Tuesday, March 19, 2013

State Budget 2013-14 (Eenadu)

రూ. 1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్.. ముఖ్యాంశాలు

 హైదరాబాద్: 2013-14 బడ్జెట్‌ను రూ.1,61,348 కోట్ల అంచనాతో ఆర్థికశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనాలు * ప్రణాళికావ్యయం రూ. 59,422 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,926 కోట్లు * ద్రవ్యలోటు రూ. 24,487 కోట్లు * రెవెన్యూ మిగులు రూ. 1023 కోట్లు * 12వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్ర వృద్దిరేటు 10 శాతం ఉండేలా లక్ష్యం విద్యకు కేటాయింపులు ఉన్నత విద్యకు రూ. 482 కోట్లు పాఠశాల విద్యకు 16,990 కోట్లు విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపునకు రూ. 250 కోట్లు 7వ తరగతి వరకు మెస్‌ఛార్జీలు రూ.475నుంచి రూ. 750కు పెంపు 8నుంచి 10వ తరగతి వరకు మెస్‌ఛార్జీలు రూ. 535 నుంచి రూ. 850కు పెంపు ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు మెస్‌ఛార్జీలు రూ. 520 నుంచి రూ. 1050కు పెంపు ఎస్సీ, బీసీ విద్యార్థులకు రాజీవ్ దీవెన పథకం ద్వారా ఉపకారవేతనాలు అందజేయనున్నారు. దీని వల్ల సుమారు మూడు లక్షలమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని ఆర్థిక మంత్రి అంచనా. నెల్లూరులో మరో వైద్య కళాశాల ఏర్పాటుకు పరిపాలన పరమైన అనుమతి లభించింది. దీనికోసం బడ్జెట్‌లో రూ. 352 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ రూ. 2126 కోట్లు వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 4027కోట్లు మహిళా శిశు సంక్షేమం రూ. 2712 కోట్లు సాంఘిక సంక్షేమ శాఖకు రూ. 4,122 కోట్లు మైనార్టీ సంక్షేమశాఖకు రూ. 1027 కోట్లు ఎస్సీ కులాల ఉప ప్రణాళికకు రూ. 8585కోట్లు ఎస్టీల ఉప ప్రణాళికు రూ. 3,666 కోట్లు బీసీ కార్పోరేషన్, సొసైటీలకు రూ. 436 కోట్లు వికలాంగుల సంక్షేమానికి రూ. 73 కోట్లు శాంతిభద్రతలు శాంతి భద్రతలకు రూ. 5,386 కోట్లు పోలీసు శిక్షణాసంస్థల ఆధునీకరణకు రూ. 100 కోట్లు హైదరాబాద్‌లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు సేవలు మౌలికసదుపాయాల కల్పనకు రూ. 180 కోట్లు పరిశ్రమలు వాణిజ్యశాఖ రూ. 1120 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ రూ. 6481 కోట్లు రహదార్లు, రవాణాశాఖకు రూ. 7117 కోట్లు పౌరసరఫరాలశాఖకు రూ. 3,231కోట్లు యువజన సేవలకు రూ. 280 కోట్లు పట్టణాభివృద్ధిశాఖకు రూ. 6,770 కోట్లు అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం కింద రూ. 2,700 కోట్లు రాష్ట్రంలో అన్నీ ప్రాంతాల క్రీడాప్రాంగణాల ఏర్పాటకు రూ .200 కోట్లు రాష్ట్రరాజధాని నగరంలో మెట్రోరైలు నిర్మాణం కోసం భూసేకరణ, పునరావాసానికి అదనంగా రూ. 1,980 కోట్లు కేటాయించారు. సాంస్కృతికం, పర్యాటకం తెలుగు బాటపేరిల సాంస్కృతిక పండగల కోసం రూ. 25 కోట్లు సాంస్కృతిక రంగానికి రూ. 69 కోట్లు పర్యాటక శాఖ రూ. 163 కోట్లు విద్యుత్ శాఖ రానున్న ఏడాది కాలంలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు చర్యలు చిత్తూరు ఖ్ణ్మీ;ల్లాలో తాగునీటి సరఫరా కోసం ఇన్‌క్యాప్ ద్వారా ఏర్పాట్లు వ్యవసాయానికి ఏడుగంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94,304 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం ప్రభుత్వం రూ. 3621 కోట్లు కేటాయించింది. జైకా సహకారంతో 16 ఖ్ణ్మీ;ల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ కోసం రూ. 1154 కోట్లు ఐటీ, ఉద్యోగాలు ఐటీ శాఖకు రూ. 207 కోట్లు. తిరుపతి, జహీరాబాద్‌లలో హోటళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణాకేంద్రాలు ఆర్థిక శాఖలో ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థలో భాగంగా బిల్ మానిటరింగ్ ఏర్పాటు 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు ఏర్పాటు చేస్తాం హైదరాబాద్‌కు తాగునీటి వసతిపెంపునకు రూ. 6,770 కోట్లు ( గోదావరి, కృష్ణా పథకాలు) వచ్చే ఏడాది కాలంలో 27,903 ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వైద్య వసతుల కల్పనకు రూ. 6481 కోట్లు జలయజ్ఞం, నీటిపారుదల జలయజ్ఞానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 13800 కోట్లు నీటిపారుదల శాఖకు రూ. 22,895 కోట్లు పోలవరం ప్రాజెక్టు అంచనా రూ. 16,010 కోట్లు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ. 38,500 కోట్లు పై రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జలయజ్ఞంలో 21,435 లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పటి వరకు జలయజ్ఞంలో రూ. 67,208 కోట్లను వ్యయం చేశారు. వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం ప్రభుత్వం రూ. 3621 కోట్లు కేటాయించింది. జైకా సహకారంతో 16 ఖ్ణ్మీ;ల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ కోసం రూ. 1154 కోట్లు 83 వేల టన్నుల ఆహార ధాన్యాల నిల్వకు రూ. 42 కోట్లతో 39 మండల స్థాయి గోదాముల నిర్మాణం వర్షాధారిత వ్యవసాయ అభివృద్ధికి రూ. 2903 కోట్లు వ్యవసాయ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 25,962 కోట్లతో వ్యవసాయబడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికా వ్యయం రూ. 17,694 కోట్లు వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం రూ. 8,267కోట్లు ఈ ఏడాది రూ. 72,450 కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6,128 కోట్లు ప్రకృతి వైపరీత్యాలకు వ్యవసాయ బడ్జెట్‌లో రూ. 589 కోట్లు ఫుడ్ ప్రొసెసింగ్‌కు రూ. 100 కోట్లు కనీస మద్దతు ధర లభించని సమయంలో రైతులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో ఆలంబన నిధి ఏర్పాటుచేయనున్నట్లు ఆర్థికమంత్రి ఆనం ప్రకటించారు. ఆహార ఉత్పత్తుల ప్రొసెసింగ్ ప్రత్యేక యూనిట్ వడ్డీలేని పంట రుణాలకు ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. విత్తనాభివృద్ధికి రూ. 308 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 450 కోట్లు సోలార్ పంప్‌సెట్లకు రూ. 150 కోట్లు రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి 2013-14 బడ్జెట్ దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి అన్నారు. అన్నీ వర్గాల మానవాభివృద్దికికు కృషి చేస్తామన్నారు.