|
Monday, December 31, 2012
'క్లిఫ్’ అంచున అమెరికా!
Saturday, December 29, 2012
3G ఫోన్సు అంటే ఏమిటి?
3జీ అంటే సంక్షిప్తంగా 'థర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ'. వేగంగా సమాచార
మార్పిడి చేసుకొనేలా మొబైల్ నెట్వర్కులనీ , మొబైల్ఫోన్లలనీ
రూపొందించారు. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీని 2G అంటున్నారు.ఇందులో
వేగాన్ని ఈ స్థాయి తర్వాత పెంచలేము. ఎక్కువగా వాయిస్ మరియు టెక్స్టు డాటాని
మాత్రమే మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే
పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా
రూపొందించిందే ఈ 3జీ. అరచేతిలో టీవీ! సినిమాలు, పాటలు, వార్తలు, ఓ మాదిరి
సైజున్న వీడియో ఫైల్స్ ఏవైనా సరే చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
రానున్న కాలంలో మొబైల్ ఫోన్లోనే టివీలూ చూడగలుగుతారు. దానికి ఎక్కువ రిజల్యూషన్ తో కూడిన డిస్ప్లే సిస్టం, అధిక డాటాని వేగంగా రిసీవ్ చేసుకోగలగటం లాంటి ఎక్కువ సౌకర్యలతో మొబైల్ ఫోన్లూ వస్తాయి. టీవీ ప్రోగ్రాములను ప్రసారం చేయడానికి ఉన్న ఛానల్స్ సిద్ధం ఔతాయి. కొత్త ఛానెల్సూ , వెబ్సైట్లూ పుట్టుకొస్తాయి. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. ఫ్రస్తుతం మనం వినియోగిస్తున్న 2జీ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో ఏ విధంగా వినియోగించగలిగామో వీడియో ఫైల్స్ ని ౩జీ లో అంతే సులువుగా యాక్సెస్ చేసుకొనేలా ఈ నెట్వర్క్లన్, ఫోన్లనీ రూపొందిస్తున్నారు.
వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్లో ఆన్లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నే 'వీడియో కాలింగ్' అని పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. దీనికోసం ఫోన్ కు ముందు భాగంలో కెమేరాను ఏర్పాటు చేసిన 3జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు.
మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది. కంప్యూటర్లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్తో కూడిన ఎటాచ్మెంట్లతో ఈ-మెయిల్స్ ని చిటికెలో పంపేయొచ్చు.
వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తోనూ, కొత్త వాళ్ళతోనూ ఆన్లైన గేమ్స్లాగా, ఇక వీడియో గేమ్లూ అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పోలీసు, రక్షణ వ్యవస్థలు ఈ నెట్వర్క్ ద్వారా సీసీటీవీలను యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. మొబైల్ టూరిజం, మొబైల్ వాణిజ్యం, ఈ-లెర్నింగ్, స్టాక్ఎక్స్చేంజ్, టెలీమెడిసిన్, మొబైల్ వాణిజ్య ప్రకటనలు సమస్త ప్రపంచం ఇక మీ అరచేతిలోనే - అరచేతిలో వైకుఠం తెలీదు గానీ, మీ ప్రపంచం మొత్తం మీ అరచేతిలోనే!
ఈ సేవల్ని పొందాలంటే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న సేవలకంటే ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశమే ఉంది. కాకపోతే ప్రభుత్వ నియంత్రణల వల్ల, ఇవన్నీ రావడానికి మాత్రం ఇంకా కొద్ది కాలం పడుతుంది. ప్రస్తుతానికి MTNL, BSNL మాత్రమే ఈ సదుపాయాలని కొన్ని చోట్ల అందిస్తున్నారు. సేవలందంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధం ఔతున్నాయి. మార్కెట్ళో ఈ 3G టెలిఫోన్లూ లభ్య మౌతున్నాయి. కాస్త ధరే రూ 15,000 పైగా ఉన్నా, వేచి చూడండి. అన్ని కంపెనీలు మొదలెట్టాగా, వీటీ రేట్లు కొద్దిగా నైనా తగ్గొచ్చు.
Monday, December 24, 2012
వేతనజీవులకు మరింత ఊరటనివ్వాలి
|
Friday, December 7, 2012
కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు
రూ.20 వేల వరకూ పెంచుతున్నట్లు ప్రకటించిన మారుతీ సుజుకీ...
|
|
|
మాలె జిఎంఆర్ చేజారుతుందా?
సింగపూర్ - మాలె , డిసెంబర్ 6 : మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు
విషయంలో సింగపూర్ హైకోర్టు తీర్పు తమకే అనుకూలంగా ఉందన్న ధీమాతో ఉన్న
జిఎంఆర్ గ్రూప్నకు హఠాత్తుగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జిఎంఆర్
చేతుల్లోంచి మాలె విమానాశ్రయాన్ని మాల్దీవుల ప్రభు త్వం వెనక్కి
తీసుకోవచ్చని సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (సుప్రీం కోర్టు) తీర్పు
చెప్పినట్టుగా మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఒక ప్రైవేట్
సంస్థకు అప్పగించిన విమానాశ్రయాన్ని అవసరమైతే వెనక్కి తీసుకునే అధికారం
మాల్దీవుల ప్రభుత్వానికి ఉంటుందని సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పు
చెప్పినట్టు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్టుగానే
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఏక్షణమైనా మాలె విమానాశ్రయాన్ని ప్రభుత్వం
స్వాధీనం చేసుకుంటుందని మాల్దీవుల అధ్యక్షుని ప్రెస్ సెక్రటరీ మసూద్ ఇమాద్
తెలిపారు.
సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ గురువారం నాడు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జిఎంఆర్ పరిస్థితి అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన వ్యూహం ఏమిటన్న విషయం జిఎంఆర్ ఇంకా బయటపెట్టలేదు. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కనిపిస్తోంది. సింగపూర్ సుప్రీం కోర్టు తీర్పును తమ విదేశాంగ శాఖ, మాలెలోని భారత హైకమిషన్ అధ్యయనం చేస్తున్నాయని భారత్ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు.
ఎయిర్పోర్టు కాంట్రాక్టుకు సంబంధించిన చట్టపరమైన నియమనిబంధనలు, పరిహారానికి సంబంధించిన కాంట్రాక్టులోని ఒప్పందాలను మాల్దీవుల ప్రభుత్వం అక్షరాల అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కేసులో రెండు అంశాలున్నాయనీ ఒకటి మాల్దీవుల ప్రభుత్వ సార్వభౌమా«ధికారానికి సంబంధించినది కాగా మరొకటి ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించిన చట్టబద్ధత అని ఆయన చెప్పారు.
సింగపూర్ కోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలే తప్ప ఒప్పందం చట్టబద్దతకు సంబం«ధించిన అంశాల ప్రస్తావన లేదని ఆయన వివరించారు. కోర్టు ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనందున, ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, కాంట్రాక్టులో పేర్కొన్న ఒప్పందాలు అన్నింటినీ పొల్లుబోకుండా అమలు చేయాల్సి ఉంటుందని సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. మాల్దీవుల ధీమా....
అంతర్జాతీయ బిడ్డింగ్లో రెండేళ్ల క్రితం జిఎంఆర్ గ్రూప్ మొహమ్మద్ నషీద్ ప్రభుత్వ హయాంలో మాలె విమానాశ్రయ ప్రాజెక్టును గెలుచుకుంది. అయితే గత ఫిబ్రవరీలో అధికారంలోకి వచ్చిన మొహమ్మద్ వహీద్ ప్రభు త్వం ఈ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చింది. నవంబర్ 27న హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జిఎంఆర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. అయితే సింగపూర్ కోర్టు ఉత్తర్వులను లెక్కచేసేది లేదని, జిఎంఆర్ను మాలె ఎయిర్పోర్టు నుంచి ఖాళీ చేసి తీరుతామని మాల్దీవుల ప్రభుత్వం మొండికేయడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. భారత ప్రభుత్వం కల్పించుకుని నిరసన తెలిపినప్పటికీ మాల్దీవులు వెనక్కి తగ్గలేదు. గురువారం నాడు సింగపూర్ అత్యున్నత న్యాయస్థానంలో కోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో మాల్దీవుల ప్రభుత్వం తన పట్టుకు మరింత బిగిస్తోంది.
