సిమెంటుపై భారమే బడ్జెట్లో ప్రతిపాదించిన పన్నులను చూస్తే సిమెంటు ఉత్పత్తి వ్యయం బస్తాకు రూ.5 నుంచి రూ.7 వరకూ పెరుగుతుందని తేలుతోంది. దీన్ని భారంగానే పరిగణించాలి. సెంట్రల్ ఎక్సైజ్ పన్నును 2 శాతం పెంచడం, బొగ్గు ధర పెంపు, దిగుమతి చేసుకున్న బొగ్గుపై అధిక దిగుమతి పన్ను, డీజిల్ ధర పెరగడం వల్ల సిమెంటు రవాణా వ్యయం పెరగడం, మ్యాట్ 15 శాతం నుంచి 18 శాతానికి పెంచడం... ఇవన్నీ కలిపి సిమెంటు ఖర్చును పెంచుతాయి. అయితే ఒక సానుకూలాంశం ఏమిటంటే... మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణబ్ ముఖర్జీ పెద్దపీట వేశారు. అందువల్ల సిమెంటు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతోంది. ఇది ఆహ్వానించదగిన మార్పు. పదకొండో పంచవర్ష ప్రణాళికలో మౌలిక సదుపాయాల రంగానికి ప్రాధాన్యం కొనసాగుతుందని మాటల్లో, చేతల్లో ఆర్థిక మంత్రి స్పష్టం చేసినందున సిమెంటు కంపెనీలకు భవిష్యత్తు ఆకర్షణీయంగానే ఉంటుందని ఆశించవచ్చు.
- ఎస్.ఆర్.బి. రమేష్చంద్ర, ఎండీ, భీమా సిమెంట్స్