Thursday, July 10, 2014

బడ్జెట్ ముఖ్యాంశాలు 2014-15

 (ఈనాడు సౌజన్యంతో)
* ప్రణాళికా వ్యయం రూ.17.9 లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.12.20లక్షల కోట్లు
* పన్నుల రేటులో మార్పులు లేవు
* 2018 నాటికి జాతీయ బ్యాంకుల్లో రూ.2.4లక్షల కోట్ల మూలధనం సమీకరణ
* ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల నుంచి రూ.2.50లక్షలకు పెంపు. సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు. 80సీసీ పరిమితి రూ.లక్షన్నరకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు.
* గృహ రుణాలపై పన్ను మినహాయింపు రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షలకు పెంపు
* తపాలాశాఖ పొదుపు పథకాల్లోని నగదు వినియోగంపై దృష్టి
* పీపీఎఫ్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంపు
పర్యాటక కేంద్రంగా గయ
* హస్తకళల పునరుద్ధరణకు రూ.30కోట్లతో అకాడమీ ఏర్పాటు
* ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014-2015లో రూ.2.4లక్షల కోట్ల పెట్టుబడులు
* ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా గయ నగరం
* పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ.100కోట్లు
* దేశవ్యాప్తంగా మరో 12 వైద్యకళాశాలలు
* జాతీయ స్పోర్ట్స్ అకాడమీలో అన్ని ప్రధాన క్రీడలకు శిక్షణ
* బెంగళూరు, ఫరీదాబాద్‌లో బయోటెక్ క్లస్టర్ల అభివృద్ధి
మినహాయింపులు, ప్రోత్సాహాలు
* 19 అంగుళాల టీవీ తయారు చేసే స్వదేశీ సంస్థలకు పన్ను రాయితీ
* విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్లపాటు పన్ను మినహాయింపు
* కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం.
* సబ్బుల ధరలు తగ్గే అవకాశం.
* గాలిమరల విద్యుత్‌కు పన్ను ప్రోత్సాహకాలు.
* సున్నపురాయి, డోలమైట్‌లపై పన్ను రాయితీ
* ఇనుము ధరలు తగ్గే అవకాశం.
* కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఉత్పత్తులపై పన్ను రాయితీ.
* పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12శాతం నుంచి 6శాతానికి తగ్గింపు.
* స్టెయిన్‌లెస్ స్టీల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు
వీటి పన్నులు పెరిగాయి
* రేడియో టాక్సీలపై సేవాపన్ను విధింపు.
* మ్యూచువల్ ఫండ్స్ బదలాయింపుపై పన్ను పెంపు
* శీతలపానీయాలు, పాన్ మసాలాలు ప్రియం
* బాక్సైట్ ఎగుమతిపై సుంకం 10 నుంచి 20శాతానికి పెంపు
* బ్రాండెడ్ దస్తులు, ప్యాకేజ్‌డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం
* పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 16శాతానికి పన్ను పెంపు

ఎఫ్‌డీఐలు 49 శాతం
* రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతానికి పెంపు, ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ నియంత్రణ
* సరిహద్దుల భద్రతకు రూ.2,250కోట్లు
* బీమారంగంలోనూ ఎఫ్‌డీఐలు 49 శాతానికి పెంపు
* ప్రతీ ఇంటికి రెండు బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు
ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐలు
ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. దేశంలో అనూహ్యంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగంలో ఎఫ్‌డీఐలతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొంటుందని ఆర్థికనిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎంత శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఏడు పారిశ్రామిక నగరాలు
దేశంలో తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దేశవ్యాప్తంగా ఏడు పారిశ్రామిక నగరాలు ఏర్పాటుచేస్తామన్నారు.
* దేశంలో తయారీ రంగం ఇంకా ప్రాథమికదశలోనే వుంది.
* తయారీ సంస్థలు తాము తయారుచేసిన ఉత్పత్తుల్ని రిటైల్ రంగం, ఈ-కామర్స్ విధానాల ద్వారా విక్రయించాల్సివుంది.
* ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ తిరిగి వృద్ధి చెందుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి.
* రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో జీడీపీ 7-8 శాతానికి చేరుకుంటుంది.

ఆంధ్రా, తెలంగాణలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే..
ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఇవాళ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులిలా ఉన్నాయి..