జిఎంఆర్ను బలవంతంగా బయటకు గెంటినా చట్టపరంగా ఇక తమపై తప్పు ఉండదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎయిర్పోర్టు ప్రాజెక్టు కాంట్రాక్టు ప్రకారం, వివాదం ఏదైనా తలెత్తితే సింగపూర్ లేదా బ్రిటన్ చట్టాల ప్రకారం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సింగపూర్ హైకోర్టులో తీర్పు జిఎంఆర్కు అనుకూలంగా వచ్చింది. దానిపై మాల్దీవులు దాఖలు చేసుకున్న అప్పీల్లో తీర్పు ఇప్పుడు తమకు అనుకూలంగా వచ్చినట్టు మాల్దీవుల ప్రతినిధి ప్రకటించారు.
జిఎంఆర్కు పొగబెట్టిందెవరు ? మాలె ఎయిర్పోర్టు ప్రాజెక్టు నుంచి జిఎంఆర్ గ్రూప్ను పక్కకు తప్పించేందుకు జరిగిన కుట్రలో మాల్దీవుల అధ్యక్షుడు వహీద్ ప్రత్యేక సలహాదారు హసన్ సయీద్ పాత్ర ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే దీనిని మాల్దీవుల ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్పోర్టు నుంచి జిఎంఆర్కు ఉద్వాసన చెప్పాల్సిందిగా దేశ అధ్యక్షునికి హసన్ సయీద్ సలహా ఇచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
సింగపూర్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ గురువారం నాడు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జిఎంఆర్ పరిస్థితి అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన వ్యూహం ఏమిటన్న విషయం జిఎంఆర్ ఇంకా బయటపెట్టలేదు. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కనిపిస్తోంది. సింగపూర్ సుప్రీం కోర్టు తీర్పును తమ విదేశాంగ శాఖ, మాలెలోని భారత హైకమిషన్ అధ్యయనం చేస్తున్నాయని భారత్ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు.
ఎయిర్పోర్టు కాంట్రాక్టుకు సంబంధించిన చట్టపరమైన నియమనిబంధనలు, పరిహారానికి సంబంధించిన కాంట్రాక్టులోని ఒప్పందాలను మాల్దీవుల ప్రభుత్వం అక్షరాల అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కేసులో రెండు అంశాలున్నాయనీ ఒకటి మాల్దీవుల ప్రభుత్వ సార్వభౌమా«ధికారానికి సంబంధించినది కాగా మరొకటి ప్రాజెక్టు ఒప్పందానికి సంబంధించిన చట్టబద్ధత అని ఆయన చెప్పారు.
సింగపూర్ కోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలే తప్ప ఒప్పందం చట్టబద్దతకు సంబం«ధించిన అంశాల ప్రస్తావన లేదని ఆయన వివరించారు. కోర్టు ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనందున, ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, కాంట్రాక్టులో పేర్కొన్న ఒప్పందాలు అన్నింటినీ పొల్లుబోకుండా అమలు చేయాల్సి ఉంటుందని సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. మాల్దీవుల ధీమా....
అంతర్జాతీయ బిడ్డింగ్లో రెండేళ్ల క్రితం జిఎంఆర్ గ్రూప్ మొహమ్మద్ నషీద్ ప్రభుత్వ హయాంలో మాలె విమానాశ్రయ ప్రాజెక్టును గెలుచుకుంది. అయితే గత ఫిబ్రవరీలో అధికారంలోకి వచ్చిన మొహమ్మద్ వహీద్ ప్రభు త్వం ఈ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చింది. నవంబర్ 27న హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జిఎంఆర్ సింగపూర్ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. అయితే సింగపూర్ కోర్టు ఉత్తర్వులను లెక్కచేసేది లేదని, జిఎంఆర్ను మాలె ఎయిర్పోర్టు నుంచి ఖాళీ చేసి తీరుతామని మాల్దీవుల ప్రభుత్వం మొండికేయడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. భారత ప్రభుత్వం కల్పించుకుని నిరసన తెలిపినప్పటికీ మాల్దీవులు వెనక్కి తగ్గలేదు. గురువారం నాడు సింగపూర్ అత్యున్నత న్యాయస్థానంలో కోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో మాల్దీవుల ప్రభుత్వం తన పట్టుకు మరింత బిగిస్తోంది.
జిఎంఆర్ను బలవంతంగా బయటకు గెంటినా చట్టపరంగా ఇక తమపై తప్పు ఉండదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎయిర్పోర్టు ప్రాజెక్టు కాంట్రాక్టు ప్రకారం, వివాదం ఏదైనా తలెత్తితే సింగపూర్ లేదా బ్రిటన్ చట్టాల ప్రకారం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సింగపూర్ హైకోర్టులో తీర్పు జిఎంఆర్కు అనుకూలంగా వచ్చింది. దానిపై మాల్దీవులు దాఖలు చేసుకున్న అప్పీల్లో తీర్పు ఇప్పుడు తమకు అనుకూలంగా వచ్చినట్టు మాల్దీవుల ప్రతినిధి ప్రకటించారు.
జిఎంఆర్కు పొగబెట్టిందెవరు ? మాలె ఎయిర్పోర్టు ప్రాజెక్టు నుంచి జిఎంఆర్ గ్రూప్ను పక్కకు తప్పించేందుకు జరిగిన కుట్రలో మాల్దీవుల అధ్యక్షుడు వహీద్ ప్రత్యేక సలహాదారు హసన్ సయీద్ పాత్ర ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే దీనిని మాల్దీవుల ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్పోర్టు నుంచి జిఎంఆర్కు ఉద్వాసన చెప్పాల్సిందిగా దేశ అధ్యక్షునికి హసన్ సయీద్ సలహా ఇచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Thursday, December 6, 2012
మాలె ప్రాజెక్టు పరిణామాలు
మాలె సంక్షొభంలో విదేశీ హస్తం
న్యూఢిల్లీ : మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి తమను బలవంతంగా
బయటకు పంపడం వెనుక పరదేశ ప్రమేయం ఉన్నట్టు జిఎంఆర్ గ్రూప్ అనుమానిస్తోంది.
మాల్దీవుల రాజకీయ పరిస్థితిని, అక్కడి రాజకీయ చట్రాన్ని దృష్టిలో
ఉంచుకుంటే.. మాలె ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు వ్యవహారంలో విదేశీ హస్తం ఉందన్న
అనుమానాలను తోసిపుచ్చలేమని సంస్థ సిఎఫ్ ఒ సిద్ధార్థ కపూర్ చెప్పారు. 50
కోట్ల డాలర్ల మాలె ఎయిర్పోర్ట్ ఆధునీకరణ ప్రాజెక్టు నుంచి జిఎంఆర్ను
బయటకు పంపాలన్న మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయం వెనక చైనా హస్తం ఉన్నట్టుగా
వార్తలు వచ్చాయి. జిఎంఆర్ ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడేందుకు
నిరాకరించినప్పటికీ అనుమానాలను మాత్రం తోసిపుచ్చలేదు.
మాలె ఎయిర్పోర్ట్ సంక్షోభం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో... వాస్తవాలను వెల్లడించడానికి జిఎంఆర్ సిఎఫ్ఒ సిద్ధార్ధ కపూర్ బుధవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయక్రీడాంగణంలో మాలె ఎయిర్పోర్టు ఫుట్బాల్గా మారిందని కపూర్ వ్యాఖ్యానిం చారు. టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు ఒక పక్క విదేశీ పెట్టుబడులను కోరుతూ.. మరో పక్క మాలె ఎయిర్పోర్టు ప్రాజెక్టు రద్దు వంటి నిర్ణయాలను తీసుకోవడాన్ని కపూర్ తప్పుబట్టారు. మాల్దీవుల ప్రభుత్వ వైఖరికి బయట ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రారని ఆయన చెప్పారు. మాలె ప్రాజెక్టును వదులుకోవాల్సి వస్తే నష్టం ఏమేరకు ఉంటుందనే విషయంలో లెక్కలు వేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
బల ప్రయోగం వద్దు
మాలె ఎయిర్పోర్టు నుంచి జిఎంఆర్ను ఖాళీ చేయించేందుకు బలప్రయోగానికి దిగే ప్రయత్నం చేయవద్దని సిద్ధార్థకపూర్ మాలె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బలప్రయోగానికి దిగితే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని ఆయన అన్నారు. ఇది భారత దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. మాలె ఎయిర్పోర్టులో 140 మంది విదేశీయులు పనిచేస్తున్నారని చెప్పారు. మాలె ఎయిర్పోర్టును శుక్రవారం ఆర్ధరాత్రికల్లా ఖాళీ చేసి తమకు అప్పగించాలని మాలె ప్రభుత్వం జిఎంఆర్ను హెచ్చరించింది. అయితే జిఎంఆర్ మాత్రం ససేమిరా ప్రాజెక్టును వదిలేది లేదని అంటున్నది.
