Monday, February 10, 2014

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముఖ్యాంశాలు (10-02-2014)

హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వచ్చే ఆర్నెల్ల కాలానికి గాను నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సభలో తెలంగాణ సభ్యుల నిరసన నినాదాల మధ్య పదినిమిషాల్లోనే మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగించారు. అందులోని ముఖ్యాంశాలు.
* 2014-15 వార్షిక బడ్జెట్ రూ. 1,83,129 కోట్లు.
* ప్రణాళిక వ్యయం రూ. 67,950 కోట్లు.
* ప్రణాళికేతర వ్యయం రూ. 1,15,179 కోట్లు
*  రెవెన్యూ నిధుల అంచనా రూ. 474 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా రూ. 25,402 కోట్లు
*  2013-14 లో సవరించిన బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు రూ. 1.023 కోట్లు.

కొత్త ఉద్యోగాలు 
*  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,346 కొత్త ఉద్యోగాలు మంజూరు చేశాం.
*  98,652 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
*  వరిసాగు 2012-13 లో 36.28 లక్షల హెక్టార్ల నుంచి 2013-14లో 43.95లక్షల హెక్టార్లకు పెరిగింది.
*  2013-14లో ఆహారధాన్యాల ఉత్పత్తి 207.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా.
*  2013-14లో రైతులకు సబ్సిడీపై అందించే ఎరువుల మొత్తాన్ని 72.33 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచగలిగాం.
*  ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల కార్యక్రమం కేటాయింపును రూ. 571. 84 కోట్లకు పెంచాం.
*  గుడ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
*  పశుసంపద అభివృద్ధికి కేటాయింపులను రూ. 874.15 కోట్లకు పెంచాం.
* 2013-14లో రూ. 67,224 కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలన్నది లక్ష్యం.
*  జలయజ్ఞం కింద ఇప్పటివరకు 17 ప్రాజెక్టులు పూర్తి చేశాం.
*  మచిలీపట్నం నౌకాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తాం.
*  భావనపాడు, కళింగపట్నంలో రెండు చిన్న నౌకాశ్రయాల అభివృద్ధి ప్రతిపాదన ఉంది.
*  రాజీవ్ యువకిరణాల పథకం కింద 25 వేల మందికి ఉపాధి కల్పించాం.
*  బంగారు తల్లి పథకం కింద నమోదైన లబ్ధిదారుల సంఖ్య 1,59,163.

(Courtesy EENADU)