స్టాక్ మార్కెట్ 2011
ఈ ఏడాదిని దలాల్ స్టీట్కు మరో 'బేర్ ఇయర్'గా చెప్పుకోవచ్చు. యూరోజోన్ రుణ సంక్షోభం, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, కీలక వడ్డీరేట్ల పెంపు, రూపాయి బలహీనం మన మార్కెట్లను ఎంతో ఇబ్బంది పెట్టాయి. దీంతో ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంపద దాదాపు 20లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఈ ఏడాది మొత్తం మీద మన మార్కెట్లు దాదాపు 25 శాతం కరెక్షన్కు గురయ్యాయి. దీంతో పాటు ఈ ఏడాది వచ్చిన ఐపీఓలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి.
గత రెండేళ్ళుగా లాభాలతో ముగిసిన మన స్టాక్ మార్కెట్లు 2011లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. రెండడుగులు ముందుకు వేస్తే... నాలుగడుగులు వెనక్కి మళ్ళినట్టు మార్కెట్లు ఈ ఏడాది భారీగా పతనమయ్యాయి. దీంతో ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంపద దాదాపు 20 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ప్రధాన సూచీలన్నీ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దేశీయ, విదేశీ పరిణామాలు మన మార్కెట్లను భారీగా కృంగదీశాయి. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు, కీలక వడ్డీరేట్లను పలుమార్లు పెంచటం, యూరోజోన్ రుణ సంక్షోభం, రుపాయి బలహీనం, గోల్డ్పై పెట్టుబడులు పెరగటం మన మార్కెట్ల సెంటిమెంట్ను బలహీనపర్చాయి. దీంతో ఈ ఏడాది సెన్సెక్స్ దాదాపు 5 వేల పాయింట్లు, నిఫ్టీ 15 వందల పాయింట్లు నష్టపోయాయి.
వచ్చే ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ స్టేబుల్ గా ఉంటాయని, సెకండ్ హాఫ్లో టెక్స్టైల్స్ స్టాక్స్ చక్కని రిటర్న్స్ ఇస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇక ఐపీఓల విషయానికి వస్తే ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో అధిక శాతం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో సెబీ అనుమతి ఉన్నప్పటికీ ఐపీఓకు రావాలంటేనే ఆయా కంపెనీలు భయపడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లన్నీ డౌన్ట్రెండ్లో ఉండటంతో ... సెబీ అనుమతి ఉన్నా పబ్లిక్ ఇష్యూకు రావాల్సిన దాదాపు 25 కంపెనీలు పరిస్థితులు చక్కబడ్డాక రావాలని ఆలోచిస్తున్నాయి.
ఈ ఏడాది 14 వేల 112 కోట్ల రూపాయలను సేకరించడానికి వివిధ కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఇందులో 5 ఐపీవోలు 80 శాతం పైగా విలువను కోల్పోయాయి. దాదాపు 10 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రీమియం ధర ఎక్కువగా ఉండటం... వివిధ కంపెనీలపై నెగిటివ్ వార్తలు రావడంతో ఆయా షేర్ల ధర భారీగా పతనమైంది. తక్శీల్ సొల్యూషన్స్ 92 శాతం, ఆర్డీబీ రసాయన్స్ 90 శాతం, ఇన్ఫో మీడియా 89 శాతం, అక్రోపిటెల్ 87 శాతం, శిల్పి కేబుల్స్ 85 శాతం కరెక్షన్కు గురయ్యాయి.
ఐపీఓలు అట్టర్ ఫ్లాఫ్ అయినా...ఈ ఏడాది ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ స్టాకుల్లో చక్కని ర్యాలీ వచ్చింది. అయితే మిగతా కౌంటర్లు కరెక్షన్కు లోనవడంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఏదేమైనా 2011 ఇన్వెస్టర్లకు ఒక పీడకలగా చెప్పొచ్చు.
ఈ ఏడాదిని దలాల్ స్టీట్కు మరో 'బేర్ ఇయర్'గా చెప్పుకోవచ్చు. యూరోజోన్ రుణ సంక్షోభం, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, కీలక వడ్డీరేట్ల పెంపు, రూపాయి బలహీనం మన మార్కెట్లను ఎంతో ఇబ్బంది పెట్టాయి. దీంతో ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంపద దాదాపు 20లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఈ ఏడాది మొత్తం మీద మన మార్కెట్లు దాదాపు 25 శాతం కరెక్షన్కు గురయ్యాయి. దీంతో పాటు ఈ ఏడాది వచ్చిన ఐపీఓలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి.
గత రెండేళ్ళుగా లాభాలతో ముగిసిన మన స్టాక్ మార్కెట్లు 2011లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. రెండడుగులు ముందుకు వేస్తే... నాలుగడుగులు వెనక్కి మళ్ళినట్టు మార్కెట్లు ఈ ఏడాది భారీగా పతనమయ్యాయి. దీంతో ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంపద దాదాపు 20 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ప్రధాన సూచీలన్నీ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దేశీయ, విదేశీ పరిణామాలు మన మార్కెట్లను భారీగా కృంగదీశాయి. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు, కీలక వడ్డీరేట్లను పలుమార్లు పెంచటం, యూరోజోన్ రుణ సంక్షోభం, రుపాయి బలహీనం, గోల్డ్పై పెట్టుబడులు పెరగటం మన మార్కెట్ల సెంటిమెంట్ను బలహీనపర్చాయి. దీంతో ఈ ఏడాది సెన్సెక్స్ దాదాపు 5 వేల పాయింట్లు, నిఫ్టీ 15 వందల పాయింట్లు నష్టపోయాయి.
వచ్చే ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ స్టేబుల్ గా ఉంటాయని, సెకండ్ హాఫ్లో టెక్స్టైల్స్ స్టాక్స్ చక్కని రిటర్న్స్ ఇస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇక ఐపీఓల విషయానికి వస్తే ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో అధిక శాతం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో సెబీ అనుమతి ఉన్నప్పటికీ ఐపీఓకు రావాలంటేనే ఆయా కంపెనీలు భయపడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లన్నీ డౌన్ట్రెండ్లో ఉండటంతో ... సెబీ అనుమతి ఉన్నా పబ్లిక్ ఇష్యూకు రావాల్సిన దాదాపు 25 కంపెనీలు పరిస్థితులు చక్కబడ్డాక రావాలని ఆలోచిస్తున్నాయి.
ఈ ఏడాది 14 వేల 112 కోట్ల రూపాయలను సేకరించడానికి వివిధ కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఇందులో 5 ఐపీవోలు 80 శాతం పైగా విలువను కోల్పోయాయి. దాదాపు 10 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రీమియం ధర ఎక్కువగా ఉండటం... వివిధ కంపెనీలపై నెగిటివ్ వార్తలు రావడంతో ఆయా షేర్ల ధర భారీగా పతనమైంది. తక్శీల్ సొల్యూషన్స్ 92 శాతం, ఆర్డీబీ రసాయన్స్ 90 శాతం, ఇన్ఫో మీడియా 89 శాతం, అక్రోపిటెల్ 87 శాతం, శిల్పి కేబుల్స్ 85 శాతం కరెక్షన్కు గురయ్యాయి.
ఐపీఓలు అట్టర్ ఫ్లాఫ్ అయినా...ఈ ఏడాది ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ స్టాకుల్లో చక్కని ర్యాలీ వచ్చింది. అయితే మిగతా కౌంటర్లు కరెక్షన్కు లోనవడంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఏదేమైనా 2011 ఇన్వెస్టర్లకు ఒక పీడకలగా చెప్పొచ్చు.