రైల్వే బడ్జెట్ను స్వాగతించిన పరిశ్రమ రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ను పారిశ్రామిక రంగం స్వాగతించింది. ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా ఉండగలదని వారు చెబుతూ ఉండగా.. ట్రేడర్లు మాత్రం రైల్వేలను ప్రైవేటు పరం చేయడానికి విడుదల చేసిన పత్రమే ఈ బడ్జెట్ అని విమర్శించారు.
కొత్త లైన్ల అభివృద్ధి, పోర్ట్ అనుసంధానం, గనుల అనుసంధానం, బహుళ లేయర్ల పార్కింగ్ సదుపాయాల ప్రాజెక్టుల్లో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం రైలు సేవల్లో సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఆర్థిక వృద్ధి 9 నుంచి 10 శాతం వరకూ పరుగులు తీయాలంటే రైల్వేల్లో ప్రైవేటు రంగం పాత్ర పెరగాల్సి ఉంది. ఏడాదికి 1000 కి.మీ. లైను ప్రతిపాదన సైతం ఆర్థిక వృద్ధికి దోహదం చేయగలదు. రైల్వే సరకు రవాణా, ప్యాసింజరు ఛార్జీల పెంపు లేకపోవడమనేది ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో ఒక భాగం. శీతలీకరణ ఉన్న వ్యాగన్ల పెంపు సైతం వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా కాపాడతాయి. భారత్లో మూల మూలకూ రైల్వే సేవలు చేరడానికి 2010-11లో రూ.41,426 కోట్ల కేటాయింపు చేయడం ఆహ్వానించదగ్గ విషయం. -ఫిక్కీ అధ్యక్షుడు హర్షపతి సింఘానియా |
భవిష్యత్ దిశగా చూస్తే మొత్తం మీద ఈ బడ్జెట్ సానుకూలంగా ఉన్నా మార్కెట్ పరంగా చూస్తే పెద్ద ప్రభావం ఏమీ లేదు. సరకు రవాణా ఛార్జీలు మార్చకపోవడంతో మౌలిక(ఉక్కు, సిమెంటు, బొగ్గు) రంగాల్లో పెద్ద మార్పుండదు. - ఏంజెల్ బ్రోకింగ్ సీఎండీ దినేశ్ ఠక్కర్ |
| -ఇండియా ఇన్ఫోలైన్ వైస్ ప్రెసిడెంట్(పరిశోధన) అమర్ అంబానీ |
| -ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) |
సరకు రవాణాపై యధాస్థితిని ప్రకటించడంతో సిమెంటు, ముడి ఇనుము, బొగ్గు పరిశ్రమలకు ఉపశమనం కలిగించినట్లయింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికీ ఇది ఒక మార్గం. బంగ్లాదేశ్కు రైల్వే లింకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది. ప్రైవేటు ఆపరేటర్లు ప్రత్యేక రైళ్లను నడపడానికి అవకాశం కల్పిస్తుంది. -భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఫియో) అధ్యక్షుడు ఎ. శక్తివేల్ |
బడ్జెట్ ముసుగులో రైల్వేలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకున్నారు. బహుళ జాతి సంస్థలకు, బడా కార్పొరేట్ సంస్థలకు రైల్వే ఆస్తులను ధారాదత్తం చేయడానికి విడుదల చేసిన పత్రమే ఈ బడ్జెట్. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం అంటూ పేర్లు మార్చి చేస్తున్నారు. కమ్యూటర్స్కు సదుపాయాలు పెంచడంపై కానీ; వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం నిర్ణీత ప్రకటనలు కానీ చేయలేదు. పాలనా వ్యవస్థను పటిష్ఠం చేసేదిశగా కూడా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుతం 90 శాతం వస్తువుల రవాణా రోడ్డు మార్గంలో జరుగుతోంది. రైల్వే రవాణా వ్యవస్థను సరిగ్గా ఉపయోగించుకుంటే ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. -అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ |
| - భారత ఎరువుల సంఘం డైరెక్టర్ జనరల్ సతీశ్ చంద్ర |
రైల్వేల్లో భాగస్వామ్యాన్ని కోరుకునే ప్రైవేటు రంగానికి ఇది స్పష్టమైన అవగాహన కల్పించలేదు. - అసోచామ్ అధ్యక్షురాలు స్వాతి పిరమాల్ |
| దేశం బయట, లోపలి మదుపర్లకు ఈ బడ్జెట్ సరైన సంకేతాలను ఇస్తుందని భావిస్తున్నాం. - సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ |





