Monday, December 31, 2012

'క్లిఫ్’ అంచున అమెరికా!


ఆఖరి నిమిషంలో డీల్ కోసం చట్టసభల సభ్యుల ముమ్మర యత్నాలు
విఫలమైతే జనవరి 1 నుంచి అమల్లోకి ‘ఫిస్కల్ క్లిఫ్’
భారీగా పన్నుల పెంపు, వ్యయాల్లో కోత భయాలు


వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా... ఇప్పుడు ‘ఫిస్కల్ క్లిఫ్’ అంచున వేలాడుతోంది. 2012 సంవత్సరం కనుమరుగయ్యేందుకు ఇక గంటల వ్యవధే మిగిలి ఉంది. 2013 జనవరి 1 ప్రారంభమవుతూనే అక్కడి ప్రజలు, కంపెనీలపై పన్నుల భారం రూపంలో వడ్డింపు కూడా మొదలవుతుంది. బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నుల పెంపు, భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యయాల్లో కోత అమల్లోకి వచ్చేస్తుంది(దీన్నే ఫిస్కల్ క్లిఫ్‌గా వ్యవహరిస్తున్నారు). గడిచిన కొద్ది వారాలుగా దీన్ని నివారించడం కోసం అక్కడి ప్రభుత్వం, విపక్షాల మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి ఫలితం లేకపోవడంతో... ఇక ఆఖరి నిమిషంలో డీల్‌పైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.

అమెరికా చట్టసభల సభ్యులు(సెనేట్, ప్రతినిధుల సభ) ఆదివారం, సోమవారం 36 గంటల పాటు ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నారు. డెమోక్రాట్‌ల ఆధిపత్యం ఉన్న సెనేట్‌లో ఇరు పార్టీలకు చెందిన నాయకులు శనివారం కూడా విస్తృత చర్చల్లో మునిగితేలారు. అటు డెమెక్రాట్‌లకు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో మెజారిటీ కలిగిన రిపబ్లికన్‌లకు సైతం ఆమోదనీయమైన ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరు సభల సభ్యులూ ఫిస్కల్ క్లిఫ్ నివారణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చించి, ఒప్పందాన్ని ఆమోదించేందుకు చాలా కొద్ది సమయమే మిగిలిఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

భయాలు ఇవీ: ఫిస్కల్ క్లిఫ్ గనుక అమల్లోకి వస్తే... ప్రజలు, కార్పొరేట్లపై పన్ను భారం పెరిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనేది ఆర్థిక వేత్తల ఆందోళన. అమెరికా చరిత్రలోనే ఏకమొత్తంలో అతిపెద్ద పన్నుల పెంపునకు ఈ ఫిస్కల్ క్లిఫ్ కారణమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 500 బిలియన్ డాలర్ల మేర ప్రజలపై భారం పడుతుందని ఆర్థిక వేత్తలు లెక్కకడుతున్నారు.

దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రతికూలత చూపుతుందని వారి వాదన. ఇప్పటికే 2008-09 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి రికవరీ కోసం నానాతంటాలూ పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది శరాఘాతమేనని స్పష్టం చేస్తున్నారు. మరోపక్క, అమెరికా కాంగ్రెస్(ఇరు సభల ప్రతినిధులు) దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదానిపై ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోనూ ఆందోళన కనబడుతోంది. ఈ గండం నుంచి అమెరికా ఎలా గట్టెక్కుతుందోనని ఇన్వెస్టర్లు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఫిస్కల్ క్లిఫ్ సంగతిదీ...
అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ల పార్టీకి చెందిన జార్జి బుష్ హయాంలో ప్రజలకు పన్నుల ఉపశమనం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. వీటిని డెమెక్రాట్‌లకు చెందిన ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం కూడా 2010లో తాత్కాలిక ప్రాతిపదికన పొడిగించింది. ఈ చర్యల గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో తీరిపోతుంది. అంటే... 2013 జనవరి 1 నుంచి ఆటోమేటిక్‌గా పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయాల్లో కోత అమల్లోకి వచ్చేస్తుంది. ఈ పరిణామాన్నే ఫిస్కల్ క్లిఫ్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని నివారించేందుకే ఇప్పుడు చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి..

ఎవరి వాదనలు ఏంటి...
రిపబ్లికన్ పార్టీ సభ్యులు పన్నుల పెంపునకు మొదటి నుంచీ ససేమిరా అంటున్నారు. దీనికి బదులు పన్నుల వసూళ్లలో ఇప్పుడున్న లోటుపాట్లను పూడ్చుకొని ఆదాయాన్ని పెంచుకోనేలా మార్గాలు అన్వేషించాలనేది వారి సూచన. మరోపక్క, సామాజిక భద్రత ఇతరత్రా పథకాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న వ్యయాల్లో భారీగా కోత విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఒబామా మాత్రం ఆదాయ పెంపునకు వీలుగా ధనికులపై పన్నులు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు.

గడువు లోగా ఒకవేళ ఇరు పార్టీలు గనుక ఒక ఒప్పందానికి వచ్చి.. రాజీ నిర్ణయం తీసుకోనిపక్షంలో పన్ను చెలిపుదార్లందరికీ ఈ తప్పనిసరిగా పెరుగుదల అమల్లోకి వచ్చేస్తుంది. కాగా, ఒబామా ప్రతిపాదిత డీల్ కుదిరినప్పటికీ, ఇది ఇరు సభల్లోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక్కడే సమస్య నెలకొంది. రిపబ్లికన్లలో డెమోక్రాట్ వ్యతిరేకులు దీనికి అంగీకరిస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. కాగా, సమయం ఇక మించిపోతుండటంతో డిసెంబర్ 31 డెడ్‌లైన్ అమలులోకి రాకుండా, ప్రత్యామ్నాయంగా జనవరిలో దీనికి పూర్తి పరిష్కారం కోసం అంగీకారం కుదరవచ్చని కూడా మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. పన్నుల పెంపులో కొంత తగ్గింపు, ఏ స్థాయి ఆదాయలకు వర్తింపజేయాలి, ఇతరత్రా ప్రతిపాదనలను జనవరి 1 నుంచే పాత తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా ఒప్పందం ఉండొచ్చని కూడా వారు చెబుతున్నారు.

Saturday, December 29, 2012

3G ఫోన్సు అంటే ఏమిటి?

3జీ అంటే సంక్షిప్తంగా 'థర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ'. వేగంగా సమాచార మార్పిడి చేసుకొనేలా మొబైల్ నెట్‌వర్కులనీ , మొబైల్‌ఫోన్లలనీ రూపొందించారు. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీని 2G అంటున్నారు.ఇందులో వేగాన్ని ఈ స్థాయి తర్వాత పెంచలేము. ఎక్కువగా వాయిస్ మరియు టెక్స్టు డాటాని మాత్రమే మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా రూపొందించిందే ఈ 3జీ. అరచేతిలో టీవీ! సినిమాలు, పాటలు, వార్తలు, ఓ మాదిరి సైజున్న వీడియో ఫైల్స్ ఏవైనా సరే చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
రానున్న కాలంలో మొబైల్ ఫోన్లోనే టివీలూ చూడగలుగుతారు. దానికి ఎక్కువ రిజల్యూషన్ తో కూడిన డిస్ప్లే సిస్టం, అధిక డాటాని వేగంగా రిసీవ్ చేసుకోగలగటం లాంటి ఎక్కువ సౌకర్యలతో మొబైల్ ఫోన్లూ వస్తాయి. టీవీ ప్రోగ్రాములను ప్రసారం చేయడానికి ఉన్న ఛానల్స్ సిద్ధం ఔతాయి. కొత్త ఛానెల్సూ , వెబ్‌సైట్లూ పుట్టుకొస్తాయి. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. ఫ్రస్తుతం మనం వినియోగిస్తున్న 2జీ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో ఏ విధంగా వినియోగించగలిగామో వీడియో ఫైల్స్ ని ౩జీ లో అంతే సులువుగా యాక్సెస్ చేసుకొనేలా ఈ నెట్‌వర్క్‌లన్, ఫోన్లనీ రూపొందిస్తున్నారు.
వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్‌లో ఆన్‌లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్‌లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నే 'వీడియో కాలింగ్' అని పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. దీనికోసం ఫోన్ కు ముందు భాగంలో కెమేరాను ఏర్పాటు చేసిన 3జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు.
మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది. కంప్యూటర్‌లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్‌తో కూడిన ఎటాచ్‌మెంట్లతో ఈ-మెయిల్స్ ని చిటికెలో పంపేయొచ్చు.
వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌తోనూ, కొత్త వాళ్ళతోనూ ఆన్‌లైన‌ గేమ్స్‌లాగా, ఇక వీడియో గేమ్‌లూ అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్‌లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పోలీసు, రక్షణ వ్యవస్థలు ఈ నెట్‌వర్క్ ద్వారా సీసీటీవీలను యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. మొబైల్ టూరిజం, మొబైల్ వాణిజ్యం, ఈ-లెర్నింగ్, స్టాక్‌ఎక్స్చేంజ్, టెలీ‌మెడిసిన్, మొబైల్ వాణిజ్య ప్రకటనలు సమస్త ప్రపంచం ఇక మీ అరచేతిలోనే - అరచేతిలో వైకుఠం తెలీదు గానీ, మీ ప్రపంచం మొత్తం మీ అరచేతిలోనే!
ఈ సేవల్ని పొందాలంటే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న సేవలకంటే ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశమే ఉంది. కాకపోతే ప్రభుత్వ నియంత్రణల వల్ల, ఇవన్నీ రావడానికి మాత్రం ఇంకా కొద్ది కాలం పడుతుంది. ప్రస్తుతానికి MTNL, BSNL మాత్రమే ఈ సదుపాయాలని కొన్ని చోట్ల అందిస్తున్నారు. సేవలందంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధం ఔతున్నాయి. మార్కెట్ళో ఈ 3G టెలిఫోన్లూ లభ్య మౌతున్నాయి. కాస్త ధరే రూ 15,000 పైగా ఉన్నా, వేచి చూడండి. అన్ని కంపెనీలు మొదలెట్టాగా, వీటీ రేట్లు కొద్దిగా నైనా తగ్గొచ్చు.

Monday, December 24, 2012

వేతనజీవులకు మరింత ఊరటనివ్వాలి


ఆదాయ పన్ను గరిష్ట శ్లాబ్‌ను రెట్టింపు చేయాలి
ప్రస్తుతం ఉన్న రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలి
80సి కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షలకు చేర్చాలి
ప్రి-బడ్జెట్ మెమొరాండంలో ఫిక్కీ


న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్‌లో వేతనజీవులకు మరింత ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలనే డిమాండ్‌లు జోరందుకుంటున్నాయి. ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపునకు సంబంధించి... సెక్షన్ 80సి కింద పన్ను ఆదాయంలో మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. లక్ష నుంచి కనీసం రూ. 2 లక్షల స్థాయికి పెంచాలని పరిశ్రమ చాంబర్ ఫిక్కీ పేర్కొంది. ఆర్థిక శాఖకు సమర్పించిన ప్రి-బడ్జెట్ మెమొరాండంలో ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పన్ను ఆదా పథకాలపై మరింత దృష్టిసారించడం, అదేవిధంగా పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ చర్యలు అవసరమని తెలిపింది.

ప్రస్తుతం జీవిత బీమా ప్రీమియంలు, పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు, ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్), ఇన్‌ఫ్రా బ్రాండ్‌లు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల వంటి వాటిలో రూ. లక్ష వరకూ వెచ్చిస్తున్న వ్యయానికి పన్ను ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఉద్యోగుల్లో వ్యయాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా గరిష్ట ఐటీ శ్లాబ్‌ను రెట్టింపు చేయాలని కూడా ఫిక్కీ కోరింది. ప్రస్తుతం రూ.10 లక్షల పైబడిన ఆదాయంపై 30%(విద్యా సెస్సుతో కలిపి 30.9%)గా ఉన్న పన్నును... వచ్చే ఆర్థిక సంవత్సరం(2013-14) నుంచి రూ.20 లక్షల పైబడిన ఆదాయంపై వర్తింపజేయాలనేది ఫిక్కీ విజ్ఞప్తి. రూ.2 లక్షల వరకూ ఆదాయంపై ప్రస్తుతం పన్ను లేదు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయంపై 10%... రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయంపై 20% పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి.

ఇతర విజ్ఞప్తులు ఇవీ...
* ఉద్యోగులకు పన్ను ఆదాయంలో కనీసం రూ.50 వేల మినహాయింపు లభించేలా స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలి.
* ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఊరట కల్పించాలి. గృహ రుణాలపై వార్షికంగా రూ. 1.5 లక్షల వరకూ చెల్లిస్తున్న వడ్డీని పన్ను ఆదాయం నుంచి మినహాయింపునిస్తుండగా... దీన్ని రూ.2.5 లక్షలకు పెంచాలి.
* విద్యకు సంబంధించిన వ్యయాన్ని సెక్షన్ 80సీ నుంచి వేరుచేయాలి. వైద్య బీమా కోసం ఇప్పుడున్న సెక్షన్ 80డీ తరహాలో ప్రత్యేకంగా మినహాయింపు పరిమితి లభించేలా విభజించాలి.
* వైద్య చికిత్సలకు చేసే వ్యయాలకు కల్పిస్తున్న మినహాయింపు పరిమితిని కూడా వచ్చే బడ్జెట్‌లో పెంచాలి. ప్రస్తుతం వార్షికంగా రూ.15,000గా ఉన్న ఈ మినహాయింపు పరిమితిని రూ.50,000కు చేర్చాలి.
 
Source : Sakshi Telugu Daily

Friday, December 7, 2012

కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు


రూ.20 వేల వరకూ పెంచుతున్నట్లు ప్రకటించిన మారుతీ సుజుకీ...


3 శాతం వరకూ జీఎం పెంపు..
ఇదే బాటలో మరిన్ని కంపెనీలు


న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరిలో కార్ల ధరలను రూ.20,000 వరకూ పెంచాలని మారుతీ సుజుకీ ఇప్పటికే నిర్ణయించింది. 1-2% ధరలను పెంచనున్నామని టయోటా పేర్కొం ది. జనరల్ మోటార్స్ 3% వరకూ ధరలను పెంచుతోంది. హోండా కార్స్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, డాలర్‌తో రూపాయి మారకం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతుండటంతో మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలంటున్నాయి.

మోడళ్లను బట్టి కార్ల ధరలను రూ.20,000 వరకూ పెంచుతున్నామని మారుతీ సుజుకి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పరీక్ చెప్పారు. మారుతీ సుజుకి కంపెనీ ఎం800 నుంచి కైజాషి మోడళ్లను రూ.2.09 లక్షల నుంచి రూ.17.52 లక్షల రేంజ్‌లో విక్రయిస్తోంది. ఇక వచ్చే నెల 1 నుంచే అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నామని టయోటా కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ఇటియోస్ లివా నుంచి ల్యాండ్ క్రూయిజర్ వరకూ మోడళ్లను రూ.4.44 లక్షల నుంచి రూ.99.27 లక్షల రేంజ్‌లో కార్లను విక్రయిస్తోంది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. జనవరి నుంచే తాము కూడా మోడళ్లను బట్టి ధరలను 1-3 శాతం వరకూ పెంచనున్నామని జనరల్ మోటార్స్ పేర్కొంది. రూ.3.32 లక్షల స్పార్క్ కారు నుంచి రూ.24.59 లక్షల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్యాప్టివా వరకూ వివిధ మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

ఇక ఫియట్ జీప్‌లు

ముంబై: జీప్‌మార్కెట్లో మళ్లీ ప్రవేశిస్తున్నామని ఫియట్ ఇండియా గురువారం తెలిపింది. వచ్చే ఏడాది చివరి కల్లా తమ జీప్ మోడళ్లు- గ్రాండ్ చెరోకీ, రాంగ్లర్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొంది. 2016 కల్లా తొమ్మిది కొత్త వాహనాలను భారత మార్కెట్లో అం దించే వ్యూహంలో భాగంగా ఈ జీప్‌లను తెస్తున్నామని వివరించింది. 25 నగరాల్లో ఉన్న 32 డీలర్ల ద్వారా ఈ జీప్‌లను విక్రయిస్తామని తెలిపింది. ప్రస్తుతం 120 దేశాల్లో ఈ జీప్‌లను అమ్ముతున్నామని వివరించింది. ఇక ఈ జీప్‌లతో పాటు వచ్చే ఏడాది తమ రేసింగ్ కార్డ్ బ్రాండ్ అబర్త్‌ను, 2014లో కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది.

మాలె జిఎంఆర్ చేజారుతుందా?

సింగపూర్ - మాలె , డిసెంబర్ 6 : మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో సింగపూర్ హైకోర్టు తీర్పు తమకే అనుకూలంగా ఉందన్న ధీమాతో ఉన్న జిఎంఆర్ గ్రూప్‌నకు హఠాత్తుగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జిఎంఆర్ చేతుల్లోంచి మాలె విమానాశ్రయాన్ని మాల్దీవుల ప్రభు త్వం వెనక్కి తీసుకోవచ్చని సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (సుప్రీం కోర్టు) తీర్పు చెప్పినట్టుగా మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించిన విమానాశ్రయాన్ని అవసరమైతే వెనక్కి తీసుకునే అధికారం మాల్దీవుల ప్రభుత్వానికి ఉంటుందని సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పు చెప్పినట్టు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఏక్షణమైనా మాలె విమానాశ్రయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మాల్దీవుల అధ్యక్షుని ప్రెస్ సెక్రటరీ మసూద్ ఇమాద్ తెలిపారు.

సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ గురువారం నాడు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జిఎంఆర్ పరిస్థితి అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన వ్యూహం ఏమిటన్న విషయం జిఎంఆర్ ఇంకా బయటపెట్టలేదు. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కనిపిస్తోంది. సింగపూర్ సుప్రీం కోర్టు తీర్పును తమ విదేశాంగ శాఖ, మాలెలోని భారత హైకమిషన్ అధ్యయనం చేస్తున్నాయని భారత్ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు.

