న్యూఢిల్లీ : ప్రస్తుత బడ్జెట్ నాటికి రైల్వే నష్టం రూ.24,600 కోట్లు రైల్వే నిర్వహణకు వ్యయం పెరిగింది. భారతీయ రైల్వేలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. భారతీయుల జీవనయానంలో రైల్వేలది కీలకపాత్ర. నిరంతర నష్టాల వల్ల కొత్త ప్రాజెక్టులకు సత్వర నిర్మాణానికి అవరోధం. ప్రయాణికులు చెల్లిస్తున్న రుసుంకు తగ్గట్టు సేవలు అందించాలి. అలహాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం. దేశ పురోగతి రైల్వేలతో ముడిపడి ఉంది. 40 శాతం ప్రమాదాలు లెవల్ క్రాసింగ్ ల వల్లే జరుగుతున్నాయి. పెరిగిన ఆధునీకరణ వల్లే ప్రమాణల సంఖ్య గణనీయంగా తగ్గింది. వచ్చే ఏడాది 17 పురాతన వంతెనల స్థానాల్లో కొత్తవాటి నిర్మాణం. మహిళ ప్రత్యేక రైళ్లకు మహిళా భద్రతా సిబ్బంది. ఏ-1 స్థాయి స్టేషన్లలో 117 ఎస్కలేటర్లు, 400 లిప్ట్ లు ఏర్పాటు. టిక్కెట్ల విక్రయంలో అక్రమాల తగ్గింపుకు ఆధార్ తో అనుసంధానం. పరిశుభ్రత కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు. ఎస్ఎంఎస్ ద్వారా రిజర్వేషన్ స్టేటస్ తెలుసుకునే ఏర్పాటు. డిసెంబర్ లోగా ఈ-టిక్కెటింగ్ లో విప్లవాత్మక మార్పు. ఒకేసారి పదిలక్షల మంది ఈ-టిక్కెటింగ్ ఉపయోగించుకోవచ్చు. ఆరు చోట్ల రైల్ బాయిలింగ్ ప్లాంట్లు. రద్దీని తగ్గించేందుకు మరిన్ని రైళ్లు.
కాజీపేటలో నైపుణ్యాల శిక్షణా కేంద్రం ఏర్పాటు. వెయ్యి కోట్లతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి సంస్థ ఏర్పాటు. ఒడిశా కలహండిలో రైల్వే వ్యాగన్ వర్క్షాపు. మధ్యప్రదేశ్లో మిస్రాలో కోచ్ల ఆధునికీకరణ వర్క్షాపు. పుణ్య క్షేత్రాలు ఉన్న రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ. కత్రా-వైష్ణోదేవి యాత్రికులకు రైలు-బస్సుకు ఒకే టికెట్. రైల్వేలో ఖాళీగా ఉన్న 1.52 లక్షల ఉద్యోగాల భర్తీ. రైల్వే ఉద్యోగుల వసతి గృహాల సంఖ్య పెంపు. లెవల్ క్రాసింగ్ల వద్ద సౌరశక్తి వినియోగం. 1007
మిలియన్ టన్నుల సరకు రవాణా లక్ష్యంగా ముందుకు సాగుతామని రైల్వే బడ్జెట్
ప్రసంగంలో ఆ శాఖ మంత్రి పవన్కుమార్ బన్సల్ పేర్కొన్నారు.
|