Saturday, January 21, 2012

రాష్ట్రంలో ఐటీ రంగానికి గడ్డుకాలం

రాష్ట్రంలో ఐటీ రంగానికి గడ్డుకాలం
సెక్టార్‌పై సంక్షోభాల ప్రభావం
రాష్ట్ర ఐటీ రంగం
రాని కొత్త కంపెనీలు
బెంగళూరు, చెన్నై వైపు ఆసక్తి చూపుతున్న కొత్త కంపెనీలు

యాంకర్‌ :
రాష్ట్రంలో ఐటీ రంగానికి గడ్డుకాలం వచ్చింది. వరుస సంక్షోభాలతో ఐటీ సెక్టార్‌ కుదేలవుతోంది. 2008లో ఆర్థిక మాంద్యం, 2009 నుంచి తెలంగాణ ఆందోళన, తాజాగా అమెరికా మార్కెట్‌లో వచ్చిన ఆర్ధిక సంక్షోభం ఐటీ రంగాన్ని షేక్‌ చేస్తున్నాయి.

వాయిస్
క్షణాల్లో ప్రపంచ సమాచారాన్ని కళ్లముందుంచుతోంది ఐటీ రంగం. అంతే వేగంగా ఉద్యోగాల కల్పన-రెవెన్యూలో ఈ శాఖ అత్యధిక వృద్ధి రేటు సాధించింది. ఐటీలో ఒకప్పుడు బెంగుళూరు తరువాత హైదరాబాదే ఉండేది. అయితే, ఇప్పుడు నాలుగో స్థానంలో మన ఐటీ సెక్టార్ కొట్టి మిట్టాడుతోంది. వరుసగా దాపురిస్తున్న సంక్షోభాలు రాష్ట్ర ఐటీ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. 2006-07లో ఐటీ రంగంలో జాతీయ వృద్ధి రేటు 33 శాతం ఉండగా అప్పుడు రాష్ట్ర వృద్ధిరేటు 48 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత పరిస్థితులు మారాయి. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2009 సంవత్సరం చివర్లో ప్రారంభమైన తెలంగాణ ఆందోళనలు ఐటీ రంగాన్ని కుదిపేశాయి. అంతే అప్పటి నుంచి రాష్ట్రానికి కొత్త అంతర్జాతీయ కంపెనీలు వచ్చిన దాఖలాలు లేవు.

2010-11 ఆర్థిక సంవత్సరంలో 12.5 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రాష్ట్రప్రభుత్వం. అయితే దీనిలో మూడో వంతు అంటే కేవలం 4.5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. రాజకీయ అనిశ్చితతో రాష్ట్రంలో పెడదామనుకున్న కంపెనీలు ప్రత్యామ్నాయ ప్రాంతాలుగా పూణే, చెన్నైలపై ఆసక్తిని కనబరుస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలతో చిన్నా-చితకా కంపెనీలు ఏర్పాటైనా అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాయి. చాలా ఐటీ కంపెనీలు హైదరబాద్‌ నుంచి బెంగుళూరుకు బిచాణా ఎత్తేశాయి. అయితే ఇదంతా శాంతి-భద్రతల కోణంలోకి వస్తే..తాజా వచ్చిన ఆమెరికా మార్కెట్ల సంక్షోభం ఎటు వైపు ఎవరెవర్ని కబళిస్తోందో అర్దం కావట్లేదు అంటున్నారు నిపుణులు.

కేంద్రం కూడా దీని ప్రభావం భారీగా ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. తక్షణమే ప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగపోతే..పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుందంటున్నారు నిపుణులు.