ఎయిర్‌పోర్టు కాంట్రాక్టుకు సంబంధించిన చట్టపరమైన నియమనిబంధనలు, పరిహారానికి సంబంధించిన కాంట్రాక్టులోని ఒప్పందాలను మాల్దీవుల ప్రభుత్వం అక్షరాల అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కేసులో రెండు అంశాలున్నాయనీ ఒకటి మాల్దీవుల ప్రభుత్వ సార్వభౌమా«ధికారానికి సంబంధించినది కాగా మరొకటి ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించిన చట్టబద్ధత అని ఆయన చెప్పారు.

సింగపూర్ కోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలే తప్ప ఒప్పందం చట్టబద్దతకు సంబం«ధించిన అంశాల ప్రస్తావన లేదని ఆయన వివరించారు. కోర్టు ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనందున, ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, కాంట్రాక్టులో పేర్కొన్న ఒప్పందాలు అన్నింటినీ పొల్లుబోకుండా అమలు చేయాల్సి ఉంటుందని సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. మాల్దీవుల ధీమా....

అంతర్జాతీయ బిడ్డింగ్‌లో రెండేళ్ల క్రితం జిఎంఆర్ గ్రూప్ మొహమ్మద్ నషీద్ ప్రభుత్వ హయాంలో మాలె విమానాశ్రయ ప్రాజెక్టును గెలుచుకుంది. అయితే గత ఫిబ్రవరీలో అధికారంలోకి వచ్చిన మొహమ్మద్ వహీద్ ప్రభు త్వం ఈ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చింది. నవంబర్ 27న హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జిఎంఆర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. అయితే సింగపూర్ కోర్టు ఉత్తర్వులను లెక్కచేసేది లేదని, జిఎంఆర్‌ను మాలె ఎయిర్‌పోర్టు నుంచి ఖాళీ చేసి తీరుతామని మాల్దీవుల ప్రభుత్వం మొండికేయడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. భారత ప్రభుత్వం కల్పించుకుని నిరసన తెలిపినప్పటికీ మాల్దీవులు వెనక్కి తగ్గలేదు. గురువారం నాడు సింగపూర్ అత్యున్నత న్యాయస్థానంలో కోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో మాల్దీవుల ప్రభుత్వం తన పట్టుకు మరింత బిగిస్తోంది.

జిఎంఆర్‌ను బలవంతంగా బయటకు గెంటినా చట్టపరంగా ఇక తమపై తప్పు ఉండదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు కాంట్రాక్టు ప్రకారం, వివాదం ఏదైనా తలెత్తితే సింగపూర్ లేదా బ్రిటన్ చట్టాల ప్రకారం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సింగపూర్ హైకోర్టులో తీర్పు జిఎంఆర్‌కు అనుకూలంగా వచ్చింది. దానిపై మాల్దీవులు దాఖలు చేసుకున్న అప్పీల్‌లో తీర్పు ఇప్పుడు తమకు అనుకూలంగా వచ్చినట్టు మాల్దీవుల ప్రతినిధి ప్రకటించారు.

జిఎంఆర్‌కు పొగబెట్టిందెవరు ? మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు నుంచి జిఎంఆర్ గ్రూప్‌ను పక్కకు తప్పించేందుకు జరిగిన కుట్రలో మాల్దీవుల అధ్యక్షుడు వహీద్ ప్రత్యేక సలహాదారు హసన్ సయీద్ పాత్ర ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే దీనిని మాల్దీవుల ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టు నుంచి జిఎంఆర్‌కు ఉద్వాసన చెప్పాల్సిందిగా దేశ అధ్యక్షునికి హసన్ సయీద్ సలహా ఇచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Thursday, December 6, 2012

మాలె ప్రాజెక్టు పరిణామాలు

మాలె సంక్షొభంలో విదేశీ హస్తం

న్యూఢిల్లీ : మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి తమను బలవంతంగా బయటకు పంపడం వెనుక పరదేశ ప్రమేయం ఉన్నట్టు జిఎంఆర్ గ్రూప్ అనుమానిస్తోంది. మాల్దీవుల రాజకీయ పరిస్థితిని, అక్కడి రాజకీయ చట్రాన్ని దృష్టిలో ఉంచుకుంటే.. మాలె ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు వ్యవహారంలో విదేశీ హస్తం ఉందన్న అనుమానాలను తోసిపుచ్చలేమని సంస్థ సిఎఫ్ ఒ సిద్ధార్థ కపూర్ చెప్పారు. 50 కోట్ల డాలర్ల మాలె ఎయిర్‌పోర్ట్ ఆధునీకరణ ప్రాజెక్టు నుంచి జిఎంఆర్‌ను బయటకు పంపాలన్న మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయం వెనక చైనా హస్తం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. జిఎంఆర్ ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడేందుకు నిరాకరించినప్పటికీ అనుమానాలను మాత్రం తోసిపుచ్చలేదు.

మాలె ఎయిర్‌పోర్ట్ సంక్షోభం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో... వాస్తవాలను వెల్లడించడానికి జిఎంఆర్ సిఎఫ్ఒ సిద్ధార్ధ కపూర్ బుధవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయక్రీడాంగణంలో మాలె ఎయిర్‌పోర్టు ఫుట్‌బాల్‌గా మారిందని కపూర్ వ్యాఖ్యానిం చారు. టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు ఒక పక్క విదేశీ పెట్టుబడులను కోరుతూ.. మరో పక్క మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు రద్దు వంటి నిర్ణయాలను తీసుకోవడాన్ని కపూర్ తప్పుబట్టారు. మాల్దీవుల ప్రభుత్వ వైఖరికి బయట ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రారని ఆయన చెప్పారు. మాలె ప్రాజెక్టును వదులుకోవాల్సి వస్తే నష్టం ఏమేరకు ఉంటుందనే విషయంలో లెక్కలు వేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

బల ప్రయోగం వద్దు
మాలె ఎయిర్‌పోర్టు నుంచి జిఎంఆర్‌ను ఖాళీ చేయించేందుకు బలప్రయోగానికి దిగే ప్రయత్నం చేయవద్దని సిద్ధార్థకపూర్ మాలె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బలప్రయోగానికి దిగితే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని ఆయన అన్నారు. ఇది భారత దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. మాలె ఎయిర్‌పోర్టులో 140 మంది విదేశీయులు పనిచేస్తున్నారని చెప్పారు. మాలె ఎయిర్‌పోర్టును శుక్రవారం ఆర్ధరాత్రికల్లా ఖాళీ చేసి తమకు అప్పగించాలని మాలె ప్రభుత్వం జిఎంఆర్‌ను హెచ్చరించింది. అయితే జిఎంఆర్ మాత్రం ససేమిరా ప్రాజెక్టును వదిలేది లేదని అంటున్నది.

ఈ నేప«థ్యంలో బలప్రయోగంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందిగా మాల్దీవుల ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు కపూర్ చెప్పారు. ఈ సంక్షోభానికి అందరికీ అమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం అండగా నిలబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రభుత్వ అధినేతతో సంప్రదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సమస్య పరిష్కారానికి మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షంతో సహా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుత్నుట్టుగా వెల్లడించారు.

ఎవరికి లాభం...
కాంట్రాక్టును బలవంతంగా రద్దుచేస్తే మాల్దీవుల ప్రభుత్వం పరిహారం కింద జిఎంఆర్‌కు కనీసం 70 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. అంతకంటే ఎక్కువే ఉండవచ్చు కూడా. ఈ భారాన్ని మాల్దీవుల ప్రజలే మోయాలి. ప్రాజెక్టు కొనసాగితే వచ్చే పాతికేళ్ల కాలంలో మాల్దీవుల ప్రభుత్వానికి 250 కోట్ల డాలర్లు లభిస్తాయి. అవి కాకుండా ఇతరత్రా ఆదాయం మరో 100 కోట్ల డాలర్లు ఉంటుంది.

మాలె పరిణామాలపై ప్రపంచబ్యాంకు కన్ను
నిజానికి మాలె ఎయిర్‌పోర్టు బిడ్డింగ్ ప్రక్రియ అంతా ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి కనుసన్నల్లో జరిగింది. అందువల్ల ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలను ప్రపంచ బ్యాంకు నిశితంగా గమనిస్తోంది. ఈ విషయం జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుకు రాసిన లేఖలో ప్రపంచబ్యాంకు ప్రెసిడెంట్ జిమ్‌యాంగ్ కిమ్ స్వయంగా తెలిపారు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఐఎఫ్‌సి, కన్సిషన్ అగ్రిమెంట్ రూపకల్పన, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. మాల్దీవుల చట్టాలు, అంతర్జాతీయ ఉత్తమ సంప్రయాలాకు అనుగుణంగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించారు.

ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఐఎఫ్‌సిని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాల్దీవులు కోరింది. ఐఎఫ్‌సి ప్రతినిధి బృందం అవసరమైన మొత్తం సమాచారాన్ని మాల్దీవుల ప్రభుత్వానికి అందించినట్టు జిమ్‌యాంగ్ కిమ్ జిఎంఆర్‌కు రాసిన లేఖలో వెల్లడించారు. పైగా ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ ఇసాబెల్ గురెరో మాల్దీవుల అధ్యక్షున్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా కలుసుకున్నారు. ఐఎఫ్‌సి వైస్‌ప్రెసిడెంట్ కరిన్ ఫిన్‌కెల్‌స్టన్ కూడా మాల్దీవుల ఆర్థికమంత్రితో త్వరలో సమావేశం కానున్నారని వెల్లడించారు. ప్రపంచబ్యాంకు కూడా ప్రాజెక్టు విషయంలో సీరియస్‌గా ఉన్నందున మాల్దీవుల ప్రభుత్వం ఆఖరు క్షణంలోనైనా దారికి రావచ్చని అంటున్నారు. . 


మాలె ప్రాజెక్టు పరిణామాలు..

2010లో జరిగిన అంతర్జాతీయ బిడ్డింగ్‌లో 50 కోట్ల డాలర్లకు ఈ ప్రాజెక్టును జిఎంఆర్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి సార«ధ్యంలో బిడ్డింగ్‌ను నిర్వహించారు.ఆ ప్రాజెక్టు కన్సీషన్ కాలవ్యవధి 25 ఏళ్లు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల్లో మహమమ్మద్ నషీద్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మాల్దీవుల చరిత్రలో స్వేచ్ఛ గా జరిగిన ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రభుత్వంగా నషీద్ ప్రభుత్వాన్ని చెబుతారు.

ఈ ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల్లో నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును టార్గెట్‌గా పెట్టుకుంది. గతవారం హఠాత్తుగా జిఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేస్తూ.. వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం తన పట్టు వీడటం లేదు. భారత ప్రభుత్వం నిరసన తెలిపినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం దిగిరాలేదు. మాలె ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులో అక్రమాలు,అవినీతి చోటుచేసుకున్నట్టుగా కొత్త ప్రభుత్వం వాదిస్తోంది.

2010
జూలై : 10 నెలలు సాగిన సుదీర్ఘ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత 50 కోట్ల డాలర్ల మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ, నిర్వహణ ప్రాజెక్టును జిఎంఆర్ గెలుచుకుంది.
అక్టోబర్ : ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా జిఎంఆర్ వెల్లడించింది. 50 కోట్ల డాలర్ల ప్రాజెక్టులో 70 శాతం రుణాలు కాగా 30 శాతం ఈక్విటీ.
నవంబర్ : మాల్దీవుల ఎయిర్‌పోర్టు కంపెనీ అధికారికంగా మాలె ఎయిర్‌పోర్టు అభివృద్ధి, అధునీకరణకు లైసెన్స్‌ను జిఎంఆర్‌కు అందజేసింది.

2011
జనవరి : 2014-15కల్లా ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన.
మార్చి : పనులు వేగం అందుకున్నట్టుగా వెల్లడి

జూన్ : నాన్ ఎయిరో స్పేస్‌ను వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రాజకీయ నాయకులు ఆందోళన ప్రారంభించడంతో జిఎంఆర్ కార్యకలాపాలకు విఘాతం కలిగింది.
సెప్టెంబర్ : ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని డెవలప్‌మెంట్‌ను జిఎంఆర్ ప్రారంభించింది.
డిసెంబర్ : జనవరి నుంచి మాలె ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నుంచి ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ చార్జీల కింద 25 డాలర్లు, బీమా చార్జీ కింద 2 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన. ఈ నిర్ణయంపై కోర్టుల్లోనూ జిఎంఆర్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది.

2012
జనవరి: ఎయిర్‌పోర్టు చార్జీల వసూలుకు ప్రభుత్వం అడ్డుపడటంపై జిఎంఆర్ అసంతృప్తి.
మార్చి : నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. మహమద్ వహీద్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే, మాలె ప్రాజెక్టును జిఎంఆర్ అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుకుందని, అందువల్ల ప్రాజెక్టు చెల్లదని ప్రకటించింది. జిఎంఆర్ కష్టాలు అప్పటి నుంచే మొదలయ్యాయి.
జూన్ : ప్రపంచబ్యాంక్ అనుబంధ సంస్థ ఐఎఫ్‌సి సారధ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగిన బిడ్డింగ్‌లో మాలె ప్రాజెక్టును తాము గెలుచుకున్నామని జిఎంఆర్ మాల్దీవుల కొత్త ప్రభుత్వానికి విన్నవించుకుంది. జూలై : మాల్దీవుల ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును జిఎంఆర్ వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ : మాలె ఎయిర్ పోర్టు ప్రాజెక్టు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 304.3 కోట్ల రూపాయల రాబడిపై 44 కోట్ల రూపాయల లాభం సాధించినట్టు జిఎంఆర్ ప్రకటన. ఢిల్లీ ఎయిర్‌పోర్టుతో పోలిస్తే మాలె ప్రాజెక్టులో భారీ లాభాలున్న విషయం కూడా జిఎంఆర్ వెల్లడించింది.
అక్టోబర్ : ముంబైలో జరిగిన ఒక సమావేశంలో మాల్దీవుల ప్రభుత్వం మాలె ప్రాజెక్టు విషయంలో నాన్చకుండా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
నవంబర్ : కాంట్రాక్టు రద్దు చేస్తూ అధికార ప్రకటన.
డిసెంబర్ : మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయంపై సింగపూర్ కోర్టులో జిఎంఆర్ పిటిషన్. అనుకూలంగా తీర్పు. తీర్పును లెక్కించమని మాల్దీవుల ప్రకటన.

Thursday, November 29, 2012

అమలు లోకి రానున్న " ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్ "

కష్టపడి.. చెమటోడ్చి.. రూపాయి రూపాయి కూడబెట్టి మీరు భూమి కొనుక్కున్నారు. లక్షలు పోసి కొనుక్కున్న భూమికి వేలు ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ ఆనందం కొన్ని రోజులు కూడా మిగలకుండానే.. ఎవరో వస్తారు. ఆ భూమి తమదంటారు. అప్పటికే తాము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెబుతారు. అదే ఆస్తిపై డాక్యుమెంట్లు కూడా తెచ్చే అవకాశం ఉంది. భూ వివాదం కోర్టుకెక్కుతుంది. ఏళ్లతరబడి నానుతుంది. మరి దీనికి పరిష్కారం..?
ఆక్రమణలతోపాటు ఒకే భూమికి రెండు మూడుసార్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రబుద్ధులతో కొనుగోలుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మీ పేరిట రిజిస్టర్ అయిన భూమి, ఆస్తులకు ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఓ ఒప్పందంగానే పేర్కొంటోంది తప్ప దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఎవరు హక్కుదారో!? ఎవరు అసలు వ్యక్తో ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. ముక్కుపిండి స్టాంపు డ్యూటీని వసూలు చేసుకుంటున్నా.. ‘ఈ భూమి మీదే’ అని ఇప్పటి వరకు ప్రభుత్వం సర్టిఫై చేయడం లేదు. ఫలితంగా.. రోజు రోజుకూ భూ వివాదాలూ పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే, ఆస్తులకు గ్యారెంటీ కల్పించే హక్కు కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. పట్టణాల్లో ఈ హక్కు కల్పించడం అత్యవసరమని కూడా కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమైంది. అదే.. ‘ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్’! ఈ పథకం కింద మీ ఆస్తులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీంతో, భవిష్యత్తులో భూ తగాదాలు, ఆక్రమణలు తగ్గుముఖం పట్టనున్నాయి.
‘ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్’ను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తేనుంది. ఇందులో భాగంగా, సదరు ఆస్తి ఎవరిదనే విషయాన్ని గుర్తించి, రిజిస్ట్రేషన్ సమయంలోనే ప్రభుత్వం సొంతదారుకు ప్రాపర్టీ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను ఇస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్‌యూఆర్ఎం) సంస్కరణల్లో భాగంగా ఉన్న ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించే అవకాశం ఉంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖాస్రా/ఖాటాని, గిర్‌ద్వారీ విధానం పట్టణాల్లో లేకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం ‘గ్యారంటీ ల్యాండ్ టైటిల్’ స్కీంను ప్రవేశపెట్టింది. ఇలాంటి పథకమే కొన్ని ఇతర దేశాల్లో కూడా అమల్లో ఉంది. వాస్తవానికి, దేశ రాజధాని ఢిల్లీలో ప్రాపర్టీ టైటిలింగ్ సిస్టమ్ సరిగా లేనందున ప్రాపర్టీ మార్కెట్ లో అంతరం ఏర్పడిందని 2002లోనే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది. దీనిపై ఒక కమిటీని నియమించి విదేశాలతోపాటు దేశంలో పలు చోట్ల అమల్లో ఉన్న టైటిలింగ్ విధానాలను అధ్యయనం చేసింది. అనేక సదస్సులు కూడా నిర్వహించింది.
ఈ నేపథ్యంలో, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు తయారు చేస్తున్న ప్రత్యేక బిల్లు కోసం డ్రాఫ్ట్ కమిటీని కూడా గతంలోనే నియమించింది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, తప్పుడు సాక్ష్యాలు సమర్పించిన వారికి శిక్షలు కూడా భారీగానే ఉండనున్నాయి. రూ.2 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

ఇవీ ప్రయోజనాలు:

ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎవరి ఆస్తి ఎవరిదో ప్రభుత్వమే పక్కాగా చెబుతుంది. ప్రభుత్వమే ఇచ్చే టైటిల్ సర్టిఫికేషన్‌తో ఇదే ఆస్తిపై ఇతరులు వివాదాలకు దిగడం, కోర్టులకు వెళ్లడాన్ని అరికట్టవచ్చు. భూ వివాదాలు, ఆక్రమణలు తగ్గిపోతాయి. నకిలీ డాక్యుమెంట్‌లకు చెక్ పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు సులువవుతుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత పక్కాగా అమలు చేయవచ్చు. క్రయ, విక్రయ లావాదేవీలు వేగంగా, సులభతరం కావడంతో పాటు భద్రత కూడా ఉంటుంది. ఆస్తి సొంతదారు ఎవరో స్పష్టంగా ఉంటున్నందున పన్నుల వసూలు పెరుగుతుంది   
Courtesy- Andhrajyothy.

