రం పూర్తి అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం దేశీ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తోంది.

ఈ-కామర్స్ జోరు- రిటైల్ బేజారు
ఇండియాలో ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది.  2014లో  ఈ-కామర్స్ విజృంభణ ముఖ్యాంశాల్లో ఒకటి.  చైనా దిగ్గజ సంస్థ అలీబాబా సహా పలు దేశాల ఈ కామర్స్ సంస్థల దిగ్గజాలు భారత్‌కు క్యూ కట్టారు. ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు బిగ్ బిలియన్ డే లాంటి పేర్లతో అత్యంత చవగ్గా వస్తువులు ఇచ్చేయడం లాంటివి ఈ కామర్స్ మరింత పుంజుకోడానికి దోహదపడ్డాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా రూ.1,50,000 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ విజయవంతం కావడం, ఆ సంస్థ చీఫ్ జాక్ మా ఆసియాలోనే అపర కుబేరిడినా అవతరించడం గమనార్హం. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ఈ కామర్స్ సంస్థలు హామీ ఇవ్వడంతో రిటైల్ సంస్థల్లో కొంత అనిశ్చితి నెలకొంది. ఈ విభాగం నేరుగా వ్యాపార రంగంలోకి ప్రవేశించడం వల్ల తమ అమ్మకాలు దెబ్బతింటాయని రిటైల్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ అమ్మకాలు భారీ తగ్గుముఖం పట్టేఅవకాశం ఉందని రిటైల్ సంస్థలు బేజారెత్తుతున్నాయి.

దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో దుమ్మురేపాయి. ఐదేళ్ల తరువాత మళ్లీ సెన్సెక్స్ ఏకంగా 6,038 పాయింట్లు(29%) ఎగసింది. ఒక దశలో చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో డిసెంబర్ 3న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి రూ. 100 లక్షల కోట్లను (ట్రిలియన్లు) అధిగమించింది.  ఈ ఏడాది 21,140 పాయింట్లతో ఆరంభమైన సెన్సెక్స్.. డిసెంబర్ 24 నాటికి 27,209 పాయింట్లతో కొనసాగుతోంది.  ఇంతక్రితం 2009లో మాత్రమే సెన్సెక్స్ 7,817 పాయింట్లు జమ చేసుకుంది. ఇక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం దాదాపు 30% పుంజుకోవడం విశేషం.

ఆశాజనకంగా జీడీపీ
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 5.3 శాతంతో కాస్త కిందికి దిగిజారినా.. గతం కంటే మెరుగ్గా ఉండటం ఆశాజనకంగా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతం వృద్ధితో ఉత్సాహాన్ని ఇచ్చినా.. తరువాత కిందికి జారిపోవడం కాస్త నిరుత్సహాన్ని నింపింది.  గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు శాతం దిగువన జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకున్నా.. క్రమేపీ ఇది పెరగడం మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చింది.   వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో తెలిపింది.

ఎయిర్ ఏషియా ఇండియా సేవలు
ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌లైట్‌ల  తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన  సర్వీసులను అందించడానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టింది.  టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ,  ఎయిర్ ఏషియా,  టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది స్పైస్ జెట్ కష్టాలు కూరుకుపోయింది. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు బకాయిలు రూ. 1,230 కోట్లకు ఎగబాకడంతో అవి తక్షణం చెల్లింపు జరపాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఒకరోజు  సర్వీసుల నిలిపివేత వరకూ పరి స్థితి వెళ్లింది. చివరకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇవ్వడంతో మళ్లీ సర్వీసులు కొనసాగుతున్నాయి.

పెను సవాళ్లతో ఆటోమొబైల్ రంగం
అమ్మకాలపరంగా ఆటోమొబైల్ కంపెనీల ప్రయాణం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆటో ఎక్స్‌పోలో ఏకంగా 70 కొంగొత్త మోడల్స్ ఊరించిన మార్కెట్ మాత్రం ఎగుడుదిగుడుగా సాగింది.  మొబీలియో, సియాజ్, జెస్ట్ వంటి వాహనాలతో ఏడాది పొడవునా కొత్త కార్లు సందడి చేశాయి. అయితే, అమ్మకాలు మాత్రం ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం లాగా సాగింది. ఏడాది తొలి 11 నెలల్లో అమ్మకాలు 10 శాతం మేర క్షీణించాయి. కాంపిటీషన్ కమిషన్ 14 కార్ల సంస్థలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించడం మరో చెప్పుకోతగ్గ పరిణామం. అయితే, సవాళ్లెన్ని ఎదురైనప్పటికీ.. ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. మహీంద్రా, మారుతీ, హీరో మోటోకార్ప్, బజాజ్ తదితర సంస్థలు 5 బిలియన్ డాలర్ల మేర భారీ పెట్టుబడులను ప్రకటించాయి. కొత్త సంవత్సరం సానుకూలంగా ఉండగలదని ఆటోమొబైల్ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల మధ్య ' వ్యాపార' పోటీ
వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాలు తమ ఉనికిని చాటి చెప్పేందుకు యత్నిస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ  రెట్టించిన ఉత్సాహంతో వ్యాపార కార్యకలాపాల్ని మరింత ముందుకెళ్లేందుకు బాటలు వేసుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులు, విస్తరణలు,  పెట్టుబడులు ఇలా అన్నింటా రెండు రాష్ట్రాల మధ్య ఒక రకంగా పోటీకి తెరతీసింది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి రెండు రాష్ట్రాలు పోటీ పడుతుండటంతో కార్పొరేట్ రంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ దిశగా యత్నాలు ఆరంభించింది. హీరో మోటార్ సైకిల్స్ ప్రాజెక్ట్ గురించి ఇరు రాష్ట్రాలు పోటీ పడగా చివరకు ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. అయితే ప్రపంచ అతిపెద్ద రిటైల్ ఫర్నిచర్ సంస్థ ఐకియూ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అలాగే ఇసుజు, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే తెలంగాణలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కోజెంట్ గ్లాస్ యూనిట్, జాన్సన్ అండ్ జాన్సన్, కోకకోలా తదితర కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.

