2013 - 14 రాష్ట్ర వార్షిక ప్రణాళిక
- రాష్ట్ర ప్రణాళిక వ్యయం రూ.59,422 కోట్లు, ఈ
మొత్తం గత సంవత్సరం కంటే 9.98శాతం ఎక్కువగా ఉంది. ఇందులో రాష్ట్ర పధకాలకు
రూ.52,955.28 కోట్లుగా ఉంది.
- ఆర్ధిక వృద్ధికి మౌలిక వసతుల
అభివృద్ధి ఎంతో కీల కం. ముఖ్యంగా సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ 2013-14
వార్షిక బడ్జెట్లో ప్రణాళిక వ్యయం కింద ఎ క్కువ నిధులు కేటాయించడం
జరిగింది.
- 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017) ముఖ్యాంశాలు
- 11వ
పంచవర్ష ప్రణాళిక కాలానికి రాష్ట్ర వృద్ధి రేటు 8.18గా ఉండగా, అఖిలభారత
వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఈ వృద్ధి సరాసరి 8.03 శాతంగా ఉంది.
- 12వ
పంచవర్ష ప్రణాళిక తొలి సంవత్సరంలో రాష్ట్రంలో అంచనా వృద్ధి 5.29శాతం
ఉండగా, దేశం మొత్తంలో ఈ వృద్ధిరేటు 4.96శాతంగా నమోదైంది. కాగా 2012-13
ఆర్ధిక సంవత్సరానికి జీఎస్డీపీ అంచనావ్యయం రూ.7,38,497 కోట్లుగా ఉంది.
- 12వ పంచవర్ష ప్రణాళికలో అన్నీ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన వ్యయం రూ.3, 42,842 కోట్లుగా నమోదైంది.
ఈ
వ్యయం 11వ పంచ వర్ష ప్రణాళికలో రాష్ట్రం ఖర్చుచేసిన మొత్తానికి రెండు
రెట్లు అధికంగా ఉండగా, 12వ పంచవర్ష ప్రణాళి క పూర్త య్యేవరకు, ప్రస్తుతం
చేసిన వ్యయానికి 10శాతం ఎక్కు వగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు
రూపొందిస్తుంది.
- 12వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను అ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ, ఆర్ధికవృద్ధితోపాటు, సంక్షేమంపై
దృష్టిసారించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యకార్యక్రమాలు...
- ఎస్సీ,ఎస్టీలకు
కేటాయించిన నిధులను ఆయా వర్గాలకే ఖర్చుచేయాలనే లక్ష్యంతో రాష్ట్ర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక నిధులకు ( ఆర్ధిక
వనరుల చట్టం నెం.1 ఆఫ్ 2013 ) చట్టబద్ధత కల్పించింది.
- ఎస్సీ,ఎస్టీ
ఉప ప్రణాళిక చట్టబద్దత ద్వారా 2013-14 ఆర్ధిక సంవత్సరానికి ఎస్సీ
సబ్ప్లాన్కు రూ.8584.83 కోట్లు ఉండగా, ఎస్సీ సబ్ప్లాన్కు రూ.3,666.59
కోట్ల నిధులు కేటాయించారు.
- రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖలకు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
దీనిని వ్యవసాయ ప్రణాళిక 2013-14గా అభివర్ణిస్తూ, ప్రణాళిక, ప్రణాళికేతర
వ్యయం కింద రూ.98,940.54 కోట్లు కేటాయించారు.
సామాజిక, ఆర్ధిక సర్వే -2012-13 ముఖ్యాంశాలు...
- 12వ
పంచవర్ష ప్రణాళిక తొలి సంవత్సరంలో రాష్ట్రంలో అంచనా వృద్ధి 5.29శాతం
ఉండగా, దేశం మొత్తంలో ఈ వృద్ధిరేటు 4.96శాతంగా నమోదైంది. కాగా 2012-13
ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రంలో జీఎస్డీపీ వ్యవసాయ రంగంలో 1.96 శాతం
వృద్ధి ఉండగా, పారిశ్రామిక రంగంలో 0.73శాతం, సేవా రంగంలో 8.45శాతంగా
నమోదైంది.
- 2004-05 వివరాల ప్రకారం 2012-13 ఆర్ధిక సంవత్సరానికి
జీఎస్డీపీ అంచనావ్యయం రూ.4,26,470 కోట్లు ఉండగా, ప్రస్తుత ధరల ప్రకారం
గత ఆర్ధిక సంవత్సరానికి జీఎస్డీపీ అంచనావ్యయం రూ.7,38,497కోట్లుగా ఉంది.
