ఈసారి రూ.40,000 కోట్లు ... ప్రభుత్వ వాటాల ఉపసంహరణ లక్ష్యం
ఈసారి రూ.40,000 కోట్లు
ప్రభుత్వ వాటాల ఉపసంహరణ లక్ష్యం న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం (2010-11)లో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో సర్కారు పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా మరింత ఎక్కువ మొత్తాన్ని.. అంటే రూ.40,000 కోట్లను సమీకరించాలని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం బడ్జెటులో ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరం 2009-10లో ఇదే మార్గంలో రూ.25,000 కోట్లను సమీకరించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం నుంచి చూస్తే ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఎన్హెచ్పీసీ, ఎన్టీపీసీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లు ఇష్యూలకు వచ్చాయి. ఎన్ఎండీసీ, సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్లలో వాటా విక్రయం ప్రక్రియ ఆరంభం అయింది.