ఐటీ  'విస్తరణ '
తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేస్తోంది. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే తన కార్యాచరణను మరింత విస్తృతం చేసింది. తొలుత హైటెక్‌సిటీ ప్రాంతంలో ఎయిర్‌టెల్‌తో కలిసి పబ్లిక్ వైఫై అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం టి-హబ్ పేరుతో దేశంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కూడా ఐటీకి విస్తృత ప్రాధాన్యం ఇస్తోంది. ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది.

ఏరోస్పేస్ కు ప్రత్యేక పాలసీ
తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. స్విట్జర్లాండ్ కంపెనీ రువాగ్ ఏవియేషన్ తయారీ డార్నియర్-228 విమానాల కోసం విమాన బాడీ, రెక్కల తయారీ కేంద్రాన్ని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఆదిభట్లలోని ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ సెజ్‌లో నెలకొల్పుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ సహకారంతో జీఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ ట్రైనింగ్ హబ్‌ను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తోంది.

Friday, December 26, 2014

ఐదేళ్ళలో అతిపెద్ద ర్యాలీ-2014 (నమస్తే తెలంగాణ సౌజన్యంతో)


2014 బిజినెస్ రౌండప్ (ఈనాడు సౌజన్యంతో)




(ఈనాడు సౌజన్యంతో)
ఒక పేజీ తిప్పితే.. మరో పేజీ వస్తుంది. ఓ ఏడాది గడిస్తే.. మరో ఏడాది వస్తుంది. అది సహజం. అయితే గతాన్ని నెమరేసుకుంటే వర్తమానానికి, భవిష్యత్‌కు దారి కనిపిస్తుంది. ఆశలు.. అంచనాలూ కనిపిస్తాయి. ఉదాహరణకు బంగారం సంగతే తీసుకుంటే కారణమేమైనా బాగా దిగివచ్చి.. కొనుగోలుదార్లను బాగా ఆకర్షించింది. ఇక వాహన ధరలేమో అలా తగ్గి.. ఇలా పెరిగాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగితేనే వినియోగదార్లకు ప్రయోజనం బదిలీ చేస్తామంటున్నాయి వాహన కంపెనీలు. ఇక మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురైనా పెట్టుబడుల్లో 10 శాతం వృద్ధిని సాధించింది. ఉక్కు కంపెనీలు ఈ ఏడాది మందగమనంలో ఉన్నా.. 'మేకిన్ ఇండియా'పై ఆశలతో దృఢంగా ఉన్నాయి. ఎఫ్ఎమ్‌సీజీ కంపెనీలూ తక్కువ గిరాకీ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొన్నాయి. మొత్తం మీద ఈ ఆరు కీలక రంగాలు.. వచ్చే ఏడాదిపై ఆశలతో ఉన్నాయి. ఎందుకంటే సంస్కరణలు ఒక్కసారి ఫలాలను అందజేయడం మొదలుపెడితే.. ఆర్థిక వ్యవస్థతో పాటూ అన్ని రంగాలూ పట్టాలు ఎక్కుతాయిగా.
'బంగారం'లా దిగివచ్చింది
వరుసగా రెండో ఏడాదీ బంగారం ధరలు దిగి వచ్చాయి. ఈ ఏడాదైతే 10 శాతం పైగా తగ్గి కొనుగోలుదార్లను ఆకర్షించిందీ పచ్చలోహం. బంగారంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హితవు పలికి.. దిగుమతిపై ఆంక్షలు విధించింది. అయితే ఇది స్మగ్లింగ్‌ను పెంచింది. మరో పక్క వెండి ఏకంగా 20% మేర చౌకగా మారింది. 2013 చివరకు 10గ్రా. స్వచ్ఛమైన బంగారం రూ.30,000గా ఉంటే.. అది ఇపుడు రూ.26,000 దరిదాపులకు వచ్చి చేరింది.
ధరలు ఎందుకు తగ్గాయంటే..
స్టాక్ మార్కెట్ భారీ స్థాయిలో దూసుకెళ్లింది. దీంతో అందరూ అటువైపే పెట్టుబడులతో నడిచారు. ఇది బులియన్ స్టాకిస్టుల వద్ద విక్రయాల ఒత్తిడికి కారణమైంది. ఇందుకు తోడు అంతర్జాతీయ లోహ మార్కెట్లో బలహీనతలు కనిపించడంతో దేశీయంగా సెంటిమెంటు కుంగి.. ధరలు తగ్గాయి.
రూ.27,000-30,945 మధ్య
