Thursday, July 10, 2014

బడ్జెట్ ముఖ్యాంశాలు 2014-15

 (ఈనాడు సౌజన్యంతో)
* ప్రణాళికా వ్యయం రూ.17.9 లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.12.20లక్షల కోట్లు
* పన్నుల రేటులో మార్పులు లేవు
* 2018 నాటికి జాతీయ బ్యాంకుల్లో రూ.2.4లక్షల కోట్ల మూలధనం సమీకరణ
* ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల నుంచి రూ.2.50లక్షలకు పెంపు. సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు. 80సీసీ పరిమితి రూ.లక్షన్నరకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు.
* గృహ రుణాలపై పన్ను మినహాయింపు రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షలకు పెంపు
* తపాలాశాఖ పొదుపు పథకాల్లోని నగదు వినియోగంపై దృష్టి
* పీపీఎఫ్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంపు
పర్యాటక కేంద్రంగా గయ
* హస్తకళల పునరుద్ధరణకు రూ.30కోట్లతో అకాడమీ ఏర్పాటు
* ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014-2015లో రూ.2.4లక్షల కోట్ల పెట్టుబడులు
* ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా గయ నగరం
* పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ.100కోట్లు
* దేశవ్యాప్తంగా మరో 12 వైద్యకళాశాలలు
* జాతీయ స్పోర్ట్స్ అకాడమీలో అన్ని ప్రధాన క్రీడలకు శిక్షణ
* బెంగళూరు, ఫరీదాబాద్‌లో బయోటెక్ క్లస్టర్ల అభివృద్ధి
మినహాయింపులు, ప్రోత్సాహాలు
* 19 అంగుళాల టీవీ తయారు చేసే స్వదేశీ సంస్థలకు పన్ను రాయితీ
* విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్లపాటు పన్ను మినహాయింపు
* కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం.
* సబ్బుల ధరలు తగ్గే అవకాశం.
* గాలిమరల విద్యుత్‌కు పన్ను ప్రోత్సాహకాలు.
* సున్నపురాయి, డోలమైట్‌లపై పన్ను రాయితీ
* ఇనుము ధరలు తగ్గే అవకాశం.
* కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఉత్పత్తులపై పన్ను రాయితీ.
* పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12శాతం నుంచి 6శాతానికి తగ్గింపు.
* స్టెయిన్‌లెస్ స్టీల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు
వీటి పన్నులు పెరిగాయి
* రేడియో టాక్సీలపై సేవాపన్ను విధింపు.
* మ్యూచువల్ ఫండ్స్ బదలాయింపుపై పన్ను పెంపు
* శీతలపానీయాలు, పాన్ మసాలాలు ప్రియం
* బాక్సైట్ ఎగుమతిపై సుంకం 10 నుంచి 20శాతానికి పెంపు
* బ్రాండెడ్ దస్తులు, ప్యాకేజ్‌డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం
* పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 16శాతానికి పన్ను పెంపు

ఎఫ్‌డీఐలు 49 శాతం
* రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతానికి పెంపు, ఎఫ్‌డీఐలపై ప్రభుత్వ నియంత్రణ
* సరిహద్దుల భద్రతకు రూ.2,250కోట్లు
* బీమారంగంలోనూ ఎఫ్‌డీఐలు 49 శాతానికి పెంపు
* ప్రతీ ఇంటికి రెండు బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు
ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐలు
ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. దేశంలో అనూహ్యంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగంలో ఎఫ్‌డీఐలతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొంటుందని ఆర్థికనిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎంత శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఏడు పారిశ్రామిక నగరాలు
దేశంలో తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దేశవ్యాప్తంగా ఏడు పారిశ్రామిక నగరాలు ఏర్పాటుచేస్తామన్నారు.
* దేశంలో తయారీ రంగం ఇంకా ప్రాథమికదశలోనే వుంది.
* తయారీ సంస్థలు తాము తయారుచేసిన ఉత్పత్తుల్ని రిటైల్ రంగం, ఈ-కామర్స్ విధానాల ద్వారా విక్రయించాల్సివుంది.
* ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ తిరిగి వృద్ధి చెందుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి.
* రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో జీడీపీ 7-8 శాతానికి చేరుకుంటుంది.

ఆంధ్రా, తెలంగాణలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే..
ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఇవాళ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులిలా ఉన్నాయి..

*  ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ ఏర్పాటు
*  వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు
*  దేశవ్యాప్తంగా నెలకొల్పే నాలుగు ఎయిమ్స్ సంస్థల్లో ఒక దానిని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనున్నారు.
*  ఎయిమ్స్‌సంస్థల ఏర్పాటుకు రూ.500 కోట్ల కేటాయింపు
*  కాకినాడ పోర్టుకు సమీపంలోని ప్రాంతాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తించడం
*  కాకినాడలో హార్డ్‌వేర్ పరిశ్రమను నెలకొల్పడంపై ప్రత్యేకదృష్టి
*  విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
*  హిందూపురంలో నేషనల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ
*  ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీగా కృష్ణపట్నం

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: జైట్లీ
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. 2014-15 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయా మంత్రిత్వశాఖలు, అధికారం యంత్రాంగం సకాలంలో చేపడుతాయి ' అని అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఉద్యానవన విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

బాలికల కోసం 'బేటీ పఢావో బేటీ బఢావో'
* బాలికల సంరక్షణ కోసం 'బేటీ పఢావో బేటీ బఢావో' పథకం
* ఈ పథకానికి రూ. 500 కోట్లు కేటాయింపు.
* మహిళల సమస్యల పరిష్కారం కోసం దేశరాజధానిలో ఒక కేంద్రం
లింగవివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో విద్యాబోధన జరిగేలా మార్పులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

డిజిటల్ ఇండియాకు రూ. 500 కోట్లు
* గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ సేవలు విస్తృతానికి డిజిటల్ ఇండియాలో భాగంగా రూ. 500 కోట్లు కేటాయింపు.
* స్థానిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు ప్రోత్సాహం
* అన్ని గ్రామాలను బ్రాడ్‌బాండ్‌తో అనుసంధానం చేస్తారు.

మౌలిక రంగానికి
* పారిశ్రామిక కారిడార్లకు సమాంతరంగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
* తమిళనాడు, రాజస్థాన్‌లలో సౌర విద్యుత్‌కు రూ.500కోట్లు.
* ఉపాధి హామీకి వ్యవసాయంతో అనుసంధానం.
* ప్రధమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటు.
* జాతీయ వారసత్వ సంపద పరిరక్షణ యోజనకు రూ.200కోట్లు
* మెరైన్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.115కోట్లు
* నదుల అనుసంధానంపై అధ్యయనానికి రూ.100కోట్లు
* ప్రధానమంత్రి కృషి సీంచాయీ యోజన కింద నీటిపారుదల వసతుల మెరుగుకు వెయ్యి కోట్లు
* దేశవ్యాప్తంగా మరో 60 ఆదాయపన్ను కేంద్రాల ఏర్పాటు
* రూ.200 కోట్లతో జమ్మూకాశ్మీర్‌లో క్రీడా సదుపాయాల పెంపు
* ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాల విస్తరణకు రూ.వెయ్యికోట్లు
* కాశ్మీర్ శరణార్థుల సంక్షేమానికి రూ.500 కోట్లు