Friday, February 28, 2014

చిన్న సిమెంటు కంపెనీలపై కన్నేస్తున్న పెద్ద కంపెనీలు

విపణిలో సుస్థిర స్థానమే లక్ష్యం

సిమెంటు పరిశ్రమలో కొనుగోళ్లు- విలీనాల సీజను మొదలైంది. ప్రస్తుత గడ్డు కాలాన్ని అతి కష్టం మీద తట్టుకుంటున్న చిన్న, మధ్య స్థాయి కంపెనీల ముందు బడా కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు పెట్టి, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మన రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని ఒకటి రెండు యూనిట్ల కొనుగోలుకు ఒక బహుళ జాతి సిమెంటు సంస్థ, మరొక దేశీయ సిమెంటు కంపెనీ కసరత్తు మొదలుపెట్టాయని పరిశ్రమ వర్గాల సమాచారం.

నిజానికి సిమెంటు పరిశ్రమకు ఉత్థాన పతనాలు మామూలే. ఆయిదారేళ్లకోసారి అనూహ్యమైన అవకాశాన్ని, ఆ తరువాత తట్టుకోలేనంత కష్టకాలాన్ని ఈ పరిశ్రమ చవిచూస్తోంది. ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. అయితే కష్టకాలంలో తట్టుకునే శక్తి ఉన్న కంపెనీలు మనుగడ సాధించగలుగుతున్నాయి. లేకపోతే అటువంటి వాటిని ఏదో ఒక పెద్ద కంపెనీ కొనుగోలు చేస్తూ వస్తోంది. 2004-05 వరకూ సిమెంటు పరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కానీ తరువాత కలిసొచ్చిన అవకాశాలతో పరిశ్రమ బాగా కోలుకుంది. అనూహ్యమైన డిమాండును సంపాదించింది. దీన్ని అవకాశంగా తీసుకొని పెద్దఎత్తున విస్తరణ సామర్థ్యాన్ని పరిశ్రమ వర్గాలు విస్తరించాయి. అక్కడే తేడా వచ్చింది. 2008 తరువాత ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రతరమై సిమెంటు కంపెనీలు లెక్కలు తప్పయ్యాయి. డిమాండు క్షీణించింది. అధిక డిమాండును ఆశించి అప్పులు చేసి మరీ సామర్థ్యాన్ని పెంచుకున్న సంస్థలకు కష్టకాలం మొదలైంది. ఈ పరిస్థితిని పెద్ద కంపెనీలు ఎలాగో నెట్టుకొస్తున్నప్పటికీ, చిన్న- మధ్యస్థాయి సిమెంటు కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. పైగా అప్పుల భారం ఉన్న కంపెనీలకు అయితే అసలే కుదరడం లేదు. దీన్ని గుర్తించిన పెద్ద సంస్థలు వాటి విస్తరణ వ్యూహాలను అమల్లో పెడుతున్నాయి. తమకు అనుకూలంగా, తమ విస్తరణ వ్యూహాలకు అనువైన సిమెంటు యూనిట్లను గుర్తించి, కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

వినియోగానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ సమస్య అధికంగా ఉంది. ఉత్పత్తి సామర్థ´్యం గత అయిదేళ్ల కాలంలో దక్షిణాదిలో అనూహ్యంగా పెరిగిపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 30 మిలియన్ టన్నుల నుంచి 75 మి. ట.కు పెరిగింది. తమిళనాడులో దాదాపు 10 మి. ట. సామర్థ్యం కాస్తా 27 మి. ట.కు చేరింది. ఇక కర్ణాటకలోనూ ఉత్పత్తి సామర్థ´్యం 40 మిలియన్ టన్నులకు చేరుకుంటోంది. ముఖ్యంగా కర్ణాటకలోని గుల్బర్గా క్లస్టర్‌లో కొత్త యూనిట్లు ఎంతో అధికంగా వచ్చాయి. సాగర్ వికా, దాల్మియా భారత్ తదితర సంస్థలు గుల్బర్గా క్లస్టర్‌లో కొత్త యూనిట్లు స్థాపించాయి. గుల్బర్గా నుంచి ఉత్తర కర్ణాటక ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లకు సిమెంటును అందించే అవకాశం ఉండడంతో పలు సంస్థలు వ్యూహాత్మకంగా అక్కడ కొత్త యూనిట్లను స్థాపిస్తున్నాయి. ఇంకా మరికొన్ని యూనిట్లు కూడా అక్కడ వస్తున్నాయి. దీంతో కర్ణాటకలోనూ సామర్థ్యం పెరుగుతోంది. చిన్న రాష్ట్రమైన కేరళలో ఒక మిలియన్ టన్నుల వరకూ మాత్రమే సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మొత్తంమీద నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు ఉంది. ఈ పరిస్థితి కూడా కొనుగోళ్లు- విలీనాల ప్రక్రియకు వీలు కల్పిస్తోంది.

ముందుముందు మరిన్ని..?!
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం గుల్బర్గాలోని సిమెంటు యూనిట్‌ను పూర్తిగా సొంతం చేసుకునేందుకు ఒక బహుళ జాతి సిమెంటు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ యూనిట్లో పాక్షికంగా వాటా ఉన్న ఈ సంస్థ మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసి, ఆ యూనిట్‌ను సొంతం చేసుకోబోతోందని చెబుతున్నారు. తద్వారా దక్షిణాది విపణిలో తన స్థానాన్ని సుస్థి´రం చేసుకొనే అవకాశం కలుగుతుందని ఈ బహుళ జాతి సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏదైనా మధ్య స్థాయి సిమెంటు కంపెనీని కొనుగోలు చేయాలని కూడా ఒక అగ్రశ్రేణి దేశీయ సిమెంటు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. సిమెంటు రంగంలో ఈ విధమైన స్ధిరీకరణ ఒకటి రెండు కొనుగోళ్లు- విలీనాలకే పరిమితం కాకుండా ముందుముందు కూడా కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- ఈనాడు, హైదరాబాద్

టెలికం సంస్థలకు వాట్స్‌యాప్ డేంజర్ రింగ్

Sakshi | Updated: February 28, 2014 00:45 (IST)
టెలికం సంస్థలకు  వాట్స్‌యాప్ డేంజర్ రింగ్
 ఆదాయానికి గండి కొడుతున్న వాట్స్ యాప్
  త్వరలో వాయిస్ కాల్ సేవలకూ రెడీ!
  ఇప్పటికే మెసేజింగ్ వల్ల రూ.2 వేల కోట్ల దాకా గండి
  మరింత నష్టపోతామంటున్న టెలికం కంపెనీలు
  వాయిస్ నుంచి డేటాకు మారాలని సూచిస్తున్న నిపుణులు


 వాట్స్ యాప్. ఇంటర్నెట్ ఉంటే చాలు. దీంతో ఏదైనా చేసేయొచ్చు. ఫ్రీగా మెసేజ్‌లు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో పంపేయొచ్చు. ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు. వాట్స్ యాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. అలాంటి వాట్స్ యాప్... ఇపుడు వాయిస్ కాల్స్‌ను కూడా అందించేందుకు శ్రీకారం చుడుతోంది. అదే గనక ఆరంభమైతే ఫ్రీగా కాల్స్ కూడా చేసేసుకోవచ్చు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్... ఎక్కడి నుంచి ఎక్కడికైనా! మరి అదే జరిగితే టెలికం సంస్థల సంగతేంటి? వస్తున్న ఆదాయాల్లో 85 శాతం వాయిస్ కాల్స్ ద్వారానే పొందుతున్న టెలికం సంస్థల భవిష్యత్తేంటి?                                 - సాక్షి, బిజినెస్ డెస్క్

 నలభై ఐదు కోట్ల మంది వాడకందార్లతో ప్రపంచంలోనే అతి పెద్ద మెసేజింగ్ సర్వీస్‌గా మారిన వాట్స్ యాప్‌ను అతి పెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్... ఈ మధ్యే 19 బిలియన్ డాలర్లు (రూ.1.18 లక్షల కోట్లు) పెట్టి కొనేసింది. ఫేస్‌బుక్, వాట్స్ యాప్ కలిస్తే ఇంకేముంది! రెండూ కలిసి కొత్త వ్యూహాలను ప్రక టిస్తుండటంతో పోటీ సంస్థలతో పాటు టెలికం కంపెనీలూ కలవరపడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం టెలికం ఆపరేటర్లకు ఎస్సెమ్మెస్, వాయిస్, డేటాతో పాటు వాల్యూ యాడెడ్ సర్వీసుల వంటి నాలుగు ఆదాయ వనరులున్నాయి. వీటిలో అగ్రస్థానం వాయిస్ కాలింగ్ సర్వీసులదే. ఇపుడు 3జీ రావటంతో డేటా సేవలను మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి. అవి ఆ ప్రయత్నాల్లో ఉండగానే... సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, మెసేజింగ్ సర్వీసుల సంస్థలు చాప కింద నీరులాగా చుట్టబెట్టేస్తున్నాయి. స్కైపీ, వైబర్ లాంటి వాటితో పాటు దాదాపు అయిదేళ్ల క్రితం ప్రారంభమైన వాట్స్ యాప్ కూడా ఇందులో దూసుకెళ్లిపోతోంది. గతేడాది మెసేజ్‌ల మార్కెట్ విలువ దాదాపు రూ.6,000 కోట్లు ఉండగా.. వాట్స్‌యాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ కంపెనీలు సుమారు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల దాకా ఆదాయానికి గండికొట్టాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా వాల్యూ యాడెడ్ సర్వీసుల ద్వారా టెలికం కంపెనీలు లక్షల కోట్లు ఆర్జిస్తుండగా.. గూగుల్ వంటి వెబ్‌సైట్లు అందులో 6-7 శాతం వాటాను దక్కించుకుంటున్నాయి. ఇవి తమ సర్వీసులను విస్తరిస్తున్న కొద్దీ టెల్కోల ఆదాయానికి మరింత గండిపడుతూనే ఉంటుందని దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మాజీ సీఈవో సంజయ్ కపూర్ పేర్కొన్నారు.


 ఈ దాడిని ఎదుర్కోవడానికి టెలికం కంపెనీలు మల్లగుల్లాలు పడుతుండగానే తాము వాయిస్ కాల్స్‌ని కూడా ప్రవేశపెట్టబోతున్నామంటూ వాట్స్‌యాప్ సహవ్యవస్థాపకుడు జాన్ కూమ్ బాంబు పేల్చారు. ఇప్పటికే ఒకదానితో మరొకటి పోటీపడి కాల్‌చార్జీలను తగ్గించుకుంటూ పోయిన టెల్కోలకు ఇది ఊహించని ఎదురుదెబ్బే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు మందికి పైగా యూజర్లు ప్రస్తుతం వాట్స్ యాప్‌ను వాడుతున్నారు. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందనేది నిపుణుల అంచనా.  ప్రస్తుత యూజర్లందరూ పెయిడ్ యూజర్లుగా మారితే కేవలం మెసేజింగ్ సర్వీసులతోనే (ఏడాదికి ఒక డాలర్) వాట్స్‌యాప్‌కి వార్షికంగా రూ.3,000 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుందని అంచనా. ఇక వంద కోట్ల మంది యూజర్లు ఇటు మెసేజింగ్, కాల్ సర్వీసులను వాడటం మొదలుపెడితే అనేక రెట్లు ఆదాయం వస్తుంది. టెల్కోలకు కూడా డేటా వాడకం రూపంలో కొంత ఆదాయం వచ్చినా.. వాటి సర్వీసులను వాట్స్‌యాప్ ఎగరేసుకుపోవడం వల్ల ఆ ప్రభావం మిగతా ఆదాయాలపై తీవ్రంగానే ఉంటుంది.

 ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్నాళ్లు పోయాక ఈ ప్రభావం టెలికం సంస్థల ఆదాయంపై తీవ్రంగా పడుతుందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీకి చెందిన జైదీప్ ఘోష్ అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ఫోన్లు ఇంకా పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రజల చేతుల్లోకి చేరలేదు కనుక, ఇంటర్నెట్ సేవలు మారుమూల గ్రామాల్లో విస్తృతంగా లేవు కాబట్టి ప్రస్తుతానికి ఈ ప్రభావం తక్కువగానే ఉంటుందన్నారు.

 వాట్స్‌యాప్‌కి సానుకూలాంశాలు..
 స్కైపీ వంటి యాప్స్‌తో పోలిస్తే వాట్స్‌యాప్‌కి అనేక అనుకూలాంశాలున్నాయని సైబర్ మీడియా ఎడిటోరియల్ అడ్వైజర్ ప్రశాంతో రాయ్ చెప్పారు. ప్రత్యేకంగా పీసీతో పని ఉండదు. వాట్స్‌యాప్‌ను ఉపయోగించడం చాలా సులువు. వీటికితోడు యూజర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండటం దానికి లాభిస్తుందని తెలిపారాయన. పైగా ఇతర యాప్స్‌తో పోల్చినప్పుడు వాట్స్‌యాప్ ఆడియో, వీడియో మెసేజిల్లో మరింత స్పష్టత ఉంటుందని తెలియజేశారు. కొంగొత్త సేవలను విస్తరించేందుకు సానుకూలాంశాలు ఉన్నందునే ఫేస్‌బుక్ భారీ మొత్తం వెచ్చించి వాట్స్‌యాప్‌ని కొనుగోలు చేసిందనేది సంజయ్ కపూర్ అభిప్రాయం. మొబైల్ కామర్స్‌లోనూ ఇది చొచ్చుకుపోయే అవకాశముందన్నారు.

 ఈజీ సేవల వాట్స్‌యాప్..
     ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు సంబంధించి ఇదో అప్లికేషన్(యాప్). దీనిద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫొటోలు ఏవైనా సరే వేరొకరికి లేదా గ్రూపునకు పంపొచ్చు.

     వేరొకరు పంపిన వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌లు ఇతరులతో షేర్ చేసుకోవచ్చు కూడా.

     దీనికి టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి ఎలాంటి చార్జీలు ఉండవు. స్మార్ట్, ఫీచర్ ఫోన్లు అన్నింటిలోనూ (గూగుల్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఓఎస్, యాపిల్ ఐఓఎస్; నోకియా ఆశా, విండోస్ ఫోన్ ఇతరత్రా) ఈ యాప్ అందుబాటులో ఉంది.

     ప్రపంచంలో ఏ మూలనుంచైనా ఈ యాప్‌ను ఉపయోగించొచ్చు. ఫోన్ లేదా ట్యాబ్‌లో కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. యూజర్ల మొబైల్ నంబర్ల ఆధారంగా ఇది అనుసంధానం అవుతుంది.

     డౌన్‌లోడ్ చేసుకున్న తొలి ఏడాది పాటు ఈ యాప్‌ను ఉచితంగానే వాడుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఏడాదికి ఒక డాలరు (దాదాపు రూ.62) చొప్పున ఫీజు చెల్లించాలని వాట్స్‌యాప్ చెబుతోంది.

 ప్రసుత్తం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు 10 లక్షల మంది కొత్త యూజర్లు జతవుతున్నట్లు అంచనా. అంతేకాదు వాట్స్‌యాప్ యూజర్లలో 70 శాతం మంది యాక్టివ్‌గా (రోజులో కనీసం ఒకసారైనా వాడేవారు) ఉంటున్నారు.