ఈ ఏడాది బంగారం ధరలు తొలుత 29,800 స్థాయి వద్ద ప్రారంభమయ్యాయి.స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం(99.9 స్వచ్ఛత) ధర మార్చి 3న రూ.30,945 వద్ద గరిష్ఠానికి చేరినా..తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ నెల్లో రూ.27,000కూ చేరింది. 99.5 స్వచ్ఛత గల పసిడి ధర సైతం ఈ ఏడాది రూ.26,000-30,795 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో 2014 మధ్యలో ఔన్సు బంగారం 1300 డాలర్లుగా పలికినా.. చివరకొచ్చేసరికి 1140 డాలర్లకు పరిమితమైంది. ఇక వెండి సంగతికి వస్తే ఈ ఏడాది మొదట్లో కిలో ధర రూ.50,000ను తాకింది. తర్వాత రూ.36,000-37,000 స్థాయికీ వచ్చింది. గతేడాది చివర్లో వెండి కిలో ధర రూ.44,230గా ఉంది.
చాలా వరకు బ్రేకులే..
ఈ ఏడాది వాహన రంగానికి అడుగడుగునా వేగనిరోధకాలే కనిపించాయి. మొత్తం 11 నెలల్లో విక్రయాలు చూసుకున్నా 10 శాతం మేర క్షీణించడం అందుకు నిదర్శనం. వాహన ప్రదర్శన నిర్వహించినా.. కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చినా.. అమ్మకాల విషయంలో వెనుకడుగే పడింది. వివిధ కారణాల వల్ల రీకాల్స్ కూడా ఎక్కువయ్యాయి. మారుతీ ఏకంగా 1.7 లక్షల కార్లను వెనక్కి పిలిపించింది. ఇతర కంపెనీలు మోస్తరుగానే రీకాల్స్ చేపట్టాయి.
ఇవీ కొత్త మోడళ్లు: హోండా కొత్త సిటీ, మొబిలియో, స్కార్పియో, సియాజ్, జెస్ట్. (అయితే ఈ ఏడాది హ్యుందాయ్ సాంత్రో; నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌లకు మంగళం పాడారు.)
సీసీఐ నుంచి ఎదురుదెబ్బ: ఓ మోస్తరు విక్రయాలతో ఉన్న వాహన కంపెనీలపై సీసీఐ అపరాధ రుసుము కుంగదీసింది. 14 కంపెనీలపై రూ.2545 కోట్ల రుసుము విధించింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మారుతీ, మహీంద్రా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఫోక్స్ వ్యాగన్‌లు రూ.20,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మిగతా పెట్టుబడులూ కలుపుకుంటే మొత్తం మీద 5 బిలియన్ డాలర్ల(రూ.30000 కోట్లు) ఈ రంగంలోకి వచ్చాయి.
ఏడాది చివర్లో సానుకూలతలు: ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రభావం ఏడాది చివర్లో కనిపించింది. చివరి త్రైమాసికంలో విక్రయాలు ఫర్వాలేదనిపించాయి. సుంకం తగ్గింపును వినియోగదార్లకు బదలాయించి.. ధరలు తగ్గించడం ఇందుకు కారణం. అయితే ఇటీవల ముడి పదార్థాల వ్యయాలు పెరగడంతో తిరిగి ధరలు పెరిగాయి.
ఏం చేయాలంటే..: కొత్త ఏడాదిపైనే వాహన కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ రంగం తిరిగి రాణించాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు లభించాలి. భద్రత, పర్యావరణ అంశాల నుంచి ఎదురైన సవాళ్లకు పరిష్కారం చూపించి.. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచాలి. ముఖ్యంగా ఎక్సైజ్ సుంకం తగ్గింపును పొడిగించాలి.
అర లక్ష కోట్ల డాలర్లకు..
లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరే క్రమంలో రిటైల్ పరిశ్రమ ప్రస్తుతానికి అందులో సగం దూరాన్ని అధిగమించింది. ఈ ఏడాది 560 బిలియన్ డాలర్ల(రూ.36,60,000 కోట్లు) స్థాయికి చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 10% వృద్ధి చెందింది. ఈ ఏడాది చిన్న పాటి రిటైల్ సంస్థలు కూడా ఆన్‌లైన్ విక్రయ సంస్థల(ఇ-కామర్స్ పోర్టళ్లు) నుంచి సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ ఈ రంగంలో వృద్ధి నమోదు కావడం విశేషం.
క్యారీఫోర్.. ఇంటికి: కొత్త ప్రభుత్వం మే 2014లో పగ్గాలు చేపట్టింది. దీంతో బహుళ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించే విషయం మూలనపడింది. ఈ నేపథ్యంలో వాల్‌మార్ట్ వేచిచూసే ధోరణిలో ఉండగా.. క్యారీఫోర్ మరో అడుగు ముందుకేసి తన అన్ని టోకు స్టోర్లను మూసివేసి భారత్ నుంచి నిష్క్రమించింది. ఇక బ్రిటన్‌కు చెందిన టెస్కో ఒకటే బహుళ బ్రాండ్ రిటైల్‌లో ఉన్న ఏకైక విదేశీ రిటైలర్. టాటా గ్రూపునకు చెందిన ట్రెంట్ హైపర్‌మార్కెట్‌తో ఇది సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకుంది.