ఈ నేప«థ్యంలో బలప్రయోగంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందిగా మాల్దీవుల ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు కపూర్ చెప్పారు. ఈ సంక్షోభానికి అందరికీ అమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం అండగా నిలబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రభుత్వ అధినేతతో సంప్రదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సమస్య పరిష్కారానికి మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షంతో సహా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుత్నుట్టుగా వెల్లడించారు.
ఎవరికి లాభం...
కాంట్రాక్టును బలవంతంగా రద్దుచేస్తే మాల్దీవుల ప్రభుత్వం పరిహారం కింద జిఎంఆర్కు కనీసం 70 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. అంతకంటే ఎక్కువే ఉండవచ్చు కూడా. ఈ భారాన్ని మాల్దీవుల ప్రజలే మోయాలి. ప్రాజెక్టు కొనసాగితే వచ్చే పాతికేళ్ల కాలంలో మాల్దీవుల ప్రభుత్వానికి 250 కోట్ల డాలర్లు లభిస్తాయి. అవి కాకుండా ఇతరత్రా ఆదాయం మరో 100 కోట్ల డాలర్లు ఉంటుంది.
మాలె పరిణామాలపై ప్రపంచబ్యాంకు కన్ను
నిజానికి మాలె ఎయిర్పోర్టు బిడ్డింగ్ ప్రక్రియ అంతా ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఐఎఫ్సి కనుసన్నల్లో జరిగింది. అందువల్ల ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలను ప్రపంచ బ్యాంకు నిశితంగా గమనిస్తోంది. ఈ విషయం జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుకు రాసిన లేఖలో ప్రపంచబ్యాంకు ప్రెసిడెంట్ జిమ్యాంగ్ కిమ్ స్వయంగా తెలిపారు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఐఎఫ్సి, కన్సిషన్ అగ్రిమెంట్ రూపకల్పన, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. మాల్దీవుల చట్టాలు, అంతర్జాతీయ ఉత్తమ సంప్రయాలాకు అనుగుణంగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించారు.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఐఎఫ్సిని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాల్దీవులు కోరింది. ఐఎఫ్సి ప్రతినిధి బృందం అవసరమైన మొత్తం సమాచారాన్ని మాల్దీవుల ప్రభుత్వానికి అందించినట్టు జిమ్యాంగ్ కిమ్ జిఎంఆర్కు రాసిన లేఖలో వెల్లడించారు. పైగా ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ ఇసాబెల్ గురెరో మాల్దీవుల అధ్యక్షున్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా కలుసుకున్నారు. ఐఎఫ్సి వైస్ప్రెసిడెంట్ కరిన్ ఫిన్కెల్స్టన్ కూడా మాల్దీవుల ఆర్థికమంత్రితో త్వరలో సమావేశం కానున్నారని వెల్లడించారు. ప్రపంచబ్యాంకు కూడా ప్రాజెక్టు విషయంలో సీరియస్గా ఉన్నందున మాల్దీవుల ప్రభుత్వం ఆఖరు క్షణంలోనైనా దారికి రావచ్చని అంటున్నారు. .
మాలె ఎయిర్పోర్ట్ సంక్షోభం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో... వాస్తవాలను వెల్లడించడానికి జిఎంఆర్ సిఎఫ్ఒ సిద్ధార్ధ కపూర్ బుధవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయక్రీడాంగణంలో మాలె ఎయిర్పోర్టు ఫుట్బాల్గా మారిందని కపూర్ వ్యాఖ్యానిం చారు. టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు ఒక పక్క విదేశీ పెట్టుబడులను కోరుతూ.. మరో పక్క మాలె ఎయిర్పోర్టు ప్రాజెక్టు రద్దు వంటి నిర్ణయాలను తీసుకోవడాన్ని కపూర్ తప్పుబట్టారు. మాల్దీవుల ప్రభుత్వ వైఖరికి బయట ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రారని ఆయన చెప్పారు. మాలె ప్రాజెక్టును వదులుకోవాల్సి వస్తే నష్టం ఏమేరకు ఉంటుందనే విషయంలో లెక్కలు వేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
బల ప్రయోగం వద్దు
మాలె ఎయిర్పోర్టు నుంచి జిఎంఆర్ను ఖాళీ చేయించేందుకు బలప్రయోగానికి దిగే ప్రయత్నం చేయవద్దని సిద్ధార్థకపూర్ మాలె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బలప్రయోగానికి దిగితే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని ఆయన అన్నారు. ఇది భారత దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. మాలె ఎయిర్పోర్టులో 140 మంది విదేశీయులు పనిచేస్తున్నారని చెప్పారు. మాలె ఎయిర్పోర్టును శుక్రవారం ఆర్ధరాత్రికల్లా ఖాళీ చేసి తమకు అప్పగించాలని మాలె ప్రభుత్వం జిఎంఆర్ను హెచ్చరించింది. అయితే జిఎంఆర్ మాత్రం ససేమిరా ప్రాజెక్టును వదిలేది లేదని అంటున్నది.
ఈ నేప«థ్యంలో బలప్రయోగంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందిగా మాల్దీవుల ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు కపూర్ చెప్పారు. ఈ సంక్షోభానికి అందరికీ అమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం అండగా నిలబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రభుత్వ అధినేతతో సంప్రదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సమస్య పరిష్కారానికి మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షంతో సహా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుత్నుట్టుగా వెల్లడించారు.
ఎవరికి లాభం...
కాంట్రాక్టును బలవంతంగా రద్దుచేస్తే మాల్దీవుల ప్రభుత్వం పరిహారం కింద జిఎంఆర్కు కనీసం 70 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. అంతకంటే ఎక్కువే ఉండవచ్చు కూడా. ఈ భారాన్ని మాల్దీవుల ప్రజలే మోయాలి. ప్రాజెక్టు కొనసాగితే వచ్చే పాతికేళ్ల కాలంలో మాల్దీవుల ప్రభుత్వానికి 250 కోట్ల డాలర్లు లభిస్తాయి. అవి కాకుండా ఇతరత్రా ఆదాయం మరో 100 కోట్ల డాలర్లు ఉంటుంది.
మాలె పరిణామాలపై ప్రపంచబ్యాంకు కన్ను
నిజానికి మాలె ఎయిర్పోర్టు బిడ్డింగ్ ప్రక్రియ అంతా ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఐఎఫ్సి కనుసన్నల్లో జరిగింది. అందువల్ల ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలను ప్రపంచ బ్యాంకు నిశితంగా గమనిస్తోంది. ఈ విషయం జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుకు రాసిన లేఖలో ప్రపంచబ్యాంకు ప్రెసిడెంట్ జిమ్యాంగ్ కిమ్ స్వయంగా తెలిపారు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఐఎఫ్సి, కన్సిషన్ అగ్రిమెంట్ రూపకల్పన, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. మాల్దీవుల చట్టాలు, అంతర్జాతీయ ఉత్తమ సంప్రయాలాకు అనుగుణంగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించారు.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఐఎఫ్సిని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాల్దీవులు కోరింది. ఐఎఫ్సి ప్రతినిధి బృందం అవసరమైన మొత్తం సమాచారాన్ని మాల్దీవుల ప్రభుత్వానికి అందించినట్టు జిమ్యాంగ్ కిమ్ జిఎంఆర్కు రాసిన లేఖలో వెల్లడించారు. పైగా ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ ఇసాబెల్ గురెరో మాల్దీవుల అధ్యక్షున్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా కలుసుకున్నారు. ఐఎఫ్సి వైస్ప్రెసిడెంట్ కరిన్ ఫిన్కెల్స్టన్ కూడా మాల్దీవుల ఆర్థికమంత్రితో త్వరలో సమావేశం కానున్నారని వెల్లడించారు. ప్రపంచబ్యాంకు కూడా ప్రాజెక్టు విషయంలో సీరియస్గా ఉన్నందున మాల్దీవుల ప్రభుత్వం ఆఖరు క్షణంలోనైనా దారికి రావచ్చని అంటున్నారు. .
మాలె ప్రాజెక్టు పరిణామాలు..
