Friday, June 21, 2013

రూపాయితో మనకేంటి నష్టం?

ఈనాడు సౌజన్యంతో...

మనకేంటి నష్టం? మన రూపాయి విలువ పతనం అవుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశీ నిల్వలు అడుగంటి పోతున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దాదాపు ప్రతి వస్తువు ధరా ప్రభావితం అవుతోంది. ఈ రూపాయి, డాలర్ పోటీలో మనకు వచ్చే లాభనష్టాలేమిటి? రూపాయి కన్నా డాలరుకు ఎక్కువ గిరాకీ ఉంటే.. రూపాయి మారకపు విలువ తగ్గుతుంది. మనదేశం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడి ఉంటుంది. సహజంగానే డాలరుకు రూపాయితో పోలిస్తే గిరాకీ ఎక్కువ. ముడి చమురు, ఎరువులు, బంగారం తదితర విలువైన లోహాలు, బొగ్గు, విద్యుత్ ఉపకరణాలు, రక్షణరంగానికి సంబంధించిన వస్తువులు, ఆహారపు నూనెలు తదితర వస్తువులను మనం ఇతర దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. దీనికి చెల్లించేదంతా డాలర్ల రూపంలోనే. దిగుమతులు ఎక్కువ కావడం, డాలర్ల కొరత ఏర్పడటంలాంటి పరిస్థితుల వల్ల నేడు రూపాయి విలువ గరిష్ఠ స్థాయిలో పతనం అయ్యింది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిశలో పయనించడం, భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గత పదేళ్ల కనిష్ఠానికి పడిపోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల కూడా రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో కొంత దిద్దుబాటు కన్పించింది. దీంతో పెద్ద మొత్తంలో ఈ విలువైన లోహాలను దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారక ద్రవ్య నిలువలు చాలా వేగంగా ఖాళీ అయ్యాయి. ఫలితంగా రూపాయి విలువ పతనం కావడానికి కారణం అయ్యింది. ఇతర దిగుమతులను ఆపడం సాధ్యం కాదు. దీంతో ఎగుమతులు, దిగుమతులను సమతౌల్యం చేసే దిశగా బంగారంలాంటి లోహాలను దిగుమతి చేసుకోకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనివల్ల రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూడాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఎంత వరకూ.. 1947లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఎంతో తెలుసా? ఒక రూపాయికి ఒక డాలరు. ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం. తర్వాత రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ మన దేశంకన్నా ముందుకు వెళ్లడంతో డాలరుతో రూపాయి మారకం విలువ పతనం అవ్వడం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం కనిష్ఠ స్థాయికి రూపాయి చేరుకుంది. ఒక డాలరు విలువ సుమారు 60 రూపాయలు (59.57) వెచ్చించాల్సి వస్తోంది. అన్నీ భారమే మన దేశంలో అవసరమయ్యే ముడి చమురులో 70శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నదే. రూపాయి విలువ ఏ మాత్రం తగ్గినా వెంటనే ఆ ప్రభావం పెట్రోలు ధరలపై పడుతుంది. ఇటీవలే రూ.2 మేరకు పెరిగిన పెట్రోలు ధరే ఇందుకు నిదర్శనం. ఇది సామాన్యుడిపై పడే ప్రత్యక్ష భారం. డీఖ్ణ్మీ;లు/పెట్రోలు ధరల పెరుగుదల కారణంగా ఉత్పాదన వ్యయం, రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దీంతో పరోక్షంగా మనపైనే ఆ భారం పడి, వస్తువులకు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తుంది. సబ్సిడీకి (9 సిలిండర్లు) మించి వినియోగించే వంటగ్యాసు ధర కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. చి మనం వినియోగించే ఆహార నూనెల్లో విదేశాల నుంచి 60శాతం వరకూ దిగుమతి చేసుకుంటున్నదే. పామ్ఆయిల్, సోయాబీన్ నూనె ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. రూపాయి పతనం ఫలితంగా ఈ నూనెల ధర ఇటీవల కాలంలో లీటరుకు రూ.3 దాకా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చే పప్పుధాన్యాల ధరలు కూడా పెరగడం చూస్తేనే ఉన్నాం. చి బంగారం, వెండిలాంటి లోహాల ధరలు రూపాయి పతనంతో పెరిగాయి. మనదేశంలో బంగారం గనుల్లో చెప్పుకోదగ్గ ఉత్పత్తి లేకపోవడంతో మొత్తంగా విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రూపాయి విలువ తగ్గడంతో బంగారం దిగుమతులపై ఆ ప్రభావం పడుతోంది. చి విద్యుత్ ఉపకరణాలను కూడా ఎక్కువగా చైనా, ఇతర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పతనం అవడంతో ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. చి సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు తదితర వస్తువుల తయారీకి ముడి చమురు నుంచి వచ్చిన కొన్ని పదార్థాలను వినియోగిస్తారు. ముడి చమురు దిగుమతి ధర పెరిగితే.. సహజంగానే.. ఈ ఉత్పాదనల విలువ పెరిగే అవకాశం ఉంది. చి విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు కూడా డాలర్ ధర పెరగడంతో ఇక్కట్లు తప్పడం లేదు. విహార యాత్రలకు వెళ్లేవారిపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. చి రూపాయి విలువ పతనం ద్రవ్యోల్బణం పెరగడానికి అవకాశాన్నిస్తుందన్న కారణంతో వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మాత్రం సవరించలేదు. దీంతో రుణం తీసుకున్నవారికి నెలసరి వాయిదాల్లో ఎలాంటి తేడా రాలేదు. లాభాలూ ఉన్నాయి డాలరు ధర పెరగడం వల్ల అన్నీ నష్టాలే లేవు. కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు మన దేశంలో ఉన్నవారికి డాలర్లలో డబ్బు పంపిస్తుంటారు. దీనివల్ల వారికి ఎక్కువ రూపాయలు వచ్చేందుకు వీలు కల్గింది. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రవాస భారతీయులకు ఇది అనువైన సమయమే. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, వాటిని వెనక్కి తీసుకోవాలనుకున్న వారికి మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు రావచ్చు. చి ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉన్న ఐటీ, ఫార్మా రంగాల్లోని కంపెనీల షేర్లలో మదుపు చేసిన వారికి రూపాయి పతనం లాభాలు తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది. దిగుమతుల మీద ఆధారపడ్డ కంపెనీల షేర్లకు ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు. విదేశీ సంస్థాగత మదుపరులు మన మార్కెట్లలో కీలకమైన పెట్టుబడిదారులు. ఇలాంటి సమయంలో రూపాయి మరింత తగ్గితే స్వల్పకాలంలో మార్కెట్‌లో కొంత వ్యతిరేక పవనాలు వీచే అవకాశం లేకపోలేదు. చి ఇటు ఈక్విటీ మార్కెట్లలోనూ, అటు బాండు మార్కెట్లోనూ మదుపు చేసేవారిపై స్వల్పకాలంలో రూపాయి పతనం ప్రభావం కనిపిస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tuesday, June 4, 2013

అనగనగా ఓ రూపాయి

 అనగనగా ఓ రూపాయి పడిపోతున్న మారకపు విలువ ప్రస్తుతం 11 నెలల కనిష్ఠ స్థాయి రూ.56.76కి.. త్వరలోనే 57కు చేరే అవకాశం దిగుమతి రంగాలకు తీవ్ర ఇబ్బందులే అంతర్జాతీయ పరిణామాలే కాదు.. ప్రభుత్వ అలసత్వమూ కారణమే ఈనాడు వాణిజ్య విభాగం రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావ్ అని అడిగితే.. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తా.. భార్య భర్తల మధ్య చిచ్చు పెడతా.. తండ్రీ బిడ్డలను విడదీస్తా.. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతా.. ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడదీస్తా.. అని అందట.. అక్కడితో విడిచిపెడుతుందనుకుంటే పొరపాటే.. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది.. స్టాక్ మార్కెట్లను కుప్పకూలుస్తుంది.. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంది.. వివిధ రంగాలను నీరుకారుస్తుంది... ఇలా చెప్పుకుంటే చాలానే పనులు చేస్తుంది రూపాయి. ఇలా అందరినీ ప్రభావితం చేసే రూపాయి.. ప్రస్తుతం డాలరుతో 11 నెలల కనిష్ఠ స్థాయి రూ.56.76కు పడిపోయి అటు ఆర్థిక వ్యవస్థను.. ఇటు ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ప్రభుత్వం చొరవ లేకే..: కరెన్సీని రక్షించడానికి రిజర్వు బ్యాంకు చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకున్నట్లే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో సరైన దిశానిర్దేశం అందలేదనే చెప్పాలి. కరెన్సీ కనిష్ఠ స్థాయిలకు వెళ్లినపుడు అంతర్జాతీయ పెట్టుబడుదారులు దేశంలోకి రావడానికి వెనకడుగు వేస్తారన్న విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితులు కఠినంగా ఉండడంతో పాటు గట్టి సవాళ్లు ఎదురుగా ఉన్నాయన్న విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఈ సమయంలో సరైన విధానపరమైన చర్యలు అవసరం. ఇంతకీ రూపాయి ఎందుకు పతనమవుతోందో మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా రూపాయి పడిపోతోందంటే.. దేశంలోకి పెట్టుబడులు రాకపోవడమో.. లేదా తరలిపోవడమో జరిగి ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మన మార్కెట్లలోకి నికరంగా పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. అయినా రూపాయి పడుతోంది. ఎందుకంటే.. ముఖ్యంగా డాలరు మారక విలువ అన్ని ప్రధాన కరెన్సీలు అంటే యెన్, యూరోల కంటే బలపడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని.. 2013లో మరింతగా మెరుగుపడుతుందన్న అంచనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఒక్క రూపాయే కాదు.. అన్ని ఆసియా కరెన్సీలదే అదే బాట. మరో పక్క దేశీయంగా సరైన సంస్కరణలు లేకపోవడంతో పెచ్చుమీరుతున్న కరెంట్ ఖాతా లోటుతో పాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) దశాబ్ద కనిష్ఠ స్థాయికి దిగజారడం కూడా రూపాయిపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఇంకా పడుతుందా..?: సోమవారం(జూన్ 3) రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజీ(ఫారెక్స్) మార్కెట్లో 56.76 వద్ద 11 నెలల తాజా కనిష్ఠ స్థాయికి చేరింది. త్వరలోనే 57కు కూడా చేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటిదాకా ఎఫ్ఐఐలు మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. అయితే ఈ మధ్యనే వెనక్కిమరలడం మొదలుపెటారు. 