2020 కల్లా: రిటైల్ పరిశ్రమ 2020 కల్లా ఒక లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్‌డీఐని అనుమతిస్తే అంతకంటే ముందే లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్‌లు ఈ ఏడాది తమ స్టోర్లను విస్తరించాయి. ఓ వైపు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలు అసలు ధర కంటే తక్కువకు ఉత్పత్తులు విక్రయిస్తున్నాయని ఫిర్యాదు చేస్తూనే.. ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ రిటైల్‌లు ఆన్‌లైన్‌లోకీ విస్తరించడం మొదలుపెట్టాయి. రిలయన్స్ రిటైల్ ఈ ఏడాది తొలిసారిగా లాభాలను ఆర్జించింది.
మేకిన్ ఇండియాపైనే ఆశలు
ఈ ఏడాది భారత్ అతిపెద్ద నాలుగో ఉక్కు ఉత్పత్తిదారుగా తన పేరును నిలబెట్టుకుంది. అంతర్జాతీయ సగటు ఉత్పత్తి వృద్ధి కంటే ఎక్కువగానే సాధించింది. 76 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. అయితే పెరుగుతున్న దిగుమతులు, ఇతర ఆందోళనల మధ్య 2015లో ఉక్కు రంగానికి కష్టకాలం ఎదురుకావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు.
సానుకూలతలు
చి ఉత్పత్తి అంతర్జాతీయ సగటు కంటే ఎక్కువగానే నమోదైంది. అయితే గిరాకీ మాత్రం స్తబ్దుగా ఉంది. ఇక మేక్ ఇన్ ఇండియాపైనే ఆశలు పెట్టుకున్న ఉక్కు తయారీ కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి.
చి అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి చేరిన ముడి ఇనుము ధరల నుంచి ఈ రంగం ప్రయోజనం పొందనుంది. అంతే కాకుండా తగ్గుతున్న కోకింగ్ కోల్ ధరలూ వీటికి మద్దతు పలకనున్నాయి.
చి అంతర్జాతీయ సగటు కంటే భారత తలసరి ఉక్కు వినియోగం నాలుగో వంతుగానే ఉండడం ఆశలను రేకెత్తిస్తోంది. మరో పక్క కర్ణాటక, గోవాల్లో మూతపడ్డ ముడి ఇనుము గనులు త్వరలోనే మొదలవుతాయన్న ఆశలున్నాయి.
చి మొజాంబిక్‌లో కోకింగ్ కోల్ గనిని ఐవీఆర్‌సీఎల్ కొనుగోలు చేసింది.
చి ముడిపదార్థాల ధరలు సమీప భవిష్యత్‌లో పెరగవన్న అంచనాలున్నాయి.
ప్రతికూలతలు
చి అయితే ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడంతో పాటు వివిధ మార్కెట్లకు ఎగుమతి చేసే విషయాల్లో పరిమితులు ఉండడం(ముఖ్యంగా ప్రభుత్వ రంగ కంపెనీలకు) తదితరాలు ఈ రంగానికి ఇబ్బందులు పలకవచ్చు. మరో పక్క భారత్ సహా ఇతర దేశాలకు చైనా ఎగుమతులను పెంచుతోంది. ఇది కూడా ఉక్కు రంగాలను ఉక్కిరిబిక్కిరి చేసే అంశమే.
చి అధిక దిగుమతుల కారణంగా దేశీయ ఉక్కు తయారీ దార్లు 5-6 శాతం దాకా ధరలను తగ్గించాల్సి వచ్చింది.
ఒక్క ఏడాదిలో రూ.3 లక్షల కోట్లు
నియంత్రణ సంస్థల కఠిన విధానాలు, ఇతరత్రా ఇబ్బందులున్నా.. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రాణించింది. ఈ ఏడాది అదనంగా రూ.3 లక్షల కోట్లను జతచేసుకుని మొత్తం నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎమ్)ను దాదాపు రూ.11 లక్షల కోట్లకు చేర్చుకుంది. అక్టోబరులో ఇవి రూ.10.96 లక్షల కోట్ల వద్ద గరిష్ఠానికి చేరాయి. ఏడాది చివర్లోనూ దాదాపు అంతే స్థాయిలోనే ఉండడం విశేషం. 2013 చివరకు ఫండ్‌ల ఆస్తులు రూ.8.26 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇవి 2012 చివర్లో రూ.8.08 లక్షల కోట్లు; 2011 చివర్లో రూ.6.11 లక్షల కోట్లు; 2010 తుదకు రూ.6.26 లక్షల కోట్లుగా ఉన్నాయి.
భవిష్యత్‌పై ధీమా: 2015లోనూ ఫండ్ పరిశ్రమ పనితీరు మెరుగ్గానే ఉంటుందని ఫండ్ సంస్థలు భావిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ర్యాలీకి తోడు ఆర్థిక వ్యవస్థ రాణింపు వల్ల ఫండ్‌లలోకి మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయన్నది అంచనా. అదీ కాక వచ్చే ఏడాది కొత్త సంస్థ ఏదీ ఈ రంగంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఇవి నిష్క్రమించాయ్: దైవా, ఐఎన్‌జీ, మోర్గాన్‌స్టాన్లీ, ప్రమెరికా, ఫిడిలిటీ, పిన్‌బ్రిడ్జ్ వంటి సంస్థలు భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి వైదొలిగాయి. 