Tuesday, November 20, 2012

మాంద్యం(Recession) అంటే ఏమిటి..?

జిడిపి (GDP) పెరుగుదల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వరుస త్రైమాసికంలో నెగిటివ్‌లో ఉన్నప్పుడు మాంద్యం (Recession) అనే పదాన్ని ఉపయోగిస్తారు. స్థూల దేశీయ ఉత్పత్తి సంక్షిప్త పదం జిడిపి. దీని సహాయంతో ఉత్పత్తిని లెక్కిస్తారు. ఇండియా స్థూల దేశీయ ఉత్పత్తి 9% నుండి 6% శాతానికి తగ్గితే.. అదే అమెరికా లాంటి దేశాలలో స్థూల దేశీయ ఉత్పత్తి 1% నుండి -0.6% శాతానికి వరుసగా రెండు త్రైమాసికాలలో తగ్గగా, అప్పుడు ఈ రెండు దేశాలు మాంద్యం (Recession)లో ఉన్నట్లు పరిగణిస్తారు.

ఒక దేశం ఉత్పత్తిని స్థూల దేశీయ ఉత్పత్తి(GDP) ఉద్యోగం, పెట్టుబడి ఖర్చు, సామర్థ్య వాడకం, ఇంటి ఆదాయం, వ్యాపార లాభాలు, ద్రవ్యోల్బణం మొదలగున వాటితో లెక్కిస్తారు. మాంద్యం సమయంలో ఇలాంటివి అన్నీ దివాళా తీయడం వల్ల నిరుద్యోగ రేటు పెరుగుతుంది.

తెలుగు వన్ఇండియా

ఫైనాన్స్ బిల్లు అంటే ఏమిటి..?

ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్దిక మంత్రి ఫైనాన్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఉంటారు. ఇంతకీ ఈ ఈ ఫైనాన్స్ బిల్లు అంటే ఏమిటీ.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు పాఠకుల కోసం ప్రత్యేకం.

భారతదేశ ప్రభుత్వం తదుపరి ఆర్థిక సంవత్సరం కోసం ఈ సంవత్సరం తయారు చేసిన ఆర్థిక ప్రతిపాదనలకు అనుమతించే బిల్లు "ఫైనాన్స్ బిల్లు". ఈ బిల్లును రూపొందించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ప్రతి సంవత్సరానికి గాను ఆ కాలానికి సంబంధించి అనుబంధ ఆర్ధిక ప్రతిపాదనలను ప్రభావం చూపుతుంది కాబట్టి.

ప్రతి సంవత్సరం ఆర్దిక మంత్రి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ పైనాన్స్ బిల్లును ప్రవేశపెడతారు. ఈ ఫైనాన్స్ బిల్లును ఎవ్వరూ వ్యతిరేకించ లేరు. వ్యయం బిల్లు, ఫైనాన్స్ బిల్లులు సభ్యులకు కాపీలు ముందుగా సర్క్యులేషన్ లేకుండా సభకు పరిచయం చేయవచ్చు. ఫైనాన్స్ బిల్లులో పన్ను ప్రతిపాదనలతో పాటు, గ్రాంట్స్ కోసం డిమాండ్లు ఓటు చెయ్యబడ్డ తర్వాత మాత్రమే లోక్ సభలో బిల్లు వస్తుంది.

ఫైనాన్స్ బిల్లుపై చర్చ విస్తారంగా ఉండడంతో భారతదేశ ప్రభుత్వం సభ్యులు ఏ చర్య ద్వారానైనా చర్చించవచ్చు. ఈ చర్చ ద్వారా మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం రివ్యూకి వస్తుంది. ఫైనాన్స్ బిల్లులపై ఏవిధమైన చర్చ జరుగుతుందో సరిగ్గా అలాంటి చర్చే మనీ బిల్లులపై జరుగుతుంది.

తెలుగు వన్ఇండియా

డిమ్యాట్ ఎకౌంట్ అంటే ఏమిటి.. అది ఎలా పని చేస్తుంది.?

బ్యాంకు ఖాతా మాదిరే డిమ్యాట్ ఎకౌంట్ పని చేస్తుంది. మీ బ్యాంకు నిల్వ బ్యాంకు లావాదేవీలు పుస్తకంలోనే లెక్కింపబడతాయి.. కాకపోతే భౌతికంగా నగదుని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఫామ్ రూపంలో సెక్యూరిటీస్ పద్దతిలో డెబిట్, క్రెడిట్‌లు జరుగుతాయి.

మీరు ఎందుకు డిమ్యాట్ ఎకౌంట్‌ను కలిగి ఉండాలి..?

సెబి మార్గదర్శకాల ప్రకారం - డిమెటరియలైజ్డ్ రూపంలో తప్ప ఏ రూపంలో విక్రయించకూడదు. అందువల్ల మీరు స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వాటాల క్రయవిక్రయాలు జరపాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఒక డిమ్యాట్ ఎకౌంట్‌ను కలిగి ఉండాలి.

డిమ్యాట్ ఎకౌంట్ ఎలా పని చేస్తుంది:

మీరు వాటాలను కొనుగోలు చేసినప్పుడు, బ్రోకర్ మీ వాటాల హోల్డింగ్స్‌ ఈ డిమ్యాట్ ఎకౌంట్ క్రెడిట్లు ప్రకటనలో ప్రతిఫలిస్తాయి. మీరు ఇంటర్నెట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆన్ లైన్‌లో మీ హోల్టింగ్స్‌ను చూడొచ్చు. సాధారణంగా బ్రోకర్ షేర్స్‌ను T +2 అని, ఆ తర్వాత వాణిజ్య రోజు + 2 రోజులుగా విశ్వసిస్తాడు.

మీరు ఎప్పుడైనా వాటాలను అమ్మదలిస్తే, వివిధ స్టాక్ వివరాలు నింపి డెలివరీ సూచనల నోటుని మీ బ్రోకర్‌కు ఇవ్వాలి. మీ ఖాతా వాటాలను డెబిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు అమ్మిన వాటాలకు డబ్బు చెల్లిస్తారు. అదే మీరు ఆన్ లైన్‌లో ఇంటర్నెట్ ద్వారా ట్రేడింగ్ నిర్వహిస్తుంటే వాటంతటవే షేర్స్ డెబిట్ అయి, మీ ఖాతాల్లో డబ్బు క్రెడిట్ అవుతుంది.

భారతదేశంలో మొత్తం రెండు డిపాజిటరీస్ ఉన్నాయి. అవి ఒకటి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (NSDL), రెండవది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL).

డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం వల్ల ఉపయోగాలు:


భౌతిక రూపాలలో వాటాలను ఉంచాల్సిన అవసరం లేదు
వాటాలలో ఒక వాటా క్రయవిక్రయాలు జరపవచ్చు
బదిలీ సంఖ్య పై స్టాంపు డ్యూటీ లేదు
బదిలీ దస్తావేజు అవసరం లేదు

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్  వెబ్ సైట్స్‌ని సందర్శించండి

తెలుగు వన్ఇండియా

RTGS, NEFTల మధ్యనున్న వ్యత్యాసం ఏమిటి..?

RTGS' అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. పేరు సూచించినట్లుగా ఎటువంటి నెట్టింగు లేకుండా నిరంతరం (real-time) పోస్ట్ చేయబడుతుంది. ఇక 'గ్రాస్ సెటిల్మెంట్' విషయానికి వస్తే నగదు బదిలీ సూచనలను వ్యక్తిగతంగా (సూచనల ఆధారంగా ద్వారా ఒక సూచన మీద) ఏర్పడుతుందని అర్థం.

'NEFT' అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ప్రధానంగా భారతదేశంలో బ్యాంకుల ఆధారంగా ఆర్థిక సంస్థ ద్వారా ఆన్‌లైన్ నిధుల బదిలీ జరుగుతుంది. NEFT వ్యవస్థ ద్వారా బ్యాంక్ శాఖలో ఖాతాల నిర్వహణ వ్యక్తులు, సంస్థలు లేదా కార్పోరేట్స్ నిధులను అందుకోవచ్చు.

NEFT, RTGS మధ్య తేడా:


1. ఈ రెండింటి మధ్య ప్రాథమిక తేడాలు సెటిల్మెంట్ సమయానికి సంబంధించింది. RTGS లావాదేవీ సూచనల ఆధారంగా, ఒక సూచన ఆధారంగా స్థూల పరిష్కారం పై ఆధారపడి ఉంటుంది. NEFT ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ, నికర సెటిల్మెంట్ (DNS) ఆధారంగా వంతులవారీగా లావాదేవీలు నిలిపివేసే పద్ధతిలో పనిచేస్తుంది.

2. రిజర్వు బ్యాంకును బట్టి RTGS కోసం కనీస మొత్తం రూ 2 లక్షల పైన ఉండాలి, అదే NEFT కనీస లేదా గరిష్ట గాని పరిమితి సంఖ్య అంటూ ఏమీ లేదు. NEFT ఉపయోగించి నిధుల మొత్తం మీద బదిలీలను చేయవచ్చు.

3. NEFT గంటల వంతున జరిగితే.. RTGS మాత్రం నిరంతర ప్రాతిపదికన జరుగుతుంది. వారం రోజులలో(సోమవారం నుండి శుక్రవారం)వరకు ఉదయం 9 నుండి రాత్రి 7 గంటలకు 11 సెటిల్మెంట్లు జరిగితే.. శనివారంలో ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు 5 సెటిల్మెంట్లుగా లావాదేవీలు జరుగుతాయి.

లావాదేవీల కోసం వర్తించే ఛార్జీలు:

NEFT
For transactions up to Rs 1 lakh – not exceeding Rs 5 (+ Service Tax)
For transactions above Rs 1 lakh and up to Rs 2 lakhs – not exceeding Rs 15 (+ Service Tax)
For transactions above Rs 2 lakhs – not exceeding Rs 25 (+ Service Tax)

RTGS
For transactions between Rs 2 lakh to Rs 5 lakh - not exceeding Rs. 30 per transaction.
For transactions above Rs 5 lakh - not exceeding Rs. 55 per transaction.

తెలుగు వన్ఇండియా

టాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే ఏమిటీ...? వాటి వల్ల ఉపయోగం ఉందా..?

టాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే 'పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన తర్వాత టాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా తిరిగి వచ్చిన వడ్డీ పన్ను పరిధిలోకి రాదన్నమాట'.

ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బు‍‌కు మీరు గవర్నమెంట్‌కు కట్టేటటువంటి మొత్తం ఇన్ కమ్ టాక్స్ పరిధిలోకి రాదు. ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్‌ సెక్యూర్‌గా ఉండేలా పాక్షిక ప్రభుత్వ ఆధారిత సంస్థలు జారీ చేస్తాయి. లేకపోతే భారత ప్రభుత్వం గ్రీసీ మార్గంలో వెళ్లడం వల్ల సార్వభౌమ రుణం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ఎన్ఎస్ఈ, బిఎస్‌ఈ లలో ట్రేడ్ అవుతూ లిక్విడిటీని ఆఫర్ చేస్తాయి.

అయినప్పటికీ.. ఈక్విడిటీల మాదికి ఎక్కువ మొత్తంలో ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ట్రేడ అవ్వవు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, పాలన పన్ను ఫ్రీ బాండ్స్ సానుకూలంగా ఉంటాయి. 2012-2013వ సంవత్సరానికి గాను ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గతంలో మొత్తాన్ని సంస్థలు 2011-2012తో పోల్చితే రూ 60,000 కోట్ల కు పెంచుతుందని రెట్టింపుగా ప్రకటించాడు. ఇందులో NHAI కోసం రూ 10,000 కోట్లు, IRFC కోసం 10,000 కోట్లు, IIFCL కోసం 10,000 కోట్లు, HUDCO కోసం 5,000 కోట్లు, జాతీయ హౌసింగ్ బ్యాంక్ కోసం 5,000 కోట్లు SIDBI కోసం 5,000 కోట్లు, పోర్ట్స్ కోసం 5,000 కోట్లు, పవర్ సెక్టార్ కోసం రూ 10,000 కోట్లు కేటాయించారు.

సెకండరీ మార్కెట్ ద్వారా ఎవరైతే లాంగ్ టర్మ్ పెట్టుబడులను పెట్టాలని చూస్తారో వారికి ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ బూమింగ్‌నిస్తాయి. పెట్టుబడి దారులు ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ లలో పెట్టుబడి పెట్టడం ద్వారా గతయేడాది కంపెనీలన బట్టి 8.20-8.35% వరకు టాక్స్ ఫ్రీ కూపన్ రేటుని సొంతం చేసుకున్నారు. ఉదాహారణకు ఫిబ్రవరి 2012లో HUDCO టాక్స్ ఫ్రీ బాండ్‌ని పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల వ్యవధిలో ఈ కంపెనీ 8.35% కూపన్ రేట్‌ని సొంతం చేసుకుంటుంది.

తెలుగు వన్ఇండియా

సర్క్యూట్ ఫిల్టర్లు అంటే ఏమిటి, అవి ఎలా పని చేస్తాయి..?

సర్క్యూట్ ఫిల్టర్లు ఎంపిక చేసిన సెక్యూరిటీస్, స్టాక్ ధరల చలనానికి పరిమితం చేయడానికి భారతదేశం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ (సెబి) ద్వారా విధించబడిన ధర బాండ్లు. వీటి సహాయంతో ఆపరేటర్లు తారుమారు చేసిన వాటా ధరలను అరికట్టవచ్చు. ఈ సర్కూట్ ఫిల్టర్లను స్టాక్ ఎక్స్చేంజ్ లు పరిచయం చేశాయి. సెబీ నిబంధనల ఆధారంగా స్టాక్ ప్రైజెస్‌లో స్టీల్ పెరిగిందా లేదా తగ్గిందా తెలుసకోవచ్చు.

సర్క్యూట్ ఫిల్టర్లు ఎలా పని చేస్తాయి..?


స్టాక్ ధర తప్పినప్పుడు ఆ ఖచ్చితమైన స్టాక్ వర్తకం, స్టాక్ ఎక్సేంజ్ ద్వారా నిర్ణయించుకుంటుంది. దీంతో బ్యాండ్ ధర నిర్దేశించినప్పుడు సస్పెండ్ చెయ్యబడుతుంది. ఉదాహరణకు మీరు గనుక రూ 100 రూపాయలను షేర్ చేయాలనుకుంటే, ఆ సందర్బంలో 5% సర్క్యూట్ బ్రేకర్ ఉంటే, షేరింగ్ ధర రూ 105 కంటే ఎక్కువ ఉంటే ట్రేడింగ్‌ను నిలిపి వేస్తారు. అదే విధంగా స్టాక్ రూ 95 కంటే తక్కువైతే, దిగువ ముగింపు సర్క్యూట్ ఫిల్టర్ వర్తించబడుతుంది. దీంతో వ్యాపారం సస్పెండ్ చెయ్యబడింది.

సర్క్యూట్లు స్టాక్ ఎక్సేంజ్ ఎంత వరకు పరిమితం

సూచికలు కోసం మొత్తం మూడు సర్క్యూట్ ఫిల్టర్స్ ఉన్నాయి 10%, 15%, 20%. ఏదైతే ముందుగా సెన్సెక్స్ లేదా నిఫ్టీని ముందుగా మొదటి పరిమితిని విభజిస్తుందో అప్పుడు ఈ ఫిల్టర్లును అనువర్తిస్తారు. ట్రిగ్గర్ కూడా అది జరిగే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

10% drift on either side
If the drift is before 1 pm – 1 hour halt
If the drift is after 1 but before 2:30 pm – half an hour halt
If the drift is after 2.30 pm – no halt

15% drift on either side
If the drift is before 1 pm – 2 hours halt
If the drift is after 1 pm but before 2 pm- 1 hour halt
If the drift is after 2 pm – no further halt

20% drift in either direction
In case of a 20% movement in either index, the trading will halt for the remainder of the day.

సర్క్యూట్ ఫిల్టర్లు ద్రవ్యత్వం లేని సర్టిఫికెట్ విషయంలో తగ్గించబడతాయి. స్టాక్ ఎక్సేంజ్ నిర్ణయం ద్వారా సర్క్యూట్ ఫిల్టర్స్ ఆధారంగా10% లేదా 5% లేదా 2% తగ్గిస్తారు.

తెలుగు వన్ఇండియా

సెన్సెక్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?

ఆర్థిక వర్గాలలో 'సెన్సెక్స్' అత్యంత ప్రజాదరణ పొందిన పదం, చెప్పాలంటే అంతకు మించింది. సెన్సెక్స్ అంటే సున్నితమైన సూచిక అని అర్థం, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ కోసం ఉపయోగించే పదం. సెన్సెక్స్ భారతదేశంలో 30 స్టాక్స్‌ను ట్రాక్ చేస్తుంది, భారతదేశం లోని అతి పురాతన సూచిక.

ఎక్కువ మూలధనీకరణ స్టాక్స్, భారతదేశంలో వివిధ పారామీటర్లు, ప్రాతినిధ్యం ఆధారంగా 30 స్టాక్స్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుత ఉన్న రోజుల్లో సెన్సెక్స్‌ను మార్కెట్ల భారమితిగా భావిస్తున్నారు. దీనితో పాటు మార్కెట్ ధోరణి వర్ణించేందుకు ఉపయోగిస్తారు. 
 
సెన్సెక్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?

సెన్సెక్స్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న అతి పెద్ద 30 స్టాక్స్‌ తెలిసిన ఒక పద్ధతి ద్వారా "ఉచిత ఫ్లోట్ మార్కెట్ మూలధనీకరణ" పద్ధతిని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న పద్దతిన లెక్కిస్కారు. ఒక కంపెనీలో కొన్ని షేర్లు తప్ప వాటాలు అందుబాటులో లేనప్పుడు స్థాపకులు లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటాలను అందుబాటులోకి తీసుకరాకపోవచ్చు.


