రూ.400 కోట్ల పెట్టుబడులు
ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యోచన
అపోలో గ్రూపు ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి
ఆరోగ్య సంరక్షణ రంగంలోని కంపెనీలు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) వీలు కల్పించిన నేపథ్యంలో గ్లోబల్ హెల్త్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనుంది. ఇందులో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, శిక్షణ సంస్థలు మొదలైనవి ఉంటాయి. ఇందుకు దాదాపు రూ.1,000 కోట్లు వెచ్చించనున్నారు. హైదరాబాద్ సహా మూడు ప్రాంతాలను ఇందుకోసం పరిశీలిస్తున్నారు.
రెండేళ్లలో 31 ఆసుపత్రులు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11, ఆ తర్వాత ఏడాది మరో 20 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని అపోలో యోచిస్తోంది. వచ్చే నెలలో సికింద్రాబాద్లో కొత్త ఆసుపత్రిని ప్రారంభించనుంది. దీంతో మొత్తం ఆసుపత్రుల సంఖ్య 52కు చేరుతుందని ప్రతాప్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసే పరిశోధన &అభివృద్ధి కేంద్రంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ చికిత్సా విధానాలపైనా పరిశోధన జరుగుతుందని, 20-25 శాతం నిధులను వెచ్చిస్తామని తెలిపారు. అహ్మదాబాద్లో మూలకణ కేంద్రం అందుబాటులోకి రానుందన్నారు.
వాటా కొనే అవకాశం: విదేశాల్లో అపోలో నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో వాటాను కొనుగోలు చేయడానికి కంపెనీకి అవకాశం (ఆప్షన్) ఉంది. అయితే.. కంపెనీ కార్పొరేట్ బోర్డు విదేశాలలో పెట్టుబడులు పెట్టొద్దని జులైలో సలహా ఇచ్చిందని రెడ్డి చెప్పారు. నైజీరియాలో రెండు, షాంఘై, వియన్నాలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు ఆసుపత్రులను కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం పనితీరు డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కన్నా మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తోంది.