Saturday, September 27, 2014

అప్పా జంక్షన్‌లో రియల్ బూమ్

(సాక్షి సౌజన్యంతో)

 హైదరాబాద్‌లో సొంతిల్లు అనగానే మోస్తారుగా ఉన్నోళ్లకే అనుకుంటాం. కానీ, సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తోంది అప్పా జంక్షన్. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుల సొంతింటికి దగ్గరి దారిని చూపిస్తోంది. కూతవేటు దూరంలో విద్యా, వైద్య సౌకర్యాలు.. వినోదాలకు సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు.. అంతే దూరంలో ఐటీ కంపెనీలు.. అంతర్జాతీయ విమానాశ్రయం.. ఓఆర్‌ఆర్   ఇలా ఒకటేమిటి నగరం నడిబొడ్డున పొందే సకల సౌకర్యాలూ ఇక్కడ పొందొచ్చు. అందుకే దేశ, విదేశీ కంపెనీలు అప్పా జంక్షన్‌లో రియల్ ప్రాజెక్ట్‌లు, వెంచర్లను వేసేందుకు క్యూ కడుతున్నాయి.

 హైదరాబాద్‌లో రియల్ బూమ్ బంజారాహిల్స్‌తో మొదలై.. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్‌కు, ఆపైన గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బూమ్ అప్పా జంక్షన్‌కు పరుగులు పెట్టిందని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. దీన్ని రియల్ ఎస్టేట్ పరిభాషలో ‘డెవలప్‌మెంట్ మేకింగ్ షిఫ్ట్’గా పేర్కొంటారు. భాగ్యనగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ముందు వరుసలో అప్పా జంక్షన్ ఉంటుంది.

ఇప్పటివరకు హైదరాబాద్‌లోని ధనవంతులకు మొదటి సొంతిల్లు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిల్లో ఉండేది. రెండో ఆస్తి బెంగళూరు, చెన్నై వంటి ఇతర ప్రాంతాల్లో ఉండేది. కానీ, ప్రస్తుతం వీరు కూడా వారి రెండో ఆస్తిని అప్పా జంక్షన్‌లో ఏర్పరుచుకోవడానికి ఇష్టపడుతున్నారని వివరిస్తున్నారు. ఇది చాలు అప్పా జంక్షన్ ఉన్నత శ్రేణి వర్గాలుండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందనడానికి.

 అతి దగ్గర్లో ఐటీ హబ్, ఎయిర్‌పోర్ట్: అప్పా జంక్షన్ ప్రాంతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలకు అతి దగ్గర్లో ఉండటం కలిసొచ్చే అంశం. 3 కి.మీ. దూరంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ), ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పోలీస్ అకాడమీలుండటంతో నిత్యం జనాలతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. అప్పా జంక్షన్‌లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ఆసుపత్రులెన్నో ఉన్నాయి.

 ఈ ప్రాంతంలో మిలటరీ ఏరియా, ఎన్‌ఐఆర్డీ, ఎన్జీ రంగా వర్సిటీలుండటంతో పచ్చని ప్రకృతిలో ఆరోగ్యకరంగా జీవించొచ్చు. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయానికి అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదని చెప్పొచ్చు.

 సొంతింటితో పాటు కారు కూడా: నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు.. సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అప్పుడే ఆ నగరం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క అని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. నా దృష్టిలో అఫడబుల్ హౌజింగ్ అంటే.. సిటీకి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇళ్లుండటం కాదు.. సిటీకి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఇళ్లు లభించాలి.

కుటుంబంతో కలసి సెకండ్ షో సినిమా చూసి సురక్షితంగా ఇంటికి చేరుకునేంత దగ్గర్లో ఉండాలి. అందుకే అప్పా జంక్షన్‌లో మేం నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్ట్‌ల్లో రూ.25 లక్షలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్లను అందిస్తున్నామన్నారు. అప్పా జంక్షన్‌లో ఫ్లాటు కొంటే కారు కూడా సొంతమవుతుందనే నిర్ణయానికి కొనుగోలుదారులొచ్చారు. ఎలాగంటే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫ్లాటు కొనాలంటే ఎంతలేదన్నా రూ.40 లక్షలకు మించి కావాలి. అదే అప్పా జంక్షన్‌లో అయితే రూ.25 లక్షలకే ఫ్లాటు కొనడంతో పాటు మిగిలిన డబ్బుతో కారూ సొంతమవుతుందన్నమాట.

Thursday, July 10, 2014

బడ్జెట్ ముఖ్యాంశాలు 2014-15

 (ఈనాడు సౌజన్యంతో)
* ప్రణాళికా వ్యయం రూ.17.9 లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.12.20లక్షల కోట్లు
* పన్నుల రేటులో మార్పులు లేవు
* 2018 నాటికి జాతీయ బ్యాంకుల్లో రూ.2.4లక్షల కోట్ల మూలధనం సమీకరణ
* ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల నుంచి రూ.2.50లక్షలకు పెంపు. సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు. 80సీసీ పరిమితి రూ.లక్షన్నరకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు.
* గృహ రుణాలపై పన్ను మినహాయింపు రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షలకు పెంపు
* తపాలాశాఖ పొదుపు పథకాల్లోని నగదు వినియోగంపై దృష్టి
* పీపీఎఫ్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంపు
పర్యాటక కేంద్రంగా గయ
* హస్తకళల పునరుద్ధరణకు రూ.30కోట్లతో అకాడమీ ఏర్పాటు
* ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014-2015లో రూ.2.4లక్షల కోట్ల పెట్టుబడులు
* ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా గయ నగరం
* పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ.100కోట్లు
* దేశవ్యాప్తంగా మరో 12 వైద్యకళాశాలలు
* జాతీయ స్పోర్ట్స్ అకాడమీలో అన్ని ప్రధాన క్రీడలకు శిక్షణ
* బెంగళూరు, ఫరీదాబాద్‌లో బయోటెక్ క్లస్టర్ల అభివృద్ధి
మినహాయింపులు, ప్రోత్సాహాలు
* 19 అంగుళాల టీవీ తయారు చేసే స్వదేశీ సంస్థలకు పన్ను రాయితీ
* విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్లపాటు పన్ను మినహాయింపు
* కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం.
* సబ్బుల ధరలు తగ్గే అవకాశం.
* గాలిమరల విద్యుత్‌కు పన్ను ప్రోత్సాహకాలు.
* సున్నపురాయి, డోలమైట్‌లపై పన్ను రాయితీ
* ఇనుము ధరలు తగ్గే అవకాశం.
* కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఉత్పత్తులపై పన్ను రాయితీ.
* పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12శాతం నుంచి 6శాతానికి తగ్గింపు.
* స్టెయిన్‌లెస్ స్టీల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు
వీటి పన్నులు పెరిగాయి
* రేడియో టాక్సీలపై సేవాపన్ను విధింపు.
* మ్యూచువల్ ఫండ్స్ బదలాయింపుపై పన్ను పెంపు
* శీతలపానీయాలు, పాన్ మసాలాలు ప్రియం
* బాక్సైట్ ఎగుమతిపై సుంకం 10 నుంచి 20శాతానికి పెంపు
* బ్రాండెడ్ దస్తులు, ప్యాకేజ్‌డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం
* పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 16శాతానికి పన్ను పెంపు

