పెట్రోల్ లీటర్కు రూ.2.71, డీజిల్ రూ.2.55
అర్ధరాత్రి నుంచే పెంపు
కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల పెంపు ఫలితం
పారిఖ్ కమిటీ సిఫార్సుల అమల్లో తొలి అడుగు


పారిఖ్ కమిటీ సిఫార్సులను అమలు చేయబోవడం లేదని ప్రణబ్ స్పష్టం చేయలేదు సరికదా.. తగిన సమయంలో పెట్రోలియం మంత్రి దేవ్రా పరిశీలిస్తారని చెప్పారు. వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని దేవ్రా వెల్లడించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో ఏకాభిప్రాయం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.
*పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలి*మోటార్బైక్లు, కార్లు వినియోగించేవారిలో ఎక్కువ మంది సంపన్నవర్గాల వారే. వారికి రాయితీపై చమురు ఇవ్వాల్సిన అవసరం లేదు.
*డీజిల్పై లీటర్కు రూ.2.33, పెట్రోల్పై రూ. 4.72 చొప్పున పెంచాలి.
*డీజిల్ వాడే వ్యక్తిగత కార్లకు, అందులోనూ విలాసవంతమైన కార్లకు ఇంధనంపై రాయితీ ఇవ్వడంలో అర్థం లేదు. మొత్తం అమ్ముడవుతున్న కార్లలో ఇవే 35% వరకు ఉన్నాయి. పెట్రోల్కు ఎంతవసూలు చేస్తున్నారో అంతే సుంకాన్ని వారి నుంచీ వసూలు చేయాలి.
*డీజిల్తో నడిపే స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకూ డీజిల్పై సుంకం పెంచాలి.
*డీజిల్ ధరల పెంపు వల్ల ట్రక్కుల వినియోగం తగ్గి సరకు రవాణాకు రైళ్లపై ఆధారపడతారు. ఇది శ్రేయస్కరమే.
*కిరోసిన్ ధరను గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయానికి ముడిపెట్టి నిర్ణయించాలి. లీటర్కు రూ.6 వరకు పెంచాలి. రాయితీ కిరోసిన్ పంపిణీకి స్మార్ట్కార్డులు జారీ చేయాలి. దీపపు వెలుగుల కోసం కిరోసిన్పై ఆధారపడడాన్ని నిరుత్సాహపరిచి గ్రామీణ విద్యుదీకరణను ప్రోత్సహించాలి.
*వంటగ్యాస్ రాయితీని పరిమితంగా, పరిమిత కాలానికే ఇవ్వాలి. గ్యాస్బండల వినియోగంపై పరిమితైనా విధించాలి. లేదంటే ధరైనా పెంచాలి. వంటగ్యాస్ వినియోగంలో పట్టణ సంపన్నుల వాటానే ఎక్కువ. అందుకే రాయితీలో అధిక భాగం వారికే పోతోంది. ఇది సరికాదు. పేదలకే అందేలా స్మార్ట్కార్డులు ప్రవేశపెట్టాలి. అప్పటివరకు బండపై రూ.100 పెంచాలి