2010లో జరిగిన అంతర్జాతీయ బిడ్డింగ్లో 50 కోట్ల డాలర్లకు ఈ ప్రాజెక్టును
జిఎంఆర్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ప్రపంచ బ్యాంకు అనుబంధ
సంస్థ ఐఎఫ్సి సార«ధ్యంలో బిడ్డింగ్ను నిర్వహించారు.ఆ ప్రాజెక్టు కన్సీషన్
కాలవ్యవధి 25 ఏళ్లు. ప్రాజెక్టు బిడ్డింగ్ జరిగిన సమయంలో మాల్దీవుల్లో
మహమమ్మద్ నషీద్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మాల్దీవుల చరిత్రలో స్వేచ్ఛ గా
జరిగిన ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రభుత్వంగా నషీద్ ప్రభుత్వాన్ని చెబుతారు.
ఈ ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల్లో నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మాలె ఎయిర్పోర్టు ప్రాజెక్టును టార్గెట్గా పెట్టుకుంది. గతవారం హఠాత్తుగా జిఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేస్తూ.. వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం తన పట్టు వీడటం లేదు. భారత ప్రభుత్వం నిరసన తెలిపినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం దిగిరాలేదు. మాలె ఎయిర్పోర్టు ప్రాజెక్టులో అక్రమాలు,అవినీతి చోటుచేసుకున్నట్టుగా కొత్త ప్రభుత్వం వాదిస్తోంది.
2010
జూలై : 10 నెలలు సాగిన సుదీర్ఘ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత 50 కోట్ల డాలర్ల మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ, నిర్వహణ ప్రాజెక్టును జిఎంఆర్ గెలుచుకుంది.
అక్టోబర్ : ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా జిఎంఆర్ వెల్లడించింది. 50 కోట్ల డాలర్ల ప్రాజెక్టులో 70 శాతం రుణాలు కాగా 30 శాతం ఈక్విటీ.
నవంబర్ : మాల్దీవుల ఎయిర్పోర్టు కంపెనీ అధికారికంగా మాలె ఎయిర్పోర్టు అభివృద్ధి, అధునీకరణకు లైసెన్స్ను జిఎంఆర్కు అందజేసింది.
2011
జనవరి : 2014-15కల్లా ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన.
మార్చి : పనులు వేగం అందుకున్నట్టుగా వెల్లడి
జూన్ : నాన్ ఎయిరో స్పేస్ను వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రాజకీయ నాయకులు ఆందోళన ప్రారంభించడంతో జిఎంఆర్ కార్యకలాపాలకు విఘాతం కలిగింది.
సెప్టెంబర్ : ఎయిర్పోర్టు చుట్టూ ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని డెవలప్మెంట్ను జిఎంఆర్ ప్రారంభించింది.
డిసెంబర్ : జనవరి నుంచి మాలె ఎయిర్పోర్టులో ప్రయాణికుల నుంచి ఎయిర్పోర్టు డెవలప్మెంట్ చార్జీల కింద 25 డాలర్లు, బీమా చార్జీ కింద 2 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన. ఈ నిర్ణయంపై కోర్టుల్లోనూ జిఎంఆర్కు అనుకూలంగా తీర్పువచ్చింది.
2012
జనవరి: ఎయిర్పోర్టు చార్జీల వసూలుకు ప్రభుత్వం అడ్డుపడటంపై జిఎంఆర్ అసంతృప్తి.
మార్చి : నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. మహమద్ వహీద్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే, మాలె ప్రాజెక్టును జిఎంఆర్ అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుకుందని, అందువల్ల ప్రాజెక్టు చెల్లదని ప్రకటించింది. జిఎంఆర్ కష్టాలు అప్పటి నుంచే మొదలయ్యాయి.
జూన్ : ప్రపంచబ్యాంక్ అనుబంధ సంస్థ ఐఎఫ్సి సారధ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగిన బిడ్డింగ్లో మాలె ప్రాజెక్టును తాము గెలుచుకున్నామని జిఎంఆర్ మాల్దీవుల కొత్త ప్రభుత్వానికి విన్నవించుకుంది. జూలై : మాల్దీవుల ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును జిఎంఆర్ వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ : మాలె ఎయిర్ పోర్టు ప్రాజెక్టు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 304.3 కోట్ల రూపాయల రాబడిపై 44 కోట్ల రూపాయల లాభం సాధించినట్టు జిఎంఆర్ ప్రకటన. ఢిల్లీ ఎయిర్పోర్టుతో పోలిస్తే మాలె ప్రాజెక్టులో భారీ లాభాలున్న విషయం కూడా జిఎంఆర్ వెల్లడించింది.
అక్టోబర్ : ముంబైలో జరిగిన ఒక సమావేశంలో మాల్దీవుల ప్రభుత్వం మాలె ప్రాజెక్టు విషయంలో నాన్చకుండా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
నవంబర్ : కాంట్రాక్టు రద్దు చేస్తూ అధికార ప్రకటన.
డిసెంబర్ : మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయంపై సింగపూర్ కోర్టులో జిఎంఆర్ పిటిషన్. అనుకూలంగా తీర్పు. తీర్పును లెక్కించమని మాల్దీవుల ప్రకటన.
ఈ ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల్లో నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మాలె ఎయిర్పోర్టు ప్రాజెక్టును టార్గెట్గా పెట్టుకుంది. గతవారం హఠాత్తుగా జిఎంఆర్ కాంట్రాక్టును రద్దు చేస్తూ.. వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం తన పట్టు వీడటం లేదు. భారత ప్రభుత్వం నిరసన తెలిపినప్పటికీ మాల్దీవుల ప్రభుత్వం దిగిరాలేదు. మాలె ఎయిర్పోర్టు ప్రాజెక్టులో అక్రమాలు,అవినీతి చోటుచేసుకున్నట్టుగా కొత్త ప్రభుత్వం వాదిస్తోంది.
2010
జూలై : 10 నెలలు సాగిన సుదీర్ఘ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత 50 కోట్ల డాలర్ల మాలె అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ, నిర్వహణ ప్రాజెక్టును జిఎంఆర్ గెలుచుకుంది.
అక్టోబర్ : ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా జిఎంఆర్ వెల్లడించింది. 50 కోట్ల డాలర్ల ప్రాజెక్టులో 70 శాతం రుణాలు కాగా 30 శాతం ఈక్విటీ.
నవంబర్ : మాల్దీవుల ఎయిర్పోర్టు కంపెనీ అధికారికంగా మాలె ఎయిర్పోర్టు అభివృద్ధి, అధునీకరణకు లైసెన్స్ను జిఎంఆర్కు అందజేసింది.
2011
జనవరి : 2014-15కల్లా ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన.
మార్చి : పనులు వేగం అందుకున్నట్టుగా వెల్లడి
జూన్ : నాన్ ఎయిరో స్పేస్ను వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రాజకీయ నాయకులు ఆందోళన ప్రారంభించడంతో జిఎంఆర్ కార్యకలాపాలకు విఘాతం కలిగింది.
సెప్టెంబర్ : ఎయిర్పోర్టు చుట్టూ ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని డెవలప్మెంట్ను జిఎంఆర్ ప్రారంభించింది.
డిసెంబర్ : జనవరి నుంచి మాలె ఎయిర్పోర్టులో ప్రయాణికుల నుంచి ఎయిర్పోర్టు డెవలప్మెంట్ చార్జీల కింద 25 డాలర్లు, బీమా చార్జీ కింద 2 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా జిఎంఆర్ ప్రకటన. ఈ నిర్ణయంపై కోర్టుల్లోనూ జిఎంఆర్కు అనుకూలంగా తీర్పువచ్చింది.
2012
జనవరి: ఎయిర్పోర్టు చార్జీల వసూలుకు ప్రభుత్వం అడ్డుపడటంపై జిఎంఆర్ అసంతృప్తి.
మార్చి : నషీద్ ప్రభుత్వం కూలిపోయింది. మహమద్ వహీద్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే, మాలె ప్రాజెక్టును జిఎంఆర్ అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుకుందని, అందువల్ల ప్రాజెక్టు చెల్లదని ప్రకటించింది. జిఎంఆర్ కష్టాలు అప్పటి నుంచే మొదలయ్యాయి.
