బ్యాంగ్ : ఫుడ్ 360 డిగ్రీస్
బీజీ : ఫుడ్ 360 డిగ్రీస్
యాంకర్ :
ఆధునిక వ్యవసాయానికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్లో రెండురోజుల పాటు నిర్వహించిన ఫిక్కీ ఫుడ్ 360 డిగ్రీస్ సదస్సు సక్సెస్ అయింది. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, రాజకీయ నాయకులతో పాటు దాదాపు 2 వేల మంది హాజరయ్యారు. వ్యవసాయాభివృద్ధిలో భారత్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుందని ఈ సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు.
వాయిస్ :
వ్యవసాయం మన జనాభాలో అత్యధికులకు జీవనాధారం. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి, లేదా జీడీపీలో 22 శాతం వాటా ఉన్న వ్యవసాయానికి మన ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యత అతి స్వల్పం. దేశ జనాభాలో సుమారుగా 60 శాతం ప్రజలు తమ జీవనాధారం కోసం ఆధారపడే వ్యవసాయానికి, వ్యవసాయ అధారిత పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్లు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ఫిక్కీ... ఫుడ్ 360 డిగ్రీస్ పేరుతో ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో రెండురోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది.
స్పాట్...
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తమ ప్రభుత్వం ఎంతో చేయూత నిస్తోందని అన్నారు. అయితే ప్రస్తుతం రైతులు మద్దతు ధర అందక ఇబ్బందులు పడుతున్నారని, వారికి తమ ప్రభుత్వం తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఒకవైపు నూనె గింజల పంటకు మద్దతు ఇవ్వలేని ప్రభుత్వాలు, ఇతర దేశాల నుంచి మాత్రం 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దిగుమతి చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కాటన్, పండ్లు, కూరగాయలకు కూడా ఉందని, గోడౌన్లలో ధాన్యం ముక్కిపోతోందని, తాము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
బైట్ : కిరణ్ కుమార్ రెడ్డీ, ముఖ్యమంత్రి
ఈ సదస్సుకు హాజరైన భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కోల్డ్ స్టోరేజీలను, ఆర్బెస్టింగ్ ప్రాసెస్లు, వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని గీతారెడ్డి అన్నారు.
బైట్ : గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖా మంత్రి
360 డిగ్రీస్ పేరుతో హైదరాబాద్ ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి జాతీయ స్థాయిలోని శాస్త్రవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. భవిష్యత్తులో వ్యవసాయాభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించనుందని నిపుణులు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉందని ఫిక్కీ రాష్ట్ర కౌన్సిల్ కో-ఛైర్మన్ జే.ఏ. చౌదరి అన్నారు.
బైట్: జె.ఏ.చౌదరి, కో-ఛైర్మన్, ఫిక్కీ రాష్ట్రకౌన్సిల్
ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సుంకాలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించడానికి కేంద్రం కృషి చేయాలని ఈ సదస్సులో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గ్లోబలైజేషన్తో ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రభుత్వం అగ్రీ బిజినెస్కు మరిన్ని రాయితీలు ప్రకటిస్తే ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్పై అవగాహన కోసం ఫిక్కీ ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలని వారు అంటున్నారు.
బైట్ :
బైట్ :
రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మొత్తం 53 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో 30 కంపెనీలు పాల్గొనగా... దాదాపు 5 వందల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఈ సదస్సుకు రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ నిపుణులు, మొక్కల పెంపకందారులు, ఎగుమతిదారులు, పరిశోధకులు, రాజకీయనాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన 2 వేల మంది సందర్శకులు హాజరయ్యారు.
స్పాట్...
యాంకర్ :
ఫుడ్ 360 డిగ్రీస్లో ఇప్పుడో బ్రేక్ తీసుకుందాం.
-------------
సెకండ్ పార్ట్:
యాంకర్ :
వెలకమ్ టూ ఫుడ్ 360 డిగ్రీస్
యాంకర్ : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ కేటగిరీల్లో ఫిక్కీ అవార్డులను ప్రధానం చేసింది. ఇందులో భాగంగా న్యూజెన్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బి.రవీంద్రనాథ్ బెస్ట్ స్టార్ట్ అప్ అవార్డును అందుకున్నారు.
వాయిస్ : 2011-12 సంవత్సరానికిగాను ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ కేటగిరీల్లో ఫిక్కీ అవార్డులను ప్రకటించింది. బెస్ట్ ఎంఎస్ఈ, బెస్ట్ బ్రాండ్, బెస్ట్ స్టార్అప్, బెస్ట్ ఎన్నోవేటివ్ పురస్కారాలను ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రధానం చేశారు. ఇందులో భాగంగా న్యూజెన్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బి.రవీంద్రనాథ్ బెస్ట్ స్టార్ట్ అప్ అవార్డును అందుకున్నారు.
స్పాట్ : ఎండీగారి అవార్డు స్పాట్ వేసుకోగలరు.
బైట్ : స్పెషల్ బైట్ ఉంటే వేసుకోగలరు. లేకుండా అవార్డ్ ఫంక్షన్లో ఉన్న బైట్ వాడాలి.
- మిగిలిన అవార్డుల వివరాలు - కంపెనీల వివరాలు ()
యాంకర్ :
వ్యవసాయ వినిమయ ఉత్పత్తుల నుంచి ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సదస్సు ఒక వేదికైంది. ప్రస్తుతం దేశీ జీడీపీలో డైరీ, ఫిషరీస్, ఆర్టికల్చర్కు 40 శాతం వాటా ఉండటంతో, ఈ రంగానికి నిధుల కేటాయింపును మరో ఐదారు శాతం పెంచితే ఎక్కువ లాభాలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. సో... ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించి ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బ్యాంగ్ :