(తెలుగు వన్ఇండియా)

పాన్ కార్డ్ అంటే ఏమిటీ, దీనిని ఎందుకు ఉపయోగిస్తాం...?

మనం సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితిలో ఉంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ అనేది అవసరం. కారణం మీ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మీ పాన్ కార్డ్ నెంబర్‌ను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నెంబర్. మన పాన్ కార్డ్ అనేది పది డిజిట్లలో ఉంటుంది. ఆల్పా న్యూమరిక్ నెంబర్లను కలిగి ఉన్న ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందజేస్తుంది. దీనినే పాన్ కార్డ్ అంటారు.

ఇది మనం సాధారణంగా ఉపయోగించే బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మాదిరి ఉంటుంది. ఈ కార్డుపై మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. వ్యక్తిగత వివరాలు అంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన రోజు, పాన్ నెంబర్‌తో పాటు మీ సంతకం మరియు మీ ఫోటో ఉంటుంది. పాన్ కార్డ్ పై గల పది ఆల్ఫా న్యూమరిక్ రూపంలో ఉండే అక్షరాలలో మొదటి ఐదు అక్షరాలు ఆంగ్ల అక్షరాలు, తర్వాత నాలుగు అక్షరాలు సంఖ్యలు మరియు చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది. ఈ పది అక్షరాలను ఐదు భాగాలుగా విభజించడమైనది.

* మొదటి మూడు అక్షరాలుగా AAA to ZZZ ఉంటాయి.
* నాలుగవ అక్షరం పాన్ కార్డ్ హోల్దర్ యొక్క స్థితిని తెలియచేస్తుంది.

• C - Company
• P - Person
• H - HUF(Hindu Undivided Family)
• F - Firm
• A - Association of Persons (AOP)
• T - AOP (Trust)
• B - Body of Individuals (BOI)
• L - Local Authority
• J - Artificial Juridical Person
• G - Government

* ఐదవ అక్షరం పాన్ కార్డ్ హోల్దర్ ఇంటి పేరు లోని మొదటి అక్షరంను తెలియచేస్తుంది.
* తర్వాత నాలుగు అక్షరాలు అంకెలలో 0001 నుండి 9999 వరకు ఉంటాయి.
* చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది.

ఏయే సమయాల్లో పాన్ కార్డ్ అవసరం:

* డిమ్యాట్ అకౌంట్ ప్రారంభించడానికి
* యాభై వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపే సమయంలో
* ఐటి డిపార్ట్ మెంట్ తో ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుటకు
* మ్యుచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో
* యాభై వేల కంటే పైన డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొనుటకు ఉపయోగపడుతుంది.

(తెలుగు వన్ఇండియా)

రెపో, రివర్స్ రెపో, CRR, SLR అంటే ఏంటి....?

రెపో రేటు అంటే ఏంటి....?
ప్రైవేట్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర రుణం తీసుకుంటాయి.. దీనికి ప్రైవేట్ బ్యాంక్ లు చెల్లించే వడ్డీని రెపో రేట్ అంటారు... రెపో రేటు పెంచడమంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న రుణాల వడ్డీ రేటు పెంచడమన్న మాట.. దీంతో వడ్డీ భారం పెరగడంతో ప్రైవేట్ బ్యాంక్ లు... రిజర్వ్ బ్యాంక్ వద్ద రుణం తీసుకోక పోగా బకాయిలను తీర్చే ప్రయత్నం చేస్తాయి.. దీనికోసం తమ ఖాతాదారుల నుంచి వసూళ్లు మొదలు పెడతాయి.. ఫలితంగా సమాజంలో ఉన్న ద్రవ్యం రిజర్వ్ బ్యాంక్ ఖజానాకు చేరుతుంది..

రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?

ప్రైవేటు బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు వద్ద కొంత ధనాన్ని డిపాజిట్ చేస్తాయి. ఈ ధనానికి ఆర్.బి.ఐ కొంత వడ్డీ చెల్లిస్తుంది. దీన్నే రివర్స్ రెపో అంటారు. ఈ రేటు కూడా కూడా పెంచడంతో.. ప్రైవేట్ బ్యాంకులు తమ వద్దనున్న నిల్వలను ఆర్.బి.ఐ లో డిపాజిట్ చేసి అధిక వడ్డీ పొందే ప్రయత్నం చేస్తాయి. దీనికోసం కూడా ఖాతా దారుల వద్ద నుంచి డబ్బు వసూలు చేసే అవకాశం ఉంది.. ఈ

CRR, SLR అర్దం ఏమిటీ..?


సాధారణంగా ఎవరైతే మనీకి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారో వారు క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచుటరీ లిక్విడిటీ రేషియోల గురించి వినే ఉంటారు. ఈ రెండు పదాలను అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని ప్రతిపాదించేటప్పుడు వాడుతూ ఉంటుంది. ఇప్పడు ఈ రెండింటి గురించి తెలుసుకుందాం.

క్యాష్ రిజర్వ్ రేషియో (CRR): బ్యాంకులు కొంత రేషియో సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచుతాయన్నమాట. ఇలా ఉంచడం ద్వారా బ్యాంకు పరపతి సురక్షితమవ్వడమే కాకుండా, బ్యాంకుల నుంచి అధిక డబ్బు బయటకు హరించబడకుండా మౌలికంగా కాపాడబడుతుంది. ఉదాహారణకు మీరు బ్యాంకులో రూ 100ను డిపాజిట్ చేశారని అనుకుందాం. మీరు దాచిన రూ 100 మొత్తాన్ని బ్యాంకు రుణ మంజూరులకు లేదా పెట్టుబడిలకు ఉపయోగించదు. ఇందులో కొంత మొత్తాన్ని క్యాష్ రూపంలో ఉంచి, మిగిలిన భాగాన్ని పెట్టుబడికి లేదా రుణ మంజూరికి ఉపయోగిస్తుంది. బ్యాంక్ ఉంచిన ఆ తక్కువ రేషియోని క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలుస్తారు.

బ్యాంకు తన డిపాజిట్‌ను రూ 100 పెంచి, క్యాష్ రిజర్వ్ రేషియోని 9 శాతంగా ఉంచినట్లేతే, రూ 9 రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచి, మిగిలిన రూ 91లను పెట్టుబడి లేదా రుణ మంజూరులకు ఉపయోగిస్తుంది. ఎక్కువ క్యాష్ రిజర్వ్ రేషియో గనుక ఉన్నట్లేతే బ్యాంకులు తక్కువ డబ్బుని పెట్టుబడి లేదా రుణ మంజూరుకి ఉపయోగిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణం అరికట్టేందుకు మరియు మార్కెట్లో అధిక లిక్విడిటీ నియంత్రించడానికి ఈ సాధనాన్ని ఉపయోగిస్తుంది.

స్టాచుటరీ లిక్విడిటీ రేషియో (SLR): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపేనా డబ్బుని ఉంచడం ఒక విధానమైతే, ప్రతి వ్యాపార రోజు చివరిలో బ్యాంకులు నికర డిమాండ్ ఆధారంగా బంగారం, నగదు, ప్రభుత్వ పత్రాలు రూపంలో, ఆమోదం పొందిన ఇతర సెక్యూరిటీలను తమ వద్ద కొనసాగించడం ఎంతైనా అవసరం. ఈ తక్కువ పర్సంటేజిని స్టాచుటరీ లిక్విడిటీ రేషియో అంటారు.

ఉదాహారణకు మీరు బ్యాంకులో రూ 100ను డిపాజిట్ చేశారని అనుకుందాం. క్యాష్ రిజర్వ్ నిష్పత్తి 9 శాతం కాగా, స్టాచుటరీ లిక్విడిటీ నిష్పత్తి 11 శాతం ఐతే బ్యాంకులు పెట్టుబడి నిమిత్తం 100-9-11= రూ 80/- మాత్రమే ఉపయోగిస్తుంది.

(తెలుగు వన్ఇండియా)

'కమోడిటీస్ ఇన్వెస్ట్‌మెంట్' లో ప్రాథమిక అంశాలు:

"కమోడిటీస్ పెట్టుబడి" ఈ పదం చాలా ప్రాచుర్యం పొందినప్పటికీ.. దీని గురించి తెలియదు. మన దైనందిన జీవితంలో చాలా మంది నోట ఈ మాట వింటూ ఉంటాం. అయినప్పటికీ, పెట్టుబడికి వచ్చే సరికే చాలా మందికి ఈ పదం ఎక్కడ వాడతారో, ఎప్పుడు వాడతారో తెలుసుకుందాం. కమోడిటీస్‌లో పెట్టుబడి పెట్టడం అనేది కొత్త కాకపోయినా.. గత సంవత్సరాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ఈక్విటీస్‌లో పెట్టుబడులు ఎలాగైతే పెడతామో, కమోడిటీస్‌లో అదే విధంగా పెట్టుబడులు పెడతాం.

ఈ రెండింటి మధ్య ఉన్న బేధం ఒక్కటే. ఈక్విటీ మార్కెట్ ట్రేడ్స్ ఈక్విటీస్‌(కంపెనీల షేర్లు)లో జరుగుతుండగా, కమోడిటీస్ మార్కెట్ ట్రేడింగ్ కమోడిటీస్ అయిన బంగారం, సిల్వర్, సోయా, గోధుమ మొదలగున వాటిల్లో జరుగుతుంది.

కమోడిటీస్ రకాలు: కమోడిటీస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక విలువను సూచించే ముడి పదార్థాలు. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు కమోడిటీస్‌లో ఎన్ని రకాలు ట్రేడ్ అవుతున్నాయో తెలుసుకోవాలి. వ్యాపారం చేసేందుకు అనేక వస్తువుల ఉన్నాయి, ముఖ్యమైన వాటిని మీకు ఈ క్రింద సూచించబడుతున్నాయి. ఐదు భాగాలుగా వీటిని విభంజించారు.

ఎనర్జీస్: కమోడిటీ మార్కెట్లో కమోడిటీస్ క్రింద్ ట్రేడ్ అయ్యే వాటిల్లో ఎనర్జీ ఒకటి. ఎనర్జీస్ క్రిందికి క్రూడ్ ఆయిల్, హీటింగ్ ఆయిల్, సహాజ వాయువు, గ్యాసోలైన్ మొదలగునవి వస్తాయి.

ఖనిజాలు: ఖనిజాలు రెండు రకాలు. ఒకటి ఆధార ఖనిజాలు కాగా రెండవది విలువైన ఖనిజాలు. ఆధార ఖనిజాలలో అల్యూమినియం, కాపర్, జింక్, లీడ్, నిఖెల్, టిన్‌లను కలిగి ఉన్నాయి. అదే విలువైన ఖనిజాలలో బంగారం, సిల్వర్, ప్లాటినమ్, ప్లలాడియమ్‌ను కలిగి ఉంది.

ధాన్యాలు: ధాన్యాలలో గోధుమ, వరి, వోట్స్, మొక్కజొన్న మరియు సోయాబీన్స్ కలిగి ఉంటాయి.

సాఫ్ట్ ఉత్పత్తులు: సాధారణంగా సాఫ్ట్ ఉత్పత్తులలో పత్తి, చక్కెర, నారింజ రసం, కోకో మరియు కాఫీ లాంటి వాంటి ట్రేడింగ్ చేస్తారు.

లైవ్ స్టాక్: లైవ్ స్టాక్ అనేది వేరో టైపు కమోడిటీ. పంది మాంసం, జీవం కలిగి ఉన్న జంతువులు ఈ లైవ్ స్టాక్ క్రింద ట్రేడింగ్ అవుతాయి.


(తెలుగు వన్ఇండియా)

పార్టిసిపేటరీ నోట్స్ లేదా పి-నోట్స్ అంటే ఏమిటీ..?

పార్టిసిపేటరీ నోట్స్ (ప్రాతినిధ్య నివేదిక) సాధారణంగా పి-నోట్స్ లేదా పాల్గోననున్న గమనికలుగా పిలుస్తుంటాం. పార్టిసిపేటరీ నోట్స్ ముఖ్య ఉపయోగం ఏమిటంటే ఈ భారత స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి కోరుకునే వారు విదేశీ పెట్టుబడిదారులు, భారతదేశం యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (సెబి)లో నమోదు కాకుండా మార్కెట్ నియంత్రణను కొనసాగిస్తారు.

పార్టిసిపేటరీ నోట్స్ అనగా ఆఫ్షోర్ ఇన్వెస్ట్. దీని అర్దం ఏమిటంటే వీటి సహాయంతో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం భారతదేశం వెలుపల ఉపయోగిస్తారు.

పార్టిసిపేటరీ నోట్స్ ఎందుకంత పాపులర్..?


పార్టిసిపేటరీ నోట్స్ ఎందుకంత పాపులర్ అయ్యాయంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులను పి-నోట్స్ లక్షణాలు కొన్నింటికి మాత్రమే పరిమితం చేయడం వల్ల ప్రసిద్ధమైనవి. అయినప్పటికీ.. సెబి గతంలో తరుచుగా పి-నోట్స్‌ను అసంతృప్తి చూపిన పెట్టుబడిదారులకు మాత్రం అజ్ఞాతంగా ఉంటాయి. పి-నోట్ పెట్టుబడిదారుకి సంబంధించిన అన్ని జాగ్రత్తలను నమోదిత ఫైల్స్ చూసుకుంటాయి, అందువల్ల క్లయింట్ వివరాలను వెల్లడించడం తప్పనిసరి కాదు.

పి-నోట్స్‌లో హెడ్జ్ ఫండ్స్ చర్యలు ఎలా..?

పి-నోట్స్ ద్వారా హెడ్జ్ ఫండ్స్ పెట్టుబడి పెట్టి ఉంటాయి. డబ్బు తీసుకొని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టబడుతాయి .

ఇండియన్ మార్కెట్‌ను ఇవి ఎలా ప్రభావితం చేస్తాయి..?

భారతదేశం వెలుపల ఏర్పాటు సంస్థలైన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారతదేశంలో ఇన్వెస్ట్(పెట్టుబడి) ప్రతిపాదనను చేస్తాయి. FIIs భారత స్టాక్ మార్కెట్ లో లిక్విడిటీ ప్రధాన మూలం మాత్రమే కాకుండా కీలకమైన పాత్రను పోషిస్తాయి. హెల్త్ మార్కెట్‌ను FIIs చేసిన ఇన్వెస్ట్ ధోరణి ద్వారా గుర్తిస్తారు.

FIIs ద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి ఆరోగ్యానికి చిహ్నం, అది మార్కెట్‌లో విశ్వాసాన్ని చేజిక్కించుకుంటుంది. తాజా నివేదిక ప్రకారం పి-నోట్స్‌లో చివరి మూడు నెలల్లో పెట్టుబడిదారులకు ప్రభుత్వం పన్ను నికర మరియు నలుపు డబ్బు కోసం వేట యొక్క ఆందోళనలలో ఒక లక్ష కోట్ల రూపాయలు వైదొలిగాయి.

మార్చిలో యూనియన్ బడ్జెట్ తర్వాత ఇతర పన్ను చట్టాలు లో కొన్ని సవరణలు యొక్క కొత్త పన్ను నియమాన్ని సూచించడంతో డౌన్ ట్రెండ్ ప్రారంభమైంది.

(తెలుగు వన్ఇండియా)

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి..?

మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ లేదా బ్యాలె‌న్స్డ్‌ కూడా కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ ఋణ పత్రాలలో, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో కూడా పెడతాయి. అందువల్ల షేర్ల ద్వారా వచ్చే రిస్క్‌ని గణనీయంగా తగ్గించుకుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బుని మొత్తం షేర్లలోనే పెట్టదు. అందులో 50% షేర్లలో కొనడం, మిగతాది ఋణపత్రాల్లో పెట్టడం వల్ల మన రిస్క్ గణనీయంగా తగ్గే అవకాశం వుంది. ఒక్కో మ్యూచువల్ ఫండ్ ఒక్కో ట్రస్ట్‌గా ఏర్పడి ఎంతోమంది మదుపుదారుల నుండి డబ్బుని సేకరించి వారి తరపున పెట్టబడులను నిర్వహిస్తాయి. ఇలా వచ్చిన పెట్టుబడులనే నిధి(ఫండ్) గా వ్యవహరిస్తారు. అందుకే వాటికి మ్యూచువల్ ఫండ్ (సమిష్టి నిధి)గా షేరు వచ్చింది.

మ్యూచువల్ పంఢ్స్ వల్ల లాభాలు:

తక్కువ పెట్టుబడి: ఒక కంపెనీ షేర్లను కొనాలంటే మీరు రూ.25,000 పెట్టుబడి పెట్టాలి. కాని మీ దగ్గర కేవలం రూ. 1000 మాత్రమే వున్నాయి. అయినా ఆ కంపెనీ షేర్లలో సైతం మీరు పరోక్షంగా భాగస్వామి కావచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

మ్యూచువల్‌ పంఢ్స్‌లో మనం కేవలం షేర్లలోనే కాక, వివిధ రకాల కంపెనీ డిపాజిట్లు. ప్రభుత్వ రుణపత్రాలు, ట్రజరీ బిల్లులు మొదలైన వాటిలో సైతం భాగస్వాములం అవుతాం. అందువల్ల ఒక షేర్‌ విలువ తగ్గిపోయినా, ఇతర షేర్లు, రుణపత్రాల ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం వుంటోంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వుంటాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా కాక యూనిట్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం వుంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాలు:


ఓపెన్ ఎం‌డెడ్ ఫండ్స్
క్లోజ్ ఎం‌డెడ్ ఫండ్స్
ఈక్విటీ ఫండ్స్
డెట్ ఫండ్స్
బ్యాలె‌న్స్‌డ్ ఫండ్స్

(తెలుగు వన్ఇండియా)

ట్రేడర్, ఇన్వెస్టర్ మధ్య ఉన్న తేడా ఏమిటి..?

మన దైనందిన జీవితంలో చాలా సార్లు ట్రేడర్, ఇన్వెస్టర్ అనే పదాలను వినే ఉంటాం. కానీ షేర్ల విషయానికి వస్తే ఈ రెండు పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. అదేంటో క్షణ్ణంగా తెలుసుకుందాం..