     స్వల్పకాలంలోనే వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని అధిగమించగలదని అంచనా.

     రోజుకు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్‌లు దీనిద్వారా షేర్ అవుతున్నట్లు అంచనా.

 టెల్కోల వ్యూహాలు..
 కన్సల్టెన్సీ సంస్థ ఓవమ్ అంచనాల ప్రకారం కస్టమర్లు డేటా నెట్‌వర్క్ ద్వారా వాయిస్ కాల్స్‌ని వాడటం మొదలుపెడితే 2018 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా టెల్కోల ఆదాయాల్లో 386 బిలియన్ డాలర్ల మేర గండిపడుతుంది. ప్రస్తుతం టెల్కోల ఆదాయంలో సగటున 85 శాతం వాటా వాయిస్ కాల్స్‌దే ఉంటోంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ) రూపంలో ఇప్పటికే ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇది వచ్చినప్పుడు కూడా దేశీయంగా వీఎస్‌ఎన్‌ఎల్ ఆదాయం 40-50 శాతం పడిపోయింది.

  వీవోఐపీతో దేశీయంగా వీఎస్‌ఎన్‌ఎల్, అటు అమెరికాలో ఏటీఅండ్‌టీ వంటి దిగ్గజాలు పోరాడినప్పటికీ... వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే, ఇప్పటికే టెలికం స్పెక్ట్రం, లెసైన్సులు, నెట్‌వర్క్ ఏర్పాటు కోసం వేల కోట్లు కుమ్మరించిన టెల్కోలు వాట్స్‌యాప్ దాడిని చూస్తూ ఊరుకోకపోవచ్చు. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవి నియంత్రణ సంస్థను ఆశ్రయించవచ్చు. ఆపరేటర్ల ఆందోళనలపై కూడా తాము దృష్టిపెడతామని ఈ మధ్యే టెలికం శాఖ కూడా హామీ ఇచ్చింది. ఏది ఏమైనా... ఇప్పటిదాకా ఏదో రకంగా లాగించిన టెలికం కంపెనీలు ఇప్పటికైనా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి సత్వర చర్యలకు దిగాలని, లేదంటే కష్టమేనని కపూర్ వ్యాఖ్యానించారు.
 

Tuesday, February 25, 2014

ఏటీఎంలకు మరో రూ.1,800 కోట్లు వెచ్చించేందుకు బ్యాంకులు సన్నద్ధం

రద్దీ లేని చోట్ల రాత్రిళ్లు మూసివేత..!
ఈనాడు -
ప్రతి బ్యాంకు శాఖలోనూ ఏటీఎం తప్పసరి చేయాలన్న భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆదేశాలను అమలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధం అవుతున్నాయి. విస్తరిస్తున్న జనావాసాలకు అనుగుణంగా, మరిన్ని ఏటీఎం కేంద్రాలనూ ఏర్పాటు చేస్తున్నాయి. గత ఏడాది ఆఖరుకు దేశంలోని బ్యాంకులన్నీ కలిపి 1.41 లక్షల ఏటీఎంలను నెలకొల్పగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా దేశంలో మరో 30,000 ఏర్పాటవుతాయని అంచనా. ఇందుకు బ్యాంకులు కనీసం రూ.1,800 కోట్లు వెచ్చించాల్సి ఉంది.
ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరాన్ని, బ్యాంకు పనివేళల్లోనే ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాల్సిన అవస్థను తప్పించిన ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్)లు మరిన్ని ఏర్పాటు కాబోతున్నాయి. ప్రారంభంలో నగదు ఉపసంహరణ, ఖాతాలో నిల్వ పరిశీలన, లావాదేవీల పరిశీలన (మినీ స్టేట్‌మెంట్)కు ఏటీఎంలను ఎక్కువగా వినియోగించే వారు. ఇప్పుడు నగదు జమ, వేరే ఖాతాలకు నగదు బదిలీ, బీమా- బిల్లుల చెల్లింపు, రుణానికి అభ్యర్థన, టికెట్ల కొనుగోలుల వంటి వాటికీ వాడుతున్నారు. బ్యాంకు శాఖల ఆవరణల్లో అద్దె అదనంగా లేకున్నా, ఏటీఎం నెలకొల్పేందుకు గదిని తీర్చిదిద్ది, భద్రతా ఏర్పాట్లు చేసేందుకు బ్యాంకులకు అదనపు ఖర్చు తప్పదు.

ఇదీ లెక్క: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని వాణిజ్య బ్యాంకులు 1.08 లక్షల బ్యాంకు శాఖలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో 1,14,014 ఏటీఎంలు ఉంటే, గత డిసెంబరు ఆఖరుకు కొత్తగా 27,501 జత చేరి, వీటి సంఖ్య 1,41,515కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే ప్రతి బ్యాంకు శాఖలోనూ ఒక ఏటీఎం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. దీనికి తోడు విస్తరిస్తున్న జనావాసాల్లో కొత్తగా ఏటీఎం కేంద్రాలను బ్యాంకులు నెలకొల్పుతున్నాయి. మార్చి లోపు మరో 30,000 వరకు కొత్తగా ఏటీఎంలు ఏర్పాటు చేయవచ్చని ఒక జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. అత్యధిక కేంద్రాల్లో ఒక ఏటీఎం ఏర్పాటు చేస్తున్నా, రద్దీకి అనుగుణంగా కొన్ని కేంద్రాల్లో 2-5 వరకు కూడా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బ్యాంకులకు సగటున రూ.6 లక్షల వరకు ఖర్చవుతోంది. అంటే 30,000 ఏటీఎంలు నెలకొల్పేందుకు బ్యాంకులు మరో రూ.1,800 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఒక్కో కేంద్రంలో 2-3 ఏటీఎంలను నెలకొల్పినప్పటికీ, ఇందుకు పెద్ద ప్రాంగణాలు అద్దెకు తీసుకోవడం వల్ల అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా కేంద్రాల సంఖ్య తగ్గినా, బ్యాంకుల పెట్టుబడి ఒకే మాదిరి ఉంటోంది. ప్రస్తుతం ఏటీఎంలపై సగటు లావాదేవీలు రోజుకు 180 వరకు ఉన్నాయి. నిర్వహణ ఖర్చులన్నీ కలుపుకొంటే, ఒక్కొక్క లావాదేవీకి రూ.12-15 వ్యయం అవుతున్నట్లు అంచనా.

నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు..
ఒకవైపు ఏటీఎం కేంద్రాలు పెంచుతూనే, మరో వైపు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకొనేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. బెంగళూరులో ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడి జరిగాక, భద్రతా ఏర్పాట్లు పెంచాలంటూ బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. 24 గంటలూ భద్రత కల్పించేందుకు మూడు షిఫ్టులలో ముగ్గురేసి సెక్యూరిటీ గార్డుల జీతభత్యాలు అదనపు భారం అవుతుంది. ఇందుకోసం అన్ని బ్యాంకులపై కలిపి ఏడాదికి రూ.4,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. అంటే ప్రతి లావాదేవీకి అదనంగా రూ.5 వరకు పడుతుందని భావిస్తున్నారు.
చి అవకాశం ఉన్న- లావాదేవీలు తక్కువగా ఉన్న సమయాల్లో ఏటీఎం కేంద్రాల మూసివేతను బ్యాంకులు చేపడుతున్నాయి.
చి అత్యధిక ఏటీఎం కేంద్రాల్లో ఎయిర్‌కండీషన్ సదుపాయం ఉంది. వీటితో పాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. కాబట్టి ఏటీఎం తక్కువ గంటలు పనిచేస్తే విద్యుత్తు బిల్లు భారం కూడా తగ్గుతుందనేది బ్యాంకుల ఆలోచన.
చి ప్రస్తుతం ఒక బ్యాంకు ఖాతాదారు, సొంత బ్యాంకు ఏటీఎంలలో ఎన్ని లావాదేవీలైనా ఉచితంగా నిర్వహించుకుంటున్నారు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే, నెలకు 5 లావాదేవీలు ఉచితం. అవి దాటితే ఛార్జీ పడుతుంది. వాస్తవానికి వేరే బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరిస్తే, ఖాతాదారు తరఫున బ్యాంకు రూ.15 (ఇంటర్‌ఛేంజ్ రేట్), నగదు నిల్వ పరిశీలనకు రూ.5 చొప్పున చొప్పున మొదటి లావాదేవీ నుంచే చెల్లిస్తున్నాయి. 5 లావాదేవీలు దాటాకే ఈ మొత్తాన్ని ఖాతాదారు నుంచి వసూలు చేస్తున్నాయి. ఇకపై సొంత బ్యాంకు ఏటీఏంలలోనూ నెలకు 5 లావాదేవీలు దాటితే, ఇలానే చార్జీ వసూలు చేయాలన్నది బ్యాంకర్ల ప్రతిపాదనగా ఉంది.
చి లావాదేవీలు అధికంగా జరిగే కేంద్రాలను మాత్రమే 24 గంటలూ తెరచి ఉంచి, మిగిలిన వాటికి విరామం ఇవ్వనున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6/8 గంటల వరకు లావాదేవీల సంఖ్య 5-10 దాటని ప్రాంతాల్లో ఏటీఎంల మూసివేతను ఇప్పటికే కొన్ని బ్యాంకులు ప్రారంభించాయి కూడా.
మార్చి లోపు కొత్తగా 1600 ఏటీఎంలు
ఒక ఏటీఎం ధర రూ.3.25 లక్షల వరకు ఉంది. స్థిరాస్తి (గది లీజు), విద్యుత్తు సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు, అలంకరణ.. ఇవన్నీ కల్పించేందుకు ఒక్కో కేంద్రంపై రూ.6 లక్షల వరకు వెచ్చిస్తున్నాం. మా బ్యాంకుకు 1,400 ఏటీఎంలున్నాయి. మార్చి 31లోపు మరో 1600 ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నాం. బ్యాంకుకు ఖాతాదారు వచ్చి, నగదు లావాదేవీలు జరుపుకునేందుకు అయ్యే వ్యయం ఏటీఎంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ అనేది వాస్తవమే. అందుకే 5 లావాదేవీల పరిమితిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు అన్ని బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.
- ఎం.ఆంజనేయ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిండికేట్ బ్యాంకు

వాట్స్‌యాప్‌ను 'లైక్' చేసిన ఫేస్‌బుక్

రూ.1,14,000 కోట్లతో సొంతం!
అతిపెద్ద మొబైల్ ఐటీ కొనుగోలు ఇదే
లాటిన్ అమెరికా, ఆసియాల్లో మరింత విస్తరణకు వూతం

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ అయిన వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేయనుంది. 19 బిలియన్ డాలర్ల(డాలరుకు రూ.60 చొప్పున లెక్కగడితే రూ.1,14,000 కోట్లు)కు ఒప్పందం కుదరనుంది. ఇందులో భాగంగా 12 బిలియన్ డాలర్ల విలువైన ఫేస్‌బుక్ షేర్లను; 4 బిలియన్ డాలర్ల నగదును; మిగిలిన 3 బిలియన్ డాలర్లను బదిలీ చేయడానికి వీలులేని షేర్ల రూపంలోనూ చెల్లించనున్నారు. తద్వారా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌గా ఉన్న ఫేస్‌బుక్.. వాట్స్‌యాప్‌నకున్న 45 కోట్ల వినియోగదార్లను జతచేసుకుని మరింత బలోపేతం కానుంది. 'ప్రపంచానికి మరింత అనుసంధానాన్ని అందించాలన్న ఫేస్‌బుక్, వాట్స్‌యాప్్‌ల ధ్యేయానికి ఈ కొనుగోలు ఉపయుక్తంగా ఉండగలద'ని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాదిలోగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది.

బ్రాండ్ మారదు: కంపెనీ చేస్తున్న అతిపెద్ద కొనుగోలు ఇదేనంటున్న ఫేస్‌బుక్.. దీని ద్వారా వాట్స్‌యాప్ బ్రాండ్‌పై ప్రభావం ఉండదని అదే విధంగా కంపెనీ ప్రధాన కార్యాలయం సైతం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోనే ఉండబోతుందని స్పష్టం చేసింది. 2012లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ 16 బిలియన్ డాలర్లను సమీకరించిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం కౌమ్.. ఫేస్‌బుక్ బోర్డులో చేరుతారు. అదే సమయంలో వాట్స్‌యాప్ వ్యవస్థాపకులు, ఉద్యోగులకు 3 బిలియన్ డాలర్ల(4,59,66,444 షేర్లు) విలువైన పరిమిత స్టాక్ యూనిట్లను అందజేస్తారు. ఒప్పందం అనంతరం కూడా వాట్స్‌యాప్ స్వతంత్రంగానే కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఒప్పందం ముగిసిన తర్వాత వాట్స్‌యాప్‌నకు చెందిన అన్ని షేర్లు, ఆప్షన్లు ఎక్స్ఛేంజీల్లో రద్దవుతాయి.
చి ఒక వేళ నియంత్రణ సంస్థలు ఈ విలీనానికి ఒప్పుకోకపోతే వాట్స్‌యాప్‌నకు ఫేస్‌బుక్ 1 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో అంతే విలువైన ఫేస్‌బుక్ క్లాస్ కామన్ స్టాక్‌ను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. రద్దయిన తేదీకి ముందు పదిరోజుల సగటు షేరు ధరను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటారు.
చి గతేడాది జుకర్‌బర్గ్ 3 బిలియన్ డాలర్లకు మరో మెసేజింగ్ సంస్థ స్నాప్‌చాట్‌ను కొనుగోలుకు యత్నించి విఫలమయ్యారు.