*  ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ ఏర్పాటు
*  వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు
*  దేశవ్యాప్తంగా నెలకొల్పే నాలుగు ఎయిమ్స్ సంస్థల్లో ఒక దానిని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనున్నారు.
*  ఎయిమ్స్‌సంస్థల ఏర్పాటుకు రూ.500 కోట్ల కేటాయింపు
*  కాకినాడ పోర్టుకు సమీపంలోని ప్రాంతాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తించడం
*  కాకినాడలో హార్డ్‌వేర్ పరిశ్రమను నెలకొల్పడంపై ప్రత్యేకదృష్టి
*  విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
*  హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ
*  ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీగా కృష్ణపట్నం

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: జైట్లీ
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయా మంత్రిత్వశాఖలు, అధికారం యంత్రాంగం సకాలంలో చేపడుతాయి ' అని అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఉద్యానవన విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

బాలికల కోసం 'బేటీ పఢావో బేటీ బఢావో'
* బాలికల సంరక్షణ కోసం 'బేటీ పఢావో బేటీ బఢావో' పథకం
* ఈ పథకానికి రూ. 500 కోట్లు కేటాయింపు.
* మహిళల సమస్యల పరిష్కారం కోసం దేశరాజధానిలో ఒక కేంద్రం
లింగవివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో విద్యాబోధన జరిగేలా మార్పులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

డిజిటల్ ఇండియాకు రూ. 500 కోట్లు
* గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ సేవలు విస్తృతానికి డిజిటల్ ఇండియాలో భాగంగా రూ. 500 కోట్లు కేటాయింపు.
* స్థానిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు ప్రోత్సాహం
* అన్ని గ్రామాలను బ్రాడ్‌బాండ్‌తో అనుసంధానం చేస్తారు.

మౌలిక రంగానికి
* పారిశ్రామిక కారిడార్లకు సమాంతరంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
* తమిళనాడు, రాజస్థాన్‌లలో సౌర విద్యుత్‌కు రూ.500కోట్లు.
* ఉపాధి హామీకి వ్యవసాయంతో అనుసంధానం.
* ప్రధమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటు.
* జాతీయ వారసత్వ సంపద పరిరక్షణ యోజనకు రూ.200కోట్లు
* మెరైన్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.115కోట్లు
* నదుల అనుసంధానంపై అధ్యయనానికి రూ.100కోట్లు
* ప్రధానమంత్రి కృషి సీంచాయీ యోజన కింద నీటిపారుదల వసతుల మెరుగుకు వెయ్యి కోట్లు
* దేశవ్యాప్తంగా మరో 60 ఆదాయపన్ను కేంద్రాల ఏర్పాటు
* రూ.200 కోట్లతో జమ్మూకాశ్మీర్‌లో క్రీడా సదుపాయాల పెంపు
* ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాల విస్తరణకు రూ.వెయ్యికోట్లు
* కాశ్మీర్ శరణార్థుల సంక్షేమానికి రూ.500 కోట్లు