ఇన్వెస్టర్ (పెట్టుబడిదారు): లాంగ్ టర్మ్ ఇన్వెస్టమెంట్ (ఉదాహారణకు 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాలు) కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారిని ఇన్వెస్టర్లు అని అంటారు. ఇన్వెస్టర్లు "buy and hold" పాలసీ ద్వారా ఆస్తులు, వస్తువుల మొదలగున వాటిల్లో పెట్టుబడి పెడతారు. రిస్క్ మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకోని ప్రాథమిక విశ్లేషణ ద్వారా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయం తీసుకుంటారు. దీర్ఘకాలిక కాలపరిమితి బట్టి పెట్టుబడిదారుల పెట్టిన పెట్టుబడి రిటర్న రూపంలో వస్తుంది.

ట్రేడర్ (వ్యాపారి): ట్రేడర్స్ అంటే స్పెక్యులేటర్లు. వీరి షేర్లు షార్ట్ టర్మ్ (కొన్ని నిమిషాలు, కొద్ది రోజుల) పాటు మాత్రమే ట్రేడ్ అవుతాయి. వీరి విధానం అస్పష్టంగా మరియు తక్షణంగా ఉంటుంది. న్యూస్, రిపోర్ట్స్, సాంకేతిక విశ్లేషణ ద్వారా వీరు నిర్ణయాలు తీసుకుంటారు. తక్కువ కాలంలో మార్కెట్లో ఏర్పడిన ఒడిదుడుకులకు తెగ బాధపడిపోతుంటారు. ట్రేడింగ్ అనిశ్చితలో ఉన్నప్పుడు రిటర్న్స్‌ని ఆశిస్తారు.

కాబట్టి వ్యాపారం లేదా పెట్టుబడి చేయాలి?

డబ్బు సంపాదించడానికి ట్రేడింగ్ అనేది ఒక మార్గం. కానీ ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్‌లో ట్రేడింగ్ చెయ్యాలంటే కావాల్సింది మార్కెట్ నాలెడ్జి. మార్కెట్‌లో పెట్టుబడులు కొంచెం రిస్క్‌తో కూడుకున్నవి. ట్రేడింగ్ అనే పదం వినడానికి వినసొంపుగా ఉన్నా.. అందులో కేవలం ఫైనాన్స్ నిపుణులు మాత్రమే రాణిస్తారు.


బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏమిటీ...?

బ్లూ చిప్ స్టాక్స్ అనేవి అధిక-నాణ్యత మరియు అధిక ధర స్టాక్ లక్షణములు కలిగి ఉంటాయి. ఈ స్టాక్స్ కంపెనీలు కలిగి ఉండడం వల్ల పెట్టుబడిదారు కాన్పిడెన్స్ తో పాటు కంపెనీలు ఎంతో ఎత్తులో ఉంటాయి. ఈ స్టాకులు పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు సహాయం చేస్తాయి. బ్లూ చిప్ స్టాక్స్ కలిగి ఉన్న కంపెనీలు ఆర్దిక పరంగా మంచి స్ట్రాంగ్‌గా ఉంటాయి.

ఈ బ్లూ చిప్ స్టాక్స్ పెట్టుబడిదారులకు సంపదను తెచ్చి పెట్టే విధంగా వ్యవహారిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్స్‌లో గట్టి పట్టుని కలిగి ఉన్న కంపెనీలు మాత్రమే ఈ బ్లూ చిప్ స్టాక్స్‌ని కలిగి ఉంటాయి. భారత దేశంలో ఈ బ్లూ చిప్ స్టాక్స్ విషయానికి వస్తే వాటాలు సెన్సెక్స్ మరియు నిప్టీ వాటాల రూపంలో భాగమై ఉంటాయి. ఉదాహారణకు ఎల్ అండ్ టి, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటిసి, బజాజ్ ఆటో మొదలగునవి.

ఈ వాటాల కొన్ని అధిక మూలధనీకరణ స్టాక్స్ ఉంటాయి. ఐతే బ్లూ చిప్స్ స్టాక్స్‌లో పెట్టిన పెట్టుబడులకు గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయనే నమ్మకం లేదు.

తెలుగు వన్ఇండియా

స్టాక్ మార్కెట్లు అంటే ఏమిటి..?

ఈక్విటీస్‌లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేసిన సందర్బాలలో బుల్ మార్కెట్ మరియు బీర్ మార్కెట్ అనే పదాల గురించి వినే ఉంటారు. మార్కెట్ రంగంలోకి తొలిసారి వెళ్లినప్పుడు ఈ పదాలను అర్దం చేసుకోవడం కొంచెం కష్టం.

షేర్ అంటే వాటా అని అర్ధం. ఒక కంపెనీ/పరిశ్రమ అభివృది కోసం ఆసక్తి ఉన్నవారి నుంచి పెట్టుబడి స్వీకరిస్తారు. అంటే అలా పెట్టుబడి పెట్టినవారు ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ అన్న మాట. వారందరికి కంపెనీలో వాటా ఉన్నట్టు. కంపెనీకి లాభాలు వస్తే వాటిని షేర్ హోల్డర్స్ కు పంచుతారు. ఆ విధంగా షేర్ విలువ పెరుగుతుంది. ఈ విధంగా బిఎస్ఈ లో నమోదు చేసుకున్న కంపెనీలలో ఎక్కువ కంపెనీల షేర్లు లాభాలలో ఉంటె సెన్సెక్స్ లాభాల బాట పడుతుంది. దీనినే బుల్స్ అంటారు. ఎక్కువ కంపెనీల షేర్లు నష్టాలలో ఉంటె సేన్సెక్స్ గీత కిందికి చూపిస్తుంది. దీనినే బేర్స్ అంటారు.

బుల్ మార్కెట్:
బుల్ మార్కెట్ అనేది పెట్టుబడిదారులు మరియు వ్యాపారులకు మార్కెట్ ధరల ధోరణి ఏవిధంగా పెరుగుతుంది అవే విషయాలను ఆశావాద వీక్షణ ద్వారా తెలుపుతుంది.

బీర్ మార్కెట్: షేర్ ధరలు పడిపోతాయని ఆశించే పెట్టుబడిదారులు మరియు వ్యాపారులను బీరీష్ ట్రేడర్‌గా పిలుస్తారు. మార్కెట్లలో దీర్ఘకాలం డ్రాప్ పరిస్థితులు ఉంటే బీర్ మార్కెట్ అంటారు. బీర్ మార్కెట్ ఉందంటే బయ్యర్స్ ఎవరూ లేరని.. అదే విధంగా ధరలు తగ్గు ముఖం పట్టాయని అర్దం చేసుకోవాలి. ఐతే ఈ మార్కెట్ ట్రెండ్స్‌కు ఇలా జంతువుల పేర్లు ఎందుకు పెట్టారనేది తెలియని విషయం. ప్రత్యర్దులపై ఈ రెండు జంతువులు ఏ విధంగా ఎటాక్ చేస్తాయో దానిని దృష్టిలో పెట్టుకోని ఈ పేర్లు పెట్టి ఉంటారనేది పలువురి నిపుణుల అంచనా.

ఉదాహారణ: బుల్ (ఎద్దు) తన కొమ్ములను గాలిలోకి పైకి లేపి ఉంచడం అనేది మార్కెట్లు పెరుగుతున్నదానికి.. బీర్ (ఎలుగుబంటి) తన చేతులను రెండింటిన క్రిందకు ఉంచడం మార్కెట్లు తగ్గుతున్న దానికి చిహ్నాలుగా వాడుతున్నారు.

Thursday, November 15, 2012

గోల్డ్ ఈ టి ఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం లాభామా ?

గోల్డ్‌ ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తాయి. ఈ ఇ.టి.ఎఫ్‌ ల ద్వారా సమీకరించిన మొత్తాన్ని బంగారంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వినియోగిస్తారు. నేరుగా బంగారంలో ఇన్వెస్ట్‌ చేయకుండా ఇ.టి.ఎఫ్‌ లలో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయాలి అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.

ఫిజికల్‌ గోల్డ్‌ కొనుగోలుతో పోలిస్తే, ఇ.టి.ఎఫ్‌ రూపంలో అయితే ఎవరూ దొంగిలించే వీలుండదు, ఇన్వెస్ట్‌మెంట్‌ సేఫ్‌గా వుంటుంది అన్నది ప్రధానమైన కారణం, ఇక ఇ.టి.ఎఫ్‌ లు గోల్డ్‌లో ట్రేడింగ్‌ కూడా చేస్తాయి కాబట్టి, రిటర్న్స్‌ కొంతమేరకు ఎక్కువగా వుంటాయి అన్నది రెండవ ప్రధాన కారణం. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ వీక్‌ అవుతూ వుండడం, ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ పెరుగుతూ వుండడం వంటివి బంగారం పెట్టుబడులకు సంబంధించిన అనుకూలాంశాలు.

భారత్‌లో గోల్డ్‌ ఇటిఎఫ్‌ లు నిర్వహిస్తున్న ఆరు మ్యూచువల్‌ ఫండ్స్‌:
1. బెంచ్‌మార్క్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
2. యుటిఐ మ్యూచువల్‌ ఫండ్‌
3. కోటక్‌ మహాంద్రా మ్యూచువల్‌ ఫండ్‌
4. రిలయన్స్‌ క్యాపిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
5. క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌
6. యస్ బి ఐ మ్యూచువల్‌ ఫండ్‌.

ఈ ఆరు ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ గోల్డ్‌లోనే ఇన్వెస్ట్‌, ట్రేడ్‌ చేస్తాయి కాబట్టి ఏ స్కీములో ఇన్వెస్ట్‌ చేసినా, ఒకటే తరహా రిటర్న్స్‌ లభిస్తాయి.

గత ఏడాది వ్యవధిలో ఈ ఆరు గోల్డ్‌ ఇటిఎఫ్‌ల లోనూ సుమారు 27 శాతం రాబడి గిట్టుబాటు అయింది. యుటిఐ గోల్డ్‌ ఇటిఎఫ్‌ లో రెండేళ్ళ రాబడి 67 శాతం వరకు వచ్చింది.అంతర్జాతీయ గోల్డ్‌ ఇటిఎఫ్‌ ల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశాలు వున్నాయి,అంతర్జాతీయ ఫండ్స్‌లో గత ఏడాది డిఎస్‌పి బ్లాక్‌రాక్‌ వరల్డ్‌ గోల్డ్‌ ఫండ్‌, ఎఐజి వరల్డ్‌ గోల్డ్‌ ఫండ్స్‌ 35 శాతం రాబడి ఇచ్చినవి. కాబట్టి గోల్డ్‌ ఇటిఎఫ్‌ లను తప్పని సరిగా, మీ పోర్ట్‌ఫోలియోకి జత చేసుకోండి. మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో కనీసం 10 శాతం గోల్డ్‌ ఇటిఎఫ్‌లకు కేటాయించండి. అలాగే ఈ గోల్డ్‌ ఇటిఎఫ్‌లలో స్వల్ప కాలిక లాభాల కంటే దీర్ఘకాలిక లాభాలకోసమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
(మన-ఆంధ్ర.కాం)

2జీ వేలం ఫ్లాప్!


రెండో రోజే ముగింపు...
బిడ్‌ల విలువ రూ. 9,407 కోట్లే...
ప్రభుత్వ లక్ష్యం రూ.40 వేల కోట్లు
దేశవ్యాప్త స్పెక్ట్రం బిడ్డింగ్‌కు టెల్కోలు దూరం
వొడాఫోన్‌కు 14 సర్కిళ్లలో స్పెక్ట్రం
వీడియోకాన్‌కు 6, ఐడియా చేతికి 8 సర్కిళ్లు...
టెలినార్‌కు 6 సర్కిళ్లలో స్పెక్ట్రం...


న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం వేలం ప్రభుత్వ ఆశలపై నీల్లుచల్లింది. భారీగా నిధులొస్తాయని భావించిన కేంద్రానికి టెల్కోల నుంచి గట్టి షాక్ తగిలింది. ఈ-వేలం రెండో రోజైన బుధవారంనాడే ముగిసింది. ముగింపు నాటికి రూ.9,407 కోట్ల విలువైన బిడ్‌లు మాత్రమే వచ్చాయి. 2జీ వేలం ఎంతగా ఫ్లాప్ అయిందనేదానికి ఇదే నిదర్శనం. జీఎస్‌ఎం స్పెక్ట్రం ద్వారా రూ.28,000 కోట్లు, సీడీఎంఏ వేలంను కూడా కలిపితే మొత్తం 2జీ వేలం ద్వారా రూ.40,000 కోట్ల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్త స్పెక్ట్రం లెసైన్స్ కోసం టెలికం ఆపరేటర్ల నుంచి ఒక్క బిడ్ కూడా లేకపోవడం మరో ప్రధానాంశం.

సోమవారం(12న) వేలం ప్రారంభమైన తొలిరోజు రూ.9,225 కోట్ల విలువైన బిడ్‌లు రావడం తెలిసిందే.
కాగా, బిడ్డింగ్ ముగిసినట్లు ప్రకటించిన టెలికం మంత్రి కపిల్ సిబల్... గతంలో 2జీ కేటాయింపుల కారణంగా ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు కాగ్ పేర్కొన్న అంచనాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ‘వాస్తవాలేమిటో ఇప్పుడు ప్రజలకు స్పష్టమైంది. 3జీ వేలం ధర ప్రకారం ప్రస్తుత 2జీ స్పెక్ట్రంకు రూ. లక్ష కోట్లు రావాలి. అయితే, రూ.9,407 కోట్లే వచ్చాయి. దీనిబట్టి మార్కెట్ పరిస్థితేంటో తేలిపోయింది’ అని పరోక్షంగా కాగ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కయిందన్న ఆరోపణలను సిబల్ కొట్టిపారేశారు.

వొడాఫోన్ జోరు...
ప్రాథమిక సమాచారం ప్రకారం... జీఎస్‌ఎం 2జీ వేలంలో వొడాఫోన్ 14 సర్కిళ్లలో అదనపు స్పెక్ట్రంను దక్కించుకొని టాప్‌లో నిలిచింది. వీడియోకాన్‌కు 6, ఐడియాలు 7 సర్కిళ్లలో స్పెక్ట్రంను దక్కించుకున్నాయి. ఇక నార్వే టెలికం దిగ్గజం టెలినార్ ఆంధ్ర ప్రదేశ్‌తో సహా 6 సర్కిళ్లలో స్పెక్ట్రం లెసైన్స్‌ను కైవసం చేసుకుంది. ఎయిర్‌టెల్ మాత్రం ఒక్క సర్కిల్(అసోం)లో మాత్రమే అదనపు స్పెక్ట్రం లెసైన్స్‌ను దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 2జీ లెసైన్స్(ఒక్కో సర్కిల్‌లో 5 మెగాహెర్ట్జ్) కోసం ప్రభుత్వం నిర్ణయించిన రూ.14,000 కోట్ల ప్రారంభ(బేస్) ధర చాలా ఎక్కువని, వేలానికి స్పందన కరువయ్యేందుకు ఇదే కారణమని జీఎస్‌ఎం ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) పేర్కొంది. కాగా, 2010లో జరిగిన 3జీ స్పెక్ట్రం వేలం దాదాపు 35 రోజుల పాటు హోరాహోరీగా కొనసాగింది. అంతేకాకుండా ప్రభుత్వ అంచనాలను మించి దాదాపు రూ.67,719 కోట్ల బంపర్ ఆదాయం ఖజానాకు సమకూరింది కూడా.

‘సుప్రీం’ రద్దు ఎఫెక్ట్...

సుప్రీంకోర్టు 2జీ స్కామ్‌పై విచారణలో భాగంగా... 2008లో అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా హయాంలో ఇచ్చిన 9 కంపెనీలకు చెందిన 122 లెసైన్స్‌లను రద్దు చేయడం(22 సర్కిళ్లలో) తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాజాగా వేలాన్ని నిర్వహించింది. 2001 నాటి ధరకు ముందొచ్చినవారికి ముందు ప్రాతిపదికన స్పెక్ట్రంను కట్టబెట్టడంవల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు 2010లో కాగ్ లెక్కతేల్చడంతో 2జీ కుంభకోణం వెలుగుచూసింది. 3జీ వేలం బిడ్డింగ్ ధరల ఆధారంగా కాగ్ ఈ అంచనాలు వేసింది. తాజా వేలానికి దేశవ్యాప్తంగా జీఎస్‌ఎం బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం బేస్ ధరను ప్రభుత్వం రూ.14,000 కోట్లుగా నిర్ణయించింది. గతంలో కేటాయించిన రూ.1,658 కోట్లతో పోలిస్తే ఇది 7 రెట్లు ఎక్కువ. కాగా, సుప్రీం తీర్పుతో లెసైన్స్‌లు కోల్పోయిన 8 కంపెనీల్లో మూడు(ఐడియా, వీడియోకాన్, టెలినార్) మాత్రమే తాజాగా లెసైన్స్‌ల కోసం పోటీలో నిలిచాయి.

వీటితో పాటు పాత టెల్కోలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ కూడా వేలంలో పాల్గొన్నాయి. అయితే, ఒక్కో సర్కిల్‌లో ఈ రెండు కంపెనీలు గరిష్టంగా 2 బ్లాక్‌లకే బిడ్ చేసుకునే అవకాశం కల్పించారు. మరోపక్క, సీడీఎంఏ స్పెక్ట్రం వేలం నుంచి టాటా టెలీ, వీడియోకాన్‌లు వైదొలగడంతో ఇక దీనికి బిడ్డర్లే లేకుండా పోయారు. మరోపక్క, జీఎస్‌ఎం స్పెక్ట్రం ప్రారంభ ధర కంటే సీడీఎంఏ స్పెక్ట్రం రేటును 1.3 రెట్లు అధికంగా కేంద్రం నిర్ణయించడంతో కంపెనీలేవీ బిడ్డింగ్‌కు ముందుకురాలేదు. దీంతో ఇక 2జీ సీడీఎంఏ స్పెక్ట్రం వేలం దాదాపు లేనట్టే. దీని ప్రకారం రూ.40,000 కోట్ల మొత్తం ఆదాయ లక్ష్యాన్ని అందుకోవడంలో కేంద్రం అత్యంత ఘోరంగా చతికిలపడినట్లయింది. ద్రవ్యలోటును 5.3 శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం లక్ష్యం... స్పెక్ట్రం వేలం వైఫల్యం కారణంగా సాధ్యం కాకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

ఖజానాకు వచ్చేది నిల్...!
2008లో స్పెక్ట్రం లెసైన్స్‌లు పొందిన కంపెనీలు సుప్రీం తీర్పుతో వాటిని కోల్పోయిన కారణంగా... వాటికి లెసైన్స్ ఫీజును వెనక్కి ఇచ్చేయనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. లేదంటే ఇప్పుడు తాజా వేలంలో పాల్గొనే వాటికి బిడ్డింగ్‌లో గెలిచిన ధరమేరకు సర్దుబాటు చేస్తామని కూడా చెప్పింది. వేలంలో రూ.10,000 కోట్లకు లోపే రావడంతో... లెసైన్స్ ఫీజును ఇందులోంచి తీసేస్తే ఖజానాకు నికరంగా సమకూరిందేమీ లేనట్టే లెక్క. దేశవ్యాప్త స్పెక్ట్రంకు నిర్ణయించిన రూ.14,000 కోట్ల బేస్ ధరలో 40 శాతం వాటా మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలదే. దీంతో ఈ రెండు సర్కిళ్లకు ఒక్క కంపెనీ కూడా బిడ్డింగ్ చేయకపోవడం గమనార్హం. ఇక చాలా వరకూ సర్కిళ్లలో బేస్ ధరకు కాస్త అటూఇటూగానే బిడ్డింగ్ జరిగినట్లు పరిశ్రమ సమాచారం.