ఎందుకీ కొనుగోలు
ప్రపంచంలో ఇప్పటికీ మూడింట రెండొంతుల మంది ఇంటర్నెట్‌ను వినియోగించని వారే. వీరికి అంతర్జాలాన్ని దరిచేయాలన్నదే ఫేస్‌బుక్‌కు చెందిన ఇంటర్నెట్.ఓఆర్‌జీ ప్రాజక్టు లక్ష్యం. ఎక్కువ శాతం వృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరగనుందనేది సుస్పష్టం. ఆ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వాట్స్‌యాప్‌ను చేజిక్కించుకోవడం ఫేస్‌బుక్ వ్యూహంలో కీలకంగా మారింది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం వాట్స్‌యాప్‌కున్న ప్రతి యాక్టివ్ వినియోగదారూ.. చెల్లించే వినియోగదారుగా మారితే వాట్స్‌యాప్్‌కు 450 మిలియన్ డాలర్లు వస్తాయి.
ఏమిటీ వాట్స్‌యాప్
ఇదో అంతర్జాల ఆధారిత క్రాస్-ఫ్లాట్‌ఫాం మొబైల్ అప్లికేషన్. వివరంగా చెప్పాలంటే.. ఎలాంటి టెలికాం ఛార్జీలు చెల్లించకుండానే సంక్షిప్త సందేశాలను (ఫొటోలు, వీడియోలు సైతం) వినియోగదారులు ఒకరికొకరు చేరవేసుకునే, పంచుకునే అప్లికేషన్. దీనిని 2009లో యాహూ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు అయిన జాన్ కౌమ్(ఉక్రేనియా), బ్రియాన్ ఆక్టన్(అమెరికా)లు స్థాపించారు. దాదాపు ప్రతీ నెలా 45 కోట్ల మంది ఈ మెసేజింగ్ సర్వీసును ఉపయోగించుకుంటుండగా.. ఇందులో 70 శాతం మంది యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతే కాదు రోజుకు 10 లక్షల మంది కొత్త వినియోగదారులు ఇందులో చేరుతున్నారు. ఒప్పందం అనంతరం కూడా కేవలం నామమాత్రపు ఫీజుతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఏ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నా.. ఈ అప్లికేషన్ సాయంతో సందేశాలు పంపించుకోవచ్చని స్వయనా కౌమ్ చెప్పారు. మధ్యలో ఎలాంటి ప్రకటనలూ బాధించబోవని హామీ ఇచ్చారు.
భారత్‌లో విస్తరణకు వూతం
తాజా కొనుగోలుతో లాటిన్ అమెరికా, ఆసియా (ముఖ్యంగా భారత్‌లో) ఫేస్‌బుక్ విస్తరణకు వూతం లభిస్తుంది. ఎందుకంటే భారత్ సహా ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లోని యువత వాట్స్‌యాప్్‌కు బాగా దగ్గరయ్యారు. ఇక్కడ అది స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని జుకర్ బర్గే స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఆ మార్కెట్‌ను సొంతం చేసుకుంటే భవిష్యత్‌కు ఢోకా ఉండదన్న అంచనాతోనే ఈ కొనుగోలు జరగనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
భారీ ఒప్పందం ఇదే..
ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద మొబైల్ ఐటీ ఒప్పందం ఇదే. 2011లో స్కైప్‌ను మైక్రోసాఫ్ట్‌ను కొనుగోలు చేసిన 8.5 బిలియన్ డాలర్ల కంటే దీని విలువ రెట్టింపు కావడం గమనర్హం. ఇక గూగుల్ నుంచి మోటరోలాను కొనుగోలు చేయడానికి లెనోవో పెట్టిన 2.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే తాజా ఒప్పందం అయిదు రెట్లు పెద్దది.

టీసీఎస్‌కు నాలుగో అతి పెద్ద కేంద్రంగా హైదరాబాద్

25,000 దాటిన నిపుణులు 6,000 మందికి శిక్షణ
డొమైన్ వ్యూహాలూ ఇక్కడే: కంపెనీ ప్రాంతీయ అధిపతి వి.రాజన్న

(ఈనాడు)
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు నాలుగో అతి పెద్ద సేవా కేంద్రంగా హైదరాబాద్ అవతరించింది. 2007 జనవరిలో 4,500 మంది నిపుణులుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 25,000 దాటింది. చెన్నై, బెంగళూరు, ముంబయి ప్రాంతాలలో 50,000 మందికి పైగా నిపుణులు ఉండగా, వాటి తరువాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రాంగణాల్లో ఎంపిక చేసిన వారిలో 6,000 మందికి ఇక్కడే శిక్షణ ఇస్తున్నారు. విభిన్న రంగాలకు అవసరమైన నిపుణుల తయారీకి వ్యూహాలను కూడా హైదరాబాద్‌లోనే సిద్ధం చేస్తున్నట్లు టీసీఎస్ ప్రాంతీయ అధిపతి వి.రాజన్న 'ఈనాడు'తో చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభాన్ని 50 శాతం పెంచుకున్న సంస్థ వ్యవహారాల్లో హైదరాబాద్ కీలక పాత్రను ఆయన వివరించారు.

అన్ని విభాగాలకు సేవలు
బ్యాంకింగ్- ఆర్థిక సేవలు- బీమా రంగాలు, టెలికాం, ఇంజినీరింగ్, రిటైల్, తయారీ, వినియోగ విభాగాలు, ప్రసార మాధ్యమాలు, వినోద రంగం, మొబిలిటీ, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్లు.. ఇలా అన్ని విభాగాలకు సేవలు విస్తరించాం. బిజినెస్ ఇంటెలిజెన్స్, టెస్టింగ్, ఎంబెడెడ్ సిస్టమ్‌ల సేవలూ అందిస్తున్నాం. 4జీ వంటి అధునాతన సాంకేతికతపై ప్రయోగాలు, అవగాహన కోసం సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ నెలకొల్పాం. ఆయా విభాగాల్లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సిబ్బందికి శిక్షణ, సూచనలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగం ఉంది. విభిన్న రంగాలు- విభాగాల (డొమైన్)లపై అవగాహన ఉంటేనే వారికి అవసరమైన సాంకేతిక సొల్యూషన్లు ఇవ్వగలం. టీసీఎస్‌కు ఈ వ్యూహాలు రచించే కీలక బృందం 'బిజినెస్ డొమైన్ అకాడమీ' పేరిట హైదరాబాద్‌లోనే ఉంది. సామాజిక మాధ్యమాలు, మొబిలిటీ, అనలిటిక్స్, క్లౌడ్ విభాగాలలో (స్మాక్) డిజిటల్ సొల్యూషన్ల కోసం 500 మందికి పైగా పనిచేస్తున్నారు. దూర ప్రాంతాల్లోని వ్యవస్థలను నియంత్రించే రిమ్ (రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్) సేవలను ప్రారంభించాం.

సినర్జీ పార్కులో మరో భవనం
ప్రభుత్వ, దేశీయ సేవల కోసం ప్రత్యేకించిన ఒక టీసీఎస్ కేంద్రం సచివాలయ సమీపంలో ఉండగా, మిగిలిన 5 కేంద్రాలు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో ఉన్నాయి. గచ్చిబౌలిలోని సినర్జీ కేంద్రంలో 13,500 మంది నిపుణులు ఉండగా, ఇక్కడ నిర్మిస్తున్న మరో భవనం ఫిబ్రవరిలో పూర్తి కానుంది. మాదాపూర్‌లోని డెక్కన్ పార్కులో 2,500 మంది పనిచేస్తున్నారు. ఈ రెండు సొంతవి. మిగిలిన 4 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఆదిభట్లలో అతి పెద్ద కేంద్రం సిద్ధం అవుతున్నా, ఈ ఏడాదికి మాత్రం ప్రస్తుత కార్యాలయాల్లో మార్పులేమీ ఉండవు.

వలసలు ఇక్కడే తక్కువ ఎందుకంటే..
టీసీఎస్‌లో వలసలు 10.5 శాతానికి తగ్గాయి. హైదరాబాద్‌లో ఇది మరింత తక్కువగా 8.5 శాతమే ఉంది. దాదాపు అన్ని రంగాలకు సేవలు అందిస్తున్నందున, నిపుణులకు కూడా విభిన్న సాంకేతికతలపై పనిచేసే అవకాశం వస్తుంది. ఇందుకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం. ఉద్యోగుల మానసిక ఆహ్లాదం, ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. సినర్జీ పార్కులో పెద్ద ఫిట్‌నెస్ కేంద్రాన్ని నెలకొల్పాం. మహిళా ఉద్యోగులకు కరాటే క్లబ్బుల వంటివీ ఉన్నాయి.

మార్చి కల్లా 3,400 నూతన నియామకాలు
2012-13 విద్యా సంవత్సరంలో ప్రాంగణాల్లో 3,400 మందిని ఎంపిక చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశలవారీగా వీరు చేరుతున్నారు. వచ్చే మార్చి కల్లా అందరూ చేరుతారు. గత అక్టోబరు నుంచీ ప్రాంగణాల్లో ఇప్పటికి 3,000 మందిని ఎంపిక చేశాం. ప్రాజెక్టుల అవసరార్థం ప్రాంగణం బయట (ఆఫ్ క్యాంపస్) ఎంపికలూ నిర్వహించనున్నాం. మొత్తంమీద గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనూ ఈసారీ ఎంపికలు (3,400) ఉంటాయి. వీరంతా వచ్చే జూన్/జులై తరువాత సంస్థలో విడతలుగా చేరతారు.

ఉద్యోగానికి సిద్ధం చేసుకుంటున్నాం
ప్రాంగణ ఎంపికలతో పాటు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు కాగానే ఉద్యోగానికి సిద్ధం అయ్యేలా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు 50కి పైగా విద్యాలయాలతో కలసి పనిచేస్తున్నాం. చివరి సంవత్సరంలో బీటెక్‌తో పాటు ఎమ్‌టెక్, ఎమ్‌సీఏ విద్యార్థులకూ ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తున్నాం. వీరికి 6- 8 నెలల ప్రాజెక్టు ఇస్తున్నాం. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్‌లకు సంబంధించిన జియో స్పేషియల్ సాంకేతికతపై ఆయా కళాశాలల అధ్యాపకులకూ తరగతులు నిర్వహించాం. గిరాకీ అధికంగా ఉన్న క్లౌడ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భద్రత వ్యవహారాల పైనా తర్ఫీదు ఇస్తున్నాం. అనంతపురం, వరంగల్, జగిత్యాల, విజయనగరం, కాకినాడ, భీమవరం, రాజమండ్రి వంటి రెండో అంచె నగరాల కళాశాలలకూ వెళ్తున్నాం. దేశంలో 500 మంది అధ్యాపకులు పీహెచ్‌డీ చేసేందుకు ఆర్థిక సహకారం ఇవ్వాలన్న టీసీఎస్ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో 18 మందికి సాయం చేస్తున్నాం.

జోరుగా మిర్చి ఎగుమతులు

విదేశాల్లో మంచి గిరాకీ
పాత నిల్వలకూ రెక్కలు
శీతల గిడ్డంగులన్నీ ఖాళీ
సీజన్ మొదట్లోనే మంచి ధరలు

( ఈనాడు )
మిర్చి సీజన్ మొదలైంది. కొత్త పంట మార్కెట్లకు వస్తోంది. సీజన్ ఆరంభంలోనే మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అటు చైనాలో, ఇటు మధ్యప్రదేశ్‌లోనూ పంట దెబ్బతినడం వల్ల దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ విపణిలోనూ మన మిర్చికి గిరాకీ బాగా పెరిగింది. ఎగుమతులు జోరుగా సాగడంతో రాష్ట్రంలోని శీతల గిడ్డంగుల్లో ఉన్న నిల్వలన్నీ అయిపోయాయి. ఏటా ఫిబ్రవరి నెలలో పాత సరుకే 25-30 లక్షల బస్తాలు ఉండేది. కానీ ఈసారి 4-5 లక్షల బస్తాలకు మించి పాత సరకు మిగల్లేదు. కొత్త పంట పైనే అందరూ ఆధారపడుతుండడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండే బాడిగి రకానికి గుంటూరు మార్కెట్‌లో క్వింటాలుకు రూ.9000-9500 వరకు ధర లభిస్తోంది. ఈసారి మన దగ్గరా పంట ఆలస్యమవడం, ఉత్పత్తి తగ్గడం వల్ల ఇకపై కూడా ధరలు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తరిగిపోయిన నిల్వలు
జనవరి-ఫిబ్రవరి నుంచి మార్కెట్లకు కొత్త మిర్చి రావడం మొదలవుతుంది. రైతులు పంటను నేరుగా తెచ్చి మార్కెట్ యార్డులో విక్రయించడంతో పాటు, కొంత సరకు శీతల గిడ్డంగుల్లో దాచుకుంటారు. రైతుల నుంచి సరకు కొనుగోలు చేసిన వ్యాపారులు కూడా గిడ్డంగుల్లో దాచిపెడతారు. గుంటూరులో సుమారు 120 శీతల గిడ్డంగులు ఉండగా వాటిలో మిర్చి ఉంచేవే ఎక్కువ. శీతల గిడ్డంగుల్లో ఉంచిన సరకు ఏడాది పొడవునా యార్డుకువస్తుంది. ఏటా సుమారు కోటి బస్తాల (ఒక్కో బస్తా సగటున 45 కిలోలు) మిర్చి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తారు. ఏడాది పొడవునా విక్రయించగా ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఇంకా 25-30 లక్షల బస్తాల సరకు ఉంటుంది. కొత్త సరకుతో పాటు, ఇది కూడా యార్డుకు వస్తుంది. కానీ ఈసారి అకాల వర్షాలు, తెగుళ్లు వంటి కారణాల వల్ల మన దగ్గర పంట 20-25 రోజులు ఆలస్యమైంది. మరోపక్క ఎగుమతులు వూపు మీద ఉండటంతో ఎగుమతిదారులు దొరికిన సరకు కనిపించినట్లు కొనేశారు. ప్రస్తుతం మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలకు మిర్చి ఎక్కువగా వెళుతోంది. మలేషియాలో బాడిగి, 273 రకాలకు, బంగ్లాదేశ్‌లో తేజ, శ్రీలంకలో 334 రకాలకు గిరాకీ ఎక్కువగా ఉన్నట్లు గుంటూరుకు చెందిన మిర్చి ఎగుమతిదారు దినేష్ తెలిపారు. ఈ గిరాకీ వల్ల శీతల గిడ్డంగుల్లో ఉన్న సరకు మొత్తం వెళ్లిపోయింది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద గిడ్డంగుల్లో 5-6 లక్షల బస్తాలు ఉంటే, దానిలో 4 లక్షలకు పైగా గుంటూరులోనే ఉంది. అది కూడా నాణ్యత లేకపోవడం, ఎగుమతులకు పనికిరాకపోవడం, బ్యాంకు రుణాల వివాదాల్లోఉండటం వంటి కారణాల వల్ల మిగిలిపోయిందే తప్ప, గిరాకీ లేక కాదని దినేష్ విశ్లేషించారు.