ఎఫ్‌డీఐలు 49 శాతం
* రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతానికి పెంపు, ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ నియంత్రణ
* సరిహద్దుల భద్రతకు రూ.2,250కోట్లు
* బీమారంగంలోనూ ఎఫ్‌డీఐలు 49 శాతానికి పెంపు
* ప్రతీ ఇంటికి రెండు బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు
ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐలు
ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. దేశంలో అనూహ్యంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగంలో ఎఫ్‌డీఐలతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొంటుందని ఆర్థికనిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎంత శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఏడు పారిశ్రామిక నగరాలు
దేశంలో తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దేశవ్యాప్తంగా ఏడు పారిశ్రామిక నగరాలు ఏర్పాటుచేస్తామన్నారు.
* దేశంలో తయారీ రంగం ఇంకా ప్రాథమికదశలోనే వుంది.
* తయారీ సంస్థలు తాము తయారుచేసిన ఉత్పత్తుల్ని రిటైల్ రంగం, ఈ-కామర్స్ విధానాల ద్వారా విక్రయించాల్సివుంది.
* ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ తిరిగి వృద్ధి చెందుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి.
* రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో జీడీపీ 7-8 శాతానికి చేరుకుంటుంది.

ఆంధ్రా, తెలంగాణలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే..
ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఇవాళ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులిలా ఉన్నాయి..

*  ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ ఏర్పాటు
*  వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు
*  దేశవ్యాప్తంగా నెలకొల్పే నాలుగు ఎయిమ్స్ సంస్థల్లో ఒక దానిని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనున్నారు.
*  ఎయిమ్స్‌సంస్థల ఏర్పాటుకు రూ.500 కోట్ల కేటాయింపు
*  కాకినాడ పోర్టుకు సమీపంలోని ప్రాంతాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తించడం
*  కాకినాడలో హార్డ్‌వేర్ పరిశ్రమను నెలకొల్పడంపై ప్రత్యేకదృష్టి
*  విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
*  హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ
*  ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీగా కృష్ణపట్నం

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: జైట్లీ
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయా మంత్రిత్వశాఖలు, అధికారం యంత్రాంగం సకాలంలో చేపడుతాయి ' అని అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఉద్యానవన విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

బాలికల కోసం 'బేటీ పఢావో బేటీ బఢావో'
* బాలికల సంరక్షణ కోసం 'బేటీ పఢావో బేటీ బఢావో' పథకం
* ఈ పథకానికి రూ. 500 కోట్లు కేటాయింపు.
* మహిళల సమస్యల పరిష్కారం కోసం దేశరాజధానిలో ఒక కేంద్రం
లింగవివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో విద్యాబోధన జరిగేలా మార్పులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

డిజిటల్ ఇండియాకు రూ. 500 కోట్లు
* గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ సేవలు విస్తృతానికి డిజిటల్ ఇండియాలో భాగంగా రూ. 500 కోట్లు కేటాయింపు.
* స్థానిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు ప్రోత్సాహం
* అన్ని గ్రామాలను బ్రాడ్‌బాండ్‌తో అనుసంధానం చేస్తారు.

మౌలిక రంగానికి
* పారిశ్రామిక కారిడార్లకు సమాంతరంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
* తమిళనాడు, రాజస్థాన్‌లలో సౌర విద్యుత్‌కు రూ.500కోట్లు.
* ఉపాధి హామీకి వ్యవసాయంతో అనుసంధానం.
* ప్రధమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటు.
* జాతీయ వారసత్వ సంపద పరిరక్షణ యోజనకు రూ.200కోట్లు
* మెరైన్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.115కోట్లు
* నదుల అనుసంధానంపై అధ్యయనానికి రూ.100కోట్లు
* ప్రధానమంత్రి కృషి సీంచాయీ యోజన కింద నీటిపారుదల వసతుల మెరుగుకు వెయ్యి కోట్లు
* దేశవ్యాప్తంగా మరో 60 ఆదాయపన్ను కేంద్రాల ఏర్పాటు
* రూ.200 కోట్లతో జమ్మూకాశ్మీర్‌లో క్రీడా సదుపాయాల పెంపు
* ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాల విస్తరణకు రూ.వెయ్యికోట్లు
* కాశ్మీర్ శరణార్థుల సంక్షేమానికి రూ.500 కోట్లు