Monday, November 12, 2012

ముందే 'పేలుతున్నాయి'


టపాసుల ధరలు తారాజువ్వలా పెరగటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూసిస్తున్నాయి. దాంతో కాల్చకుండానే ధరలు పేలుతున్నాయి.
ఎంతో సంబరంగా జరుపుకునే వెలుగుల పండుగ దీపావళికి ధరాఘాతం తగిలింది. పండుగకు ప్రత్యేక శోభ కలిగించే టపాసులు ప్రియంగా మారాయి. టపాసుల ధరలు తారాజువ్వలా పెరగటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూసిస్తున్నాయి. దాంతో కాల్చకుండానే టపాసులు పేలుతున్నాయి. సుమారు వెయ్యిరూపాయలు చెల్లిస్తేగానీ బాణాసంచా దుకాణాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఈ ప్రభావం వ్యాపారాలపైనా పడింది.

గత ఏడాదికన్నా ఈ ఏడాది పటాసుల ధర సుమారు 40 శాతం పెరిగింది. దీంతో విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీపావళికి రెండు రోజుల ముందు నుంచే టపాసుల విక్రయాలు మొదలయ్యేవి. దీపావళికి ముందు సుమారు 60 శాతం వరకు బాణసంచా అమ్ముడయ్యేది.

ప్రస్తుతం హైదరాబాద్ నగర మార్కెట్లో రూ.10 మొదలుకొని రూ.16వేల విలువైన వివిధ రకాల బాణాసంచా పేలుడు సామగ్రి అందుబాటులో ఉంది. పదిరోజుల క్రితమే బాణాసంచా హోల్‌సేల్ దుకాణాలు తెరచినా విక్రయాలు ఇంకా ఊపందుకోక పోవడం వారిలో ఆందోళనను మరింత పెంచుతోంది. పండుగకు ఒక్కరోజే సమయమున్నా దుకాణాలు వెలవెలబోతున్నాయి.

గత ఏడాది దీపావళికి రెండు రోజుల ముందే సందడి మొదలుకాగా ఈ ఏడు అంతంత మాత్రంగా ఉంది. ఏటా పిల్లలకు సుమారు వెయ్యి రెండు వేలు వరకు టపాసులు కొని ఇచ్చే తల్లిదండ్రులు వారికి సర్దిచెప్పి 500 నుంచి వెయ్యి లోపే కొనుగోలు చేస్తున్నారు. విడిగా బాణసంచా కొనుగోలు చేసేకన్నా అన్నీ కలిపి ఉండే గిఫ్ట్‌బాక్స్‌లను పలువురు కొనుగోలు చేసేవారు.

గిఫ్ట్‌బాక్స్‌ల ధర విపరీతంగా పెరగడంతో వాటి గిరాకీ తగ్గింది. గత ఏడాది గిఫ్ట్‌బాక్స్ రూ. 200 నుంచి రూ. 1200ల వరకు ఉండేది. ఈసారి వీటి ధర రూ. 350 నుంచిరూ. 2500 వరకు పెరగడంతో కొనుగోలుదార్లు కరువయ్యారు. దీంతో టపాసుల దుకాణాల్లో గిఫ్ట్‌బాక్స్‌లు కుప్పలుగా కనిపిస్తున్నాయి.

మరోవైపు వ్యాపారస్తులు సిండికేట్ గా మారి బాణసంచా ధరలను పెంచేశారు. గత ఏడాది కన్నా రెట్టింపు ధరలతో విక్రయిస్తుండటంతో పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. బాణసంచా కొనేందుకు ఉత్సాహంగా వచ్చిన పిల్లలు, పెద్దలు ధరలను చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. టపాసులు కొనాలంటే జనం భయపడిపోతున్నారు.

విపరీతంగా పెరిగిన ధరలు, పండగ ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. దీంతో దీపావళి పండుగ కళ తప్పుతోంది. 'చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళీ' అనేది ఒకప్పటి నానుడిగా మారిపోయింది. ప్రకృతి... ప్రమాదాలు... పన్ను భారం... వెరసి ఈసారి బాణాసంచా వ్యాపారులకు, వినియోగదారులకు చీకటినే పంచుతోంది. ధరలు ఇలాగే పెరిగితే ... భవిష్యత్తులో జనాలు.... పండగ దండగ అనుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోవల్సిన పనిలేదు.

గోల్డ్ రష్ @ ధన్‌తేరాస్

గోల్డ్ రష్ @ ధన్‌తేరాస్

* ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయి లావాదేవీలు
* చేతులు మారిన 4,441 కేజీల బంగారం
* దీని విలువ రూ.1,337 కోట్లు
* రాష్ట్రంలో రూ. 500 కోట్ల పసిడి విక్రయాలు జరుగుతాయని అంచనా
* దేశవ్యాప్తంగా అమ్మకాలు 30 శాతం అప్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి ధన్‌తేరాస్ సందర్భంగా నేరుగా బంగారం కంటే పేపర్‌గోల్డ్‌పైనే దృష్టిసారించారు. గత సంవత్సరంతో పోలిస్తే దేశవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్ లావాదేవీల్లో 110% వృద్ధి నమోదైతే, రాష్ట్రంలో బంగారం అమ్మకాల్లో స్వల్పంగా వృద్ధి నమోదయినట్లు తెలుస్తోంది. ఇంత వరకు ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజులో రూ.1,337 కోట్ల లావాదేవీలు గోల్డ్ ఈటీఎఫ్‌లలో నమోదైనట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ధన్‌తేరాస్ సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించగా రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి.

గత సంవత్సరం ధన్‌తేరాస్ నాడు ఎన్‌ఎస్‌ఈలో రూ. 636 కోట్ల లావాదేవీలు జరగ్గా ఈసారి 110 శాతం పెరిగి రూ. 1,137 కోట్లకు చేరింది. అదే పరిమాణం పరంగా చూస్తే గత సంవత్సరం కంటే 81 శాతం అధికంగా 4,441 కేజీల బంగారం చేతులు మారినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియచేసింది. మొత్తం 70,440 మంది ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (జనవరి-జూలై) సగటున రూ.1,195 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2011-12 నాటికి రూ.23,039 కోట్ల విలువైన బంగారం ఈటీఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం 14 మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈటీఎఫ్‌లను అందిస్తున్నాయి.

రాష్ట్రంలో రూ.500 కోట్ల లావాదేవీలు
ఉత్తరాది రాష్ట్రాలో బాగా ప్రాచుర్యం పొందిన ధన్‌తేరాస్ ఇప్పుడిప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. గత సంవత్సరం ఈ పర్వదినం నాడు రాష్ట్రంలో రూ.300 కోట్లు జరగ్గా అది ఈ సంవత్సరం రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. మన రాష్ట్రంలో అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయని, అప్పుడు జరిగిన అమ్మకాల్లో ధన్‌తేరాస్ నాడు కేవలం 30 శాతం కూడా జరగవని సీఎంఆర్ డెరైక్టర్ రామారావు పేర్కొన్నారు.

ఈ సారి ఒకటి రెండు పెద్ద షాపుల్లో మినహా మిగలిన వాటిల్లో అమ్మకాలు నీరసించాయని, దీనికి ప్రధాన కారణం గోల్డ్ ఈటీఎఫ్‌లకు తోడు పెరిగిన బంగారం ధరలు దోహదం చేశాయన్నారు. అప్పుడే అమ్మకాలు ఎంత జరిగాయో చెప్పలేం కానీ గత సంవత్సరం జరిగిన అమ్మకాల్లో 70 శాతం జరిగితే చాలు అనుకుంటున్నట్లు జంటనగరాల బులియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సతీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్‌లలో పన్నులు తక్కువగా ఉండటంతో ఈ పర్వదినాల్లో బంగారం కొనాలనుకునే వారు పేపర్ గోల్డ్‌కు మొగ్గు చూపడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని రామారావు తెలిపారు.

‘ధన్‌తేరాస్ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఉత్సాహాన్ని చూపించారు. ముఖ్యంగా చిన్న చిన్న ఆభరణాలకే మొగ్గు చూపారు. బంగారం ధర పెరగడం, తుపాను ప్రభావమే దీనికి కారణంగా కనపడుతోంది. దుకాణాల్లోకి వచ్చే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఏమాత్రం తగ్గలేదు. ఆర్‌ఎస్ బ్రదర్స్ గ్రూపుకు చెందిన జువెల్లరీ షాపుల న్నింటిలో కలిపి 50 కేజీల దాకా బంగారం అమ్ముడైంది. ఇక మొత్తం మీద హైదరాబాద్‌లో ఇది సుమారు 300 కేజీలు ఉండొచ్చని అంచనా. గతేడాది ధంతేరాస్‌కు 400 కేజీల బంగారం విక్రయాలు జరిగాయి’ అని ఆర్‌ఎస్ బ్రదర్స్ జువెల్లర్స్ జీఎం టి.భద్రీనారాయణ చెప్పారు.

తగ్గని డిమాండ్...
ధన్‌తేరాస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు 30% పుంజుకున్నట్లు ముంబై, ఢిల్లీ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ పెళ్లి ఆభరణాల డిమాండ్ కారణంగా అమ్మకాలు 30%మేర పుంజుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై తదితర మార్కెట్లలో పసిడి ధరలు 10 గ్రాములు రూ. 32,000 సమీపంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధిక ధరల నేపథ్యంలో ధన్‌తేరాస్ అమ్మకాల పట్ల అంత ఆశాజనకంగా లేమని పీసీ జువెల్లర్స్ ఎండీ బలరామ్ గార్గ్ చెప్పారు. అయితే తమ అంచనాలను మించుతూ 30% అమ్మకాలు నమోదుకావడం విశేషమని వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రధానంగా పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసే ఆభరణాల అమ్మకాలు దోహదపడ్డాయనితెలిపారు.

పీసీ జువెల్లర్స్ దేశవ్యాప్తంగా 30 షోరూములను నిర్వహిస్తోంది. ఇక పీపీ జువెల్లర్స్ డెరైక్టర్ పవన్ గుప్తా సైతం ధన్‌తేరాస్ అమ్మకాలపట్ల ఇదే విధంగా స్పందించారు. గరిష్ట స్థాయికి చేరిన ప్రస్తుత ధరల్లోనూ పసిడికి డిమాండ్ కొనసాగిందని తెలిపారు. వెరసి ఈ ధన్‌తేరస్‌కు జువెలరీ అమ్మకాలు 25-30% వరకూ పెరగవచ్చునని అంచనా వేస్తున్నామని చెప్పారు. ధన్‌తేరాస్‌గా పిలిచే ధనత్రయోదశి రోజున శుభసూచకంగా పసిడి కొనుగోలుకి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తుండటం విదితమే. ఈ ధన్‌తేరస్‌కు వినియోగదారులు బంగారం, వెండి కాయిన్లకంటే ఆభరణాల కొనుగోళ్లకే మొగ్గుచూపారని మరికొంతమంది రిటైలర్లు చెప్పారు.

సోమవారం మధ్యాహ్నం వరకూ...
ఈ ఏడాది ధన్‌తేరాస్ రోజున అంచనాలకుమించి డిమాండ్ పుంజుకున్నదని ముంబైలోని యూటీ జవేరీ రిటైల్ చైన్ అధిపతి కుమార్ జైన్ చెప్పారు. అమ్మకాల పరిమాణంలో 25-30% మధ్య వృద్ధి నమోదుకావచ్చునని చెప్పారు. ముంబై జువెల్లర్స్ అసోసియేషన్‌కు జైన్ వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. గతేడాది ధన్‌తేరాస్‌తో పోలిస్తే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఆభరణాలకు భారీ డిమాండ్ కనిపిస్తున్నదని త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ మార్కెటింగ్ హెడ్ కిరణ్ దీక్షిత్ చెప్పారు. దీపావళి మర్నాటినుంచే పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నదని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలవరకూ ధన్‌తేరాస్ కొనసాగనున్నదని, అప్పటివరకూ పుత్తడిలో కొనుగోళ్లు జరుగుతాయని వివరించారు.

Friday, November 9, 2012

కింగ్‌ఫిషర్.. అకౌంటింగ్ స్కామ్?

క్యూ2లో రూ. 754 కోట్ల నికర నష్టం; 61% అప్
అకౌంటింగ్‌పై కంపెనీ ఆడిటర్ల సందేహాలు...
సరైన ప్రమాణాలు పాటిస్తే... నష్టం రూ.1,032 కోట్ల వరకూ ఉండేదని నివేదిక


ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లోనూ ‘సత్యం’ తరహా అకౌంటింగ్ మోసాలు జరుగుతున్నాయా? కంపెనీ ఆడిటర్ల సందేహాలు చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా ఆమోదనీయమైన అకౌంటింగ్ ప్రమాణాలను గనుక కింగ్‌ఫిషర్ పాటించి ఉంటే... క్యూ2 నష్టం మరింత భారీగా రూ.1,032 కోట్లుగా ఉండేదని(కంపెనీ ప్రకటించింది రూ.754 కోట్లు) ఫలితాలపై సమర్పించిన సమీక్షా నివేదికలో ఆడిటర్లు పేర్కొన్నారు. దీంతో ఖాతాల్లో అవకతవకలు జరిగిఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో లాభాలను పెంచిచూపితే... కింగ్‌ఫిషర్‌లో నష్టాలను తగ్గించి చూపుతున్నారన్న వాదనలు తెరపైకి వస్తుండటం గమనార్హం.

23 క్వార్టర్లు... నాన్‌స్టాప్ నష్టాలు...

ఇప్పటికే పీకల్లోతు అప్పులు, లెసైన్స్ సస్పెన్షన్‌తో మూలన కూర్చున్న కింగ్‌ఫిషర్... మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్, క్యూ2)లో కంపెనీ నికర నష్టం 61% ఎగబాకి రూ.754 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నష్టం రూ.469 కోట్లు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ఈ నష్టజాతక ఎయిర్‌లైన్స్... వరుసగా... 23వ క్వార్టర్‌లోనూ నష్టాలను చవిచూడటం గమనార్హం. వెరసి సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ మొత్తం నష్టాలు దాదాపు 9,000 కోట్లకు పేరుకుపోయాయి. కంపెనీ క్యూ2 ఆదాయం కూడా ఏకంగా 87 శాతం పడిపోయి రూ.200 కోట్లుగా మాత్రమే నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,553 కోట్లు. 2006లో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఒక్కసారి మాత్రమే కంపెనీ రూ.9.6 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే, ఇప్పటిదాకా పూర్తి ఏడాదికి ఎన్నడూ లాభాలను నమోదు చేయకపోవడం గమనార్హం.

పునరుద్ధరణకు కసరత్తు...
కార్యకలాపాలకు ఆటంకం, భారీ రుణ భారం, అధిక పన్ను చెల్లింపులు, నిర్వహణ-పునర్‌వ్యవస్థీకరణ వ్యయాలు వంటివన్నీ నష్టాలు మరింత పెరిగిపోయేలా చేస్తున్నాయని కింగ్‌ఫిషర్ పేర్కొంది. కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు వీలుగా సమగ్ర ప్రణాళికపై కసరత్తు చేస్తున్నామని కూడా తెలిపింది. బ్యాంకర్లు, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్‌ఏవియేషన్(డీజీసీఏ)కు తమ పునరుద్ధరణ ప్రణాళికను సమర్పిస్తామని, త్వరలోనే కార్యకలాపాలను పునఃప్రారంభించగలమని కూడా కంపెనీ పేర్కొంది. కాగా, సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించడానికి కింగ్‌ఫిషర్‌కు నిర్దిష్ట గడువేమీ నిర్దేశించలేదని డీజీసీఏ చీఫ్ అరుణ్ మిశ్రా గురువారం హైదరాబాద్‌లో చెప్పారు. త్వరలో ప్రణాళికను ఇస్తామని కంపెనీ చెప్పిందని, సంబంధిత ప్రతిపాదనల్లోని అంశాలన్నీ పరిశీలించాకే లెసైన్స్ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, రూ.7,000 కోట్లకు పైగానే రుణాలిచ్చిన బ్యాంకులు కూడా ప్రమోటర్లు మూలధనాన్ని సమకూరిస్తేనే విమానాలు నడిచేపరిస్థితి ఉందని, తాజాగా మరిన్ని రుణాలిచ్చే సమస్యేలేదని తేల్చిచెప్పాయి కూడా.

డైజియోకు యునెటైడ్ స్పిరిట్స్‌లో వాటా ?
యునెటైడ్ స్పిరిట్స్‌లో వాటా విక్రయానికి ప్రపంచ లిక్కర్ తయారీ దిగ్గజం డయాజియోతో విజయ్‌మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యునెటైడ్ స్పిరిట్స్‌లో ఎంత పరిమాణంలో వాటా విక్రయాలు జరుగుతున్నాయి, దీని విలువ ఎంత వంటి అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు వచ్చిన వార్తలపై స్పందించడానికి యూబీ గ్రూప్ ప్రతినిధి నిరాకరించారు. అయితే 51 శాతం వాటా అమ్మకాలకు అవగాహన కుదిరిందని, ఈ డీల్ విలువ 1-2 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండవచ్చని తెలుస్తోంది.