దెబ్బతిన్న ఎంపీ పంట
మిర్చి సాగులో మనకు మధ్యప్రదేశ్ ప్రధాన పోటీదారుగా తయారైంది. ప్రస్తుతం అక్కడ ఏటా 50-60 లక్షల బస్తాల పంట వస్తోంది. దీపావళి సమయంలో అక్కడ పంట మార్కెట్‌కి రావడం మొదలవుతుంది. వెంటనే మన పంటపై ప్రభావం పడుతుంది. ఈసారి అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిర్చి పంట దెబ్బతింది. 35-40 లక్షల బస్తాలకు మించి పంట రాలేదు. మరోపక్క చైనాలో కూడా పంట దెబ్బతింది. చైనా తమ పంట దెబ్బతిన్నప్పుడు సహజంగానే భారత్‌పై ఆధారపడుతుంది. ఈ పరిణామాల వల్ల మన రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఈసారి మన దగ్గర కూడా దిగుబడులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా కోటిన్నర బస్తాల వరకు మిర్చి ఉత్పత్తి జరుగుతుంది. ఈ సారి ఇది తగ్గుతుందని కోటి బస్తాలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయానికి గుంటూరు మిర్చియార్డుకి రోజూ సుమారు లక్ష బస్తాల మిర్చిరావాలి. పాత సరుకు లేకపోవడం, దిగుబడులు దగ్గడం వల్ల ప్రస్తుతం 50-60 వేల బస్తాలే వస్తున్నాయి. ఈ కారణాల వల్ల ధరలు స్థిరంగా కొనసాగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం తేజ రకానికి క్వింటాలుకు రూ.7500-8000, 341 రకానికి రూ.7500-8200, 275 రకానికి క్వింటాలుకి రూ.6500-7200, బాడిగి రకానికి రూ.9000-9500, 334 రకానికి రూ.6000-6800 వరకు ధర లభిస్తోంది. పంట ముమ్మరంగా వచ్చినప్పుడు 10 శాతం ధరలు తగ్గినా మళ్లీ పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్లకు రూపాయే దిక్కు

భారత్ వంటి దేశాల్లో వాటికి భారీ గిరాకీ
సై అంటున్న దిగ్గజ సంస్థలు
వియత్నాంలో అధికోత్పత్తి దిశగా కదులుతున్న శామ్‌సంగ్


స్మార్ట్‌ఫోన్ల విక్రయాలకు భారత్, ఆఫ్రికా వంటి ప్రవర్ధమాన దేశాలు పెద్ద దిక్కుగా మారాయి. అయితే రూ.7,500 లోపు ధరతో ఉండే ఫోన్లకే గిరాకీ ఎక్కువగా ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి కొనుగోలుదార్లను స్మార్ట్ ఫోన్లకు మళ్లించాలంటే, ఆకర్షణీయ ఫీచర్లతో పాటు ఆ తరహా ఫోన్లను తక్కువ ధరలలో అందించాల్సిందే. ఇందుకోసమే దిగ్గజ సంస్థలు చైనా కన్నా నిర్వహణ వ్యయం తక్కువగా ఉండే దేశాలపై దృష్టి సారించాయి. శామ్‌సంగ్ వియత్నాంలో ఉత్పత్తి అధికం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏటా 25 కోట్ల వరకు సెల్‌ఫోన్ల దిగుమతి చేసుకుంటున్న భారత్ ఈ తరహా అవకాశాన్ని తాను కూడా అందిపుచ్చుకొంటే విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఆదా చేసుకోవడం సాధ్యపడవచ్చు.


దేశంలోకి గత ఏడాది 21 కోట్లకు పైగా చౌక సెల్‌ఫోన్లు దిగుమతి అయ్యాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు వీటికి అదనం. చైనా, తైవాన్ వంటి దేశాల్లో సెల్‌ఫోన్ల తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఎగుమతి చేసినందుకు ప్రభుత్వం సుంకాల రూపేణా ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోంది. అందుకే ఆపిల్, శామ్‌సంగ్ సహా అత్యధిక సెల్‌ఫోన్ తయారీ సంస్థలు చైనాలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చైనాలోనూ స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమై, విక్రయాల్లో వృద్ధి నెమ్మదించింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరిగేందుకు భారత్ వంటి ప్రవర్థమాన దేశాలపై ఆధారపడుతున్నారు. వెచ్చించే ప్రతి రూపాయికి తగిన విలువ ఆశించడం ప్రవర్ధమాన దేశాల ప్రజల నైజం. ఈ సంగతిని గ్రహించిన సంస్థలు తక్కువ ధరల్లో మెరుగైన స్మార్ట్‌ఫోన్లు అందించేందుకు కృషి చేస్తున్నాయి. చైనాతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువగా ఉన్న వియత్నాం, ఇండొనేషియా వంటి దేశాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి.

సగం విక్రయాలు అక్కడే: గత ఏడాది ప్రపంచం మొత్తం మీద 100 కోట్ల స్మార్ట్‌ఫోన్లు విక్రయమైతే, ఇందులో 50 కోట్ల అమ్మకాలు భారత్, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికా, మధ్య- తూర్పు ఐరోపా వంటి ప్రాంతాల్లోనే జరిగాయి. 35.10 కోట్ల స్మార్ట్‌ఫోన్లు చైనా నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత మూడేళ్లలో చైనాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం మూడు రెట్లు పెరిగి, మొత్తం విక్రయాల్లో వీటి వాటా 80 శాతానికి చేరింది. ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా వంటి దేశాల మాదిరే చైనాలోనూ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో వృద్ధి మందగించినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 66 కోట్ల ఫీచర్ ఫోన్లే విక్రయమైతే, వీటిల్లో అత్యధికం వర్ధమాన దేశాలకే వెళ్లాయి. అన్ని దేశాల కన్నా భారత్‌కు అధికంగా 21.23 కోట్ల ఫీచర్‌ఫోన్లు సరఫరా అయ్యాయి.

స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు అంతంతే: ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన సెల్‌ఫోన్లలో 50 శాతం 100 డాలర్ల (సుమారు రూ.6,200)లోపువే. ఇందులోనూ మూడింట రెండు వంతులు 50 డాలర్ల (రూ.3,100) లోపువే. దేశంలో ఐఫోన్ వంటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో అధిక వృద్ధి లేదు. అయితే చౌక స్మార్ట్‌ఫోన్లకు అత్యధిక గిరాకీ లభిస్తోంది. 2013లో దేశంలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో 50 శాతానికి పైగా 120 డాలర్ల (సుమారు రూ.7,400లోపు) లోపు విలువైనవే అని ఐడీసీ ఆసియా పసిఫిక్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు కిరణ్్‌జీత్ కౌర్ చెబుతున్నారు.

ఇండొనేషియా, వియత్నాంలపై పడ్డ కళ్లు
శామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు వివిధ దేశాల్లోని సంస్థలకు సెల్‌ఫోన్లను కాంట్రాక్టు పద్ధతిలో తయారు చేసి ఇచ్చే చైనాకు చెందిన దిగ్గజ సంస్థ హాన్‌హాయ్ కూడా చౌకగా స్మార్ట్‌ఫోన్లు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా కన్నా నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే వియత్నాంలో ఉత్పత్తి పెంచడంపై శామ్‌సంగ్ దృష్టిసారించింది. ఇండొనేషియాలో తయారీ యూనిట్ నెలకొల్పుతున్నట్లు హాన్‌హాయ్ వెల్లడించింది. 2020 నాటికి దేశం దిగుమతి చేసుకునే ముడిచమురు విలువ కన్నా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే అధికంగా ఉంటాయన్నది మన కేంద్రప్రభుత్వ అంచనాగా ఉంది. ఇప్పటికే రూ.40,000 కోట్ల స్థాయి దాటిన సెల్‌ఫోన్ల తయారీ యూనిట్లను దేశంలోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తే, దేశానికి భారీఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకోవచ్చంటున్నారు.

Thursday, February 20, 2014

కార్ల ధరలు దిగొచ్చాయ్..

Sakshi | Updated: February 20, 2014 00:30 (IST)
న్యూఢిల్లీ: అమ్మకాల క్షీణతతో అతలాకుతలమవుతున్న వాహన రంగానికి ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఊపిరినిచ్చింది.  వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తీసుకున్న నిర్ణయం కారణంగా పలు వాహన కంపెనీలు ధరలను తగ్గించాయి. ఈ ధరల తగ్గింపు కారణంగా అమ్మకాలు పెరుగుతాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్, ఫియట్, హోండా, నిస్సాన్‌లు బుధవారం రేట్ల కోతను ప్రకటించాయి.  లగ్జరీ కార్ల దిగ్గజాలు ఆడి, మెర్సిడెస్‌లతో పాటు టూవీలర్ కంపెనీలు.. హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ కూడా ఇప్పటికే ధరలను తగ్గించాయి.

 సుంకం తగ్గింపు పూర్తి ప్రయోజనం కస్టమర్లకే...
 ఎక్సైజ్ సుంకం తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకే అందజేస్తామని, ఆ మేరకు ధరలను తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు తెలిపాయి. కార్ల ధరలను మారుతీ సుజుకీ రూ.8,501 నుంచి రూ.30,984 రేంజ్‌లో, హ్యుందాయ్ కంపెనీ రూ.10,000 నుంచి రూ.1,35,300 రేం జ్‌లో తగ్గించాయి. మహీంద్రా రూ.13,000 నుంచి రూ.49,000 వరకూ, ఫియట్ రూ.8,000-12,000 వరకూ ధరలను తగ్గిం చాయి. మహీంద్రా కంపెనీ ప్రీమియం ఎస్‌యూవీ రెక్స్‌టన్ ధరలను రూ.92,000 వరకూ తగ్గించింది.

  ఫోక్స్‌వ్యాగన్, హోండా కూడా...
 మారుతీ సుజుకి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో హ్యాచ్‌బాక్‌ను రూ.8,502 తగ్గించింది. ఇది కనిష్ట తగ్గింపు, ఇక గరిష్టంగా ఎస్‌ఎక్స్4 సెడాన్ ధరను రూ. 30,984కు తగ్గించింది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన సెలెరియో ధరను కూడా కంపెనీ రూ.13,615 వరకూ తగ్గించింది. స్విఫ్ట్ ధరలను రూ.15,874, ఎర్టిగ ధరను రూ.18,747 తగ్గించింది.  హోండా కార్స్ ఇండియా కంపెనీ ధరలను రూ.44,741 వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోక్స్‌వ్యాగన్ వాహన ధరలు రూ.14,500 నుంచి రూ.51,000 వరకూ తగ్గాయి.

 నిస్సాన్ తగ్గింపు 6 శాతం...: నిస్సాన్ కంపెనీ కార్ల ధరలను
  4-6 శాతం వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు సోమవారం నుంచే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. మైక్రా యాక్టివ్, మైక్రా, సన్నీ, ఇవిల, టెర్రానో, టియనా కార్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. దేశీయ వాహన పరిశ్రమకు పునరుత్తేజాన్నిచ్చే దిశగా ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఆహ్వానించదగ్గ చర్య అని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ కెనిచిరో యోముర చెప్పారు. ఈ కార్ల తగ్గింపు కారణంగా తమ అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కంపెనీ రూ.3.5 లక్షల నుంచి రూ.25.47 లక్షల రేంజ్‌లో ఉన్న కార్లను విక్రయిస్తోంది. కాగా, టూవీలర్ల దిగ్గజాలు   హీరో మోటోకార్ప్5 శాతం(రూ.4,500 )వరకూ, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ కంపెనీ రూ.1,600 నుంచి రూ.7,600 వరకూ ధరలను తగ్గించిన విషయం విదితమే.

 అధిక వడ్డీరేట్లు, అంతకంతకూ పెరుగుతున్న ఇంధనం ధరలు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం తదితర కారణాల వల్ల గత ఏడాది కార్ల విక్రయాలు 11 ఏళ్ల కనిష్టానికి క్షీణించాయి. ఈ  నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం తగ్గింపు మంచి ఉపశమన చర్య అని వాహన కంపెనీలు హర్షం ప్రకటించాయి. ఎక్సైజ్ సుంకాన్ని ... చిన్న కార్లు, స్కూటర్లు, మోటార్ బైక్‌లు, వాణిజ్య వాహనాలపై 12% నుంచి 8%కి; ఎస్‌యూవీలపై 30% నుంచి 24%కి, మిడ్ సైజ్ కార్లపై 24 శాతం నుంచి 20%కి,  పెద్ద కార్లపై 27 శాతం  నుంచి 24 శాతానికి తగ్గించడం తెలిసిందే.

 ధరలు ఇలా తగ్గాయ్...

 కంపెనీ           తగ్గింపు (రూ.లలో)
 మారుతీ సుజుకి    8,502-30,984
 హ్యుందాయ్    10,000-1,35,300
 ఫోక్స్‌వ్యాగన్     14,500-51,000
 మహీంద్రా           13,000-49,000
 ఫియట్            8,000-12,000
 హోండా కార్స్    44,751 వరకూ
 నిస్సాన్           4-6 శాతం
 ఆడి                    3.82లక్షల వరకూ
 మెర్సిడెస్ బెంజ్      2 లక్షల వరకూ
 హీరో మోటోకార్ప్       4,500 వరకూ
 హోండా మోటార్‌సైకిల్    1,600-7,600

వారసుడొచ్చాడు! (Mukesh Ambani Son)

Sakshi | Updated: February 20, 2014 10:12 (IST)
వారసుడొచ్చాడు!
న్యూఢిల్లీ: సరిగ్గా ముప్పై రెండేళ్ల క్రితం రిలయన్స్ సామ్రాజ్యంలో ధీరూభాయ్ అంబానీ కుమారుడు ముకేశ్ అంబానీ అడుగుపెట్టారు. ఇప్పుడు ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కంపెనీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ త్వరలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆకాశ్ దీనిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం కావడం విశేషం.

 దేశవ్యాప్తంగా వైర్‌లెస్ బ్రాండ్ బ్యాండ్(4జీ) స్పెక్ట్రంను దక్కించుకున్న రిలయన్స్ జియో... తాజాగా జరిగిన 2జీ వేలంలో అనేక సర్కిళ్లలో స్పెక్ట్రంను కొనుగోలు చేయడం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రిలయన్స్ జియో టెలికం సేవలకు సంబంధించి కీలకమైన మార్కెట్ వ్యూహాన్ని ఖరారు చేయడంలో ఆకాశ్ కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. ‘కంపెనీకి క్రమంతప్పకుండా ఆకాశ్ వస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే మనోజ్ మోడి, చైర్మన్ ముకేశ్‌తో సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. రిలయన్స్ జియో గ్రూప్ ప్రెసిడెంట్ సందీప్ దాస్ తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. అయితే, కంపెనీ దీనిపై బయటకు వివరాలను వెల్లడించకపోవడానికి ఆకాశ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉండటం కారణం’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 తండ్రి బాటలోనే...
 1981లో ముకేశ్ అంబానీ 24 ఏళ్ల వయస్సులో ఆర్‌ఐఎల్‌లో చేరారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారత్‌లోనే అతిపెద్ద చమురు రిఫైనరీని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు రిలయన్స్ గ్రూప్ తొలిసారిగా టెలికం వెంచర్‌లోకి రావడంలో(విడిపోక ముందు) ముకేశ్ చొరవే ప్రధానకారణం. కాగా, ప్రస్తుతం ఆకాశ్ అంబానీ వయస్సు కూడా 22 ఏళ్లు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో అండర్ గ్యాడ్యుయేషన్ చేసిన ఆకాశ్ గతేడాది భారత్‌కు తిరిగొచ్చారు.

ముకేశ్‌కు ప్రీతిపాత్రమైన టెలికం రంగంలోనే, అందులోనూ సొంత కంపెనీలోనే తన తొలి కార్పొరేట్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుండటం విశేషం. కాగా, యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆకాశ్ సోదరి ఇషా కూడా త్వరలోనే రిలయన్స్ ఫౌండేషన్‌లో చేరనున్నట్లు సమాచారం. గ్రూప్ నేతృత్వంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, హాస్పిటల్ వెంచర్‌లు దీని అధీనంలోనే ఉన్నాయి. కాగా, ముకేశ్ రెండో కుమారుడు అనంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు.

