Thursday, February 25, 2010

ఏప్రిల్‌ 9 నుంచి త్రీజీ వేలం!

ఏప్రిల్‌ 9 నుంచి త్రీజీ వేలం!
న్యూఢిల్లీ: త్రీజీ వేలం షెడ్యూలుపై కేంద్రం ఎట్టకేలకు ఓ ప్రకటన చేసింది. ఏప్రిల్‌ 9 నుంచి వేలానికి శ్రీకారం చుట్టనున్నట్లు టెలికాం శాఖ ప్రతినిధి ఒకరు బుధవారమిక్కడ వెల్లడించారు. వేలానికి దరఖాస్తులను ఆహ్వానించే ప్రకటన నేడు వెలువడుతుందని, ఆసక్తి కలవారు మార్చి 19లోపు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుదారుల యాజమాన్య వివరాలు మార్చి 26న ప్రచురించనుండగా, అదే నెల 30న బిడ్డర్ల ప్రి-క్వాలిఫికేషన్‌ను పరిశీలిస్తామన్నారు. ఏప్రిల్‌5,6 తేదీల్లో మౌఖిక వేలంపాట నిర్వహిస్తామని పేర్కొన్నారు.