Wednesday, November 7, 2012

డిసెంబర్‌కల్లా 51కి రూపాయి

ఇటీవలి కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ పతనబాట పట్టినప్పటికీ... డిసెంబర్ చివరికల్లా 51 స్థాయికి పుంజుకునే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్(బీఓఎఫ్‌ఏ) ఒక నివేదికలో పేర్కొంది. భారత్ వద్దనున్న అధిక ఫారెక్స్ నిల్వలు రూపాయి విలువ రికవరీకి కీలకం కానుందని తెలిపింది. అయితే, రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) జోక్యం చేసుకోనంతవరకూ... 50 స్థాయికి మించి బలపడటం సాధ్యంకాకపోవచ్చని కూడా నివేదిక అభిప్రాయపడింది.


ప్రస్తుతం రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్ట స్థాయిలో 54.70 వద్ద కదలాడుతున్న సంగతి తెలిసిందే. 2008 మధ్యకాలం నుంచి ఆర్‌బీఐ విక్రయించిన 65 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలను తిరిగి చేజిక్కించుకుంటే తప్ప... డాలరుతో రూపాయి మారకం 50 పైకి ఎగబాకే అవకాశాల్లేవనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా. గతేడాది ఆగస్టు నుంచి భారీగా పడిపోవడం, తిరిగి అంతేవేగంగా పుంజుకోవడం... ఇలా రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్న సంగతి తెలిసిందే. 2011 సెప్టెంబర్ నుంచి చూస్తే... 18.5 శాతం పతనమైంది. బ్రెజిల్ కరెన్సీ తర్వాత అత్యంత దారుణంగా క్షీణించింది రూపాయే కావడం గమనార్హం.

టీవీ కన్నా స్మార్ట్ ఫోనే ముద్దు!

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జోరు పెరుగుతోందని గూగుల్ -ఐపీసాస్ సంయుక్త సర్వేలో తేలింది. మొత్తం 40 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. వినోదం విషయమై టీవీల కన్నా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే భారతీయుల సంఖ్య అధికంగా ఉందంటున్న ఈ సర్వే వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు....


టీవీలు చూసే సమయాన్ని స్మార్ట్‌ఫోన్‌ల వినియోగానికి వెచ్చించే వ్యక్తులు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీల్లో 27 శాతంగా ఉండగా, భారత్‌లో ఈ సంఖ్య 49 శాతంగా ఉంది.

స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్లు, ఉన్నతమైన నాణ్యత గల వీడియో కంటెంట్, విస్తృతమైన ఆప్స్ కారణంగా భారతీయులు టీవీ కంటే స్మార్ట్‌ఫోన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

టీవీ కంటే కూడా స్మార్ట్‌ఫోన్ల ద్వారానే మరింత వినోదాన్ని పొందవచ్చని 56 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ఇలా భావించే భారత మహిళల సంఖ్య 58 శాతంగా ఉంది. ఇక టీవీ కంటే స్మార్ట్‌ఫోన్ల ద్వారా మరింత వినోదాన్ని పొందవచ్చని భావించేవారి సంఖ్య అమెరికాలో 21 శాతం ఇంగ్లాండ్‌లో 18 శాతంగా ఉంది.
భారత మహిళలు స్మార్ట్‌ఫోన్లను కేవలం వినోదానికే వినియోగించడం లేదు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా మిత్రులను కలవడం, ఆన్‌లైన్ షాపింగ్ తదితర సమాచారం కోసం వినియోగిస్తున్నారు.



స్మార్ట్‌ఫోన్ల ధరలు అందుబాటులోకి రావడం కూడా భారత్‌లో ఈ ఫోన్‌ల వినియోగం పెరగడానికి ముఖ్య కారణమని గూగుల్ ఇండియా కంట్రీ హెడ్(ఇండియా ప్రోడక్ట్స్) లలితేష్ కాట్రగడ్డ చెప్పారు.

మళ్ళీ తెరమీదకు ఐటీ సంక్షోభం

దేశీయ ఆర్థిక వ్యవస్థను అంత ర్జాతీయ ఆర్థిక మాంద్యం నీడలా వెంటాడుతున్నది. ఇప్పటికీ అభివృద్ది చెందిన అమెరికా, యూరప్‌ దేశాలు మాంద్యంతో కొట్టుమిట్టాడడంతో భారత్‌ వంటి వర్ధమాన దేశాలు కూడా ఈ దెబ్బకు విలవిల్లాడుతున్నది. ఇప్పటికే దేశీయ వృద్ధిరేటు 5 శాతం దాటే పరిస్థితి కానరావడం లేదు.తాజాగా దేశీయ ఆర్థిక వ్యవ స్థకు వెన్నుముఖ లాంటి ఐటీ రంగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొం టున్నది. అమెరికా, యూరప్‌ దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక విధా నాలతో భారత్‌ ఐటీ మార్కెట్లో ఉపాధి అవకాశాలకు శాపం గా మారాయి. ఇప్పటికే బారక్‌ ఒబా మా భారత్‌ వ్యతిరేక వెైఖరి అవ లంభించడంతో దేశీయ ఐటీ రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితు లను ఎదుర్కొంటున్నది. మరో వెైపు యూరప్‌లో కూడా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఆదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో దే శీయ ఐటీ వర్క్‌ ప్రాజెక్టులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, విప్రో, టిసిఎస్‌ వంటి కంపెనీలు నియమాకాల జోరుకు బ్రేకులు వేశాయి.



డిసెంబర్‌ పైనే ఆశలు : ఫలితంగా ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు దాదాపుగా నిలియిపోయాయి. ప్రతి ఏటా రెండున్నర లక్షల మంది యువతకు ఐటీ అవకాశాలు లభిస్తే, ఈసారి ఆ అవకాశాలు కనుచూపు మేరలో కాన రావడం లేదు. ప్రతి ఏటా జులెైలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ నియామకాల పండుగ జోరుగా జరుగుతుండగా, ఈఏడాది నవంబర్‌ ప్రవేశించిన అటువంటి వాతావరణం కానరావడం లేదు. తాజాగా ఇన్ఫోసిస్‌ వచ్చే మూడు నెలల వరకు ఎటువంటి క్యాంపస్‌ నియామకాలు ఉండవని, కంపెనీ చవి చూస్తున్న నష్టాల భారాన్ని వీలెైనంత మేరకు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు బెంగుళూరులో ప్రకటించింది. అదే విధంగా ఉద్యోగుల శిక్షణపై వెచ్చించే ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించుకొంటున్నట్లు ఇన్ఫోసిస్‌ ఇప్పటికే ప్రకటించింది. గత ఏడాది ఈ సీజన్లో కాగ్నిజంట్‌, విప్రో, టిఎసిఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలు చేపట్టిన క్యాంపస్‌ నియామకాలతో పోల్చితే, ప్రస్తుతం ఇది నాల్గొవంతుకు పడిపోయిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.



2009 నుంచి దేశీయ ఐటీ రంగం ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటున్నప్పటికీ, 2011-12 ఆర్థిక సంవత్సరం దేశీయ ఐటీ కంపెనీలు మెరుగెైన ఫలితాలు సాధించడంతోపాటు, అన్ని స్థాయిల్లోనూ నియామకాలను మెరుగెైనట్లు జాబ్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా 2012-13 ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ మాంద్యంతో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. ఆపెై అమెరికా ఆర్థిక వ్యవస్థను శాండీ వంటి పెను తుఫాన్లు దెబ్బతీయండతో ఆప్రభావం భారత్‌ వంటి దేశా లపెై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఫలితంగా దేశీయ ఐటీ కంపెనీలు చేతిలో ఉన్న అరకొర ప్రాజెక్టులు చేజారడంతో, పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు మూత పడుతున్నాయి. దీంతో ప్రతి నెలా వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఒక హైదరాబాద్‌ మార్కెట్లోనే రోడ్డునపడడం గమనార్హం.



ఆందోళనలో ఇంజనీరింగ్‌ యాజమాన్యాలు: తాజాగా హైదరాబాద్‌ ఐటీ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా స్థానిక ఐటీ కంపెనీలతోపాటు, ఉద్యోగులు కూడా చెన్నయ్‌, బెంగుళూరు, నొయిడా, ముంబాయి, పూనే వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరులుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా పొదుపు చర్యల్లో భాగంగా ఐటీ దిగ్గజాలు చేపడుతున్న కఠిన చర్యలతో ఇంజనీరింగ్‌ కాలేజీలతోపాటు విద్యార్థులు కలవరం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 750 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉంటే, ఇప్పటికే వాటి పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. తాజా ఐటీ పరిశ్రమ ప్రతికూల పరిస్థితుల రీత్యా మరింత బెంబేలె త్తుతున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా ఐదు లక్షల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు బయటకు వస్తే, దీనిలో ఒక ఆంధ్రప్రదేశ్‌ నుంచే రెండు లక్షల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారని గణాంకాలు వెల్లడి స్తున్నాయి.



ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు ఐటీ నియామకాలు జరుగుతుంటే, దీనిలో ఒక ఏపీలోనే లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, తాజా గడ్డు పరిస్థితులు స్థానిక విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలకు మింగుడుపడడం లేదు.ఫలితంగా పీజీ ఇతర ఉన్నత చదువులపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నట్లు జామ్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజా ఐటీ పరిశ్రమల సవాళ్లపెై ఇటు రాష్ట్ర ఐటీ శాఖ గాని, అటు ఐటీ అసోసియేషన్లు గానీ స్పంధించడానికి విముఖత కనబరుస్తున్నాయి.

Monday, November 5, 2012

పసిడి... దీపావళి హ్యాట్రిక్!

పసిడి... దీపావళి హ్యాట్రిక్!
11/5/2012
వరుసగా మూడో ఏడాదీ స్టాక్‌మార్కెట్‌ను మించి లాభాలు
గత దీపావళి నుంచి 15 శాతం పెరిగిన ధర...
మూడేళ్ల కాలంలో 92 శాతం అప్...


న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు ‘కనక’వర్షం కురుస్తోంది. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి ఏటికేడు సిరుల పంట పండుతోంది. గడిచిన మూడేళ్ల కాలంలో దీపావళి నుంచి దీపావళికి చూస్తే... పసిడి ధర హాట్రిక్ లాభాలతో దూసుకెళ్తోంది. స్టాక్ మార్కెట్ల కంటే బంగారమే మెరుగైన రాబడులను అందిస్తుండటంతో ఈ ఇన్వెస్టర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. 2011 దీపావళి నాటికి రూ.26,700 స్థాయిలో ఉన్న పుత్తడి రేటు(10 గ్రాములు)... ఇప్పుడు 15 శాతం ఎగబాకి... రూ.30,700 స్థాయికి చేరింది.

అదే స్టాక్ మార్కెట్లకు ప్రామాణిక సూచీ అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ను తీసుకుంటే 17,300 పాయింట్ల నుంచి 18,755 పాయింట్లకు మాత్రమే పెరిగింది. సెన్సెక్స్ కూడా సానుకూల రాబడులనే అందించినప్పటికీ... ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాల మాదిరిగా 8.5 శాతం మేర లాభాలనే అందించడం గమనార్హం. గత దీపావళినాడు రూ.10 లక్షలను బంగారంపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్ము... ఇప్పుడు దాదాపు రూ.11.5 లక్షలు అయినట్లు లెక్క. ఇంకా దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. అదే... స్టాక్‌మార్కెట్లో సెన్సెక్స్ ప్రకారం చూస్తే రూ.10 లక్షల పెట్టుబడి ప్రస్తుతం రూ.10.85 లక్షలకు మాత్రమే పెరిగినట్లు చెప్పుకోవచ్చు.

స్వర్ణం కొత్త రికార్డులకు...
భారతీయులు స్వర్ణంపై పెట్టుబడుల విషయంలో వెనకాడటం లేదని... ఇది ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ బంగారం కొనుగోలు అనేది ఒక సంస్కృతి. అక్షయ తృతీయ, ధన్‌తేరస్, దీపావళి వంటి శుభదినాల్లో పసిడి కొనుగోలు చేస్తే మంచిదనే సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. రేటు భారీగా పెరిగినప్పటికీ... భవిష్యత్తులో కూడా బంగారం ధర కొత్త శిఖరాలను తాకుతూనే ఉంటుందనే భావనలోనే అత్యధిక శాతం మంది ప్రజలు ఉన్నారనేది పరిశీలకుల విశ్లేషణ. మరోపక్క, స్టాక్స్‌లో పెట్టుబడి అత్యంత రిస్క్‌తో కూడుకున్నదే కాకుండా... ఇంకా మన దేశంలో స్టాక్‌మార్కెట్ సంస్కృతి అంతంతమాత్రంగానే ఉండటంతో పసిడి అత్యంత అనువైన పెట్టుబడి సాధనంగా అలరారుతోంది. ఏటా భారతీయులు 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 80 వేల కోట్లు) విలువచేసే బంగారు కడ్డీలు, నాణేలు కొనుగోలు చేస్తారని అంచనా. రమారమి ఇది 270 టన్నులకు సమానం. కాగా, వచ్చే వారంలో 11న ధన్‌తేరస్, 13న దీపావళి ఉండటంతో బంగారం కొనుగోళ్ల గిరాకీ దూసుకెళ్తుందని, ఇప్పటిదాకా ఉన్న రూ.32,000 రికార్డును కూడా బద్దలుకొట్టి రేటు కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

పుత్తడి పరుగేపరుగు...
దీపావళి రోజు నుంచి లెక్కలేస్తే... గత మూడేళ్లలో పసిడి వార్షిక ప్రాతిపదిక పగ్గాల్లేకుండా పరుగులు తీస్తోంది. 2009 దీపావళి నాటికి రూ. 16,000 స్థాయిలో ఉన్న బంగారం రేటు 2010 దీపావళికి రూ. 21,100 స్థాయికి ఎగబాకింది. అంటే దాదాపు 32 శాతం మేర ఎగసింది. ఇక 2010 దీపావళి నుంచి 2011 దీపావళి వరకూ చూస్తే... 27 శాతం పెరిగింది. అదే సెన్సెక్స్ విషయానికొస్తే... 2009 నుంచి 2010 దీపావళికి 21 శాతం పెరగగా... 2010 నుంచి 2011 నాటికి 17 శాతం పైగానే పడిపోవడం గమనార్హం. ఇక 2009 నుంచి ఇప్పటిదాకా మూడేళ్ల వ్యవధికి చూసినా సరే పసిడి 92% మేర పరుగులు తీసింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 17,300 స్థాయి నుంచి 18,755 పాయింట్లకు(ప్రస్తుతం) పెరిగింది. అంటే కేవలం 8% మాత్రమే వృద్ది చెందింది. అంతకుముందు 2007-08 మధ్య స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద సగానికి పైనే ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బంగారం మాత్రం 11% రాబడులను అందించింది. ఇలా ఏవిధంగా చూసుకున్నా... లాభాలందించడంలో, సురక్షితమైన పెట్టుబడి సాధనంగానూ స్టాక్‌మార్కెట్ కంటే అత్యంత మెరుగైనదిగా పసిడి కాంతులీనుతోంది.

Courtesy : Sakshi


బంగారం హ్యాట్రిక్... వరుసగా మూడేళ్లలో స్టాక్ మార్కెట్‌కన్నా మంచి రాబడులు

  బంగారం హ్యాట్రిక్
వరుసగా మూడేళ్లలో స్టాక్ మార్కెట్‌కన్నా మంచి రాబడులు


న్యూఢిల్లీ , నవంబర్ 4 : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఏ రోజున కరిగిపోతుందో, ఏ రోజున పెరుగుతుందో కచ్చితంగా చెప్పడం కష్టమే. ఒక రోజున కోటీశ్వరుడిగా ఉన్న ఇన్వెస్టరు మరో రోజున బికారిగా మారి రోడ్డుపై పడిన తరుణాలు స్టాక్ మార్కెట్లో సర్వసాధారణం. కానీ బంగారాన్ని నమ్ముకున్న వారికి ఇలాంటి పరిస్థితి ఉండదు. ఎంతో కొంత ధర తగ్గినా నష్టం పెద్దగా ఉండదు. అయితే గణాంకాలను చూస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కన్నా బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారి సంపదే విపరీతంగా పెరిగిపోయింది. గడచిన మూడేళ్లకాలంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఇన్వెస్టర్లను కుబేరులుగా మార్చాయి. వరుస లాభాలు తెచ్చిన పసిడి ఇన్వెస్టర్లు హ్యాట్రిక్ కొట్టేలా చేశాయి.

ఈ దీపావళికి కూడా బంగారం ఇంకా పెరుగుతుందన్న అంచనాలున్నాయి. గత ఏడాది దీపావళితో పోల్చితే బంగారంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద 15 శాతం పెరిగింది. ఇది స్టాక్ మార్కెట్ పెట్టుబడులకన్నా ఎక్కువే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా పొందిన మాదిరిగా 8.5 శాతం రాబడిని పొందగలిగారు. గత దీపావళి సీజన్‌లో 26,700 రూపాయలున్న పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 30,700 రూపాయల స్థాయిలో ఉంది. అప్పుడు 10 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడదని 11.50 లక్షల రూపాయలకు పెరిగేది. వచ్చే దీపావళి వరకు ధర పెరిగితే రాబడి ఇంకా వృద్ధి చెందుతుంది.

ఈ దీపావళికి బంగారం ధర 32,000 రూపాయలకు ఎగబాకే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. నవంబర్ 12న దంతేరస్, 13న దీపావళి ఉన్న నేపథ్యంలో అమ్మకాలు జోరందుకుంటాయని అంటున్నారు. స్టాక్ మార్కెట్ విషయానికొస్తే.. గత దీపావళప్పుడు సెన్సెక్స్ 17300 పాయింట్ల స్థాయిలో ఉంది.

గత శుక్రవారంనాడు సెన్సెక్స్ 18755 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లో 10 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పుడది 10.85 లక్షల రూపాయలయి ఉండేది. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లను అదుకున్నది బంగారమే. 2007, 2008 దీపావళికి ఇన్వెస్టర్ల సంపదంతా కరిగిపోయింది. కానీ 2009లో స్టాక్ మార్కెట్ మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

దంతేరస్ అమ్మకాల్లో 40 శాతం వృద్ధి!

