Saturday, February 27, 2010

అభివృద్ధి సాధ్యమేనా?

అభివృద్ధి సాధ్యమేనా?
క్ష్యాలైతే ఘనంగా నిర్దేశించుకున్నారు.. కానీ వాటిని చేరుకునే మార్గం మీదే ఆర్థిక మంత్రి దృష్టి సారించలేదు. ఐదేళ్లలో మురికివాడల్లేకుండా దేశాన్ని తీర్చిదిద్దుతామని అట్టహాసంగా ఆరంభించిన 'రాజీవ్‌ ఆవాస్‌ యోజన' పథకానికి నిధులు పెద్దగా కేటాయించలేదు. 2012 నాటికి కోటి ఇరవై లక్షల మందికి సరిపడా మౌలిక వసతుల్ని కల్పించడం.. కోటి వరకూ పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం.. ఇవీ రాజీవ్‌ ఆవాస్‌ యోజన లక్ష్యాలు. ఈ పథకం పూర్తవ్వాలంటే కనీసం రూ. 2,25,000 కోట్లు అవుతుందని అంచనా! గతేడాది ఈ పథకానికి రూ.150 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.1,270 కోట్లతో సరిపెట్టేశారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజన విజయవంతం అవ్వాలంటే ప్రభుత్వ సంస్థలు ఇళ్లను కడితే సరిపోదు. ఇందులో నిర్మాణ సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలి. ముందుకొచ్చే బిల్డర్లు, డెవలపర్లకు పన్ను రాయితీలివ్వాలి. ఇళ్ల గరిష్ఠ సంఖ్యపై నిబంధన విధించి.. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేవారికి పెద్దపీట వేయాలి.
* దేశవ్యాప్తంగా నగరాల అభివృద్ధికి సుమారు రూ. 5,400 కోట్లు కేటాయించారు. వీటితో నగరాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. ఫ్త్లెఓవర్లు, డ్రైనేజీ, రోడ్లకు పెద్దపీట వేస్తారు.
* ఇందిరా ఆవాస్‌ యోజన కింద బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా నిర్మించే ఇళ్ల యూనిట్‌ ధరను పెంచారు. సాధారణ స్థలాల్లో కట్టే ఒక్కో ఇంటికి రూ.45 వేల చొప్పున అందజేస్తారు. అదే కొండ ప్రాంతాల్లో కట్టే ఇంటికి రూ.48,500 చెల్లిస్తారు. ఇంటి యూనిట్‌ ధరను పెంచడం స్వాగతించాల్సిన నిర్ణయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.