Tuesday, July 8, 2014

2014-15 రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

(ఈనాడు సౌజన్యంతో)
ఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ ఇవాళ పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సదానందగౌడ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిదని పేర్కొన్నారు. కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో విజ్ఞాపనలు అందాయన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత మనమే ముందున్నామన్నారు. రైల్వే ప్రతిరోజు 2.30కోట్ల మందిని గమ్య స్థానాలకు చేరుస్తోందని మంత్రి వివరించారు.
రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* రైల్వే సామాజిక బాధ్యతను మరువలేదు, ప్రయాణికుల భద్రతే మా ప్రధానాంశం
* రైల్వేకు వచ్చిన ఆదాయంలో రూపాయికి 90పైసలు ఖర్చుపెడుతున్నాం.
* 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది, పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.80లక్షల కోట్లు కావాలి.
* హైస్పీడ్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతాం.
* సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామికావడమే లక్ష్యం.
* గత 10ఏళ్లలో రూ.41వేల కోట్లతో 3700 కి.మీ. కొత్త లైన్ల నిర్మాణం జరిగింది.
* ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టిపెడతాం.
* ఏడాదిలోగా రైల్వేని గాడిలో పెడతాం
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం.
* ఇప్పటి వరకు 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తయ్యాయి.
* వచ్చే పదేళ్లలో రైల్వే ఆధునికీకరణకు రూ.5లక్షల కోట్ల నిధులు అవసరం.
* 30 ఏళ్లు నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి.
* ప్రయాణికులకు మరింత నాణ్యమైన భోజనం అందిస్తాం
* రైల్వే నిర్వహణలో ఎఫ్‌డీఐలను ఆశిస్తున్నాం.
* కేవలం ఛార్జీల పెంపు వల్లే రైల్వే అభివృద్ధి సాధ్యం కాదు
* ఈ ఏడాది రూ.602కోట్లు మిగులు ఆదాయం మా లక్ష్యం
* రైల్వే సదుపాయం లేని కొత్త ప్రాంతాలకు సేవలపై దృష్టి
* గత పదేళ్లలో 3,500 లైన్లకు రూ.41వేల కోట్లు వ్యయం అయింది.
*రైల్వే నిర్వహణలో నిధుల దుర్వినియోగాన్ని నియంత్రించాలి.
* వచ్చే పదేళ్ల వరకు ఏటా రైల్వే అభివృద్ధికి రూ.50వేల కోట్లు అవసరం
* ప్రైవేటు భాగస్వామ్యంతో అన్ని స్టేషన్లలో వంతెనలు, ఎస్కలేటర్లు ఏర్పాటుకు ప్రతిపాదన
* రైల్వే స్టేషనల్లో సీసీ కెమెరాల ద్వారా భద్రత పర్యవేక్షణ.
* ధరల పెంపుపై నిర్ణీత కాలంలో సమీక్ష జరగాలి.
* 2014-15లో రూ.1.64లక్షల కోట్లు రైల్వే టర్నోవర్‌గా అంచనా.
* ఇటీవల పెంచిన ధరల వల్ల రూ.8వేల కోట్ల ఆదాయం.
* డబ్లింగ్, ట్రిప్లింగ్‌లకు మొదటి ప్రాధాన్యం, కొత్తలైన్ల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం
* ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయంపై కేబినెట్ అనుమతి కావాలి.
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు ప్రతిపాదన
* ప్రధాన రైల్వే స్టేషన్లలో, నిర్దేశించిన రైళ్లలోనూ వైఫై వ్యవస్థ
* పోస్టాఫీసులు, మొబైళ్లలో టికెట్ల కొనుగోలు విధానం విజయవంతమైంది.
* ఈశాన్య భారతంలో విజ్ఞాన యాత్రలకు ప్రణాళికలు.
* రైల్వే సేవలపై ప్రయాణికుల అభిప్రాయం సేకరణ వ్యవస్థ ఏర్పాటు.
* రైల్వే లైన్ల విస్తరణకు ప్రథమ, కొత్త రైళ్లకు ద్వితీయ ప్రాధాన్యం
* వృద్ధులు, వికలాంగులను స్టేషన్‌లోకి తీసుకొచ్చేందకు బ్యాటరీ వాహనాలు.
* 50 రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య పనులు ఔట్‌సోర్సింగ్‌కు అప్పగింత
* కాపలా లేని 5,400 క్రాసింగ్‌ల వద్ద ప్రత్యేక చర్యలు
* సాంకేతిక, సాంకేతికేతర విద్యతో కూడిన రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం.
* చెన్నై-హైదరాబాద్ మధ్య సెమీ బులెట్ రైలు
* మెట్రోనగరాల్లోని 10 ప్రధాన స్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన
* రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో సమూల మార్పులు
* ఎంపిక చేసిన లైన్లలో 160 నుంచి 200 కి.మీల వేగంతో నడిచే రైళ్లు
* అన్ని రైల్వేస్టేషన్లలో విశ్రాంతి గదులకు ప్రతిపాదన
* హైస్పీడ్ రైళ్లకు రూ.100కోట్లు కేటాయింపు
* మహిళా భద్రత కోసం 4వేలమంది మహిళా కానిస్టేబుళ్లు
* ఈ-టికెటింగ్ ద్వారా నిమిషానికి 7,200 టికెట్లు బుక్ చేసుకునేలా ఏర్పాట్లు
* రైల్వేల్లో పారిశుద్ధ్యానికి గతేడాది 40శాతం అధిక నిధులు
* రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రయాణ సమయం గుర్తు చేసేలా అలర్ట్ మెసేజ్‌లు
* అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర చతుర్భుజి రైల్వే లైన్
* ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-చంఢీగడ్, ఢిల్లీ-కాన్పూర్‌లకు హైస్పీడ్ రైళ్లు
* కొత్తగా 5 జనసాధారణ్, 5 ప్రీమియం, 27 ఎక్ర్‌ప్రెస్ రైళ్లు
* కొత్తగా 6 ఏసీ, 8 ప్యాసింజర్, 2 మెమూ, 5 డెమూ రైళ్లు