తగ్గుతున్న ఎస్‌ఎమ్మెస్‌ల ప్రాభవం

న్యూఢిల్లీ: మన దగ్గరకి కాస్త ఆలస్యంగా 1998 ప్రాంతంలో వచ్చినప్పటికీ.. ఎస్‌ఎమ్మెస్‌లు దాదాపు 20 ఏళ్లుగా చలామణీలో ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం దాకా టెలికం ఆపరేటర్లకు వచ్చే ఆదాయంలో సుమారు 10% వాటా ఎస్‌ఎమ్మెస్‌ల నుంచే ఉండేది. కానీ, ప్రస్తుతంఇది 5-6%కి తగ్గిపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌కి వచ్చిన ఆదాయంలో మెసేజింగ్, విలువ ఆధారిత సర్వీసుల ద్వారా 8.2% దాకా వాటా ఉంది. కానీ ఇది జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి వచ్చే సరికి 6.7%కి తగ్గిపోయింది.

వొడాఫోన్ విషయానికొస్తే.. క్రితం ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే  2013-14 ప్రథమార్ధంలో మెసేజింగ్ సేవల ఆదాయం ఏకంగా 7% తగ్గింది. అటు ఐడియా పరిస్థితి కూడా అలాగే ఉంది. క్రితం క్వార్టర్‌తో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో డేటాయేతర సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం 1.4% క్షీణించింది. ఈ నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో ఎస్‌ఎమ్మెస్‌ల ద్వారా వచ్చే ఆదాయం 45-50% దాకా పడిపోవచ్చని అంచనాలు ఉన్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ తెలిపారు. మొబైల్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సంస్థ ‘ఓవమ్’ అధ్యయనం ప్రకారం 2011లో ఎస్‌ఎమ్మెస్‌ల వృద్ధి రేటు 14 % ఉండగా.. 2013లో 8%కి పడిపోయింది. 2015 చివరి నాటికి మరింత తగ్గగలవని అంచనా.

 పెరుగుతున్న డేటా సేవలు..
 తగ్గుతున్న ఎస్‌ఎమ్మెస్‌ల ఆదాయాలను భర్తీ చేసుకునేందుకు టెలికం కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లో ఎస్‌ఎమ్మెస్‌ల సేవలను ప్రవేశపెడుతున్నాయి. డేటా సేవల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోందని మ్యాథ్యూస్ తెలిపారు. టెల్కోల ఆదాయ గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2013-14 ద్వితీయ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ మొత్తం మొబైల్ ఆదాయాల్లో డేటా సర్వీసుల ద్వారా వచ్చేది 5.2% నుంచి 9.2%కి పెరిగింది.

 2013-14 ప్రథమార్ధంలో వొడాఫోన్  డేటా ఆదాయం (బ్రౌజింగ్ మినహా) ఏకంగా 45.9% ఎగిసింది. అధ్యయనం ప్రకారం వాట్స్‌యాప్, బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (బీబీఎం), వుయ్‌చాట్ లాంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ కోసం ఈ డేటా వినియోగం ఎక్కువగా ఉంటోంది. 2016-17 నాటికి డేటా సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 34 శాతం పెరిగి 35 కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3జీ సర్వీసులు ఇంకాస్త ప్రాచుర్యంలోకి వస్తే డేటా సేవల ద్వారా టెల్కోల ఆదాయాలు మరింతగా పెరగగలవని భావిస్తున్నాయి.

భలే ఛాన్సులే.. దిగొచ్చిన కార్ల ధరలు

మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కార్ల కంపెనీలు ఆ ప్రయోజనాన్ని కొనుగోలుదారులకు బదిలీ చేస్తున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫియట్, నిస్సాన్‌లు తగ్గింపు బాటపట్టాయి. ప్రధాన కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు అన్ని కార్ల ధరలను తగ్గించడం విశేషం. ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల లభించిన మొత్తం ప్రయోజనాన్ని కొనుగోలుదారులకు బదిలీ చేసినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. హ్యుందాయ్ కార్ల ధరలు రూ.10,000 నుంచి రూ.1,35,300 వరకూ తగ్గాయి. ఇయాన్ నుంచి శాంటా ఫే వరకూ అన్ని మోడళ్ల ధరలు చౌక అయ్యాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (అమ్మకాలు, మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు.


ప్యాసింజర్ కార్లతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్-రెక్సాట్ ధరను రూ.92,000 మేర తగ్గించింది. వాణిజ్య వాహన ధరలను కూడా సవరించింది. రకాన్ని బట్టి కార్ల ధర తగ్గింపు ఉందని ఫియట్ పేర్కొంది. ఈ కంపెనీ పుంటో, లీనియా మోడళ్లను దేశంలో విక్రయిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో ధర రూ.18,000 నుంచి రూ.31,000 వరకూ, వెంటో ధర రూ.14,500-27,000, జెట్టా ధర రూ.38,000-51,000 వరకూ దిగివచ్చాయి. ధరల తగ్గింపు కార్ల గిరాకీని పెంచగలదని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, అమ్మకాలు) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. తన కార్ల ధరలను 6 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ఇప్పటికే నిస్సాన్ ప్రకటించింది. మైక్రా యాక్టివ్, మైక్రా, సన్నీ, ఎవాలియా, టెర్రానో, టెన్నా మోడళ్లపై ఈ కంపెనీ ధరలు తగ్గించింది.
టీవీఎస్ మోటార్స్: ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల కలిగిన ప్రయోజనం మొత్తాన్ని కొనుగోలుదారులకే బదిలీ చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్స్ ప్రకటించింది. ఈ మేరకు మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను బుధవారం నుంచి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ద్విచక్ర వాహన ధరలను సవరించాయి.

Wednesday, February 19, 2014

డిమాండ్ బంగారమే..


 
ముంబై: బంగారం దారి ఎప్పుడూ బంగారమేనని మరోసారి స్పష్టమైంది. 2013లో భారత్ పసిడి డిమాండ్ 2012తో పోల్చితే 13 శాతం పెరిగింది. పరిమాణంలో 864 టన్నుల నుంచి 975 టన్నులకు చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ఒకటి ఈ విషయాలను తెలిపింది. కరెంట్ అకౌంట్ కట్టడి(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా  దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య విలువ మధ్య వ్యత్యాసం)లో భాగంగా ప్రభుత్వం పసిడి దిగుమతులపై పలు ఆంక్షలు విధించినప్పటికీ పసిడి డిమాండ్ పెరగడం ఆసక్తికరం. 2013 గోల్డ్ డిమాండ్ ధోరణుల పేరుతో డబ్ల్యూజీసీ ఈ గణాంకాలను విడుదల చేసింది.

డబ్ల్యూజీసీ మేనేజింగ్ డెరైక్టర్(ఇండియా) సోమసుందరం తెలిపిన వివరాలు క్లుప్తంగా...
 2013 మొదటి ఆరు నెలలతో పోల్చితే ద్వితీయార్థంలో డిమాండ్ తగ్గింది. సరఫరా ఇబ్బందులు దీనికి కారణం. ఏప్రిల్-మే నెలల్లో బంగారం ధర తగ్గడాన్ని గృహస్తులు కొనుగోళ్లకు అవకాశంగా భావించారు.

 ఆభరణాలకు డిమాండ్ 11 శాతం పెరిగి 612.7 టన్నులుగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది రూ.1,61,751 కోట్లు. 2012లో ఈ పరిమాణం 552 టన్నులు. విలువలో రూ.1,58,359 కోట్లు.

 పెట్టుబడుల డిమాండ్ 16% పెరిగి 362.1 టన్నులుగా నమోదయ్యింది. 2012లో ఇది 312.2 టన్నులు. విలువలో ఈ పరిమాణం 6 శాతం పెరిగి రూ. 90,184.6 కోట్ల నుంచి రూ.95,460.8 కోట్లకు చేరింది.

 సైకిల్డ్ గోల్డ్ డిమాండ్ 10.79 శాతం పడిపోయింది. ఇది 113 టన్నుల నుంచి 100.8 టన్నులకు తగ్గింది.
2013 ద్వితీయార్థంలో గ్రే మార్కెట్ క్రియాశీలత పెరిగింది. ప్రభుత్వ నియంత్రణలు కొనసాగితే 2014లో ఈ ప్రభావం మరింత పెరిగి, స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

 {పభుత్వ ఆంక్షల వల్ల బంగారం అక్రమ రవాణా తీవ్రమయ్యింది. నెలకు 20 నుంచి 30 టన్నుల వరకూ అక్రమ రవాణా మార్గాల్లో పయనించినట్లు అంచనా.

 2014లో భారత్ బంగారం డిమాండ్ 900 టన్నుల నుంచి 1,000 టన్నుల వరకూ ఉండొచ్చు.

 ప్రపంచవ్యాప్తంగా డౌన్...

 కాగా ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 2013లో 15 శాతం పడిపోయింది. 2012తో పోల్చితే 4,416 టన్నుల నుంచి 3,756 టన్నులకు పడిపోయింది. ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)నుంచి భారీ మొత్తంలో నిధుల ఈక్విటీ మార్కెట్లకు తరలిపోవడమే దీనికి కారణం. అయితే ఈటీఎఫ్ రూపంలో డిమాండ్ పడిపోయినా... బంగారం మార్కెట్ విషయంలో వినియోగదారుల నుంచి 21 శాతం వృద్ధి నమోదుకావడం విశేషం.

 భారత్‌ను అధిగమించిన చైనా
 ఇదిలావుండగా... 2013లో బంగారం డిమాండ్ విషయంలో భారత్‌ను చైనా అధిగమించింది. ప్రపంచంలో అతిపెద్ద పసిడి వినియోగదారుగా తన హోదాను భారత్ మొదటిసారిగా చైనాకు అప్పగించింది. చైనాలో 2013లో బంగారం డిమాండ్ 1,065.8 టన్నులుగా నమోదయ్యింది. భారత్ ఈ పరిమాణం 975 టన్నులు మాత్రమే. కాగా 2012లో చైనా బంగారం డిమాండ్ 806.8 టన్నులుగా ఉంది. 2014 సంవత్సరంలో చైనా బంగారం డిమాండ్ 1,000-1,100 టన్నులుగా ఉంటుందన్నది అంచనా.

Saturday, February 15, 2014

బిర్యానీ ప్రియుల ప్యారడైజ్ !

Sakshi | Updated: February 15, 2014 08:37 (IST)
బిర్యానీ ప్రియుల ప్యారడైజ్ !
  1953 నాటి మాట.. సికింద్రాబాద్‌లో ‘ప్యారడైజ్ టాకీస్’ పేరిట సినిమా థియేటర్ నడిచేది. థియేటర్‌కు అనుబంధంగా సమోసా, చాయ్, బిస్కెట్ అమ్మే చిన్న టీ కొట్టు ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. మెల్లగా ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ హుస్సేన్ హిమ్మతీ టీకొట్టు మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. 10 మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు ఇప్పుడు 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే ప్యారడైజ్ హోటల్‌గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే లా దాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం 2.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి.

 స్థానికానికే ప్రాధాన్యం...
 దేశ, విదేశీ ప్రతినిధుల నోరూరించే ప్యారడైజ్ బిర్యానీ తయారీకి వస్తువుల్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారనేది చాలా మంది ప్రశ్న. ప్యారడైజ్ బిర్యానీకి ఉపయోగించే ధావత్ బాస్మతీ బియ్యాన్ని ఢిల్లీ నుంచి, సుగంధ ద్రవ్యాలైన సాఫ్రాన్‌ను కాశ్మీర్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మాంసం ఉత్పత్తుల్ని మాత్రం హైదరాబాద్‌లోని చెంగిచెర్ల నుంచి, తృణ ధాన్యాలు, గరం మసాలా, ఇతర దినుసులన్నిటినీ బేగంబజార్ నుంచే తెచ్చుకుంటారు. ఇవన్నీ స్థానికంగా లభించేవే.

 మొదటి గ్రేడువే వాడుతుంటారు. ‘‘మేం బిర్యానీ కోసం ఉపయోగించే మాంసం ఎంత లేతదంటే.. పచ్చి మాంసంతోనే బిర్యానీ వంటకం మొదలుపెడతాం’’ అంటారు గత 30 ఏళ్లుగా ప్యారడైజ్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్. హైదరాబాద్ నుంచి దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో బిర్యానీ పార్శిల్స్ వెళ్తుంటాయి.

 త్వరలో మరో 4 బ్రాంచీలు..
 ప్రస్తుతం సికింద్రాబాద్ ప్యారడైజ్‌తో పాటు హైదరాబాద్‌లో 6 ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటె క్‌సిటీ, మాసబ్‌ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్, కూకట్‌పల్లి, బేగంపేటల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఈ ఏడాదిలో దిల్‌సుఖ్‌నగర్, ఏఎస్‌రావ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మరో 4 హోటళ్లు ప్రారంభం కానున్నా చెప్పారు ఖాజిం హిమ్మతీ. ఇప్పటికే అందుబాటులో ఉన్న కూకట్‌పల్లి ప్యారడైజ్ హోటల్  నుంచి హోమ్ డెలివరీని కూడా ప్రారంభిస్తున్నామని, జనాదరణ బట్టి మిగతా బ్రాంచీలకూ హోమ్ డెలివరీని విస్తరిస్తామని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన.

 ఇత ర నగరాల్లోనూ... : ఇప్పటిదాకా హైదరాబాద్ వాసులు మాత్రమే రుచిచూసిన తమ బిర్యానీని ఇతర జిల్లాలు, మెట్రో నగరాలకు సైతం అందించడానికి ప్యారడైజ్ ప్రణాళికలు వేస్తోంది. 2015 ముగిసేలోగా రాష్ర్టంలోని విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లోను, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ ప్యారడైజ్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. ఏ నగరంలో మొదట ప్రారంభించాలి? అక్కడ అనువైన ప్రాంతమేది? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆదరణ, అవసరాలను బట్టి బ్రాండ్ అంబాసిడర్ ను కూడా ఎంపిక చేసుకుంటారు.

 పాఠశాల నుంచి మేనేజ్‌మెంట్ వరకు..
 ఇప్పటివరకు ప్యా రడైజ్ హోటళ్లలో పనిచేసే వారంతా హోటల్ మేనేజ్‌మెంట్‌లలో శిక్షణ పూర్తి చేసినవారే. ఎక్కడో కోర్సులు పూర్తి చేసిన వారికి కాకుండా తామే సొంతగా శిక్షణ ఇవ్వటానికి ప్యారడైజ్ హోటల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ‘ప్యారడైజ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ‘ప్యారడైజ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్’ను కూడా ప్రారంభించనున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణతో పాటు శిక్షణానంతరం తమ బ్రాంచీల్లో ఉద్యోగులుగా కూడా నియమించుకుంటారు.

 రుచి చూడని వారు లేరు...
 హైదరాబాద్‌కు ప్రముఖులు ఎవరొచ్చినా ప్యారడైజ్ బిర్యానీ రుచి చూడాలని కోరుకుంటారు. రాహుల్‌గాంధీ, ఎంపీలు జ్యోతిరాదిత్య సింధియా, ప్రియాదత్, సచిన్‌పైలట్, మిలింద్ దేవరా, కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, క్రికెట  ర్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి; చిత్రకారుడుఎంఎఫ్ హుస్సేన్, నాటి మంత్రులు గురుమూర్తి, రోడా మిస్త్రీ, సికింద్రాబాద్ మేయర్ సాంబయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖుల లిస్ట్ చాలా పెద్దదేనన్నారు ఖజీం హిమ్మతీ.

