Monday, January 2, 2012

సహాయంతో "వికాస్‌"ను బతికిద్దాం

సహాయంతో "వికాస్‌"ను బతికిద్దాం

బుడిబుడి అడుగులతో పాఠశాలకు వెళ్ళి విద్య అభ్యసించాల్సిన ఐదేళ్ళ వికాస్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని "రెయిన్‌బో" ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధికి తోడు బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడంతో వికాస్‌ కోమాలోకి వెళ్ళి చావుతో పోరాడుతున్నారని వికాస్‌ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న "సేవ్‌ ఏ లైఫ్‌" ఫౌండేషన్‌ తన వంతుగా రూ.25,000 విరాళాన్ని ప్రకటించి ఆ చెక్కును నల్గొండ పార్లమెంట్‌ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతుల మీదుగా వికాస్‌ తల్లిదండ్రులకు ఈరోజు అందించారు. వికాస్‌కు ఖరీదైన వైద్యసేవలు అందిస్తుండటంతో రూ.7 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఇంకా రూ.10 లక్షలు కావాలని వికాస్‌ తల్లిదండ్రులు ఎంపీకి వివరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు ఇప్పించి, వికాస్‌కు వైద్య సేవలు అందించాలని ఫౌండేషన్‌ ఎంపీని కోరింది. అందుకు ఎంపీ అంగీకరించారు. వికాస్‌ను కాపాడేందుకు "సేవ్‌ ఏ లైఫ్‌" ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ఫౌండేషన్‌ మరిన్ని ప్రాణాలను కాపాడాలని కోరారు. వికాస్‌కు సహాయం అందించాలనుకునే వారు 9010807788 నెంబరును సంపద్రించాలని ఫౌండేషన్‌ అధ్యక్షులు శ్రీధర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు శ్రీరామశర్మ, హనుమాండ్లు, గుర్రం సుదర్శన్‌, సుభాష్‌రెడ్డి, బుర్రా శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.