జీఎస్టీ 14-16శాతం?
జీఎస్టీ 14---- 16శాతం? న్యూఢిల్లీ: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ప్రధాన సంస్కరణలుగా పేర్కొనదగిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ)ని 2011 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రణబ్ముఖర్జీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే జీఎస్టీ అమలు కావాల్సి ఉంది. * ఆదాయపు పన్ను చట్టానికి ప్రత్యామ్నాయంగా డీటీసీ అమల్లోకి వస్తుంది.* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పరోక్ష పన్నులు.. సేవాపన్ను, ఎక్సైజ్ సుంకం, వ్యాట్, ఇతర సుంకాలు, సర్ఛార్జీలు, స్థానిక సుంకాలు ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. వీటి స్థానంలో ఏకీకృత జీఎస్టీ అమలవుతుంది.* ప్రస్తుతం సేవలపై 10% పన్ను వసూలు చేస్తున్నారు. వస్తువులపై పరోక్ష పన్నులన్నీ కలిపి 20% వరకు ఉన్నాయి.* జీఎస్టీ 14-16% ఉండవచ్చు. అంటే వినియోగదారుడికి లాభమే