జూన్ : ప్రపంచబ్యాంక్ అనుబంధ సంస్థ ఐఎఫ్సి సారధ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగిన బిడ్డింగ్లో మాలె ప్రాజెక్టును తాము గెలుచుకున్నామని జిఎంఆర్ మాల్దీవుల కొత్త ప్రభుత్వానికి విన్నవించుకుంది. జూలై : మాల్దీవుల ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును జిఎంఆర్ వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ : మాలె ఎయిర్ పోర్టు ప్రాజెక్టు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 304.3 కోట్ల రూపాయల రాబడిపై 44 కోట్ల రూపాయల లాభం సాధించినట్టు జిఎంఆర్ ప్రకటన. ఢిల్లీ ఎయిర్పోర్టుతో పోలిస్తే మాలె ప్రాజెక్టులో భారీ లాభాలున్న విషయం కూడా జిఎంఆర్ వెల్లడించింది.
అక్టోబర్ : ముంబైలో జరిగిన ఒక సమావేశంలో మాల్దీవుల ప్రభుత్వం మాలె ప్రాజెక్టు విషయంలో నాన్చకుండా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
నవంబర్ : కాంట్రాక్టు రద్దు చేస్తూ అధికార ప్రకటన.
డిసెంబర్ : మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయంపై సింగపూర్ కోర్టులో జిఎంఆర్ పిటిషన్. అనుకూలంగా తీర్పు. తీర్పును లెక్కించమని మాల్దీవుల ప్రకటన.
Thursday, November 29, 2012
అమలు లోకి రానున్న " ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్ "
కష్టపడి..
చెమటోడ్చి.. రూపాయి రూపాయి కూడబెట్టి మీరు భూమి కొనుక్కున్నారు. లక్షలు
పోసి కొనుక్కున్న భూమికి వేలు ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ
ఆనందం కొన్ని రోజులు కూడా మిగలకుండానే.. ఎవరో వస్తారు. ఆ భూమి తమదంటారు.
అప్పటికే తాము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెబుతారు. అదే ఆస్తిపై
డాక్యుమెంట్లు కూడా తెచ్చే అవకాశం ఉంది. భూ వివాదం కోర్టుకెక్కుతుంది.
ఏళ్లతరబడి నానుతుంది. మరి దీనికి పరిష్కారం..?
ఆక్రమణలతోపాటు ఒకే భూమికి రెండు మూడుసార్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రబుద్ధులతో కొనుగోలుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మీ పేరిట రిజిస్టర్ అయిన భూమి, ఆస్తులకు ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఓ ఒప్పందంగానే పేర్కొంటోంది తప్ప దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఎవరు హక్కుదారో!? ఎవరు అసలు వ్యక్తో ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. ముక్కుపిండి స్టాంపు డ్యూటీని వసూలు చేసుకుంటున్నా.. ‘ఈ భూమి మీదే’ అని ఇప్పటి వరకు ప్రభుత్వం సర్టిఫై చేయడం లేదు. ఫలితంగా.. రోజు రోజుకూ భూ వివాదాలూ పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే, ఆస్తులకు గ్యారెంటీ కల్పించే హక్కు కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. పట్టణాల్లో ఈ హక్కు కల్పించడం అత్యవసరమని కూడా కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమైంది. అదే.. ‘ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్’! ఈ పథకం కింద మీ ఆస్తులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీంతో, భవిష్యత్తులో భూ తగాదాలు, ఆక్రమణలు తగ్గుముఖం పట్టనున్నాయి.
‘ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్’ను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తేనుంది. ఇందులో భాగంగా, సదరు ఆస్తి ఎవరిదనే విషయాన్ని గుర్తించి, రిజిస్ట్రేషన్ సమయంలోనే ప్రభుత్వం సొంతదారుకు ప్రాపర్టీ వెరిఫికేషన్ సర్టిఫికెట్ను ఇస్తుంది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) సంస్కరణల్లో భాగంగా ఉన్న ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించే అవకాశం ఉంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖాస్రా/ఖాటాని, గిర్ద్వారీ విధానం పట్టణాల్లో లేకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం ‘గ్యారంటీ ల్యాండ్ టైటిల్’ స్కీంను ప్రవేశపెట్టింది. ఇలాంటి పథకమే కొన్ని ఇతర దేశాల్లో కూడా అమల్లో ఉంది. వాస్తవానికి, దేశ రాజధాని ఢిల్లీలో ప్రాపర్టీ టైటిలింగ్ సిస్టమ్ సరిగా లేనందున ప్రాపర్టీ మార్కెట్ లో అంతరం ఏర్పడిందని 2002లోనే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది. దీనిపై ఒక కమిటీని నియమించి విదేశాలతోపాటు దేశంలో పలు చోట్ల అమల్లో ఉన్న టైటిలింగ్ విధానాలను అధ్యయనం చేసింది. అనేక సదస్సులు కూడా నిర్వహించింది.
ఈ నేపథ్యంలో, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు తయారు చేస్తున్న ప్రత్యేక బిల్లు కోసం డ్రాఫ్ట్ కమిటీని కూడా గతంలోనే నియమించింది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, తప్పుడు సాక్ష్యాలు సమర్పించిన వారికి శిక్షలు కూడా భారీగానే ఉండనున్నాయి. రూ.2 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
Courtesy- Andhrajyothy.
ఆక్రమణలతోపాటు ఒకే భూమికి రెండు మూడుసార్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రబుద్ధులతో కొనుగోలుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మీ పేరిట రిజిస్టర్ అయిన భూమి, ఆస్తులకు ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఓ ఒప్పందంగానే పేర్కొంటోంది తప్ప దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఎవరు హక్కుదారో!? ఎవరు అసలు వ్యక్తో ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. ముక్కుపిండి స్టాంపు డ్యూటీని వసూలు చేసుకుంటున్నా.. ‘ఈ భూమి మీదే’ అని ఇప్పటి వరకు ప్రభుత్వం సర్టిఫై చేయడం లేదు. ఫలితంగా.. రోజు రోజుకూ భూ వివాదాలూ పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే, ఆస్తులకు గ్యారెంటీ కల్పించే హక్కు కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. పట్టణాల్లో ఈ హక్కు కల్పించడం అత్యవసరమని కూడా కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమైంది. అదే.. ‘ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్’! ఈ పథకం కింద మీ ఆస్తులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీంతో, భవిష్యత్తులో భూ తగాదాలు, ఆక్రమణలు తగ్గుముఖం పట్టనున్నాయి.
‘ప్రాపర్టీ టైటిల్ సర్టిఫికేషన్ సిస్టమ్’ను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తేనుంది. ఇందులో భాగంగా, సదరు ఆస్తి ఎవరిదనే విషయాన్ని గుర్తించి, రిజిస్ట్రేషన్ సమయంలోనే ప్రభుత్వం సొంతదారుకు ప్రాపర్టీ వెరిఫికేషన్ సర్టిఫికెట్ను ఇస్తుంది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) సంస్కరణల్లో భాగంగా ఉన్న ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించే అవకాశం ఉంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖాస్రా/ఖాటాని, గిర్ద్వారీ విధానం పట్టణాల్లో లేకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం ‘గ్యారంటీ ల్యాండ్ టైటిల్’ స్కీంను ప్రవేశపెట్టింది. ఇలాంటి పథకమే కొన్ని ఇతర దేశాల్లో కూడా అమల్లో ఉంది. వాస్తవానికి, దేశ రాజధాని ఢిల్లీలో ప్రాపర్టీ టైటిలింగ్ సిస్టమ్ సరిగా లేనందున ప్రాపర్టీ మార్కెట్ లో అంతరం ఏర్పడిందని 2002లోనే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది. దీనిపై ఒక కమిటీని నియమించి విదేశాలతోపాటు దేశంలో పలు చోట్ల అమల్లో ఉన్న టైటిలింగ్ విధానాలను అధ్యయనం చేసింది. అనేక సదస్సులు కూడా నిర్వహించింది.
ఈ నేపథ్యంలో, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు తయారు చేస్తున్న ప్రత్యేక బిల్లు కోసం డ్రాఫ్ట్ కమిటీని కూడా గతంలోనే నియమించింది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, తప్పుడు సాక్ష్యాలు సమర్పించిన వారికి శిక్షలు కూడా భారీగానే ఉండనున్నాయి. రూ.2 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
ఇవీ ప్రయోజనాలు:
ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎవరి ఆస్తి ఎవరిదో ప్రభుత్వమే పక్కాగా చెబుతుంది. ప్రభుత్వమే ఇచ్చే టైటిల్ సర్టిఫికేషన్తో ఇదే ఆస్తిపై ఇతరులు వివాదాలకు దిగడం, కోర్టులకు వెళ్లడాన్ని అరికట్టవచ్చు. భూ వివాదాలు, ఆక్రమణలు తగ్గిపోతాయి. నకిలీ డాక్యుమెంట్లకు చెక్ పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు సులువవుతుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత పక్కాగా అమలు చేయవచ్చు. క్రయ, విక్రయ లావాదేవీలు వేగంగా, సులభతరం కావడంతో పాటు భద్రత కూడా ఉంటుంది. ఆస్తి సొంతదారు ఎవరో స్పష్టంగా ఉంటున్నందున పన్నుల వసూలు పెరుగుతుందిCourtesy- Andhrajyothy.