Tuesday, July 8, 2014

2014-15 రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

(ఈనాడు సౌజన్యంతో)
ఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ ఇవాళ పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిదని పేర్కొన్నారు. కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో విజ్ఞాపనలు అందాయన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత మనమే ముందున్నామన్నారు. రైల్వే ప్రతిరోజు 2.30కోట్ల మందిని గమ్య స్థానాలకు చేరుస్తోందని మంత్రి వివరించారు.
రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* రైల్వే సామాజిక బాధ్యతను మరువలేదు, ప్రయాణికుల భద్రతే మా ప్రధానాంశం
* రైల్వేకు వచ్చిన ఆదాయంలో రూపాయికి 90పైసలు ఖర్చుపెడుతున్నాం.
* 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది, పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.80లక్షల కోట్లు కావాలి.
* హైస్పీడ్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతాం.
* సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామికావడమే లక్ష్యం.
* గత 10ఏళ్లలో రూ.41వేల కోట్లతో 3700 కి.మీ. కొత్త లైన్ల నిర్మాణం జరిగింది.
* ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టిపెడతాం.
* ఏడాదిలోగా రైల్వేని గాడిలో పెడతాం
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం.
* ఇప్పటి వరకు 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తయ్యాయి.
* వచ్చే పదేళ్లలో రైల్వే ఆధునికీకరణకు రూ.5లక్షల కోట్ల నిధులు అవసరం.
* 30 ఏళ్లు నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి.
* ప్రయాణికులకు మరింత నాణ్యమైన భోజనం అందిస్తాం
* రైల్వే నిర్వహణలో ఎఫ్‌డీఐలను ఆశిస్తున్నాం.
* కేవలం ఛార్జీల పెంపు వల్లే రైల్వే అభివృద్ధి సాధ్యం కాదు
* ఈ ఏడాది రూ.602కోట్లు మిగులు ఆదాయం మా లక్ష్యం
* రైల్వే సదుపాయం లేని కొత్త ప్రాంతాలకు సేవలపై దృష్టి
* గత పదేళ్లలో 3,500 లైన్లకు రూ.41వేల కోట్లు వ్యయం అయింది.
*రైల్వే నిర్వహణలో నిధుల దుర్వినియోగాన్ని నియంత్రించాలి.
* వచ్చే పదేళ్ల వరకు ఏటా రైల్వే అభివృద్ధికి రూ.50వేల కోట్లు అవసరం
* ప్రైవేటు భాగస్వామ్యంతో అన్ని స్టేషన్లలో వంతెనలు, ఎస్కలేటర్లు ఏర్పాటుకు ప్రతిపాదన
* రైల్వే స్టేషనల్లో సీసీ కెమెరాల ద్వారా భద్రత పర్యవేక్షణ.
* ధరల పెంపుపై నిర్ణీత కాలంలో సమీక్ష జరగాలి.
* 2014-15లో రూ.1.64లక్షల కోట్లు రైల్వే టర్నోవర్‌గా అంచనా.
* ఇటీవల పెంచిన ధరల వల్ల రూ.8వేల కోట్ల ఆదాయం.
* డబ్లింగ్, ట్రిప్లింగ్‌లకు మొదటి ప్రాధాన్యం, కొత్తలైన్ల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం
* ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయంపై కేబినెట్ అనుమతి కావాలి.
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు ప్రతిపాదన
* ప్రధాన రైల్వే స్టేషన్లలో, నిర్దేశించిన రైళ్లలోనూ వైఫై వ్యవస్థ
* పోస్టాఫీసులు, మొబైళ్లలో టికెట్ల కొనుగోలు విధానం విజయవంతమైంది.
* ఈశాన్య భారతంలో విజ్ఞాన యాత్రలకు ప్రణాళికలు.
* రైల్వే సేవలపై ప్రయాణికుల అభిప్రాయం సేకరణ వ్యవస్థ ఏర్పాటు.
* రైల్వే లైన్ల విస్తరణకు ప్రథమ, కొత్త రైళ్లకు ద్వితీయ ప్రాధాన్యం
* వృద్ధులు, వికలాంగులను స్టేషన్‌లోకి తీసుకొచ్చేందకు బ్యాటరీ వాహనాలు.
* 50 రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య పనులు ఔట్‌సోర్సింగ్‌కు అప్పగింత
* కాపలా లేని 5,400 క్రాసింగ్‌ల వద్ద ప్రత్యేక చర్యలు
* సాంకేతిక, సాంకేతికేతర విద్యతో కూడిన రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం.
* చెన్నై-హైదరాబాద్ మధ్య సెమీ బులెట్ రైలు
* మెట్రోనగరాల్లోని 10 ప్రధాన స్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన
* రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో సమూల మార్పులు
* ఎంపిక చేసిన లైన్లలో 160 నుంచి 200 కి.మీల వేగంతో నడిచే రైళ్లు
* అన్ని రైల్వేస్టేషన్లలో విశ్రాంతి గదులకు ప్రతిపాదన
* హైస్పీడ్ రైళ్లకు రూ.100కోట్లు కేటాయింపు
* మహిళా భద్రత కోసం 4వేలమంది మహిళా కానిస్టేబుళ్లు
* ఈ-టికెటింగ్ ద్వారా నిమిషానికి 7,200 టికెట్లు బుక్ చేసుకునేలా ఏర్పాట్లు
* రైల్వేల్లో పారిశుద్ధ్యానికి గతేడాది 40శాతం అధిక నిధులు
* రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రయాణ సమయం గుర్తు చేసేలా అలర్ట్ మెసేజ్‌లు
* అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర చతుర్భుజి రైల్వే లైన్
* ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-చంఢీగడ్, ఢిల్లీ-కాన్పూర్‌లకు హైస్పీడ్ రైళ్లు
* కొత్తగా 5 జనసాధారణ్, 5 ప్రీమియం, 27 ఎక్ర్‌ప్రెస్ రైళ్లు
* కొత్తగా 6 ఏసీ, 8 ప్యాసింజర్, 2 మెమూ, 5 డెమూ రైళ్లు