9 కోట్ల డాలర్ల దాకా మన స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. మరోపక్క ద్రవ్యోల్బణంపై రిజర్వు బ్యాంకు అంచనాలు ఆశావహంగా లేవు. కరెంట్ ఖాతా లోటు కూడా భయపెడుతోంది. వ్యవసాయం, తయారీ తవ్వక రంగాలు డీలా పడడంతో జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 4.8 శాతానికి పడిపోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఈ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైంది. ఇది దశాబ్దపు కనిష్ఠ స్థాయి. ఇప్పటికే ఫ్యూచర్స్ మార్కెట్లో 57 స్థాయిని అధిగమించిన రూపాయికి ఫారెక్స్ మార్కెట్లో 56.85 వద్ద గట్టి నిరోధం ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఈ స్థాయిని దాటితే అల్‌టైం కనిష్ఠ స్థాయి అయిన 57.32ను త్వరలోనే చేరే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. మరోపక్క మరికొంతమంది విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్పకాలంలో ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి చేరే అవకాశం తక్కువేనంటున్నారు. రూపాయి మారక విలువ క్షీణించిందంటే.. ముఖ్యంగా మనం డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకునే రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మనం ఎక్కువ శాతం ముడి పదార్థాలకు దిగుమతులపైనే ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ముడి చమురు..: ఫారెక్స్ నిల్వల్లో మనం ఎక్కువ భాగం ఖర్చుపెట్టేది చమురు దిగుమతుల కోసమే. బ్రెంట్ చమురు ధర రెండేళ్ల కిందట బారెల్‌కు 118 డాలర్ల దాకా పలికింది. అప్పట్లో రూపాయి మారక విలువ 44.4గా ఉంది. ప్రస్తుతం ముడి చమురు ధర 103 డాలర్లకు తగ్గింది. అయితేనేం ఒక్కో డాలరుకు 56 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో చమురు ధర తగ్గినా మనకు పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదు. కార్పొరేట్ రుణాలు: మన కార్పొరేట్లు ఎక్కువగా పెట్టుబడుల కోసం విదేశీ నిధులను సమీకరిస్తుంటారు. ఇందు కోసం విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీలు); విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల (ఎఫ్‌సీసీబీలు)ను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడి అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యలభ్యత దృష్ట్యా విదేశీ నిధులను సమీకరించుకున్నాయి కంపెనీలు. అయితే రూపాయి విలువ 17 శాతం దాకా క్షీణించడంతో వీరికి రుణం మరింత భారమైంది. విద్యుత్: ఫెర్రస్ లోహాల దిగుమతి వ్యయాలు అధికం కావడంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎరువులు: ఈ పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలలో సగభాగం దిగుమతుల ద్వారా అందేవే. వీటి వ్యయం 20 శాతం దాకా పెరగడంతో వీటిపై భారం పడుతోంది. వీటికి లాభం ఫార్మా కంపెనీలకు: సాధారణంగా ఫార్మా కంపెనీలన్నీ ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాయి. రూపాయి పతనం కావడంతో వీటి మార్జిన్లు పెరగనున్నాయి. విదేశీ వాణిజ్య రుణాలపై నష్టాలు; ఎఫ్‌సీసీబీలు కొంత మేర వీటిపై ఒత్తిడి తెచ్చినా.. కలిసొచ్చే మార్జిన్లతో పోలిస్తే అవి అంత భారీగా ఏమీ ఉండబోవు. జౌళి: ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరగడానికి తోడు నూలు ధరలు తగ్గడంతో జౌళి పరిశ్రమకు ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత హెడ్జింగ్ పొఖ్ణ్మీ;షన్లపై మార్క్-టు-మార్కెట్ నష్టాలు మొత్తం మీద లాభదాయకతను లెక్కించేటపుడు కీలకం కానున్నాయి. వజ్రాభరణాలు: ఈ మధ్య తగ్గుతున్న బంగారం, వెండి ధరలకు తోడు రూపాయి కూడా క్షీణించడంతో వజ్రాభరణాల పరిశ్రమ పంట పండిందనే చెప్పాలి. దిగుమతి చేసుకునే బంగారం, వెండి ధరలు తగ్గడం.. ఎగుమతులు చేసేటపుడు రూపాయి విలువ ఆధారంగా ఎక్కువ మార్జిన్లు రావడంతో రెండు వైపులా ప్రయోజనాలు అందుతాయి.