Saturday, January 21, 2012

Busi_IPO

Busi_IPO

స్టాక్‌ మార్కెట్ల వరుస పతనాలతో ఐపీఓల జోరు కాస్త తగ్గింది. సెబీ అనుమతి ఉన్నప్పటికీ మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌లో ఉండటంతో ఆయా కంపెనీలు ఐపీఓలపై పునరాలోచిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల విస్తరణ కార్యక్రమాలు మరింత ఆలస్యం కానున్నాయి.

ఒకప్పుడు పబ్లిక్‌ ఇష్యూలంటే ఎంతో ఆసక్తి చేపే కంపెనీలు... ప్రస్తుతం ఆ పేరు వింటేనే ఆమడదూరం పరిగెడుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ వరుస పతనాలు సెకండరీ మార్కెట్‌తో పాటూ ఐపీఓలనూ ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో సెబీ అనుమతి ఉన్నప్పటికీ ఐపీఓకు రావాలంటేనే ఆయా కంపెనీలు భయపడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లన్నీ డౌన్‌ట్రెండ్‌లో ఉండటంతో ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన కంపెనీలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. మరోవైపు సెబీ అనుమతి ఉన్నా పబ్లిక్‌ ఇష్యూకు రావాల్సిన దాదాపు 25 కంపెనీలు పరిస్థితులు చక్కబడ్డాక రావాలని ఆలోచిస్తున్నాయి. సెబీ అనుమతి తీసుకున్నా ఏడాదిలోపు ఐపీఓకు రావాల్సిన కంపెనీలు కాలపరిమితి ముగుస్తుండటంతో ప్రస్తుతం రావాలా వద్దా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇష్యూకు రాని కంపెనీల్లో లోధా డెవలపర్స్‌, ఆంబియన్స్‌ రియల్‌ ఎస్టేట్‌, కుమార్‌ అర్బన్‌ డెవలపర్స్‌, నెప్ట్యూన్‌ డెవలపర్స్‌, బీపీటీపీ, రహేజా యూనివర్సల్‌ అండ్‌ లవాసా కార్పొరేషన్‌, స్టెర్‌లైట్‌ ఎనర్జీ, జిందాల్‌ పవర్‌, అవన్తా పవర్‌, ఇండ్‌ భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రాలు ఉన్నాయి.

స్పాట్‌...

ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, యూరోప్‌ సంక్షోభంతో ప్రస్తుతం ట్రేడర్లు, ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్‌కు దూరంగా ఉంటున్నారు. అలాగే బులియన్‌ మార్కెట్‌పై ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం కూడా మరో ప్రధాన కారణం. ఇతర దేశాలతో పోలిస్టే భారత ఆర్థిక వృద్ధి రేటు బలంగా ఉన్నప్పటికీ... అంతర్జాతీయ పరిణామాలు మన మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఐపీఓలు క్లిక్‌ కావడం లేదని విమర్శలు వస్తున్నాయి.

బైట్‌ :

మరోవైపు ఐపీఓలు అట్టర్‌ ఫ్లాప్‌ అవుతోన్న కంపెనీల పరిస్థితి మారటం లేదని విమర్శలు వస్తున్నాయి. కంపెనీ సామర్థ్యం, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌, కంపెనీ మార్జిన్స్‌తో నిమిత్తం లేకుండా తమకు ఇష్టం వచ్చిన రీతిలో కంపెనీలు ప్రీమియం ధరను నిర్ణయిస్తున్నాయి. మార్కెట్‌ మొత్తం స్పెక్యులేటర్స్‌ గుప్పిట్లోకి వెళ్ళడంతో నిజమైన పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయి... మార్కెట్‌ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు.

బైట్‌ :

ఏదైమేనా ఐపీఓలు క్లిక్‌ కాకపోవడంతో మిగతా కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను వాయిదా వేసుకుంటున్నాయి. దీంతో విస్తరణ కోసం అవసరమైన నిధుల సమీకరణ మరింత ఆలస్యమవుతోంది.