 ‘పీ’ లోగో ఉంటేనే ప్యారడైజ్...: ప్యారడైజ్ పేరుతో నగరంలో చాలా హోటళ్లు, బేకరీలున్నాయని అవన్నీ తమవి కావని ఖాజీం చెప్పారు. ‘పీ- అనే అక్షరం, 1953 ఉన్న లోగో హోటళ్లు మాత్రమే మావి. సికింద్రాబాద్‌లోని సెంట్రల్ కిచెన్‌లోనే బిర్యానీ వండుతాం. ఇక్కడి నుంచే అన్ని బ్రాంచీలకు సరఫరా చేస్తాం. రాబోయే తరాలూ ఈ వ్యాపారంలోనే ఉంటాయి’ అన్నారాయన.

Friday, February 14, 2014

పర్సు జారి గల్లంతయ్యిందే (Feb 14 Valentines Day Special)

ఫిబ్రవరి 14.. ప్రేమికులకే కాదు.. కంపెనీలకూ పండుగ రోజే. తన 'స్వీట్ హార్ట్' కోసం ప్రేమికులు కొనే బహుమతులు.. కంపెనీలకు కాసులు కురిపిస్తాయి. అందుకే ఇది ప్రేమికుల 'పర్సు జారి గల్లంతయ్యే రోజు.. కంపెనీలకు లాభాలు పంచే రోజు.. మరి ఈసారి వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు)కు ఏయే కంపెనీలు ఎలాంటి ఆఫర్లతో ప్రేమికులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయో తెలుసుకుందామా..!
వేలంటైన్స్ డే నాడు పుష్పగుచ్ఛాలు, చాకొలెట్ బాక్సులు, మొబైల్ ఫోన్లు, గడియారాలు, దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుతో పాటు.. కలసి రెస్టారెంట్లకు వెళ్లేందుకు యువతీయువకులు ప్రాధాన్యం ఇస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విక్రయ సంస్థలతో పాటు రెస్టారెంట్లు కూడా పలు పథకాలు ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జబాంగ్ వంటి ఆన్‌లైన్ సంస్థలు ఆయా ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తున్నాయి. రూ.41,000 విలువైన ఐఫోన్ 5సి మోడల్‌ను రూ.37,000కే విక్రయిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇక విమాన ప్రయాణంతో ముందుకొచ్చింది స్పైస్‌జెట్.
బిగ్ సి: యువతీ యువకులు ఒకరికి మరొకరు కానుకగా ఇచ్చుకునేందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నట్లు బిగ్ సి డైరెక్టర్ పవన్ వెల్లడించారు. డ్యూయల్‌సిమ్, టచ్, స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ ప్రత్యేక ఆఫర్‌లో ఉన్నాయి. రెండు ఫోన్ల కొనుగోలుపై రూ.700-1,800 వరకు ఆఫర్ ఉంటుంది. రూ.10,000కు మించిన సోనీ ఎరిక్‌సన్ ఫోన్లు, రూ.15,000కు మించిన శామ్‌సంగ్ ఫోన్లు, రూ.22,000కు మించిన ఐఫోన్లను వడ్డీ లేని సులభ వాయిదాల్లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కూడా బిగ్ సి కల్పిస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. ఆదివారం వరకు ఈ ఆఫర్లు అమలులో ఉంటాయి.

యూనివర్‌సెల్: సిటీబ్యాంకు క్రెడిట్ కార్డుదారులకు 10% రాయితీతో పాటు స్మార్ట్‌ఫోన్లపై పలు ఆఫర్లు ఇస్తోంది.

లాట్: రూ.5,000-50,000 వరకు విలువైన స్మార్ట్ ఫోన్లను మార్చుకుని, కొత్తవి కొనుగోలు చేయాలనుకునే వారికి అవకాశం. పాత స్మార్ట్ ఫోన్ తీసుకుని వస్తే 50% విలువ ఇస్తామని, వెంటనే మార్చుకుని కొత్తది కొనుగోలు చేసుకోవచ్చు.

వాచీలపై 20-40 శాతం: వాచీలపై 20-40% వరకు రాయితీని టైటాన్ ప్రకటించింది.

స్పైస్‌జెట్: ఈ నెల 28 లోపు దేశీయంగా స్పైస్‌జెట్ విమానాల్లో ప్రయాణించిన వారు లక్కీ డ్రాలో మరో దేశీయ ప్రయాణానికి ఉచితంగా టికెట్టును గెలుపొందే అవకాశం కల్పిస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఇలా లక్ష టికెట్లు అందచేస్తామని తెలిపింది. డ్రాలో విజేతల వివరాలను మార్చి 7న తమ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని పేర్కొంది.

హోటళ్లలో: హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో ప్రేమికులు, దంపతులు ప్రత్యేక విందుకు హాజరు కావచ్చు. పార్క్ హయత్, ట్రిడెంట్ హోటల్, గోల్కొండ హోటల్, ఎల్లా హోటల్స్‌తో పాటు జీవీకే వన్ మాల్‌లోని హార్డ్‌రాక్ కేఫ్, బార్బెక్యు నేషన్ రెస్టారెంట్లు ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి.

రిలయన్స్ జువెల్స్, జోయాలుక్కాస్ ప్రత్యేక పథకాలను ప్రకటించాయి.
విదేశాల నుంచి ఆర్డర్ల వెల్లువ
భారత్ నుంచి అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లిన వారు చాలామంది ప్రేమికుల రోజుకు వారు ఆయా దేశాల నుంచి ఇక్కడి తమ సన్నిహితులకు బహుమతులు పంపుతుంటారు. ఈ ఏడాది భారత్ మొత్తం మీద 50,000 వరకు ఆర్డర్లు వస్తాయని ఆన్‌లైన్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందులోనూ సింహభాగం అమెరికా నుంచే ఉంటాయని సమాచారం. దేశం మొత్తానికీ వచ్చేవాటిలో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్‌కే ఉంటాయని యూఎస్2ఏపీడాట్‌కామ్ ఎండీ శ్రీధర్ చెప్పారు. గత ఏడాది సగటు ఆర్డరు 43 డాలర్లుండగా, ఈసారి డాలర్ విలువ 10 శాతం పెరిగినప్పటికీసగటు ఆర్డరు విలువ 45 డాలర్లుగా (సుమారు రూ.2,800) ఉందన్నారు.
అసోచామ్ అధ్యయనం చెబుతున్న
ఆశ్చర్యకరమైన నిజాలు..
చి గత ఏడాదితో పోలిస్తే ఈసారి 'ప్రేమ ఖరీదు' పెరగొచ్చు. 2013లో వేలంటైన్స్ డే వేళ దాదాపు రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రేమికులు ఈ ఏడాది రూ.18,000 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చి ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, హాస్పిటాలిటీ తదితర రంగాలతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలో అధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగులు భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

చి అధిక వేతన ఉద్యోగులు రూ.1000-50,000 వరకు వెచ్చించవచ్చు. విద్యార్థులైతే రూ.500-10,000 వరకు ఖర్చు పెట్టొచ్చని అంచనా.

చి ప్రేమికుల రోజున మరింత అందంగా కన్పించేందుకు 75 శాతం మంది తమ వ్యక్తిగత సౌందర్యం కోసం రూ.500-10,000 వరకు వెచ్చించడం ఆశ్చర్యమే కదూ!

చి రిటైల్ విక్రయ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఎంపీ3 ప్లేయర్లు, ఐపాడ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వస్త్రాలు ఆదాయం తెచ్చిపెట్టనుండగా.. ఆన్‌లైన్ విక్రయ సంస్థలకు పూలు, గ్రీటింగ్ కార్డులు, చాకొలెట్లు, బొమ్మలు, ఆభరణాల ద్వారా ఆదాయం రానుంది.

చి 'తమ వాళ్ల'తో కలసి రాత్రిపూట హోటల్‌కు భోజనానికి వెళ్లాలని 65% మంది అనుకుంటూండగా.. తనను డిన్నర్‌కు తీసుకెళ్తే బాగుండునని 49% మంది కోరుకుంటున్నారు. తమ ప్రేమను తెలిజేస్తూ చాకొలేట్లు ఇవ్వాలని 38 శాతం మంది భావిస్తూండగా, పువ్వులు ఇవ్వాలని 37% మంది భావిస్తున్నారు. తన ప్రియుడు/ప్రియురాలు నుంచి చాకొలేట్లు బహుమతిగా వస్తే బాగుంటుందని 30% మంది, పువ్వులు వస్తే సంతోషమని 20% మంది ఎదురుచూస్తున్నారు.

చి గ్రీటింగ్‌లు ఇవ్వాలనుకునేవారు 8% మంది అయితే.. గ్రీటింగ్ కార్డులు రావాలని ఎదురుచూస్తున్నవారు 15 శాతం మంది. 7% మంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతూ ఉండగా.. 20 శాతం మంది అలాంటివే రావాలని కోరుకుంటున్నారు.

చి వేలంటైన్స్ డే కొనుగోళ్లలో గుర్‌గావ్, నోయిడా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, గోవా, పుణెల్లో చదువుతున్న/ఉద్యోగం చేస్తున్న వారి వాటా 75 శాతం ఉంది.

చి ప్రేమికుల రోజున కానుకల కోసం 65 శాతం మంది పురుషులు వెచ్చిస్తుండగా.. మహిళలు 35 శాతం మంది మాత్రమే ఖర్చు పెడుతున్నారు.

పైచేయి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లదే

ముగిసిన స్పెక్ట్రమ్ వేలం
ప్రభుత్వానికి రూ.61,162 కోట్లు
లక్ష్యాన్ని మించి నిధులు 

రేడియో తరంగాల వేలానికి టెలికాం కంపెనీల నుంచి విశేష స్పందన లభించింది. 10 రోజుల పాటు కంపెనీల మధ్య పోటాపోటీగా జరిగిన స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ గురువారం ముగిసింది. ప్రభుత్వ లక్ష్యాన్ని మించి ఖజానాకు రూ.61,162 కోట్లు సమకూరాయి. ఢిల్లీ, ముంబయి, ఇతర నగరాల్లో కీలకమైన స్పెక్ట్రమ్‌ను వొడాఫోన్ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్‌లు దక్కించుకున్నాయి. 900 మెగాహెర్ట్జ్, 1,800 మెగా హెర్ట్జ్ (ఎంహెచ్‌జెడ్) బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేసింది. ఈ రెండు బ్యాండ్ల రేడియో తరంగాలను సొంతం చేసుకోవడానికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తహతహలాడినప్పటికీ 18 సర్కిళ్లలో 1800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌నే ఎంచుకుంది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో వొడాఫోన్‌కు ఉన్న లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబరుతో ముగుస్తుంది. దీంతో కార్యకలాపాలను కొనసాగించాలంటే.. ఎంత ధరైనా చెల్లించి స్పెక్ట్రమ్‌ను పొందాల్సిన అవసరం కంపెనీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ మూడు మహానగరాల్లో 900 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్, 11 సర్కిళ్లలో 2జీ 1800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను పొందడానికి రూ.19,600 కోట్లు వెచ్చించి బిడ్లు దాఖలు చేసింది. ఢిల్లీ, కోల్‌కతాలలో ఎయిర్‌టెల్ లైసెన్సుల గడువు కూడా నవంబరుతో ముగుస్తుంది. ఈ రెండు మహానగరాలతోపాటు ముంబయిలో కూడా 900 మెగా హెర్ట్జ్ రేడియోతరంగాలను ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది. 15 సర్కిళ్లలో 1800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను పొందింది. ఇందుకు రూ.18,530 కోట్లు వెచ్చించింది. 1800 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలను వినియోగించి దేశ వ్యాప్తంగా 4జీ సేవలందించనున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఢిల్లీలో ఐడియా కూడా 900 మెగాహెర్ట్జ్ రేడియో తరంగాలను సంపాదించింది.
2013-14లో రూ.18,296 కోట్లు 
వేలం పూర్తి కావడం సంతోషం కలిగిస్తోందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వానికి మొత్తం రూ.61,162.22 కోట్లు లభిస్తాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే వేలం విజయవంతమైనట్లేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కనీసం రూ.18,296.36 కోట్లు లభిస్తాయి.భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఇన్ఫోకాం సహా 8 టెలికాం వేలంలో పాల్గొన్నాయని, 68 విడతల్లో వేలం జరిగిందని తెలిపారు. 1800 మెగా హెర్ట్జ్ విభాగంలో దాదాపు 78 శాతం బ్లాక్‌లకు బిడ్లు దాఖలయ్యాయి. 900 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో మొత్తం (100 శాతం) బ్లాకుల్లో బిడ్లు వేశారు. 1800 మెగా హర్ట్జ్ (ఎంహెచ్‌జెడ్) స్పెక్ట్రమ్ బిడ్డింగ్ మొత్తం కనీస విలువను మించింది. ఈ రేడియో తరంగాల్లో దాదాపు 385 మెగాహెర్ట్జ్‌ని ప్రభుత్వం పక్కన పెట్టింది. 900 ఎంహెచ్‌జెడ్‌లో 46 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు వేలం వేయలేదు. 900 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలకు రూ.37,572.60 కోట్ల బిడ్లు లభించాయని, 1,800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు రూ.23,589.62 కోట్ల విలువైన బిడ్లు లభించాయని టెలికాం కార్యదర్శి ఎం.ఎఫ్. ఫరూకీ తెలిపారు. మొత్తం స్పెక్ట్రమ్ కనీస ధరను ప్రభుత్వం రూ.47,933.40 కోట్లుగా నిర్ణయించింది. 1,800 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలకు ముందుగా (అప్ ఫ్రంట్) 33 శాతం మొత్తాన్ని చెల్లించడానికి కంపెనీలు అంగీకరించాయి. 900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు ఇది 25 శాతం ఉంది.

Monday, February 10, 2014

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముఖ్యాంశాలు (10-02-2014)

హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వచ్చే ఆర్నెల్ల కాలానికి గాను నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సభలో తెలంగాణ సభ్యుల నిరసన నినాదాల మధ్య పదినిమిషాల్లోనే మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగించారు. అందులోని ముఖ్యాంశాలు.
* 2014-15 వార్షిక బడ్జెట్ రూ. 1,83,129 కోట్లు.
* ప్రణాళిక వ్యయం రూ. 67,950 కోట్లు.
* ప్రణాళికేతర వ్యయం రూ. 1,15,179 కోట్లు
*  రెవెన్యూ నిధుల అంచనా రూ. 474 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా రూ. 25,402 కోట్లు
*  2013-14 లో సవరించిన బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు రూ. 1.023 కోట్లు.

