హార్డ్డిస్క్
హార్డ్డిస్క్ల ధరలు దిగిరాకపోవడంతో పర్సనల్ కంప్యూటర్ల ధరలకు రెక్కలు వస్తున్నాయి. వరదలతో థాయ్లాండ్ ఉక్కిరిబిక్కిరి కావడంతో హార్డ్డిస్క్ల ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గింది. దీంతో గత నాలుగు నెలల్లో హార్డ్డిస్క్ల ధరలు దాదాపు రెట్టింపు కావడంతో... పర్సనల్ కంప్యూటర్స్ రేట్లు దాదాపు 15 శాతం వరకు పెరిగాయి.
వాయిస్ :
కంప్యూటర్కు గుండెకాయ వంటిది హార్డ్డిస్క్. డిమాండ్కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో గత నాలుగు నెలల్లో హార్డ్డిస్క్ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. చైనా తర్వాత హార్డ్డిస్క్లను ఎక్కువగా తయారు చేసే థాయ్లాండ్ను ఇటీవల వరదలు ముంచెత్తడమే దీనికి ప్రధాన కారణం. ప్రపంచంలో వినియోగిస్తోన్న హార్డ్డిస్క్లలో థాయ్లాండ్ వాటా 40 శాతం పైనే. వరదలు ముంచెత్తడంతో వెస్ట్రన్ డిజిటల్, సీగేట్, తోషిబా వంటి అగ్రశేణి కంపెనీలు తమ సరఫరాను అమాంతంగా తగ్గించాయి. దీనికితోడు డాలర్ మారకం విలువ కూడా పెరగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో గత సెప్టెంబర్తో పోలిస్తే ప్రస్తుతం హార్డ్డిస్క్ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
స్పాట్...
హార్డ్డిస్క్ ధరలు రెట్టింపు కావడంతో విడిభాగాలను విక్రయించే అడ్రెసబుల్ మార్కెట్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. విడిభాగాలతో తయారు చేసే పర్సనల్ కంప్యూటర్స్ ప్రతినెలా దాదాపు 40 వేలకు పైగా అమ్ముడుపోగా ప్రస్తుతం అమ్మకాలు సగానికి సగం తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. గతంలో హార్డ్డిస్క్ 18వందల్లోపే లభించేదని ప్రస్తుతం ఇది దాదాపు 4 వేలకు చేరిందని, దీంతో కంప్యూటర్ల ధరలను పెంచాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు.
బైట్ : వ్యాపారి
గతంలో మంచి కాన్ఫిగరేషనల్ కలిగిన కంప్యూటర్లు 20 వేల రూపాయల లోపే లభించేవి. హార్డ్డిస్క్ ధరలు పెరగడంతో ప్రస్తుతం ఈ కంప్యూటర్ల ధరలు 23 వేల రూపాయలకు పెరిగాయి. దీంతో కంప్యూటర్స్ కొనుగోళ్ళను మరో రెండు నెలలు వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్టు కస్టమర్లు అంటున్నారు.
బైట్ : కస్టమర్
ఏదైమైనా హార్డ్డిస్క్ రేట్స్ హైరేంజ్లో ఉండటంతో కంప్యూటర్స్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ ధరలు మరో రెండు నెలల్లో దిగివస్తాయని వార్తలు వస్తున్నా... బడ్జెట్లో కేంద్రం కొత్తగా విధించే సుంకాలతో ధరలు తగ్గుతాయో లేదా మరింత ప్రియమవుతాయో తెలియాలంటే మరో రెండునెలలు ఆగాల్సిందే...!
ఎండ్ విండ్ స్పాట్...