- 2012-13
ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం ప్రకారం రూ.77, 277 కోట్లు అంచనావ్యయం
ఉండగా, గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ అంచనావ్యయం 12శాతం అధికంగా ఉంది.
- గడచిన
10 సంవత్సరాలతో పోల్చుకుంటే రాష్ట్ర తలసరి ఆదాయం దేశం తలసరి ఆదాయం కంటే
మెరుగ్గా ఉంది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం
రూ.8,500గా నమోదుకాగా, దేశ మొత్తంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ.
రాష్ట్రంలో పక్కాప్రణాళికతో అమలుచేస్తున్న పలు కార్యక్రమాలు...
1.ఆధార్ కార్డుల జారీలో రాష్ట్రం దేశస్ధాయిలో మొదటిస్ధానంలో నిలిచింది.
2.మీసేవ ద్వారా ప్రభుత్వ ధృవపత్రాల సత్వరమే జారీ.
3.
ఇందిరమ్మ బాట కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి
జిల్లాల్లో పర్యటన, తద్వారా హాస్టళ్ళు, పాఠశాలల్లో వసతులపై సమీక్ష.
ఇందిరమ్మ బాట కార్యక్రమంతో 14 జిల్లాల్లో పర్యటన పూర్తి.
4. శిశువులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఐఎంఆర్, ఎంఎంఆర్, పోషకలోపం నివారణ.
5. ఐఎంఆర్, ఎంఎంఆర్ రేటు తగ్గుదల
6. ఇందిరమ్మ అమృత హస్తం ద్వారా 102 అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణి స్ర్తీలకు పౌష్టికాహారం అందజేయడం.
7. మార్పు, చిన్నారి చూపు కార్యక్రమాలు
8.ప్రజాపంపిణీ వ్యవస్ధ ద్వారా మనబియ్యం పధకం ద్వారా రూ.1కి కేజీ బియ్యం
ఆహార ధాన్యాల ఉత్పత్తికి గత సంవత్సరం 66.3 లక్షల హెక్టార్లు లక్ష్యం కాగా, 72.9 లక్షల హెక్టార్లుగా నమోదైంది.
- ‘వడ్డీలేని రుణాలు’ పధకం ద్వారా రైతులకు ఆత్మస్ధైర్యం కల్పించడం.
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేక కార్యక్రమాలు.
- 13.61 స్వయం సహాయక బృందాలలో ఒక కోటి నలభై ఆరు లక్షల సభ్యులు.
- గ్రామీణ ప్రాంతాలలో 10.59 స్వయం సహాయక బృందాలు ఉండగా, వీటిలో సభ్యులు 1కోటి 15 లక్షల మంది సభ్యులున్నారు.
- పట్టణ ప్రాంతాలలో మూడు లక్షల రెండు వేల స్వయం సహాయక బృందాలు ఉండగా, ఇందులో 31లక్షల మంది సభ్యులున్నారు.
- హాస్టల్ విద్యార్ధులకు డైట్, ఫీజు రీయింబర్స్మెంట్ ఛార్జీల పెంపు.
- ఐటీ
రంగం ద్వారా రూ.40,646 కోట్ల మేరకు ఎగుమతులు ఉండగా, అదనంగా గత ఆర్ధిక
సంవత్సరానికి 39,186 మందికి ఉద్యోగ అవకాశాలు. దీనితో రాష్ట్రంలో ఐటీ
ఉద్యోగులు మొత్తం 3,18,624 ఉన్నారు.
- రాష్ట్రంలో ప్రతినెలా
76.09 మందికి ఫించన్ చెల్లిస్తుండగా, 2011-12 ఆర్ధిక సంవత్సరానికి
64లక్షల ఫించన్దారులకు రూ.2069 కోట్లు వెచ్చించారు. కాగా 2012-13 ఆర్ధిక
సంవత్సరానికి (సెప్టెంబర్ చివరినాటికి) రూ.68.05 ఫించన్దారులకు
రూ.1108.55 కోట్లు చెల్లించారు.
- 2011-12 ఆర్ధిక సంవత్సరానికి
బలహీన వర్గాలకు 1.05 గృ హాలు నిర్మించగా, 2012-13 ఆర్ధిక సంవత్సరానికి
(సెప్టెంబర్ చివరినాటికి) 2,03, 475 గృహాలు నిర్మించారు.