రూపాయి వెలవెల-డాలర్ కళ కళ
రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుండటంతో కార్పొరేట్ ఇండియా గజగజా వణుకుతోంది. రాబడి భారీగా ఉన్నప్పటికీ లాభాలు స్వల్పంగా ఉండటంతో అనేక భారతీయ కంపెనీలు సతమతమవుతున్నాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే రూపాయి మారకం విలుద దాదాపు 8 రూపాయల మేర బలహీనపడింది. దీంతో ఐటీ రంగం వృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ... మిగితా అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం పడింది.
ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు యూరో సంక్షోభం మన రూపాయిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యూరో సంక్షోభంతో డాలర్ విలువ అమాంతం పెరగడంతో రూపాయి వెలవెలబోతోంది. ఈ ఏడాది జులై చివరి వారంలో 43.85 స్థాయి దగ్గర ఉన్న రూపాయి ప్రస్తుతం 52 రూపాయలు దాటింది. ముఖ్యంగా గత నెల రోజులు వ్యవధిలోనే రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే దాదాపు 3 రూపాయల మేర బలహీనపడింది. ఎఫ్డీఐ ఇన్ఫ్లో ఏమంత ఆశాజనకంగా లేకపోవడం, జపాన్, యూరో సంక్షోభం నేపథ్యంలో రూపాయి విలువ భారీగా బలహీనపడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బైట్ : బాలసుబ్రమణ్యం, రిసెర్చ్ హెడ్, పీసీఎస్ సెక్యూరిటీస్ (గురువారంనాడు బిజీ-బాల పేరుతో ఇంజెస్ట్ అయింది)
రూపాయి ప్రస్తుతం బేరిష్ ట్రెండ్లో ఉందని, మున్ముందు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 54 రూపాయలకు చేరే అవకాశం ఉందని వారంటున్నారు. ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ ఇన్ఫ్లో బాగుంటేనే రూపాయి మారకం విలువ తిరిగి బలపడుతుందని, లేకుంటే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
డాలర్ పుంజుకోవడంతో ఐటీ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. అయితే ఐటీ ఎగుమతులు వృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ... దిగుమతుల మీద ఆధారపడే అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం పడింది. గత త్రైమాసికంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఇంపోర్ట్స్ మీద ఆధారపడే అన్ని రంగాలకూ ఈ దెబ్బ ఇప్పటికే పడింది. రూపాయి బలహీనం కావడం ఎగుమతిదారులకు ఊరటనిస్తున్నప్పటికీ... దిగుమతిదారులను మాత్రం బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు, రాగి, బంగారం, ఫెస్టిలైజర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో డౌన్ట్రెండ్లో ఉన్నప్పటికీ ... డాలర్ పుణ్యమా అని మన మార్కెట్లో ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. అలాగే దిగుమతుల మీదే ఆధారపడిన ఫెల్టిలైజర్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్ రంగాలకు రూపాయి బలహీన పడటం పెద్ద దెబ్బేనని నిపుణులంటున్నారు..
ఏదైమైనా అమెరికా జిమ్మిక్కు పుణ్యమా అని ఇతర దేశాల కరెన్సీలన్నీ బలహీన పడుతున్నాయి. ఇది మరికొంత కాలం కొనసాగితే పెట్టుబడులు తగ్గి భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు లోనయ్యే ఆస్కారముంది.
రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుండటంతో కార్పొరేట్ ఇండియా గజగజా వణుకుతోంది. రాబడి భారీగా ఉన్నప్పటికీ లాభాలు స్వల్పంగా ఉండటంతో అనేక భారతీయ కంపెనీలు సతమతమవుతున్నాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే రూపాయి మారకం విలుద దాదాపు 8 రూపాయల మేర బలహీనపడింది. దీంతో ఐటీ రంగం వృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ... మిగితా అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం పడింది.
ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు యూరో సంక్షోభం మన రూపాయిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యూరో సంక్షోభంతో డాలర్ విలువ అమాంతం పెరగడంతో రూపాయి వెలవెలబోతోంది. ఈ ఏడాది జులై చివరి వారంలో 43.85 స్థాయి దగ్గర ఉన్న రూపాయి ప్రస్తుతం 52 రూపాయలు దాటింది. ముఖ్యంగా గత నెల రోజులు వ్యవధిలోనే రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే దాదాపు 3 రూపాయల మేర బలహీనపడింది. ఎఫ్డీఐ ఇన్ఫ్లో ఏమంత ఆశాజనకంగా లేకపోవడం, జపాన్, యూరో సంక్షోభం నేపథ్యంలో రూపాయి విలువ భారీగా బలహీనపడిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బైట్ : బాలసుబ్రమణ్యం, రిసెర్చ్ హెడ్, పీసీఎస్ సెక్యూరిటీస్ (గురువారంనాడు బిజీ-బాల పేరుతో ఇంజెస్ట్ అయింది)
రూపాయి ప్రస్తుతం బేరిష్ ట్రెండ్లో ఉందని, మున్ముందు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 54 రూపాయలకు చేరే అవకాశం ఉందని వారంటున్నారు. ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ ఇన్ఫ్లో బాగుంటేనే రూపాయి మారకం విలువ తిరిగి బలపడుతుందని, లేకుంటే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
డాలర్ పుంజుకోవడంతో ఐటీ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. అయితే ఐటీ ఎగుమతులు వృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ... దిగుమతుల మీద ఆధారపడే అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం పడింది. గత త్రైమాసికంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఇంపోర్ట్స్ మీద ఆధారపడే అన్ని రంగాలకూ ఈ దెబ్బ ఇప్పటికే పడింది. రూపాయి బలహీనం కావడం ఎగుమతిదారులకు ఊరటనిస్తున్నప్పటికీ... దిగుమతిదారులను మాత్రం బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు, రాగి, బంగారం, ఫెస్టిలైజర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో డౌన్ట్రెండ్లో ఉన్నప్పటికీ ... డాలర్ పుణ్యమా అని మన మార్కెట్లో ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. అలాగే దిగుమతుల మీదే ఆధారపడిన ఫెల్టిలైజర్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్ రంగాలకు రూపాయి బలహీన పడటం పెద్ద దెబ్బేనని నిపుణులంటున్నారు..
ఏదైమైనా అమెరికా జిమ్మిక్కు పుణ్యమా అని ఇతర దేశాల కరెన్సీలన్నీ బలహీన పడుతున్నాయి. ఇది మరికొంత కాలం కొనసాగితే పెట్టుబడులు తగ్గి భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు లోనయ్యే ఆస్కారముంది.