తగ్గుతున్న 'గూడ్స్'వేగం
ఆదాయ వనరుపై మమత అంతంతే
ఛార్జీల మోతలేదు
కొత్తగా వ్యాగన్ల పథకం
ఆటోమొబైల్ హబ్ల ఏర్పాటు
రవాణా రంగంలో ముఖ్యాంశాలివీ...
* సరకు రవాణాను మరింత ప్రోత్సహించేందుకు వీలుగా ఆధునిక వ్యాగన్ల పథకాన్ని మమత ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎక్కువ సామర్థ్యంగల ప్రత్యేక వ్యాగన్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాలను త్వరలో నోటిఫై చేస్తామని చెప్పారు.
* కంటెయినర్ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు భాగస్వాములను ఆహ్వానిస్తూ త్వరలో ఒక విధానాన్ని ప్రకటిస్తామని రైల్వేమంత్రి తెలిపారు. వీటిని ఆటోమొబైల్స్, కూరగాయలు, నూనెలు, పెట్రో కెమికల్స్ రవాణాకు ఉపయోగిస్తామని వివరించారు.
* దేశంలో 10 చోట్ల ఆటోమొబైల్ హబ్లను ఏర్పాటు చేస్తామని మమత ప్రకటించారు.
* రోడ్డు రవాణాను కలుపుకుని గోదాముల నుంచి గోదాములదాకా సరకు రవాణా చేసేందుకు కొత్త పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. గూడ్స్ ర్యాక్లను రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా చేసేందుకు వీలుగా రూపొందిస్తారు.
* సరకు రవాణా విభాగంలోనూ తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందని చెప్పారు. ఇనుప ఖనిజం, ఫ్త్లెయాష్, ఆటోమొబైల్ రవాణాకు ప్రత్యేక వ్యాగన్లు తయారుచేసే యోచన ఉందని మంత్రి వెల్లడించారు.
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో 94.4 కోట్ల టన్నుల సరకు రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నామని మమత వివరించారు. గత ఏడాది సవరించిన అంచనా కంటే ఇది 5.4 కోట్ల టన్నులు ఎక్కువ.
సరకు రవాణా ఆదాయం (2008-09లో)
* బొగ్గు: రూ.24,319.56 కోట్లు
* సిమెంటు: రూ.5,600.85 కోట్లు
* ఆహార ధాన్యాలు: రూ.3,698.16 కోట్లు
* ఎరువులు: రూ.3,506.67 కోట్లు
* పెట్రోలియం: రూ.3,472.19 కోట్లు
* కంటెయినర్లు: రూ.3,025 కోట్లు
* 2009-10 ఏడాదిలో సవరించిన ఆదాయం: రూ.58,715.66 కోట్లు
* 2010-11 ఏడాదిలో ఆదాయం అంచనా: రూ.62,489.33 కోట్లు
* ఆదాయంలో పెరుగుదల శాతం: 6.4
* రైల్వే మొత్తం ఆదాయంలో సరకు రవాణా వాటా: 66శాతం