2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్

2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్

Courtesy : Sakshi | Updated: July 08, 2014

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సదానంద గౌడ మంగళవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు:
* సేప్టీ, సెక్యూరిటీ, స్పీడ్ కు ప్రాధాన్యత
* కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం
*  దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు అత్యంత కీలకం
* భారతీయ రైల్వే ముందు ఎన్నో సవాళ్లు
* రోజుకు 2కోట్ల 30లక్షలమందిని గమ్యానికి చేరుస్తోంది
* భద్రత, సౌకర్యాలపై రాజీ పడేది లేదు
* హైస్పీడ్ నెట్ వర్క్ ను నెలకొల్పుతాం
* గత సంవత్సరం 99 కొత్త లైన్లకు అనుమతిస్తే ఒక్కటే పూర్తి
* 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
* ప్రతిపాదిత ప్రాజెక్టుల పూర్తికి 5 లక్షల కోట్లు అవసరం
* రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరం
* కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి చాలా విజ్ఞాపనలు వచ్చాయి
* ఆదాయంలో ప్రతి రూపాయికి 94 పైసలు ఖర్చు పెడుతున్నాం
* 12,500 రైళ్లలో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం
* ఏడాదిలోగా రైల్వే వ్యవస్థను గాడిలో పెడతాం
* సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామి కావటమే లక్ష్యం
* రైల్వే సామాజిక బాధ్యత మరవలేదు
* 30ఏళ్ల నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి
* భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిది
* ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
* ప్రాజెక్టుల ఆమోదం పైనే తప్ప పూర్తిపైన దృష్టి కొరవడింది
* సరుకు రవాణాలో కొంత తగ్గుదల
* పదేళ్లలో 99 కొత్త లైన్లకు రూ. 60 వేల కోట్లు ఖర్చు
* 1,57,888 కోట్లు విలువైన ప్రాజెక్టులు ఆమోదం పొందాయి
* 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి
* నాణ్యమైన భోజనం అందించేందుకు క్యాటరింగ్ వ్యవస్థ సంస్కరిస్తాం
* రైళ్లలో అందుబాటులో రెడీ టూ ఈట్ ఫుడ్
* అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులు
* అన్ని ప్రధాన స్టేషన్లలో సీనియర్ సిటిజన్లకు బ్యాటరీ కార్లు
* అన్ని స్టేషన్లలో రైల్వే ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యం
* నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు, అవసరమైతే కాంట్రాక్ట్ రద్దు
* రైళ్లలో పరిశుభ్రతకు కేటాయించే నిధులు 40 శాతం పెంపు
* పెండింగ్ ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం ఈ ఏడాది పూర్తి చేసేందుకు యత్నం
* 11,794 కోట్ల లోన్ కోసం ప్రయత్నం
* రైళ్లలో లోపాలు గుర్తించేందుకు అల్ట్రా సోనిక్ రైల్ స్కానింగ్ సిస్టమ్ ఏర్పాటు
* ఆర్ పీఎఫ్ బలగాలకు మొబైల్ ఫోన్లు
* రైల్వే స్టేషన్లు వచ్చాకే తలుపులు తెరుచుకునేలా ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ ట్రయిన్
* అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ 'రైల్వే వజ్ర చతుర్భుజి' హైస్పీడ్ రైళ్లు
* నిమిషానికి 7200 టికెట్లు ఇచ్చేలా ఈ టికెటింగ్ వ్యవస్థ తీర్చిదిద్దుతాం
* 4వేల  మహిళా ఆర్ పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం
* ఎంపిక చేసిన 9 మార్గాల్లో రైళ్ల స్పీడ్ 160 కిలోమీటర్లు నుంచి 200 కిలోమీటర్లుకు పెంచుతాం
* అయిదేళ్లలో పేపర్ లెస్ రైల్వే కార్యాలయాలు
* త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* అన్ని ఏ కేటగిరి రైళ్లలో ఉచిత వై ఫై సౌకర్యం
* ఈశాన్య రాష్ట్రాలకు ఏకో టూరిజం రైళ్లు, ఎడ్యుకేషన్ రైళ్లు
* రైల్వే కార్యాలయాల్లో సోలార్ పవర్ వినియోగం
* ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయం లక్ష్యం
* రైల్వే రిజర్వేషన్లకు పోస్టాఫీసులు వాడకం
* ఏకో టూరిజానికి ప్రాధాన్యత
* పార్శిల్ రవాణాలో ప్రయివేట్ భాగస్వామ్యం
* రైల్వేకు కేంద్రం రూ.1100 కోట్లు సాయం
* చెన్నై-హైదరాబాద్ మధ్య  బుల్లెట్ రైలు
* ఆన్ లైన్ లో ఫ్లాట్ ఫాం టిక్కెట్
* విద్యార్థులకు ప్రత్యే రాయితీలు
* నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్
* కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
* ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
* ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం
* టికెట్ల అమ్మకం ద్వారా రూ. 44,645 కోట్లు ఆదాయం
* రైల్వే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
* త్వరలో రైల్వేబోర్డులో మార్పులు చేర్పులు
* చార్ థామ్, కేదారనాథ్,బద్రీనాథ్ లకు రైల్వే కనెక్టివిటీ
* ఎస్ ఎంఎస్ ద్వారా రైళ్లలో ఫుడ్ ఆర్డర్
* కొత్తగా అయిదు జన సాధారణ్ రైళ్లు
* విజయవాడ-ఢిల్లీ మధ్య  ఏసీ ఎక్స్ ప్రెస్ కొత్తరైలు
* సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు
* విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్
* పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్