Friday, February 26, 2010

మన్నవరం పరిశ్రమకు సత్వర సహకారం

మన్నవరం పరిశ్రమకు సత్వర సహకారం
సీఎస్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా మన్నవరంలో బీహెచ్‌ఈఎల్‌-ఎన్టీపీసీ సంయుక్తంగా నిర్మించే విద్యుత్‌ ఉపకరణాల ప్రాజెక్టుకు సత్వరమే అన్నిరకాల అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రోత్సహక మండలి సమావేశం జరిగింది. 750 ఎకరాల భూముల అప్పగింత, ఇతర అనుమతులను వెంటనే ఇస్తామని సీఎస్‌ చెప్పారు. తెలుగుగంగ నుంచి నీటి సరఫరా, రోడ్లు, విద్యుత్‌ ఇతర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. శంకుస్థాపనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఎన్టీపీసీ-భెల్‌ అధికారులు తెలిపారు.