Saturday, January 21, 2012

ఎస్‌కేఎస్‌ మైక్రో ఫైనాన్స్‌

ఎస్‌కేఎస్‌ మైక్రో ఫైనాన్స్‌

మైక్రో ఫైనాన్స్‌ రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఎస్‌కేఎస్‌ మైక్రో ఫైనాన్స్‌... ప్రస్తుతం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆంక్షలు, రిజర్వుబ్యాంక్‌ నిబంధనలతో...మన రాష్ట్రంలో ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోలేక ఈ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సంస్థ భారీ నష్టాల్లో ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర రంగాల్లోకి ప్రవేశించడానికి పైలెట్‌ ప్రాజెక్టులను చేపట్టింది. ఈ పైలెట్‌ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో పప్పులు ఉడకవని భావించి పొరుగు రాష్ట్రాలపై ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌ దృష్టిసారించింది.

వాయిస్‌ :
ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌... ఈ పేరు తెలియని వారు మన రాష్ట్రంలోనే లేరని చెప్పొచ్చు. అప్పుల మీద అప్పులు ఇచ్చి దానికి రెండుమూడు రెట్ల వడ్డీలను వసూలు చేశారన్న అపకీర్తిని ఈ కంపెనీ మూటగట్టుకుంది. దీంతో ఈ సంస్థ చేసిన ఆగడాలను అరికట్టడానికి ఒకదశలో ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎస్‌కేఎస్‌ నుంచి జనం నుంచి వ్యతిరేకత ఎదురవడంతో మన రాష్ట్రప్రభుత్వం మైక్రోఫైనాన్స్‌పై కొత్త చట్టాన్ని తెచ్చింది. అలాగే రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొత్త నిబంధనలను విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తాము ఇచ్చిన అప్పులు వసూలు అవుతాయో లేదని భయపడుతోన్న ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌ ప్రస్తుతం తమ కార్యకలాపాలను పక్కరాష్ట్రాల్లో నిర్వహించడానికి కసరత్తు ప్రారంభించింది.

బైట్స్‌ :

అలాగే కంపెనీ లాభాలను పెంచడానికి గోల్డ్‌లోన్‌, మొబైల్‌లోన్స్‌, సంగమ్‌ స్టోర్స్‌ పేరుతో రిటైల్‌ మార్కెట్లోకి ఎంటర్‌ కానుంది. గోల్డ్‌ లోన్స్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షలు ఉండటంతో పక్కరాష్ట్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టులను ప్రారంభించింది.

బైట్‌ :

ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాము మైక్రోఫైనాన్స్‌ రంగాన్ని వీడమని, ఈ రంగంలో తమ కార్యకలాపాలు 90 శాతంగా ఉంటుందని, కేవలం 10 శాతం మాత్రమే ఇతర రంగాలపై దృష్టిపెడుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.

బైట్‌ :

స్టేట్‌ గవర్నమెంట్‌ కొత్త చట్టం, రిజర్వుబ్యాంక్‌ ఆంక్షలతో తమ వ్యాపారం ఆంధ్రప్రదేశ్‌లో నెమ్మదించిందని, ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆ ప్రభావం లేదని కంపెనీ సీఎఫ్‌ఓ ఢిల్లీ రాజ్‌ అన్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ తిరిగి లాభాలబాటలోకి మళ్ళుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బైట్‌ :

ఒకప్పుడు స్టాక్‌ మార్కెట్లో 14 వందల స్థాయికి వెళ్ళిన ఎస్‌కేఎస్‌ షేర్‌ ప్రస్తుతం 150 రూపాయల వద్ద కదలాడుతోంది. కొత్త మేనేజ్‌మెంట్‌ తీసుకునే నిర్ణయాలు, విస్తరణ ప్రణాళికలు ఈ కంపెనీని ఏ మాత్రం గట్టెక్కిస్తాయో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే...!