Tuesday, November 20, 2012
మాంద్యం(Recession) అంటే ఏమిటి..?
జిడిపి (GDP) పెరుగుదల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వరుస త్రైమాసికంలో నెగిటివ్లో ఉన్నప్పుడు మాంద్యం (Recession) అనే పదాన్ని ఉపయోగిస్తారు. స్థూల దేశీయ ఉత్పత్తి సంక్షిప్త పదం జిడిపి. దీని సహాయంతో ఉత్పత్తిని లెక్కిస్తారు. ఇండియా స్థూల దేశీయ ఉత్పత్తి 9% నుండి 6% శాతానికి తగ్గితే.. అదే అమెరికా లాంటి దేశాలలో స్థూల దేశీయ ఉత్పత్తి 1% నుండి -0.6% శాతానికి వరుసగా రెండు త్రైమాసికాలలో తగ్గగా, అప్పుడు ఈ రెండు దేశాలు మాంద్యం (Recession)లో ఉన్నట్లు పరిగణిస్తారు.
ఒక దేశం ఉత్పత్తిని స్థూల దేశీయ ఉత్పత్తి(GDP) ఉద్యోగం, పెట్టుబడి ఖర్చు, సామర్థ్య వాడకం, ఇంటి ఆదాయం, వ్యాపార లాభాలు, ద్రవ్యోల్బణం మొదలగున వాటితో లెక్కిస్తారు. మాంద్యం సమయంలో ఇలాంటివి అన్నీ దివాళా తీయడం వల్ల నిరుద్యోగ రేటు పెరుగుతుంది.
తెలుగు వన్ఇండియా
ఒక దేశం ఉత్పత్తిని స్థూల దేశీయ ఉత్పత్తి(GDP) ఉద్యోగం, పెట్టుబడి ఖర్చు, సామర్థ్య వాడకం, ఇంటి ఆదాయం, వ్యాపార లాభాలు, ద్రవ్యోల్బణం మొదలగున వాటితో లెక్కిస్తారు. మాంద్యం సమయంలో ఇలాంటివి అన్నీ దివాళా తీయడం వల్ల నిరుద్యోగ రేటు పెరుగుతుంది.
తెలుగు వన్ఇండియా
ఫైనాన్స్ బిల్లు అంటే ఏమిటి..?
ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్దిక మంత్రి ఫైనాన్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఉంటారు. ఇంతకీ ఈ ఈ ఫైనాన్స్ బిల్లు అంటే ఏమిటీ.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు పాఠకుల కోసం ప్రత్యేకం.
భారతదేశ ప్రభుత్వం తదుపరి ఆర్థిక సంవత్సరం కోసం ఈ సంవత్సరం తయారు చేసిన ఆర్థిక ప్రతిపాదనలకు అనుమతించే బిల్లు "ఫైనాన్స్ బిల్లు". ఈ బిల్లును రూపొందించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ప్రతి సంవత్సరానికి గాను ఆ కాలానికి సంబంధించి అనుబంధ ఆర్ధిక ప్రతిపాదనలను ప్రభావం చూపుతుంది కాబట్టి.
ప్రతి సంవత్సరం ఆర్దిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ పైనాన్స్ బిల్లును ప్రవేశపెడతారు. ఈ ఫైనాన్స్ బిల్లును ఎవ్వరూ వ్యతిరేకించ లేరు. వ్యయం బిల్లు, ఫైనాన్స్ బిల్లులు సభ్యులకు కాపీలు ముందుగా సర్క్యులేషన్ లేకుండా సభకు పరిచయం చేయవచ్చు. ఫైనాన్స్ బిల్లులో పన్ను ప్రతిపాదనలతో పాటు, గ్రాంట్స్ కోసం డిమాండ్లు ఓటు చెయ్యబడ్డ తర్వాత మాత్రమే లోక్ సభలో బిల్లు వస్తుంది.
ఫైనాన్స్ బిల్లుపై చర్చ విస్తారంగా ఉండడంతో భారతదేశ ప్రభుత్వం సభ్యులు ఏ చర్య ద్వారానైనా చర్చించవచ్చు. ఈ చర్చ ద్వారా మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం రివ్యూకి వస్తుంది. ఫైనాన్స్ బిల్లులపై ఏవిధమైన చర్చ జరుగుతుందో సరిగ్గా అలాంటి చర్చే మనీ బిల్లులపై జరుగుతుంది.
తెలుగు వన్ఇండియా
భారతదేశ ప్రభుత్వం తదుపరి ఆర్థిక సంవత్సరం కోసం ఈ సంవత్సరం తయారు చేసిన ఆర్థిక ప్రతిపాదనలకు అనుమతించే బిల్లు "ఫైనాన్స్ బిల్లు". ఈ బిల్లును రూపొందించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ప్రతి సంవత్సరానికి గాను ఆ కాలానికి సంబంధించి అనుబంధ ఆర్ధిక ప్రతిపాదనలను ప్రభావం చూపుతుంది కాబట్టి.
ప్రతి సంవత్సరం ఆర్దిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ పైనాన్స్ బిల్లును ప్రవేశపెడతారు. ఈ ఫైనాన్స్ బిల్లును ఎవ్వరూ వ్యతిరేకించ లేరు. వ్యయం బిల్లు, ఫైనాన్స్ బిల్లులు సభ్యులకు కాపీలు ముందుగా సర్క్యులేషన్ లేకుండా సభకు పరిచయం చేయవచ్చు. ఫైనాన్స్ బిల్లులో పన్ను ప్రతిపాదనలతో పాటు, గ్రాంట్స్ కోసం డిమాండ్లు ఓటు చెయ్యబడ్డ తర్వాత మాత్రమే లోక్ సభలో బిల్లు వస్తుంది.
ఫైనాన్స్ బిల్లుపై చర్చ విస్తారంగా ఉండడంతో భారతదేశ ప్రభుత్వం సభ్యులు ఏ చర్య ద్వారానైనా చర్చించవచ్చు. ఈ చర్చ ద్వారా మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం రివ్యూకి వస్తుంది. ఫైనాన్స్ బిల్లులపై ఏవిధమైన చర్చ జరుగుతుందో సరిగ్గా అలాంటి చర్చే మనీ బిల్లులపై జరుగుతుంది.
తెలుగు వన్ఇండియా
డిమ్యాట్ ఎకౌంట్ అంటే ఏమిటి.. అది ఎలా పని చేస్తుంది.?
బ్యాంకు ఖాతా మాదిరే డిమ్యాట్ ఎకౌంట్ పని చేస్తుంది. మీ బ్యాంకు నిల్వ బ్యాంకు లావాదేవీలు పుస్తకంలోనే లెక్కింపబడతాయి.. కాకపోతే భౌతికంగా నగదుని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఫామ్ రూపంలో సెక్యూరిటీస్ పద్దతిలో డెబిట్, క్రెడిట్లు జరుగుతాయి.
మీరు ఎందుకు డిమ్యాట్ ఎకౌంట్ను కలిగి ఉండాలి..?
సెబి మార్గదర్శకాల ప్రకారం - డిమెటరియలైజ్డ్ రూపంలో తప్ప ఏ రూపంలో విక్రయించకూడదు. అందువల్ల మీరు స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వాటాల క్రయవిక్రయాలు జరపాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఒక డిమ్యాట్ ఎకౌంట్ను కలిగి ఉండాలి.
డిమ్యాట్ ఎకౌంట్ ఎలా పని చేస్తుంది:
మీరు వాటాలను కొనుగోలు చేసినప్పుడు, బ్రోకర్ మీ వాటాల హోల్డింగ్స్ ఈ డిమ్యాట్ ఎకౌంట్ క్రెడిట్లు ప్రకటనలో ప్రతిఫలిస్తాయి. మీరు ఇంటర్నెట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా ట్రేడింగ్ను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆన్ లైన్లో మీ హోల్టింగ్స్ను చూడొచ్చు. సాధారణంగా బ్రోకర్ షేర్స్ను T +2 అని, ఆ తర్వాత వాణిజ్య రోజు + 2 రోజులుగా విశ్వసిస్తాడు.