కొత్త ఉద్యోగాలు 
*  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,346 కొత్త ఉద్యోగాలు మంజూరు చేశాం.
*  98,652 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
*  వరిసాగు 2012-13 లో 36.28 లక్షల హెక్టార్ల నుంచి 2013-14లో 43.95లక్షల హెక్టార్లకు పెరిగింది.
*  2013-14లో ఆహారధాన్యాల ఉత్పత్తి 207.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా.
*  2013-14లో రైతులకు సబ్సిడీపై అందించే ఎరువుల మొత్తాన్ని 72.33 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచగలిగాం.
*  ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల కార్యక్రమం కేటాయింపును రూ. 571. 84 కోట్లకు పెంచాం.
*  గుడ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
*  పశుసంపద అభివృద్ధికి కేటాయింపులను రూ. 874.15 కోట్లకు పెంచాం.
* 2013-14లో రూ. 67,224 కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలన్నది లక్ష్యం.
*  జలయజ్ఞం కింద ఇప్పటివరకు 17 ప్రాజెక్టులు పూర్తి చేశాం.
*  మచిలీపట్నం నౌకాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తాం.
*  భావనపాడు, కళింగపట్నంలో రెండు చిన్న నౌకాశ్రయాల అభివృద్ధి ప్రతిపాదన ఉంది.
*  రాజీవ్ యువకిరణాల పథకం కింద 25 వేల మందికి ఉపాధి కల్పించాం.
*  బంగారు తల్లి పథకం కింద నమోదైన లబ్ధిదారుల సంఖ్య 1,59,163.

(Courtesy EENADU)

Thursday, February 6, 2014

అదరగొడుతున్న భారత సంతతి

Courtesy : Sakshi
అదరగొడుతున్న భారత సంతతి
భారత సంతతి అంతర్జాతీయ స్థాయిలో పలు అతి పెద్ద సంస్థల పగ్గాలు చేపట్టి తమ సత్తా చాటుతున్నారు. విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉద్యోగాలు చేస్తున్న టాప్‌ టెన్‌ అత్యంతకీలక సిఇఓల సరసన ఇప్పుడు సత్య నాదెళ్ల  చేరారు.  ప్రమోటర్ కాకుండా  అతి పెద్ద సాప్ట్ వేర్ కంపెనీ మైక్రోసాప్ట్ కు  సత్య సిఇఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇంద్రనూయి, లక్ష్మిమిట్టల్‌, అన్షుజైన్‌,ఇవాన్‌ మెనెంజీస్‌ లాంటి భారతీయ సంతతికి చెందిన వారు విదేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. దాదాపుగా 12 మంది భారతీయ సంతతికి చెందిన వారు వరల్డ్‌ టాప్‌కంపెనీల్లో అత్యున్నత సిఇఒ పదవుల్లో కొనసాగుతుండటం గర్వకారణం. అటువంటివాటిలో మైక్రోసాప్ట్‌, పెప్సికో, ఆర్సిలర్‌ మిట్టల్‌, డాయిచీ బ్యాంక్‌, డియాగో, మాస్టర్‌ కార్డ్‌ లాంటి కంపెనీలున్నాయి. ఇంతకు ముందు సిటీ గ్రూప్‌, వోడాఫోన్‌, మోటరోలా కంపెనీల సిఇఒలు సైతం భారతీయ సంతతికి చెందిన వారే ఉండేవారు.

అతి పెద్ద కంపెనీలు ఆర్సిలర్‌ మిట్టల్(లక్ష్మీమిట్టల్), రెక్కిట్ బెంకైజర్(రాకేష్ కపూర్), మాస్టర్ కార్డ్(అజయ్ బంగా), డిబిఎస్ గ్రూప్ హోల్డింగ్స్(పియూష్ గుప్త), శాన్ డిస్క్(సంజయ్ మెహ్రోత్ర),గ్రోబల్ ఫౌడ్రీస్( సంజయ్ ఝా), ఎడాబ్(శంతనుడు నారాయెన్) భారత సంతతి సారధ్యంలోనే నడుస్తున్నాయి. ఇవాన్‌ మెనెంజీస్‌  గత సంవత్సరం యుకె కేంద్రంగా నిర్వహించే అతి పెద్ద మద్యం వ్యాపార సంస్థ డియాజియోకు చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అన్షుజైన్ జర్మనీకి చెందిన డాయిచీ బ్యాంక్‌కు కో-సిఇఓగా వ్యవహరిస్తున్నారు. గతంలో అతి పెద్ద సంస్థలైన సిటీగ్రూప్, ఓడాఫోన్, మోట్రోలా వంటి కంపెనీలకు కూడా భారత సంతతికి చెందినవారే సిఇఓలుగా వ్యవహరించారు.

 భారత సంతతి సిఇఓలుగా వ్యవహరించే 10 టాప్‌ కంపెనీల వ్యాపారం విలువ అక్షరాల 350 బిలియన్‌ డాలర్లని అంచనా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారి సారధ్యంలో నడిచే వ్యాపారం  విలువ భారత ఎగుమతులకంటే ఎక్కువగా ఉంటుందని ఒక అంతర్జాతీయ మ్యాగజైన్ వెల్లడించింది. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో కూడా భారత సంతతి ఉన్నత పదవులు అధిష్టించి తమ ప్రతిభను చాటుతున్నారు.

మానవ వనరుల నిపుణుల అంచనాల ప్రకారం భారతదేశంలో నిపుణులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. భారతీయ నిపుణులు సాంకేతికంగా మంచి నైపుణ్యం గలవారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోని ముందుకు సాగిపోగల  సమర్ధులని తేల్చారు.

జిగేల్..జిగేల్..

    -ఆటో ఎక్స్‌పో అదుర్స్
    -కొత్త వాహనాలతో సందడి చేసిన సంస్థలు
    -కాన్సెప్ట్ కార్లే అధికం
    గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 5: ఆటోమొబైల్ సంస్థలకు పండుగ కళ వచ్చింది. కొత్త వాహనాలు, తళుక్కుమనే బెణుకులు, తారల సందడి, కంపెనీల ప్రతినిధుల సందడి ఇది తొలిరోజు గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటోఎక్స్‌పో విశేషాలు. గడిచిన రెండేళ్లుగా అమ్మకాలు లేక వెల ఆటోమొబైల్ సంస్థలు కొత్త వాహనాలను విడుదల చేయడంలో మాత్రం టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న 12వ ఆటో ఎక్స్‌పోలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు కొత్త కార్లతో సందడి చేశాయి. దేశవ్యాప్తంగా కాన్సెప్ట్ కార్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో తొలిరోజు సంస్థలు వీటిని ప్రదర్శించడానికి మొగ్గు చూపాయి. దేశ ఆర్థిక రంగం ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సంకేతాలు వెలుబడటంతో ఆటోమొబైల్ సంస్థలు 2014పైనే భారీ ఆశలు పెట్టుకున్నాయి.karina దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వంటి అగ్రస్థాయి సంస్థలు కాన్సెప్ట్ కార్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. తొలి రెండు రోజులు కేవలం కంపెనీ ప్రతినిధులు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ విశ్లేషకులకు మాత్రమే అనుమతినిస్తుండగా.. ఏడు నుంచి సామాన్యులకు కూడా అవకాశం కల్పించింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ఎస్‌ఐఏఎం), భారత పరిక్షిశమల సమాఖ్య(సీఐఐ)తోపాటు ఆటోమొటివ్ విడిభాగాలు తయారీదారుల సంఘం(ఏసీఎంఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్‌పో ఈ నెల 11 వరకు జరుగనున్నది.

    దీంట్లోభాగంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ రెండు కొత్త కాన్సెప్ట్ మోడళ్లను నేడు ప్రదర్శించింది.అమ్మకాలను పెంచుకోవడానికి కొత్త వాహనాలను విడుదలచేయాలని నిర్ణయించినట్లు మారుతి సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. మాంద్యం పరిస్థితుల్లోనే గత ఆర్థిక సంవత్సరంలో 10.6 లక్షల యూనిట్లను సంస్థను విక్రయించింది. మరో ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన సంటే ఫీని ప్రవేశపెట్టింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.26.3 లక్షల నుంచి రూ.29.2 లక్షల మధ్యలో లభించనున్నది. అలాగే జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థ సుజుకీ మోటార్ 1000 సీసీ సామర్థ్యంతో రూ.15 లక్షల విలువైన ప్రీమియం బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

    నెక్సన్‌ను ప్రవేశపెట్టిన టాటామోటార్స్
    అమ్మకాలు లేక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్..కాన్సెప్ట్ కాంపాక్ట్ స్పోర్ట్స్ యూటిలిటీ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ‘నెక్సన్‌తోపాటు కనెక్ట్‌నెక్ట్’ పేర్లతో లభించే ఈ కొత్త కార్లతో మార్కెట్ వాటా పెరగడానికి దోహదపడుతుందని కంపెనీ ఆశిస్తున్నది. ఈ రెండింటితోపాటు కాంపాక్ట్ సెడాన్ జెస్ట్, హ్యచ్‌బ్యాక్ బోల్ట్ వాహనాలను కూడా ప్రదర్శించింది. కమర్షియల్ వాహన సెగ్మెంట్‌కు చెందిన మీడియం కమర్షియల్ వాహనాలైన సీఎక్స్ 1618టీ, అల్ట్రా 614, ఎల్‌పీఎస్ 4923 ఎల్‌ఏలను కూడా మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నది. ఈ కొత్త కార్లలో టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ, మాజీ చైర్మన్ రతన్ టాటా సందడి చేశారు.


    హీరో మోటో నుంచి 100 సీసీ బైక్
    ద్విచక్ర వాహనాల ఉత్పత్తలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్..ండు కొత్త బైక్‌లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి రెడీ అయింది. దీంట్లో 100 సీసీ సామర్థ్యం గల స్లెండర్ ప్రో క్లాసిక్, ప్యాషన్ టీఆర్ బైకులను వచ్చే నెల నుంచి దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజల్ తెలిపారు. ఈ బైక్‌లతోపాటు 620 సీసీ సామర్థ్యం గల సూపర్ ప్రీమియం మోటార్‌బైక్ ‘హస్టర్’, కాన్సెప్ట్ బైక్స్ ‘సింపిల్‌సిటీ’, ఇయాన్ బైక్‌లను కూడా ప్రదర్శించింది. 150 సీసీ సామర్థ్యంతో రూపొందించిన డీజిల్ బైక్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

    హార్లీ డేవిడ్సన్ నుంచి చవకైన బైక్
    ప్రీమియం బైకుల ఉత్పత్తి సంస్థ హార్లీ డేవిడ్సన్ దేశీయ మార్కెట్లోకి చవకైన బైక్‌ను విడుదలచేసింది. స్ట్రీట్ 750 పేరుతో లభించే ఈబైక్ ఢిల్లీ షోరూంలో రూ.4.11 లక్షలకు లభించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. యువతను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించడం జరిగిందని హార్లీ డేవిడ్సన్ ఇండియా ఎండీ అనూప్ ప్రకాశ్ తెలిపారు. ఈ కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు మార్చి 1 నుంచి బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపింది. ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో 13 మోడళ్లు అందుబాటులో ఉండగా..స్ట్రీట్ 750 మిగత వాటికంటే తక్కువ ధర కలదు.

    రూ.1,100 కోట్లతో గుజరాత్‌లో ప్లాంట్: హెచ్‌ఎంఎస్‌ఐ
    గుజరాత్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడితో స్కూటర్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రకటించింది. ఇప్పటికే హర్యానా, రాజస్థాన్, కర్ణాటకలో మూడు ప్లాంట్లు ఉండగా..గుజరాత్‌లో ఏర్పాటుచేయబోయేది నాలుగొది కానున్నది. దేశవ్యాప్తంగా స్కూటర్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో రూ.1,100 కోట్ల పెట్టుబడితో ఏడాది 12 లక్షల యూనిట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈవో కైతా మరమత్సు తెలిపారు. 2016 కల్లా అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్లో మూడు వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నది.

    యమహా నుంచి సరికొత్త స్కూటర్
    జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థ యమహా..దేశీయ విపణిలోకి సరికొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ‘అల్ఫా’ పేరుతో లభించే ఈ స్కూటర్ ఢిల్లీ షోరూంలో రూ.49,518కి లభించనున్నది. కుటుంబ అవసరాలకోసం తయారు చేసిన ఈ స్కూటర్‌ను ఏడాదికి రెండు లక్షల యూనిట్లు విక్రయించాలనుకుంటున్నట్లు యమహా మోటార్ ప్రెసిడెంట్, సీఈవో హిరోయుకి యనగి తెలిపారు. 113 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు 62కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. భారత్‌లో స్కూటర్లకు డిమాండ్ అధికంగా ఉందని..2014లో దేశవ్యాప్తంగా 36 లక్షల వాహనాలు విక్రయించే అవకాశం ఉందన్నారు.

Wednesday, February 5, 2014

వాహన ప్రదర్శన నేటి నుంచే (5 ఫిబ్రవరి-2014)

(5 ఫిబ్రవరి-2014)
న్యూఢిల్లీ: భారత వాహన ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఆ పండుగకు తెరతీయనుంది. ఈ రంగం గత రెండేళ్లుగా డీలా పడ్డ సమయంలో తిరిగి గిరాకీని పెంచేందుకు.. కొనుగోలు దార్లను ఆకర్షించేందుకు ఇదో మంచి వేదికగా కంపెనీలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 11 వరకూ జరిగే ఈ ప్రదర్శనలో తొలి రెండు రోజులు మీడియా ప్రతినిధులకు కేటాయించారు. 7 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తారు. అంతక్రితంలా కాకుండా ఈ సారి 12వ ఆటో ఎక్స్‌పో రెండు భాగాలుగా విడదీశారు. గ్రేటర్ నోయిడాలో వాహన ప్రదర్శనను; ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ప్రదర్శనను నిర్వహించనున్నారు.

మొత్తం మీద 70 కొత్త వాహనాలు ఈ ప్రదర్శనలో మెరవనున్నాయి. ఇందులో 26 అంతర్జాతీయ మోడళ్లు కావడం విశేషం. అంతక్రితం ప్రదర్శనలో నిర్వహణపై ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజాలు 'ఇది తమాషా కాదు' అన్న విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సారి నిర్వాహకులు మరింత పకడ్బందీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారన్న అంచనాలున్నాయి. భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), భారత వాహన విడిభాగాల తయారీ సంఘం(ఏసీఎమ్ఏ)లు నిర్వహణలో పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే.

తెలుగు తేజానికి మైక్రోసాఫ్ట్ పగ్గాలు

Courtesy : Eenadu

ఈ సంధి కాలంలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి ఎవరూ లేరు. ఇంజినీరింగ్ నైపుణ్యం, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను కలిసికట్టుగా ఉంచడం వంటి విషయాల్లో సత్య ఒక నాయకుడుగా నిరూపించుకున్నారు.