బంగారం ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ ధరలు డిమాండ్‌ను ఎంత మాత్రం ప్రభావితం చేయబోవని అంటున్నారు బంగారం వ్యాపారులు. దంతేరస్‌ను దృష్టిలో ఉంచుకుని వారు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దంతేరస్‌ను హిందువులు శుభ దినంగా భావిస్తారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే సిరిసంపదలు కలిసివస్తాయని విశ్వసిస్తారు. కాబట్టి ధర ఎంత ఉన్నా ఈ రోజున వినియోగదారులు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తారని వ్యాపారులు అంటున్నారు.

ఫలితంగా దంతేరస్ అమ్మకాలు 35-40 శాతం వృద్ధి చెందే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. దీపావళి తరువాత వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో అమ్మకాలు ఇంకా జోరందుకుంటాయని గీతాంజలి గ్రూప్ చైర్మన్ ఎండి మెహుల్ చోక్రి తెలిపారు. ధరలు అధిక స్థాయిలో ఉన్నందు వల్ల కస్టమర్ల ధోరణి కూడా మారుతోందని ఆయన అంటున్నారు. తక్కువ బరువున్న ఆభరణాలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని, దీని వల్ల వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.

ఇక బంగారు నాణాలకు గిరాకీ బాగా పుంజుకుందని, ఏడాది కాలంలో వీటికి డిమాండ్ 35-40 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. బంగారం ధరలు పెరగడం వల్ల తక్కువ బరువు ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని మరో నగల వ్యాపారి తెలిపారు. వచ్చే పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొంత మంది కస్టమర్లు ఇప్పటి నుంచే కొనుగోళ్లు జరుపుతున్నారని చెప్పారు. పండగల సీజన్‌లో అమ్మకాలు బాగా పెరుగుతాయి. ఇదే సమయంలో ధరలు కూడా పెరగడానికి ఆస్కారం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి డైరెక్టర్ (ఇన్వెస్ట్‌మెంట్) అమ్రేష్ ఆచార్య తెలిపారు.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు దిగిరావడం మొదలైంది. ఇదే ధోరణి కొనసాగినా, ప్రస్తుత స్థాయిలోనే ధర ఉన్నా డిమాండ్ విపరీతంగా ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఇక బంగారం అమ్మకాలు కేవలం జువెలరీ దుకాణాలకే పరిమితం కావడం లేదు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా పసిడి నాణాలను విక్రయిస్తున్నారు. గత ఏడాది 125 కిలోల బంగారు నాణాలను బ్యాంకులు విక్రయించినట్టు కోటక్ మహీంద్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు. ఈ ఏడాదిలో కనీసం 20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పండగల సీజన్‌లో బంగారం ధర 35,500-31,000 రూపాయల స్థాయిలో ఉండవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ హెడ్ (కమోటిడీస్) నవీన్ మాథుర్ అంచనా వేస్తున్నారు.

25 రోజులు వజ్రాల యూనిట్లకు సెలవు
గుజరాత్‌లోని వజ్రాల కటింగ్, పాలిషింగ్ యూనిట్లు 20 నుంచి 25 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో పరిశ్రమలకు సెలవులుంటాయని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు. సోమవారంనుంచి నాలుగు వేలకు పైగా డైమండ్ యూనిట్లలో పనులు జరగవు.

డిసెంబర్ 1వ తేదీ నుంచి మళ్లీ యూనిట్లు ప్రారంభం అవుతాయి. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం. గుజరాత్‌లోని వజ్రాల పరిశ్రమ ప్రపంచ ప్రాసెస్డ్ డైమండ్స్‌లో 72 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఎగుమతుల్లో 80 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇక్కడ సుమారు 6,547 డైమండ్ ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. వీటి ద్వారా దాదాపు ఏడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

Courtesy: Andhra Jyothy

Friday, November 2, 2012

సెన్సెక్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?

సెన్సెక్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?

ఆర్థిక వర్గాలలో 'సెన్సెక్స్' అత్యంత ప్రజాదరణ పొందిన పదం, చెప్పాలంటే అంతకు మించింది. సెన్సెక్స్ అంటే సున్నితమైన సూచిక అని అర్థం, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ కోసం ఉపయోగించే పదం. సెన్సెక్స్ భారతదేశంలో 30 స్టాక్స్‌ను ట్రాక్ చేస్తుంది, భారతదేశం లోని అతి పురాతన సూచిక.

ఎక్కువ మూలధనీకరణ స్టాక్స్, భారతదేశంలో వివిధ పారామీటర్లు, ప్రాతినిధ్యం ఆధారంగా 30 స్టాక్స్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుత ఉన్న రోజుల్లో సెన్సెక్స్‌ను మార్కెట్ల భారమితిగా భావిస్తున్నారు. దీనితో పాటు మార్కెట్ ధోరణి వర్ణించేందుకు ఉపయోగిస్తారు.

సెన్సెక్స్‌‌ను ఎలా లెక్కిస్తారు..?

సెన్సెక్స్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న అతి పెద్ద 30 స్టాక్స్‌ తెలిసిన ఒక పద్ధతి ద్వారా "ఉచిత ఫ్లోట్ మార్కెట్ మూలధనీకరణ" పద్ధతిని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న పద్దతిన లెక్కిస్కారు. ఒక కంపెనీలో కొన్ని షేర్లు తప్ప వాటాలు అందుబాటులో లేనప్పుడు
స్థాపకులు లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటాలను అందుబాటులోకి తీసుకరాకపోవచ్చు.

బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏమిటీ...?

బ్లూ చిప్ స్టాక్స్ అనేవి అధిక-నాణ్యత మరియు అధిక ధర స్టాక్ లక్షణములు కలిగి ఉంటాయి. ఈ స్టాక్స్ కంపెనీలు కలిగి ఉండడం వల్ల పెట్టుబడిదారు కాన్పిడెన్స్ తో పాటు కంపెనీలు ఎంతో ఎత్తులో ఉంటాయి. ఈ స్టాకులు పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు సహాయం చేస్తాయి. బ్లూ చిప్ స్టాక్స్ కలిగి ఉన్న కంపెనీలు ఆర్దిక పరంగా మంచి స్ట్రాంగ్‌గా ఉంటాయి.

ఈ బ్లూ చిప్ స్టాక్స్ పెట్టుబడిదారులకు సంపదను తెచ్చి పెట్టే విధంగా వ్యవహారిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్స్‌లో గట్టి పట్టుని కలిగి ఉన్న కంపెనీలు మాత్రమే ఈ బ్లూ చిప్ స్టాక్స్‌ని కలిగి ఉంటాయి. భారత దేశంలో ఈ బ్లూ చిప్ స్టాక్స్ విషయానికి వస్తే వాటాలు సెన్సెక్స్ మరియు నిప్టీ వాటాల రూపంలో భాగమై ఉంటాయి. ఉదాహారణకు ఎల్ అండ్ టి, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటిసి, బజాజ్ ఆటో మొదలగునవి.

ఈ వాటాల కొన్ని అధిక మూలధనీకరణ స్టాక్స్ ఉంటాయి. ఐతే బ్లూ చిప్స్ స్టాక్స్‌లో పెట్టిన పెట్టుబడులకు గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయనే నమ్మకం లేదు.

సర్క్యూట్ ఫిల్టర్లు అంటే ఏమిటి?

సర్క్యూట్ ఫిల్టర్లు ఎంపిక చేసిన సెక్యూరిటీస్, స్టాక్ ధరల చలనానికి పరిమితం చేయడానికి భారతదేశం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ (సెబి) ద్వారా విధించబడిన ధర బాండ్లు. వీటి సహాయంతో ఆపరేటర్లు తారుమారు చేసిన వాటా ధరలను అరికట్టవచ్చు. ఈ సర్కూట్ ఫిల్టర్లను స్టాక్ ఎక్స్చేంజ్ లు పరిచయం చేశాయి. సెబీ నిబంధనల ఆధారంగా స్టాక్ ప్రైజెస్‌లో స్టీల్ పెరిగిందా లేదా తగ్గిందా తెలుసకోవచ్చు.

సర్క్యూట్ ఫిల్టర్లు ఎలా పని చేస్తాయి..?

స్టాక్ ధర తప్పినప్పుడు ఆ ఖచ్చితమైన స్టాక్ వర్తకం, స్టాక్ ఎక్సేంజ్ ద్వారా నిర్ణయించుకుంటుంది. దీంతో బ్యాండ్ ధర నిర్దేశించినప్పుడు సస్పెండ్ చెయ్యబడుతుంది. ఉదాహరణకు మీరు గనుక రూ 100 రూపాయలను షేర్ చేయాలనుకుంటే, ఆ సందర్బంలో 5% సర్క్యూట్ బ్రేకర్ ఉంటే, షేరింగ్ ధర రూ 105 కంటే ఎక్కువ ఉంటే ట్రేడింగ్‌ను నిలిపి వేస్తారు. అదే విధంగా స్టాక్ రూ 95 కంటే తక్కువైతే, దిగువ ముగింపు సర్క్యూట్ ఫిల్టర్ వర్తించబడుతుంది. దీంతో వ్యాపారం సస్పెండ్ చెయ్యబడింది.

సర్క్యూట్లు స్టాక్ ఎక్సేంజ్ ఎంత వరకు పరిమితం

సూచికలు కోసం మొత్తం మూడు సర్క్యూట్ ఫిల్టర్స్ ఉన్నాయి 10%, 15%, 20%. ఏదైతే ముందుగా సెన్సెక్స్ లేదా నిఫ్టీని ముందుగా మొదటి పరిమితిని విభజిస్తుందో అప్పుడు ఈ ఫిల్టర్లును అనువర్తిస్తారు. ట్రిగ్గర్ కూడా అది జరిగే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

10% drift on either side
If the drift is before 1 pm – 1 hour halt
If the drift is after 1 but before 2:30 pm – half an hour halt
If the drift is after 2.30 pm – no halt

15% drift on either side
If the drift is before 1 pm – 2 hours halt
If the drift is after 1 pm but before 2 pm- 1 hour halt
If the drift is after 2 pm – no further halt

20% drift in either direction
In case of a 20% movement in either index, the trading will halt for the remainder of the day.

సర్క్యూట్ ఫిల్టర్లు ద్రవ్యత్వం లేని సర్టిఫికెట్ విషయంలో తగ్గించబడతాయి. స్టాక్ ఎక్సేంజ్ నిర్ణయం ద్వారా సర్క్యూట్ ఫిల్టర్స్ ఆధారంగా10% లేదా 5% లేదా 2% తగ్గిస్తారు.

COURTESY : తెలుగు వన్ఇండియా

Monday, September 3, 2012

భారత్ - బంగారం

భారత్ - బంగారం
అన్ని రకాల లోహాలతో తయారు చేసిన ఆభరణాలు ధరించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఒక ప్రాంత సంస్కృతినీ, సంప్రదాయాలను, వేషభాషలను కించపరచడం, హేళన చేయడం మంచిపద్దతికాదు. ‘పీపుల్స్ డెయిలీ’ భారత్ కు క్షమాపణలు చెప్పాలి.
 
మనదేశంలో బంగారు ఆభరణాల ధరించడంపై చైనా అధికారిక పత్రిక ‘పీపుల్స్ డెయిలీ’ అర్థంపర్ధంలేని కథనాన్ని ప్రచురించింది. అభ్యంతరకరమైన రాతలు రాసింది. ఇందుకు ఆ పత్రిక భారత్ కు క్షమాపణలు చెప్పాలి. భారత ప్రభుత్వం కూడా నిరసన తెలుపవలసిన అవసరం ఉంది.

ఆధునిక యుగంలో భారతదేశమంటే చైనాకు ఈర్ష, ద్వేషాలు ఎక్కువ.వీలు దొరికినప్పుడల్లా తన ద్వేషాన్ని వెళ్లగక్కుతూ వస్తోంది. తాజాగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు ధరించడంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. బంగారు ఆభరణాలపై భారతీయులకు గల మోజును కించపరుస్తూ చైనా విద్వేషాన్ని వెళ్లగక్కింది. బంగారు ఆభరణాలంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఈ ఇష్టం ఈనాడు కొత్తగా వచ్చింది కాదు. వేల సంవత్సరాలుగా మన దేశంలో స్వర్ణాభరణాలను ధరించడం ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని చైనా కించపరిచింది. భారతీయుల నల్లని శరీరంపై బంగారం ధగధగలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చైనా అధికార పత్రిక పీపుల్స్‌ డెయిలీలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాసంతోపాటు ఐశ్వర్యారయ్‌ సహా పలువురు మోడళ్లు ఆభరణాలు ధరించిన ఫోటోలను ప్రచురించి జాత్యంహకార వ్యాఖ్యలు చేసింది. బంగారు చెవి రింగులు, నెక్లెసులు ధరించిన మహిళలు మన దేశంలో ఎటు చూసినా కనిపిస్తారని రాసింది. చివరకు రోడ్ల పక్కన భిక్షం అడుక్కునే బాలికలు సైతం ముక్కు పుడకలు ధరించి కనిపిస్తారని ఆ కథనంలో పేర్కొంది. ముక్కు పుడక లేకుండా భారతీయ మహిళలు బయటకు వెళ్లరని వ్యాఖ్యానం చేసింది. మన దేశంలో పురుషులు సైతం బంగారు ఆభరణాలు ధరించడం సర్వ సాధారణమని చెప్పింది. మూడేసి ఉంగరాలు, భారీ బంగారు ఆభరణాలు ధరించిన మగవారు భారతదేశంలో చాలా మంది కనిపిస్తారని రాసింది. పెళ్లిళ్లలో వధువు తల్లిదండ్రులు స్వర్ణాభరణాలను కట్నంగా ఇస్తారన, ఇవి పెళ్లికూతురు అందాన్ని కనబడకుండా చేస్తాయని పేర్కొంది. ఈ ఆభరణాలకు వధువు వైవాహిక జీవితంలో ఆస్తిగా ఉపయోగపడతాయని వ్యాఖ్యానించింది.

మన దేశంలో చిన్న చిన్న పట్టణాల్లో సైతం ధగధగలాడే దుకాణాలు దర్శనమిస్తాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ఏడాది బంగారం దిగుమతుల్లో ఇండియాను చైనా అధిగమిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధికార దినపత్రిక పీపుల్స్‌ డైలీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ మన బంగారు ఆభరణాలపై అర్థం లేని రాతలు రాసింది.

బంగారు ఆభరణాలకు భారతదేశానికి విడదీయరాని సంబంధం ఉంది. ఆభరణాలు మనదేశ సంస్కృతిలో ఒక భాగం. ప్రపంచంలో అత్యంత పురాతనమై నాగరికతల్లో ఒకటైన సింధూనాగరికతలో కూడా ఇక్కడివారు అనేక ఆభరణాలు ధరించారు. రాళ్ల దగ్గర నుంచి ప్లాటినం వరకు అన్ని రకాల లోహాలతో తయారు చేసిన ఆభరణాలు ధరించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. క్రీస్తు పూర్వం నుంచి భారత దేశం సంపన్న దేశం. స్వర్ణయుగాలు నడిచాయి ఇక్కడ. ఇక్కడ సంపదని కొల్లగొట్టడానికి గ్రీకులు, మహమ్మదీయులు, మొగలాయిలు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఆంగ్లేయులు .. ఇలా అనేకమంది మన దేశంపై దాడులు, దండయాత్రలు చేశారు. మన సంపదని కొల్లగొట్టారు. బంగారు నగలు, మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు దోచుకువెళ్లారు. స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఆభరణాలు ధరించడం ఇక్కడి ఆచారం. రాజుల కాలంలో బంగారు సింహాసనాలు ఉండేవి. రాజులు బంగారు కిరీటాలు, ఆభరణాలు ధరించేవారు. ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాలు మనదేశంలో ఉండేవని చరిత్ర చెబుతోంది. ఎంతమంది ఎంత సంపద దోచుకువెళ్లినా మనదేశంలో బంగారానికి కొందవలేదు. అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో ఇటీవల బయటపడిన సంపదే అందుకు నిదర్శనం. ఇంకా వివరించి చెప్పవలసిన అవసరంలేదు. మహిళలు బంగారు ఆభరణాలు ధరించే విషయంలో ధనిక, పేద అన్న తేడా ఉండదు. ఇక్కడ మహిళలందరూ వివాహానికి గుర్తుగా బంగారు మంగళసూత్రాలను ధరిస్తారు. సామూహిక వివాహాలు జరిపించేవారు కూడా బంగారు మంగళసూత్రాలను ఉచితం ఇస్తారు. మంగళసూత్రం అనేది ఇక్కడ సంస్కృతి ఒక భాగం.

ఇప్పడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం ధగధగలాడే దుకాణాలు ఇక్కడ ఉన్నట్లు ‘పీపుల్స్ డెయిలీ’ రాసింది. ఇప్పుడేమిటి వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ అంగళ్లలో రత్నాలు అమ్మారు. ఆనాడే బంగారు దుకాణాలు ధగధగలాడాయి. ఇదంతా చారిత్ర చెబుతున్న సత్యం. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో బంగారానికి, నవరత్నాలకు కొదవలేదు. దేవాలయాలు నిర్మించే సమయంలో శంకుస్థాపనల సందర్భంగా, ధ్వసస్థంభం ప్రతిష్టాపన సమయంలో ఇప్పుడు నవధాన్యాలు వేస్తున్నారు. అప్పట్లో నవధాన్యాలతోపాటు బంగారం,నవరత్నాలు, వజ్రవైఢూర్యాలు వేసేవారు. వాటినే ఇప్పుడు గుప్త నిధులుగా వెలికితీస్తున్నారు. రాయలు పరిపాలించిన ప్రాంతం అంతా ఈ రకమైన గుప్తనిధులు బయటపడుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్నో నిధులు ఉన్నాయి.

ఒక దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, భాషని, మాండలికాలను కించపరిచేవారు నైతికంగా పతనమైనట్లే లెక్క. అటువంటి వ్యాసాలను ప్రచురించే పత్రికలు విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్లే భావించాలి. ఒక ప్రాంత సంస్కృతినీ, సంప్రదాయాలను, వేషభాషలను కించపరచడం, హేళన చేయడం మంచిపద్దతికాదు. ఇటువంటి దిగజారుడు రాతలను ఖండించవలసిన అవసరం అందరిపైన ఉంది.  
(Sakshi Telugu Daily)