మీరు ఎప్పుడైనా వాటాలను అమ్మదలిస్తే, వివిధ స్టాక్ వివరాలు నింపి డెలివరీ సూచనల నోటుని మీ బ్రోకర్కు ఇవ్వాలి. మీ ఖాతా వాటాలను డెబిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు అమ్మిన వాటాలకు డబ్బు చెల్లిస్తారు. అదే మీరు ఆన్ లైన్లో ఇంటర్నెట్ ద్వారా ట్రేడింగ్ నిర్వహిస్తుంటే వాటంతటవే షేర్స్ డెబిట్ అయి, మీ ఖాతాల్లో డబ్బు క్రెడిట్ అవుతుంది.
భారతదేశంలో మొత్తం రెండు డిపాజిటరీస్ ఉన్నాయి. అవి ఒకటి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (NSDL), రెండవది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL).
డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం వల్ల ఉపయోగాలు:
భౌతిక రూపాలలో వాటాలను ఉంచాల్సిన అవసరం లేదు
వాటాలలో ఒక వాటా క్రయవిక్రయాలు జరపవచ్చు
బదిలీ సంఖ్య పై స్టాంపు డ్యూటీ లేదు
బదిలీ దస్తావేజు అవసరం లేదు
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ వెబ్ సైట్స్ని సందర్శించండి
తెలుగు వన్ఇండియా
మీరు ఎందుకు డిమ్యాట్ ఎకౌంట్ను కలిగి ఉండాలి..?
సెబి మార్గదర్శకాల ప్రకారం - డిమెటరియలైజ్డ్ రూపంలో తప్ప ఏ రూపంలో విక్రయించకూడదు. అందువల్ల మీరు స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వాటాల క్రయవిక్రయాలు జరపాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఒక డిమ్యాట్ ఎకౌంట్ను కలిగి ఉండాలి.
డిమ్యాట్ ఎకౌంట్ ఎలా పని చేస్తుంది:
మీరు వాటాలను కొనుగోలు చేసినప్పుడు, బ్రోకర్ మీ వాటాల హోల్డింగ్స్ ఈ డిమ్యాట్ ఎకౌంట్ క్రెడిట్లు ప్రకటనలో ప్రతిఫలిస్తాయి. మీరు ఇంటర్నెట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా ట్రేడింగ్ను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆన్ లైన్లో మీ హోల్టింగ్స్ను చూడొచ్చు. సాధారణంగా బ్రోకర్ షేర్స్ను T +2 అని, ఆ తర్వాత వాణిజ్య రోజు + 2 రోజులుగా విశ్వసిస్తాడు.
మీరు ఎప్పుడైనా వాటాలను అమ్మదలిస్తే, వివిధ స్టాక్ వివరాలు నింపి డెలివరీ సూచనల నోటుని మీ బ్రోకర్కు ఇవ్వాలి. మీ ఖాతా వాటాలను డెబిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు అమ్మిన వాటాలకు డబ్బు చెల్లిస్తారు. అదే మీరు ఆన్ లైన్లో ఇంటర్నెట్ ద్వారా ట్రేడింగ్ నిర్వహిస్తుంటే వాటంతటవే షేర్స్ డెబిట్ అయి, మీ ఖాతాల్లో డబ్బు క్రెడిట్ అవుతుంది.
భారతదేశంలో మొత్తం రెండు డిపాజిటరీస్ ఉన్నాయి. అవి ఒకటి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ (NSDL), రెండవది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL).
డిమ్యాట్ ఎకౌంట్ ఓపెన్ చెయ్యడం వల్ల ఉపయోగాలు:
భౌతిక రూపాలలో వాటాలను ఉంచాల్సిన అవసరం లేదు
వాటాలలో ఒక వాటా క్రయవిక్రయాలు జరపవచ్చు
బదిలీ సంఖ్య పై స్టాంపు డ్యూటీ లేదు
బదిలీ దస్తావేజు అవసరం లేదు
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ వెబ్ సైట్స్ని సందర్శించండి
తెలుగు వన్ఇండియా
RTGS, NEFTల మధ్యనున్న వ్యత్యాసం ఏమిటి..?
RTGS' అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. పేరు సూచించినట్లుగా ఎటువంటి నెట్టింగు లేకుండా నిరంతరం (real-time) పోస్ట్ చేయబడుతుంది. ఇక 'గ్రాస్ సెటిల్మెంట్' విషయానికి వస్తే నగదు బదిలీ సూచనలను వ్యక్తిగతంగా (సూచనల ఆధారంగా ద్వారా ఒక సూచన మీద) ఏర్పడుతుందని అర్థం.
'NEFT' అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ప్రధానంగా భారతదేశంలో బ్యాంకుల ఆధారంగా ఆర్థిక సంస్థ ద్వారా ఆన్లైన్ నిధుల బదిలీ జరుగుతుంది. NEFT వ్యవస్థ ద్వారా బ్యాంక్ శాఖలో ఖాతాల నిర్వహణ వ్యక్తులు, సంస్థలు లేదా కార్పోరేట్స్ నిధులను అందుకోవచ్చు.
NEFT, RTGS మధ్య తేడా:
1. ఈ రెండింటి మధ్య ప్రాథమిక తేడాలు సెటిల్మెంట్ సమయానికి సంబంధించింది. RTGS లావాదేవీ సూచనల ఆధారంగా, ఒక సూచన ఆధారంగా స్థూల పరిష్కారం పై ఆధారపడి ఉంటుంది. NEFT ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ, నికర సెటిల్మెంట్ (DNS) ఆధారంగా వంతులవారీగా లావాదేవీలు నిలిపివేసే పద్ధతిలో పనిచేస్తుంది.
2. రిజర్వు బ్యాంకును బట్టి RTGS కోసం కనీస మొత్తం రూ 2 లక్షల పైన ఉండాలి, అదే NEFT కనీస లేదా గరిష్ట గాని పరిమితి సంఖ్య అంటూ ఏమీ లేదు. NEFT ఉపయోగించి నిధుల మొత్తం మీద బదిలీలను చేయవచ్చు.
3. NEFT గంటల వంతున జరిగితే.. RTGS మాత్రం నిరంతర ప్రాతిపదికన జరుగుతుంది. వారం రోజులలో(సోమవారం నుండి శుక్రవారం)వరకు ఉదయం 9 నుండి రాత్రి 7 గంటలకు 11 సెటిల్మెంట్లు జరిగితే.. శనివారంలో ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు 5 సెటిల్మెంట్లుగా లావాదేవీలు జరుగుతాయి.
లావాదేవీల కోసం వర్తించే ఛార్జీలు:
NEFT
For transactions up to Rs 1 lakh – not exceeding Rs 5 (+ Service Tax)
For transactions above Rs 1 lakh and up to Rs 2 lakhs – not exceeding Rs 15 (+ Service Tax)
For transactions above Rs 2 lakhs – not exceeding Rs 25 (+ Service Tax)
RTGS
For transactions between Rs 2 lakh to Rs 5 lakh - not exceeding Rs. 30 per transaction.
For transactions above Rs 5 lakh - not exceeding Rs. 55 per transaction.
తెలుగు వన్ఇండియా
'NEFT' అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ప్రధానంగా భారతదేశంలో బ్యాంకుల ఆధారంగా ఆర్థిక సంస్థ ద్వారా ఆన్లైన్ నిధుల బదిలీ జరుగుతుంది. NEFT వ్యవస్థ ద్వారా బ్యాంక్ శాఖలో ఖాతాల నిర్వహణ వ్యక్తులు, సంస్థలు లేదా కార్పోరేట్స్ నిధులను అందుకోవచ్చు.
NEFT, RTGS మధ్య తేడా:
1. ఈ రెండింటి మధ్య ప్రాథమిక తేడాలు సెటిల్మెంట్ సమయానికి సంబంధించింది. RTGS లావాదేవీ సూచనల ఆధారంగా, ఒక సూచన ఆధారంగా స్థూల పరిష్కారం పై ఆధారపడి ఉంటుంది. NEFT ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ, నికర సెటిల్మెంట్ (DNS) ఆధారంగా వంతులవారీగా లావాదేవీలు నిలిపివేసే పద్ధతిలో పనిచేస్తుంది.