తదుపరి తరం ఉత్పత్తుల్లో వినూత్నత, వృద్ధిలోకి కంపెనీ అడుగుపెడుతున్న ఈ సమయంలో మైక్రోసాఫ్ట్‌కు ఏం కావాలో; సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాదెళ్లకు బాగా తెలుసు.
- బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు

సత్య నాదెళ్ల ఓ అద్భుతమైన నాయకుడు. వినూత్న సాంకేతిక నైపుణ్యం ఆయన సొంతం. వ్యాపార పోకడలను త్వరితంగా అర్థం చేసుకోగల శక్తిసంపన్నుడు. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో కనిపెట్టగలడు. వాటిని మైక్రోసాఫ్ట్ ఎలా అందిపుచ్చుకోవాలో నిర్ణయించగలడు. సత్య నాదెళ్లతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశా. సత్య నాదెళ్ల గొప్ప సీఈఓ అవుతారన్న నమ్మకం నాకుంది.
- స్టీవ్ బామర్, వైదొలగుతున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ 

న్యూయార్క్: వూహించినదే జరిగింది. ప్రపంచ అగ్రగామి సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన తెలుగు తేజం సత్య నాదెళ్ల నియమితులయ్యారు. 38 ఏళ్ల మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడుఈయనే కావడం గమనార్హం. స్టీవ్ బామర్ స్థానంలో 46 ఏళ్ల నాదెళ్ల నియామకంతో కొన్ని నెలలుగా షికారు చేస్తున్న వూహాగానాలకు తెరపడింది. ఒక అమెరికా కంపెనీలో.. అందునా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలో.. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత సీఈఓ పదవి చేపట్టిన వ్యక్తిగా సత్య నాదెళ్ల నిలిచారు. ఇది ఒక భారతీయుడికి లభించిన అరుదైన గౌరవం.
నాదెళ్లతో పాటు.. గూగుల్‌కు చెందిన సుందర్ పిచాయ్ కూడా మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి పోటీ పడ్డారు. క్రికెట్ అంటే బాగా ఇష్టపడే నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అంతక్రితం క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ గ్రూపునకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఛైర్మన్‌గా జాన్ థాంప్సన్ : ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న జాన్ థాంప్సన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్థానంలో ఛైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక బిల్‌గేట్స్ సాంకేతిక సలహాదారుగా కొత్త అవతారం ఎత్తనున్నారు. బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు.

మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు ఉద్యోగులకు సత్య నాదెళ్ల రాసిన లేఖ సారాంశం....... 

'ఈ రోజు నాకు చిరస్మరణీయం. 22 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టిన రోజు గుర్తుకొస్తోంది. పనిచేసే కంపెనీని ఎంచుకునే అవకాశం మీలాగే నాకూ లభించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా నమ్మి మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టా. ఆనాటి నుంచి కొత్త ఆలోచనలు, ఉత్పత్తులతో ప్రజల సామర్థ్యాలను పెంచుతున్న మైక్రోసాఫ్ట్‌ను చూస్తూనే ఉన్నా. అద్భుతాలు సృష్టించాలనుకుంటే.. పని చేయడానికి మైక్రోసాఫ్ట్‌కు మించిన కంపెనీ లేదని నాకు తెలుసు. ఇదే స్ఫూర్తి నన్ను ఈ రోజు వరకూ నడిపిస్తోంది. నాకు నమ్మలేని గౌరవం దక్కింది. ఇంత గొప్ప కంపెనీకి నాయకత్వం వహించి సేవ చేసే భాగ్యం కలిగింది. చిన్న ఆలోచన నుంచి ప్రపంచంలోనే అత్యంత గొప్ప, ఆరాధ్య కంపెనీ స్థాయికి మైక్రోసాఫ్ట్ ఎదగడానికి కారణమైన స్టీవ్, బిల్‌గేట్స్‌తో సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఇప్పుడు సీఈఓ బాధ్యతలు చేపట్టాను. కంపెనీకి అదనంగా సమయం కేటాయించమని, టెక్నాలజీ, ఉత్పత్తులపై దృష్టిపెట్టమని బిల్‌ను కోరాను. కంపెనీ కొత్త ఛైర్మన్ జాన్ థాంప్సన్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనం ఎన్నో విజయాలను సాధించాం. మరిన్ని విజయాల కోసం తహతహలాడుతున్నాం. పరిశ్రమకు, మైక్రోసాఫ్ట్‌కు ఇది కీలకమైన సమయం. మొబైల్, క్లౌడ్ రంగాల్లో మైక్రోసాఫ్ట్ దూసుకుపోయేలా చేయడం మనందరి ముందున్న కర్తవ్యం. ఈ తరుణంలో నా గురించి మీతో ఓ రెండు ముక్కలు చెప్పుకోవాలి. నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విషయాలను మీతో పంచుకోవాలి.

నా వయసు 46 ఏళ్లు. 22 ఏళ్ల క్రితం పెళ్త్లెంది. ముగ్గురు పిల్లలు. అందరి లాగే నా కుటుంబం, అనుభవాలే నన్ను తీర్చిదిద్దాయి. నా మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను పుస్తకాల పురుగంటారు. అయితే.. చదివిన పుస్తకాల కంటే కొన్నవే ఎక్కువ. ఆన్‌లైన్‌లో కొత్త కోర్సులకు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నా.. పూర్తి చేసింది తక్కువే. కొత్త విషయాలను తెలుసుకోలేకపోతే ఉపయోగపడే గొప్ప పనులు చేయలేమని నా నమ్మకం. మొత్తం మీద కుటుంబం.. జ్ఞానాన్ని సముపార్జించాలన్న తృష్ణ, ఉత్సుకతలే నన్ను మలిచాయి.

నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే..?

ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మైక్రోసాఫ్ట్‌లో ఎక్కువమంది ఎందుకు చేరుతున్నారో ఆ కారణం తెలుసుకోవాలి. ఆ కారణమే నేను ఈ కంపెనీలో చేరడానికి దారి తీసింది. అబ్బురపడే పనులు చేయగలగడానికి వీలుగా ప్రజలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, తద్వారా ఈ ప్రపంచంలో మార్పు తేవాలనే ఆశయంతోనే పలువురు మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు.. అయినప్పటికీ నిజం మాత్రం ఇదే. మనం దీన్ని చేసి చూపించాం. ఈవేళకీ చేస్తున్నాం.
రానున్న పది సంవత్సరాల్లో కంప్యూటింగ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని నా నమ్మకం. కొత్త రకాల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్రాణం పోసుకొని మనం చేస్తున్న అనేక పనులలోకి, వ్యాపారాల లోకి, జీవన శైలుల్లోకి, ఏకమొత్తంగా మనదైన ప్రపంచంలోకీ చొచ్చుకు వచ్చి డిజిటైజ్ చేసేస్తాయి. ఈ ప్రపంచం సాఫ్ట్‌వేర్ ఆలంబనగా నిలుస్తున్న ప్రపంచం.

మన కుటుంబాలతోనూ, స్నేహితులతోనూ ఉన్న అనుబంధాన్ని మరింత మెరుగ్గా మనం పెంచుకోవడానికీ, ఈ ప్రపంచాన్ని ఇదివరకెన్నడూ ఎరుగని పద్ధతుల్లో చూడడానికి, అనుభూతించడానికి, సన్నిహితంగా పంచుకోవడానికి ఉపయోగపడనుంది. ఒక బలమైన ప్రభావాన్ని కలగజేయడంలో సాటిలేని శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నందువల్లనే నేను ఇక్కడికి వచ్చాననుకుంటున్నా.

ఇక్కడ ఎందుకున్నాం?

ఇంతకు ముందు వరకు మన ధ్యేయమల్లా ప్రతి ఇంట్లోకీ ఒక పీసీని చేర్చాలనేది. దీన్ని మనం చాలావరకు సాధించగలిగాం. ఇవాళ మరింత విస్తృత శ్రేణి పరికరాలపై దృష్టి కేంద్రీకరించాం. నోకియాతో మన ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు కానీ.. ఆ కంపెనీ ఉపకరణాలను, సేవలను మన కుటుంబంలోకి ఆహ్వానిద్దాం. మొబైల్ ఫోన్లపరంగా వారు మనకు తెచ్చి ఇచ్చే శక్తియుక్తులను అందుకుందాం. ఈ ప్రపంచానికి మైక్రోసాఫ్ట్ తనవంతుగా అందించగల విశిష్ట సేవలేమిటన్నది మనం గుర్తించి తీరాలి. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఇది.

ఇక నుంచి ఏం చేద్దాం?

ఆస్కార్ వైల్డ్ అన్నట్లు 'మనకు అసాధ్యం అన్నది ఉండదన్న విషయాన్ని విశ్వసించాలి. అదే సమయంలో అనుమానాన్ని దరిదాపుల్లోకి కూడా రానీయకూడదు.'
అపుడే మనం చేయాల్సిన పనిపై ఒక స్పష్టత మొదలవుతుంది. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. వినూత్నతకు ప్రాధాన్యమివ్వాలి. మన వినియోగదార్లకు కావాల్సింది అదే. మనం అందించే ప్రతీ సేవ, వస్తువుల్లో మరింత వినూత్నతను కనబరచాలి.

ఇక, మనం మన అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శించాలి. మనలో ప్రతి ఒక్కరూ తమ పనికి అర్థాన్ని వెతుక్కోగలరని నేను గట్టిగా నమ్ముతున్నా. ప్రజల జీవితాన్ని మార్చేదేదో చేసినపుడే అది అత్యుత్తమ పని.చాలా వరకు కంపెనీలు ప్రపంచాన్ని మార్చివేయాలని భావిస్తుంటాయి. కానీ చాలా కొన్నిటి వద్దే అందుకు కావలసిన ముడిసరకులుంటాయి. అందులో ముఖ్యమైనవి: ప్రతిభ, వనరులు, నిరంతర శ్రమ. మైక్రోసాఫ్ట్‌కు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొత్త సీఈఓగా నేను మరింత గట్టి పునాదులుండాలని కోరుకోను. రండి.. ఈ పునాదిపైనే ఒక నవ లోకాన్ని నిర్మిద్దాం.

ముళ్ల బాటే!

మొబైల్ కంప్యూటింగ్ రంగంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న మైక్రోసాఫ్ట్‌కు యాపిల్, గూగుల్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కంపెనీ 'మొబైల్' ఆశలను నెరవేర్చడంలో సత్య నాదెళ్ల ఎటువంటి వ్యూహాలను అమలు చేయనున్నారన్నదిఆసక్తి కరం.. సవాళ్లు పరిశీలిస్తే..
చి అంతర్జాలం (ఇంటర్నెట్) ఆధారిత, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో సత్యకు మంచి అనుభవమే ఉంది. కంపెనీకి నాయకత్వం వహించడానికి ఆయన తగిన వ్యక్తే. అయితే.. వినియోగదారులను మెప్పించడంలో.. వాటాదారులను సంతృప్తిపరచడంలో ఏ మేరకు విజయం సాధించగలరన్నది ప్రశ్న.

- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆయనకు అనుభవం ఉన్నా.. మొబైల్ సొల్యూషన్లపై పెద్ద అవగాహన లేదు. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

- వర్క్‌ప్లేస్ కంప్యూటింగ్‌లో కంపెనీకి ఇప్పటికీ తిరుగు లేకపోయినప్పటికీ.. అటు అమెరికాలోను, ఇటు విదేశాల్లోను క్రమక్రమంగా కంపెనీ వినియోగదారుల ఆదరణ కోల్పోతోంది.

- ఆండ్రాయిడ్ ఫోన్లు, యాపిల్ ఐపాడ్‌లను సవాలు చేయడానికి నోకియాను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. ఇది వాల్‌స్ట్రీట్‌ను అంతగా మెప్పించలేదు. హార్డ్‌వేర్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని కీలకమైన వాటాదారుల నుంచి ఒత్తిడి వస్తోంది.

- యూనిట్ అధిపతిగా సత్య నాదెళ్లకు అనుభవం ఉన్నా.. ఒక భారీ కంపెనీ ఎదుర్కొనే సవాళ్లను నేరుగా చవి చూడలేదు. ఇంత పెద్ద కంపెనీ లాభ, నష్టాల ఖాతాలపైనా ఆయనకు అనుభవం లేదు.

- పెద్ద పెద్ద కంపెనీల్లో వాటాదారుల విలువ పెరగడం నిధుల కేటాయింపుపైనే ఆధారపడి ఉంటుంది. కొత్త ఉత్పత్తుల వల్ల కాదు. వాటాదారుల విలువ పెంచడమే నాదెళ్లకు అసలైన సవాల్.

మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యాలయం: రెడ్‌మండ్, వాషింగ్టన్ 
ఏర్పాటు: 1975, ఏప్రిల్ 4, ఆల్బుకర్క్, న్యూమెక్సికో రాష్ట్రం 
వ్యాపార కార్యకలాపాలు: ఆసియా, ఐరోపా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలు దక్షిణ ఫసిఫిక్ 
ఉద్యోగుల సంఖ్య: సుమారు 1,00,932 (2013, డిసెంబరు నాటికి) 
ఆదాయం: 77.85 బిలియన్ డాలర్లు (2013లో)

బుక్కాపురం బిడ్డ.. 'ఐఏఎస్' యుగంధర్ కుమారుడు..

ఈనాడు, అనంతపురం; న్యూస్‌టుడే, తాడిపత్రి: సత్య నాదెళ్ల అలియాస్ నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. లోగడ ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగాను, ప్రణాళికా సంఘం సభ్యుడిగాను, ఇతర హోదాల్లోను పనిచేసి, ప్రజాసంక్షేమం, పరిపాలనలో తనదైన ముద్ర వేసి జాతీయస్థాయిలో పేరుగాంచిన మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ కుమారుడే సత్య. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ అల్లుడు కూడా. యుగంధర్ చిన్నతనం నుంచే కష్టపడి చదివారు. ఐఏఎస్‌కు ఎంపికై, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కుమారుడు సత్యను బాగా చదివించారు. పలు సందర్భాల్లో తండ్రి యుగంధర్‌తో కలిసి సత్య బుక్కాపురం సందర్శించారు. తమ ఇల్లు, పంట పొలాలు చూశారు. బంధువులను కలిసి ఆత్మీయంగా పలకరించారు. యుగంధర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. వూరిలోని చెన్నకేశవస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, గ్రామంలో సీసీ రోడ్లు, ఎస్సీలకు పక్కా ఇళ్ల నిర్మాణం- ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ప్రధాన భూమిక పోషించారు. 'ఈనాడు-ఈటీవీ' బృందం మంగళవారం బుక్కాపురాన్ని సందర్శించి, సత్య బంధువులు, కుటుంబీకులతో ముచ్చటించింది. ఆయన అత్యున్నత స్థాయికి ఎదగడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. ఆ తండ్రీ కొడుకులు గ్రామానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చారని ప్రశంసించారు.
పంట పొలాలు చూసి సంతోషించాడు: సర్పంచ్

''సత్య తండ్రి, మా తండ్రి చిన్నాన్న పెదనాన్న పిల్లలు. సత్య మైక్రోసాఫ్ట్ సీఈవో కావడం చెప్పలేని ఆనందాన్నిస్తోంది. సత్య బీటెక్‌లో చేరే ముందు తండ్రితో కలిసి గ్రామానికి వచ్చాడు. పంట పొలాలు చూసి సంతోషపడ్డాడు. గ్రామస్థులందరిని ఆప్యాయంగా పలకరించాడు. ఇప్పటికీ వారికి ఇక్కడ పదెకరాల పొలం ఉంది'' అని బుక్కాపురం సర్పంచ్ భీమశంకర్ తెలిపారు.