Tuesday, March 19, 2013

2013-14 budget eenadu news

ఎన్నికల ఏడాదిలో బడుగులే లక్ష్యంగా నిధుల గుమ్మరింపు వైద్యం, ఆరోగ్యం సహా కీలక రంగాలకు కత్తెర.. యూజర్ ఛార్జీల మోత 2013-14 బడ్జెట్ రూ.1.61,348 కోట్లు వృద్ధిరేటు మందగించినా రూ.22 వేల కోట్లు పెంపు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విత్తమంత్రి ఆనం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ ప్రతిపాదన విపక్షాల విమర్శలతో.. వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికగా మార్పు ఆదుకుంటారో లేదో తెలియదు. అయిననూ చివరాఖరి ప్రయత్నం చేయక తప్పదు! అందుకే ఆర్థిక మంత్రి ఆనంవారు భారీ వరాల జల్లులూ, ఆర్భాట సందోహాలేవీ లేని బడ్జెట్ తూణీరంలోంచి కొన్ని పూలబాణాలు తీశారు. వాటిని- సరిగ్గా తమను ఆదుకుంటారని ఆశపడుతున్న వర్గాలవైపే గురిపెట్టారు. ఎన్నికల సమర ప్రాంగణంలో ప్రవేశించబోతున్న తుది అంకంలో.. దాదాపు ఆఖరి బడ్జెట్ ఘట్టంలో.. ఆశ్చర్యకరంగా విత్తమంత్రి అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణ మంత్రాలేవీ చదవలేదు. జనం నెత్తిన వరాల జల్లులేవీ కురిపించ లేదు. తమకు బాసటగా నిలుస్తారని ఆశపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వంటి అక్షౌహిణులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని.. వారివైపు మాత్రమే కొన్ని పూల బాణాలు వదిలారు. మరోవైపు- మధ్యతరగతి జీవుల నెత్తిన కనిపించని కొరడాలు ఝుళిపించారు. పన్నులంటూ, వ్యాట్, యూజర్ ఛార్జీలంటూ, రిఖ్ణ్మీ;స్ట్రేషన్ రుసుములంటూ.. అటూ ఇటూగా బాగానే వాయించారు. గత ఏడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్ల మేర పిండుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. పైగా అత్యంత కీలకమైన విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలకు కొద్దికొద్దిగా కత్తెరలు కూడా వేశారు. మొత్తానికి ఆయన కళ్లన్నీ 'ఓటు బ్యాంకు' మీదే! అయితే... ఆయనైతే బడుగులకు గురి పెట్టారుగానీ.. మరివారికి ఈ సర్కారు మీద 'గురి' కుదురుతుందో లేదో చెప్పటం మహా కష్టం. అందుకే ఆనం వారి బడ్జెట్ పత్రం.. ఆశలు వదులుకోలేని ఒక ప్రయత్నం! ఓటరుపై 'ఆన'ం బడుగుల్ని అకట్టుకొనే పథకాలకు నిధుల గుమ్మరింపు వైద్యం, ఆరోగ్యం సహా పలు కీలక రంగాల వాటాలకు కత్తెర ఈనాడు - హైదరాబాద్ ఆనం గల్లాపెట్టె 'ఓటు' మోత మోగింది. ప్రాధాన్య రంగాల్ని పక్కనబెట్టింది. ''దారిద్య్రానికి మూలం నిధుల కొరత కాదు. సరైన మార్గాల్ని అనుసరించకపోవటమే'' అంటూ అమర్త్యసేన్ చెప్పిన మాటల్ని వల్లెవేసిన విత్తమంత్రి అనం దారిద్య్ర నిర్మూలన మార్గాలకు పెద్దపీట వేయాల్సింది పోయి.. 2014లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా, వివిధ వర్గాల్ని అకర్షించటమే ధ్యేయంగా 2013-14 వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. వైద్యం, గృహ నిర్మాణం వంటి కీలక రంగాల్ని సైతం విస్మరించి ఓటరన్న దీవెనలు పొందడంపైనే దృష్టిపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో వారికి సంబంధించిన పథకాల ప్రస్తావనే ఎక్కువగా చోటు చేసుకొంది. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో మున్ముందు రాజకీయంగా ప్రయోజనాల్ని పొందటమే ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ పరమార్థంగా ఉంది. ఇదే ఆఖరి అవకాశం... లెక్కప్రకారమైతే.. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2014 ఏప్రిల్, మే నెలల్లో జరుగుతాయి. ఆ ఎన్నికల నాటికి రాష్ట్ర సర్కారు చేతిలో చిట్టచివరి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఇది మాత్రమే. 2014 ఎన్నికల వేళ ప్రభుత్వం కేవలం కొద్ది రోజుల ఖర్చులకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టటమే తప్ప 2014-15కు పూర్తిస్థాయి బడ్జెట్‌కు రూపకల్పన చేసే అవకాశం ఉండదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ తన ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసుకోవటం కోసమే సర్కారు ఇలా చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి బడ్జెట్ మాత్రమే సర్కారు వద్ద ఉండే ప్రధాన, చివరి ఆయుధం కాబట్టి.. కొన్ని వర్గాల వారిని అకట్టుకొనేలా తీర్చిదిద్దుకొనేందుకు ప్రభుత్వం చాలా తంటాలు పడింది. వ్యవసాయం తీవ్రసంక్షోభంలో చిక్కుకొని రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు 5.29 శాతానికి పరిమితమైన నేపథ్యంలో కూడా 2012-13 సవరణ బడ్జెట్ కంటే రూ.22 వేల కోట్లను కొత్త బడ్జెట్‌లో అదనంగా చేర్చింది. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే పథకాలను కూడా ప్రత్యేకంగా ప్రవేశపెట్టేందుకు సర్కారుకు సాధ్యంకాదు. అందుకే ప్రస్తుత బడ్జెట్‌లో ఆయా వర్గాలకు ఇచ్చిన నిధులకు అనుగుణంగా త్వరలోనే కొన్ని పథకాలను ప్రవేశపెట్టి ఎన్నికల వేళ ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది. ప్రధాన రంగాలకు తగ్గిన కేటాయింపులు మొత్తం రూ.1.61 లక్షల కోట్లతో తయారుచేసిన బడ్జెట్‌లో పలు ప్రధాన రంగాలకు పొందుపరిచిన ప్రణాళిక, ప్రణాళికేతర కేటాయింపుల శాతం నడుస్తున్న 2012-13 బడ్జెట్ కంటే తగ్గిపోయింది. తాను లక్ష్యంగా నిర్దేశించుకొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మాత్రం ఎక్కువ నిధుల్ని ఇవ్వటంతో వారికి ప్రస్తుత 5.31 శాతం నుంచి 7.01 శాతానికి నిధులు పెరిగాయి. ఈ నిధులు ఆయా వర్గాల్ని ఆకర్షించే పథకాలకు వెళ్లాయి. అయితే అదే వర్గాలు విరివిగా ఉపయోగించుకొనే ఆసుపత్రులపై మాత్రం సర్కారుకు దయ కలగలేదు. వైద్యానికి ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కేటాయింపుల వాటాను బడ్జెట్ మొత్తంలో 4.04 శాతం నుంచి 4.02 శాతానికి కుదించేసింది. దేశంలో పలు ప్రధాన రాష్ట్రాల కంటే ఇక్కడే తక్కువగా కేటాయిస్తున్నారంటూ రిజర్వు బ్యాంకు ఇటీవల వెల్లడించిన నేపథ్యంలోనైనా వైద్యం వాటాను పెంచలేదు. విద్యకు కుదింపు విద్యా రంగంలో రాష్ట్రంలోని కేటాయింపు శాతం మిగతా అన్ని రాష్ట్రాల కంటే బాగా తక్కువనే విషయాన్నీ ఆర్‌బీఐ చెప్పింది. ఇప్పుడు కేటాయింపును పెంచాల్సిందిపోయి విద్యా రంగానికి 12.70 శాతం వాటాను 12.30 శాతానికి కుదించింది. అంటే తాను అకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్న వర్గాలకు విద్య, వైద్యం సరిగ్గా సమకూరకపోయినా సర్కారుకు ఏమీ పట్టదు. అవి రెండూ తన లక్ష్య సాధనకు మార్గాలను ఏర్పరచలేవు కాబట్టే సర్కారు ఇలా వ్యవహరించింది. తనకు అక్కరకు వస్తారని భావించటం వల్లనే బీసీల సంక్షేమ కేటాయింపును రూ. 2,656 కోట్ల నుంచి రూ.3,632 కోట్లకు పెంచింది. ఎస్సీలకు చెందిన సాంఘిక సంక్షేమ కేటాయింపును రూ.1,719 కోట్ల నుంచి ఏకంగా రూ.3,077 కోట్లకు పెంచేసింది. ఎస్టీలకు మరో రూ.500 కోట్లు అదనంగా ఇచ్చింది. మైనారిటీలకు ప్రస్తుతమున్న రూ.482 కోట్లను ఏకంగా రూ.1,020 కోట్లకు తీసుకెళ్లింది. నడ్డీ విరుస్తారు... బడుగు వర్గాల ఓట్లను దండుకోవాలనే సన్నాహాల్లో ఉన్న సర్కారు మళ్లీ అవేవర్గాలు ఉపయోగించే పప్పులు, సబ్బులు, బియ్యం సహా పలు వస్తువులపై విపరీతంగా పన్నుల్ని పిండదలచింది. సొంత పన్నుల రాబడుల్ని 2012-13 సవరించిన బడ్జెట్ కంటే దాదాపు రూ.10 వేల కోట్ల మేర పెంచి రూ.72 వేల కోట్ల మేర రాబట్టదలిచింది. ఇందులో వస్తువులపై వ్యాట్ ద్వారా వచ్చే మొత్తమే రూ.52 వేల కోట్ల మేర ఉంటుంది. సవరించిన బడ్జెట్‌తో పొలిస్తే ఇది రూ.10 వేల కోట్ల ఎక్కువ. అనేక వస్తువుల్ని గరిష్ఠ పన్ను రేటు పరిధిలోకి తెచ్చినప్పుడే ఇంతటి రాబడి సాధ్యమవుతుంది. భూముల రిఖ్ణ్మీ;స్ట్రేషన్ రుసుముల్ని బాగా పెంచాలని కూడా సర్కారు సంకల్పించింది. రిఖ్ణ్మీ;స్ట్రేషన్ల రాబడి లక్ష్యాన్ని ఏకంగా రూ.6,414 కోట్లకు చేర్చింది. ప్రస్తుత సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.1,464 కోట్లు ఎక్కువ. ఇక త్వరలో మోటారు వాహనాల జీవిత కాల పన్నులు కూడా పెరగబోతున్నాయని కొత్త బడ్జెట్‌లోని రవాణా శాఖ రాబడి లక్ష్యం వెల్లడిస్తోంది. వాహనాలపై సుంకాల రాబడి లక్ష్యాన్ని రూ.745 కోట్లు ఎక్కువతో రూ. 4,352 కోట్లగా పొందుపరిచింది. వివిధ రిఖ్ణ్మీ;స్ట్రేషన్లతో సహా వివిధ శాఖల్లో యూజర్ ఛార్జీల బాదుడు కూడా పెరగబోతోంది. సాకారమయ్యేనా? సర్కారుకు రాబడులు పెరగాలంటే వ్యవసాయం బాగుండాలి. కానీ వ్యవసాయ వృద్ధిరేటు ప్రస్తుతం తిరోగమనంలో ఉంది. పరిశ్రమలదీ ఇదే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో సర్కారు ఆర్భాటంగా తెచ్చిన బడ్జెట్ ఆయా వర్గాలకు నిజంగా ఉపయోగపడుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తంకావటం సహజం. బడ్జెట్‌లో చెప్పినట్టుగా చేయలేకపోతే సర్కారువన్నీ ఎన్నికల వేళ ఉత్తుత్తి వాగ్దానాలుగానే మిగిలిపోతాయి. అప్పులు భారం ప్రభుత్వం అప్పుల్ని కూడా ఈసారి ఎక్కువగానే తేదలచింది. ఇప్పటికే అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయినా మరిన్ని అప్పులకు ఎగబడదలచింది. మొత్తం రూ.24,487 కోట్ల నికర అప్పుల్ని తేబోతోంది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.85 శాతం. 2012-13 బడ్జెట్‌కు నికర అప్పుల్ని 20 కోట్ల మేర తెస్తామని తొలి అంచనాల్లో చెప్పి సవరించిన అంచనాల్లో దాన్ని రూ.21 వేల కోట్లకు పెంచింది. వైఎస్ హయాంలో మొదలైన భూముల అమ్మకాలను ఏ సర్కారూ వదిలిపెట్టడం లేదు. కొత్త బడ్జెట్‌లో భూములపై రూ.37 కోట్లను లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఓటాన్ అకౌంట్ కూడా.. 2013-14 ఆర్థిక సంవత్సరం మొదటి 3నెలల ఖర్చులకుగాను దాదాపు రూ.40వేల కోట్లతో ఓటాన్ అకౌంట్‌నూ ప్రభుత్వం ఈ పూర్తిస్థాయి బడ్జెట్‌లో నుంచే ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను విశ్లేషించడం కోసం కొత్తగా స్థాయి సంఘాలు ఏర్పాటయినందున ఈ ఓటాన్ అకౌంట్ ఆవశ్యకత ఏర్పడింది. ఓటాన్ అకౌంట్‌కు ఈ నెల 26వ తేదీన, పూర్తిస్థాయిబడ్జెట్‌కు మే 2న ఆమోదం లభిస్తుంది.