Busi_Mullapudi
ఆంధ్రా బిర్లాగా పిలవబడే ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గత సెప్టెంబర్ 3న మరణించారు. మూత్రపిండాల వ్యాధితో కొంత కాలంగా బాధపడుతోన్న ఆయన తన 91వ ఏట కన్నుమూశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధిని చూపిన మహా మనిషి. ఆయన్ని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఎందరో యువ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శిగా నిలిచిన ముళ్ళపూడి జీవితం ఆదర్శప్రాయం.
ఆంధ్ర పారిశ్రామిక రంగానికి ఆద్యుడు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెద్దపట్నంలో 1921 జులై 8న హరిచంద్రప్రసాద్ జన్మించారు. కేవలం పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన ఆగస్ట్ 11, 1947 సంవత్సరంలో తణుకులో ఆంధ్రా షుగర్స్ స్థాపించారు. స్వతంత్ర భారతదేశంలో ప్రారంభించిన తొలి కంపెనీల్లో ఇది ఒకటి. గత 63 ఏళ్ళల్లో ఆంధ్రా షుగర్స్లో ఒక్క రోజు కూడా సమ్మె జరగలేదంటేనే ఆయనకి పని పట్ల ఉన్న దీక్ష, పట్టుదలకు నిదర్శనంగా నిలిచాయి.
ఫ్యాఫ్సీ ప్రెసిడెంట్గా, ఆంధ్రా పెట్రో కెమికల్స్ ఎండీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఆయన పలు కీలక బాధ్యతలు వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక పన్నును చెల్లించి పరిశ్రమ కూడా ఆయనదే. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధిని చూపారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న ఆయన సెప్టెంబర్ 3న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని కోల్పోవడం రాష్ట్రానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటు.
ఆంధ్రా బిర్లాగా పిలవబడే ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గత సెప్టెంబర్ 3న మరణించారు. మూత్రపిండాల వ్యాధితో కొంత కాలంగా బాధపడుతోన్న ఆయన తన 91వ ఏట కన్నుమూశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధిని చూపిన మహా మనిషి. ఆయన్ని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఎందరో యువ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శిగా నిలిచిన ముళ్ళపూడి జీవితం ఆదర్శప్రాయం.
ఆంధ్ర పారిశ్రామిక రంగానికి ఆద్యుడు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెద్దపట్నంలో 1921 జులై 8న హరిచంద్రప్రసాద్ జన్మించారు. కేవలం పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన ఆగస్ట్ 11, 1947 సంవత్సరంలో తణుకులో ఆంధ్రా షుగర్స్ స్థాపించారు. స్వతంత్ర భారతదేశంలో ప్రారంభించిన తొలి కంపెనీల్లో ఇది ఒకటి. గత 63 ఏళ్ళల్లో ఆంధ్రా షుగర్స్లో ఒక్క రోజు కూడా సమ్మె జరగలేదంటేనే ఆయనకి పని పట్ల ఉన్న దీక్ష, పట్టుదలకు నిదర్శనంగా నిలిచాయి.
ఫ్యాఫ్సీ ప్రెసిడెంట్గా, ఆంధ్రా పెట్రో కెమికల్స్ ఎండీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఆయన పలు కీలక బాధ్యతలు వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక పన్నును చెల్లించి పరిశ్రమ కూడా ఆయనదే. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధిని చూపారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న ఆయన సెప్టెంబర్ 3న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని కోల్పోవడం రాష్ట్రానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటు.