కిశోర్ చంద్ర దేవ్ కమిటీ సిఫారసు
ఇంకా నివేదిక ఏమందంటే: నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్-నాసిల్)ను బాధిస్తున్న సమస్యలకు విలీనమే మూలకారణం. ఆరంభంలోనే లోపభూయిష్ఠమైన విలీనం ఎన్నటికీ సఫలీకృతం కాలేకపోయింది. (ఎయిరిండియా రూ.7,000 కోట్ల మేరకు నష్టాల్లో కూరుకుపోయింది.)
* నాసిల్ను హోల్డింగ్ కంపెనీగా ఉంచి, దాని అజమాయిషీలో నాసిల్-ఇండియన్ ఎయిర్లైన్స్ను ఢిల్లీ ప్రధాన కేంద్రంగాను, నాసిల్-ఎయిరిండియాను ముంబయి ప్రధాన కేంద్రంగాను పనిచేసేలా చూడాలి.
* ఈ రెండు కంపెనీలకు చెరొక ఎండీ ఉండాలి. వారు ఇరువురు నాసిల్ ఛైర్మన్కు రిపోర్టు చేయాలి. కేంద్రం ఈ సూచనలను తక్షణం అమల్లోకి తీసుకురావాలి.
* విలీన నిర్ణయాన్ని పౌర విమానయాన శాఖ ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ల నెత్తిన రుద్దింది. ఆ తరువాత పురోగతిని పర్యవేక్షించేందుకు ఎలాంటి చొరవా తీసుకోలేదు. నాయకత్వ పటిమను కొనసాగించడంలో విఫలం అయింది.