Thursday, February 6, 2014

జిగేల్..జిగేల్..

    -ఆటో ఎక్స్‌పో అదుర్స్
    -కొత్త వాహనాలతో సందడి చేసిన సంస్థలు
    -కాన్సెప్ట్ కార్లే అధికం
    గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 5: ఆటోమొబైల్ సంస్థలకు పండుగ కళ వచ్చింది. కొత్త వాహనాలు, తళుక్కుమనే బెణుకులు, తారల సందడి, కంపెనీల ప్రతినిధుల సందడి ఇది తొలిరోజు గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటోఎక్స్‌పో విశేషాలు. గడిచిన రెండేళ్లుగా అమ్మకాలు లేక వెల ఆటోమొబైల్ సంస్థలు కొత్త వాహనాలను విడుదల చేయడంలో మాత్రం టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న 12వ ఆటో ఎక్స్‌పోలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు కొత్త కార్లతో సందడి చేశాయి. దేశవ్యాప్తంగా కాన్సెప్ట్ కార్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో తొలిరోజు సంస్థలు వీటిని ప్రదర్శించడానికి మొగ్గు చూపాయి. దేశ ఆర్థిక రంగం ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సంకేతాలు వెలుబడటంతో ఆటోమొబైల్ సంస్థలు 2014పైనే భారీ ఆశలు పెట్టుకున్నాయి.karina దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వంటి అగ్రస్థాయి సంస్థలు కాన్సెప్ట్ కార్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. తొలి రెండు రోజులు కేవలం కంపెనీ ప్రతినిధులు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ విశ్లేషకులకు మాత్రమే అనుమతినిస్తుండగా.. ఏడు నుంచి సామాన్యులకు కూడా అవకాశం కల్పించింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ఎస్‌ఐఏఎం), భారత పరిక్షిశమల సమాఖ్య(సీఐఐ)తోపాటు ఆటోమొటివ్ విడిభాగాలు తయారీదారుల సంఘం(ఏసీఎంఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్‌పో ఈ నెల 11 వరకు జరుగనున్నది.

    దీంట్లోభాగంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ రెండు కొత్త కాన్సెప్ట్ మోడళ్లను నేడు ప్రదర్శించింది.అమ్మకాలను పెంచుకోవడానికి కొత్త వాహనాలను విడుదలచేయాలని నిర్ణయించినట్లు మారుతి సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. మాంద్యం పరిస్థితుల్లోనే గత ఆర్థిక సంవత్సరంలో 10.6 లక్షల యూనిట్లను సంస్థను విక్రయించింది. మరో ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన సంటే ఫీని ప్రవేశపెట్టింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.26.3 లక్షల నుంచి రూ.29.2 లక్షల మధ్యలో లభించనున్నది. అలాగే జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థ సుజుకీ మోటార్ 1000 సీసీ సామర్థ్యంతో రూ.15 లక్షల విలువైన ప్రీమియం బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

    నెక్సన్‌ను ప్రవేశపెట్టిన టాటామోటార్స్
    అమ్మకాలు లేక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్..కాన్సెప్ట్ కాంపాక్ట్ స్పోర్ట్స్ యూటిలిటీ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ‘నెక్సన్‌తోపాటు కనెక్ట్‌నెక్ట్’ పేర్లతో లభించే ఈ కొత్త కార్లతో మార్కెట్ వాటా పెరగడానికి దోహదపడుతుందని కంపెనీ ఆశిస్తున్నది. ఈ రెండింటితోపాటు కాంపాక్ట్ సెడాన్ జెస్ట్, హ్యచ్‌బ్యాక్ బోల్ట్ వాహనాలను కూడా ప్రదర్శించింది. కమర్షియల్ వాహన సెగ్మెంట్‌కు చెందిన మీడియం కమర్షియల్ వాహనాలైన సీఎక్స్ 1618టీ, అల్ట్రా 614, ఎల్‌పీఎస్ 4923 ఎల్‌ఏలను కూడా మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నది. ఈ కొత్త కార్లలో టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ, మాజీ చైర్మన్ రతన్ టాటా సందడి చేశారు.


    హీరో మోటో నుంచి 100 సీసీ బైక్
    ద్విచక్ర వాహనాల ఉత్పత్తలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్..ండు కొత్త బైక్‌లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి రెడీ అయింది. దీంట్లో 100 సీసీ సామర్థ్యం గల స్లెండర్ ప్రో క్లాసిక్, ప్యాషన్ టీఆర్ బైకులను వచ్చే నెల నుంచి దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజల్ తెలిపారు. ఈ బైక్‌లతోపాటు 620 సీసీ సామర్థ్యం గల సూపర్ ప్రీమియం మోటార్‌బైక్ ‘హస్టర్’, కాన్సెప్ట్ బైక్స్ ‘సింపిల్‌సిటీ’, ఇయాన్ బైక్‌లను కూడా ప్రదర్శించింది. 150 సీసీ సామర్థ్యంతో రూపొందించిన డీజిల్ బైక్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

    హార్లీ డేవిడ్సన్ నుంచి చవకైన బైక్
    ప్రీమియం బైకుల ఉత్పత్తి సంస్థ హార్లీ డేవిడ్సన్ దేశీయ మార్కెట్లోకి చవకైన బైక్‌ను విడుదలచేసింది. స్ట్రీట్ 750 పేరుతో లభించే ఈబైక్ ఢిల్లీ షోరూంలో రూ.4.11 లక్షలకు లభించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. యువతను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించడం జరిగిందని హార్లీ డేవిడ్సన్ ఇండియా ఎండీ అనూప్ ప్రకాశ్ తెలిపారు. ఈ కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు మార్చి 1 నుంచి బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపింది. ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో 13 మోడళ్లు అందుబాటులో ఉండగా..స్ట్రీట్ 750 మిగత వాటికంటే తక్కువ ధర కలదు.

    రూ.1,100 కోట్లతో గుజరాత్‌లో ప్లాంట్: హెచ్‌ఎంఎస్‌ఐ
    గుజరాత్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడితో స్కూటర్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రకటించింది. ఇప్పటికే హర్యానా, రాజస్థాన్, కర్ణాటకలో మూడు ప్లాంట్లు ఉండగా..గుజరాత్‌లో ఏర్పాటుచేయబోయేది నాలుగొది కానున్నది. దేశవ్యాప్తంగా స్కూటర్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో రూ.1,100 కోట్ల పెట్టుబడితో ఏడాది 12 లక్షల యూనిట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈవో కైతా మరమత్సు తెలిపారు. 2016 కల్లా అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్లో మూడు వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నది.

    యమహా నుంచి సరికొత్త స్కూటర్
    జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థ యమహా..దేశీయ విపణిలోకి సరికొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ‘అల్ఫా’ పేరుతో లభించే ఈ స్కూటర్ ఢిల్లీ షోరూంలో రూ.49,518కి లభించనున్నది. కుటుంబ అవసరాలకోసం తయారు చేసిన ఈ స్కూటర్‌ను ఏడాదికి రెండు లక్షల యూనిట్లు విక్రయించాలనుకుంటున్నట్లు యమహా మోటార్ ప్రెసిడెంట్, సీఈవో హిరోయుకి యనగి తెలిపారు. 113 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు 62కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. భారత్‌లో స్కూటర్లకు డిమాండ్ అధికంగా ఉందని..2014లో దేశవ్యాప్తంగా 36 లక్షల వాహనాలు విక్రయించే అవకాశం ఉందన్నారు.