ఒత్తిడి కొనసాగింది

గురువారం డెరివేటివ్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా నమోదైంది. త్వరగా అమ్ముడయ్యే వినియోగదారు వస్తువులు అధికంగా కుంగగా.. ఆరోగ్య సంరక్షణ, వాహన, టెక్నాలజీ, బ్యాంకింగ్ సూచీలూ అదే బాట పట్టాయి. అయితే స్థిరాస్తి, ఐటీ, సహజవాయువు, యంత్ర పరికరాల సూచీలు మార్కెట్ అధిక నష్టాల పాలు కాకుండా కాపాడాయి. 986 స్క్రిప్లు లాభపడగా.. 1917 స్క్రిప్లు నష్టపోయాయి. మార్కెట్ పరిమాణం రూ.4566.06 కోట్లుగా నమోదైంది. రైల్వే షేర్త్లెన కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్, కాలిండీ రైల్, టిటాఘర్ వ్యాగన్స్, స్టోన్ ఇండియా, హింద్ రెక్టిఫైయర్స్, టెక్స్మ్యాకోలు 4.70- 6% మేర నష్టపోయాయి. ఇక సన్ ఫార్మా, ఎం&ఎం, ఆర్కామ్, టాటా మోటార్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ 1.38-2.51% కుంగాయి. మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, ఎల్&టీ, టాటా పవర్, టీసీఎస్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.