2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్

2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్

Courtesy : Sakshi | Updated: July 08, 2014

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సదానంద గౌడ మంగళవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు:
* సేప్టీ, సెక్యూరిటీ, స్పీడ్ కు ప్రాధాన్యత
* కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం
*  దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు అత్యంత కీలకం
* భారతీయ రైల్వే ముందు ఎన్నో సవాళ్లు
* రోజుకు 2కోట్ల 30లక్షలమందిని గమ్యానికి చేరుస్తోంది
* భద్రత, సౌకర్యాలపై రాజీ పడేది లేదు
* హైస్పీడ్ నెట్ వర్క్ ను నెలకొల్పుతాం
* గత సంవత్సరం 99 కొత్త లైన్లకు అనుమతిస్తే ఒక్కటే పూర్తి
* 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
* ప్రతిపాదిత ప్రాజెక్టుల పూర్తికి 5 లక్షల కోట్లు అవసరం
* రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరం
* కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి చాలా విజ్ఞాపనలు వచ్చాయి
* ఆదాయంలో ప్రతి రూపాయికి 94 పైసలు ఖర్చు పెడుతున్నాం
* 12,500 రైళ్లలో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం
* ఏడాదిలోగా రైల్వే వ్యవస్థను గాడిలో పెడతాం
* సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామి కావటమే లక్ష్యం
* రైల్వే సామాజిక బాధ్యత మరవలేదు
* 30ఏళ్ల నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి
* భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిది
* ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి
* రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
* ప్రాజెక్టుల ఆమోదం పైనే తప్ప పూర్తిపైన దృష్టి కొరవడింది
* సరుకు రవాణాలో కొంత తగ్గుదల
* పదేళ్లలో 99 కొత్త లైన్లకు రూ. 60 వేల కోట్లు ఖర్చు
* 1,57,888 కోట్లు విలువైన ప్రాజెక్టులు ఆమోదం పొందాయి
* 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి
* నాణ్యమైన భోజనం అందించేందుకు క్యాటరింగ్ వ్యవస్థ సంస్కరిస్తాం
* రైళ్లలో అందుబాటులో రెడీ టూ ఈట్ ఫుడ్
* అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులు
* అన్ని ప్రధాన స్టేషన్లలో సీనియర్ సిటిజన్లకు బ్యాటరీ కార్లు
* అన్ని స్టేషన్లలో రైల్వే ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యం
* నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు, అవసరమైతే కాంట్రాక్ట్ రద్దు
* రైళ్లలో పరిశుభ్రతకు కేటాయించే నిధులు 40 శాతం పెంపు
* పెండింగ్ ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం ఈ ఏడాది పూర్తి చేసేందుకు యత్నం
* 11,794 కోట్ల లోన్ కోసం ప్రయత్నం
* రైళ్లలో లోపాలు గుర్తించేందుకు అల్ట్రా సోనిక్ రైల్ స్కానింగ్ సిస్టమ్ ఏర్పాటు
* ఆర్ పీఎఫ్ బలగాలకు మొబైల్ ఫోన్లు
* రైల్వే స్టేషన్లు వచ్చాకే తలుపులు తెరుచుకునేలా ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ ట్రయిన్
* అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ 'రైల్వే వజ్ర చతుర్భుజి' హైస్పీడ్ రైళ్లు
* నిమిషానికి 7200 టికెట్లు ఇచ్చేలా ఈ టికెటింగ్ వ్యవస్థ తీర్చిదిద్దుతాం
* 4వేల  మహిళా ఆర్ పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం
* ఎంపిక చేసిన 9 మార్గాల్లో రైళ్ల స్పీడ్ 160 కిలోమీటర్లు నుంచి 200 కిలోమీటర్లుకు పెంచుతాం
* అయిదేళ్లలో పేపర్ లెస్ రైల్వే కార్యాలయాలు
* త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* అన్ని ఏ కేటగిరి రైళ్లలో ఉచిత వై ఫై సౌకర్యం
* ఈశాన్య రాష్ట్రాలకు ఏకో టూరిజం రైళ్లు, ఎడ్యుకేషన్ రైళ్లు
* రైల్వే కార్యాలయాల్లో సోలార్ పవర్ వినియోగం
* ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయం లక్ష్యం
* రైల్వే రిజర్వేషన్లకు పోస్టాఫీసులు వాడకం
* ఏకో టూరిజానికి ప్రాధాన్యత
* పార్శిల్ రవాణాలో ప్రయివేట్ భాగస్వామ్యం
* రైల్వేకు కేంద్రం రూ.1100 కోట్లు సాయం
* చెన్నై-హైదరాబాద్ మధ్య  బుల్లెట్ రైలు
* ఆన్ లైన్ లో ఫ్లాట్ ఫాం టిక్కెట్
* విద్యార్థులకు ప్రత్యే రాయితీలు
* నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్
* కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
* ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
* ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం
* టికెట్ల అమ్మకం ద్వారా రూ. 44,645 కోట్లు ఆదాయం
* రైల్వే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
* త్వరలో రైల్వేబోర్డులో మార్పులు చేర్పులు
* చార్ థామ్, కేదారనాథ్,బద్రీనాథ్ లకు రైల్వే కనెక్టివిటీ
* ఎస్ ఎంఎస్ ద్వారా రైళ్లలో ఫుడ్ ఆర్డర్
* కొత్తగా అయిదు జన సాధారణ్ రైళ్లు
* విజయవాడ-ఢిల్లీ మధ్య  ఏసీ ఎక్స్ ప్రెస్ కొత్తరైలు
* సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు
* విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్
* పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్