2. రిజర్వు బ్యాంకును బట్టి RTGS కోసం కనీస మొత్తం రూ 2 లక్షల పైన ఉండాలి, అదే NEFT కనీస లేదా గరిష్ట గాని పరిమితి సంఖ్య అంటూ ఏమీ లేదు. NEFT ఉపయోగించి నిధుల మొత్తం మీద బదిలీలను చేయవచ్చు.
3. NEFT గంటల వంతున జరిగితే.. RTGS మాత్రం నిరంతర ప్రాతిపదికన జరుగుతుంది. వారం రోజులలో(సోమవారం నుండి శుక్రవారం)వరకు ఉదయం 9 నుండి రాత్రి 7 గంటలకు 11 సెటిల్మెంట్లు జరిగితే.. శనివారంలో ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు 5 సెటిల్మెంట్లుగా లావాదేవీలు జరుగుతాయి.
లావాదేవీల కోసం వర్తించే ఛార్జీలు:
NEFT
For transactions up to Rs 1 lakh – not exceeding Rs 5 (+ Service Tax)
For transactions above Rs 1 lakh and up to Rs 2 lakhs – not exceeding Rs 15 (+ Service Tax)
For transactions above Rs 2 lakhs – not exceeding Rs 25 (+ Service Tax)
RTGS
For transactions between Rs 2 lakh to Rs 5 lakh - not exceeding Rs. 30 per transaction.
For transactions above Rs 5 lakh - not exceeding Rs. 55 per transaction.
తెలుగు వన్ఇండియా
టాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే ఏమిటీ...? వాటి వల్ల ఉపయోగం ఉందా..?
టాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే 'పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన తర్వాత టాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా తిరిగి వచ్చిన వడ్డీ పన్ను పరిధిలోకి రాదన్నమాట'.
ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బుకు మీరు గవర్నమెంట్కు కట్టేటటువంటి మొత్తం ఇన్ కమ్ టాక్స్ పరిధిలోకి రాదు. ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ సెక్యూర్గా ఉండేలా పాక్షిక ప్రభుత్వ ఆధారిత సంస్థలు జారీ చేస్తాయి. లేకపోతే భారత ప్రభుత్వం గ్రీసీ మార్గంలో వెళ్లడం వల్ల సార్వభౌమ రుణం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ఎన్ఎస్ఈ, బిఎస్ఈ లలో ట్రేడ్ అవుతూ లిక్విడిటీని ఆఫర్ చేస్తాయి.
అయినప్పటికీ.. ఈక్విడిటీల మాదికి ఎక్కువ మొత్తంలో ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ట్రేడ అవ్వవు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, పాలన పన్ను ఫ్రీ బాండ్స్ సానుకూలంగా ఉంటాయి. 2012-2013వ సంవత్సరానికి గాను ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గతంలో మొత్తాన్ని సంస్థలు 2011-2012తో పోల్చితే రూ 60,000 కోట్ల కు పెంచుతుందని రెట్టింపుగా ప్రకటించాడు. ఇందులో NHAI కోసం రూ 10,000 కోట్లు, IRFC కోసం 10,000 కోట్లు, IIFCL కోసం 10,000 కోట్లు, HUDCO కోసం 5,000 కోట్లు, జాతీయ హౌసింగ్ బ్యాంక్ కోసం 5,000 కోట్లు SIDBI కోసం 5,000 కోట్లు, పోర్ట్స్ కోసం 5,000 కోట్లు, పవర్ సెక్టార్ కోసం రూ 10,000 కోట్లు కేటాయించారు.
సెకండరీ మార్కెట్ ద్వారా ఎవరైతే లాంగ్ టర్మ్ పెట్టుబడులను పెట్టాలని చూస్తారో వారికి ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ బూమింగ్నిస్తాయి. పెట్టుబడి దారులు ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ లలో పెట్టుబడి పెట్టడం ద్వారా గతయేడాది కంపెనీలన బట్టి 8.20-8.35% వరకు టాక్స్ ఫ్రీ కూపన్ రేటుని సొంతం చేసుకున్నారు. ఉదాహారణకు ఫిబ్రవరి 2012లో HUDCO టాక్స్ ఫ్రీ బాండ్ని పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల వ్యవధిలో ఈ కంపెనీ 8.35% కూపన్ రేట్ని సొంతం చేసుకుంటుంది.
తెలుగు వన్ఇండియా
ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బుకు మీరు గవర్నమెంట్కు కట్టేటటువంటి మొత్తం ఇన్ కమ్ టాక్స్ పరిధిలోకి రాదు. ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ సెక్యూర్గా ఉండేలా పాక్షిక ప్రభుత్వ ఆధారిత సంస్థలు జారీ చేస్తాయి. లేకపోతే భారత ప్రభుత్వం గ్రీసీ మార్గంలో వెళ్లడం వల్ల సార్వభౌమ రుణం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ఎన్ఎస్ఈ, బిఎస్ఈ లలో ట్రేడ్ అవుతూ లిక్విడిటీని ఆఫర్ చేస్తాయి.
అయినప్పటికీ.. ఈక్విడిటీల మాదికి ఎక్కువ మొత్తంలో ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ట్రేడ అవ్వవు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, పాలన పన్ను ఫ్రీ బాండ్స్ సానుకూలంగా ఉంటాయి. 2012-2013వ సంవత్సరానికి గాను ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గతంలో మొత్తాన్ని సంస్థలు 2011-2012తో పోల్చితే రూ 60,000 కోట్ల కు పెంచుతుందని రెట్టింపుగా ప్రకటించాడు. ఇందులో NHAI కోసం రూ 10,000 కోట్లు, IRFC కోసం 10,000 కోట్లు, IIFCL కోసం 10,000 కోట్లు, HUDCO కోసం 5,000 కోట్లు, జాతీయ హౌసింగ్ బ్యాంక్ కోసం 5,000 కోట్లు SIDBI కోసం 5,000 కోట్లు, పోర్ట్స్ కోసం 5,000 కోట్లు, పవర్ సెక్టార్ కోసం రూ 10,000 కోట్లు కేటాయించారు.
సెకండరీ మార్కెట్ ద్వారా ఎవరైతే లాంగ్ టర్మ్ పెట్టుబడులను పెట్టాలని చూస్తారో వారికి ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ బూమింగ్నిస్తాయి. పెట్టుబడి దారులు ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ లలో పెట్టుబడి పెట్టడం ద్వారా గతయేడాది కంపెనీలన బట్టి 8.20-8.35% వరకు టాక్స్ ఫ్రీ కూపన్ రేటుని సొంతం చేసుకున్నారు. ఉదాహారణకు ఫిబ్రవరి 2012లో HUDCO టాక్స్ ఫ్రీ బాండ్ని పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల వ్యవధిలో ఈ కంపెనీ 8.35% కూపన్ రేట్ని సొంతం చేసుకుంటుంది.
తెలుగు వన్ఇండియా
Subscribe to:
Posts (Atom)

రానున్న
బడ్జెట్లో వేతనజీవులకు మరింత ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలనే డిమాండ్లు
జోరందుకుంటున్నాయి. ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపునకు సంబంధించి... సెక్షన్
80సి కింద పన్ను ఆదాయంలో మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. లక్ష నుంచి
కనీసం రూ. 2 లక్షల స్థాయికి పెంచాలని పరిశ్రమ చాంబర్ ఫిక్కీ పేర్కొంది.
ఆర్థిక శాఖకు సమర్పించిన ప్రి-బడ్జెట్ మెమొరాండంలో ఈ మేరకు పలు విజ్ఞప్తులు
చేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పన్ను ఆదా పథకాలపై మరింత
దృష్టిసారించడం, అదేవిధంగా పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ చర్యలు
అవసరమని తెలిపింది.
వచ్చే
ఏడాదిలో కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరిలో కార్ల ధరలను రూ.20,000 వరకూ
పెంచాలని మారుతీ సుజుకీ ఇప్పటికే నిర్ణయించింది. 1-2% ధరలను పెంచనున్నామని
టయోటా పేర్కొం ది. జనరల్ మోటార్స్ 3% వరకూ ధరలను పెంచుతోంది. హోండా కార్స్
ఇండియా, ఫోక్స్వ్యాగన్ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలు
పెరుగుతున్నాయని, డాలర్తో రూపాయి మారకం తీవ్రమైన ఒడిదుడుకులకు
లోనవుతుండటంతో మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని, అందుకే ధరలు పెంచాల్సి
వస్తోందని కంపెనీలంటున్నాయి.