Thursday, February 25, 2010

అడిగినవే అటుఇటుగా ఇచ్చారు

అడిగినవే అటుఇటుగా ఇచ్చారు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
ముఖ్యమంత్రి రోశయ్య రైల్వే బడ్జెట్‌కుముందే కేంద్ర మంత్రి మమతా బెనర్జీని కలిసి ఓ జాబితా అందజేశారు. ఆ లేఖలో ప్రస్తావించిన కొన్ని ప్రతిపాదనలకు మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. మరికొన్నిటిని అసలు పట్టించుకోలేదు. ఆ వివరాలు..
ప్రాజెక్టులు అడిగితే పీపీపీలుగా ఇచ్చినవి
*నడికుడి- శ్రీకాళహస్తి
*భద్రాచలం రోడ్‌-కొవ్వూరు
*మణుగూరు-రామగుండం
*కొండపల్లి-కొత్తగూడెం
*కంభం-పొద్దుటూరు
*గద్వాల్‌-మాచర్ల
*విజయవాడ-గుడివాడ- మచిలీపట్నం- భీమవరం- నర్సాపూర్‌-నిడదవోలు మార్గం డబ్లింగ్‌

హామీ లభించలేదు
*జంటనగరాల్లో ఎం.ఎం.టీఎస్‌ రెండో దశ (107 కి.మీ) ప్రాజెక్టు వ్యయంలో మూడింట రెండొంతుల నిధులు రాష్ట్రం ఇస్తానన్నా రైల్వే మంత్రి ఆ విషయమే ప్రస్తావించలేదు

ఆ రెంటికే ఓకే
*కాచిగూడ-అజ్మీర్‌ను హైదరాబాద్‌- అజ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌గా వేశారు
*సికింద్రాబాద్‌/హైదరాబాద్‌- ముంబై (సూపర్‌ఫాస్ట్‌)ను దురంతోగా ప్రవేశపెట్టనున్నారు.

అడిగినా పట్టించుకోనివి...
*సికింద్రాబాద్‌/హైదరాబాద్‌- బెంగళూరు(సూపర్‌ఫాస్ట్‌)
*సికింద్రాబాద్‌/హైదరాబాద్‌- అహ్మదాబాద్‌ (వయా నిజామాబాద్‌)
*సికింద్రాబాద్‌/హైదరాబాద్‌- గోవా
*సికింద్రాబాద్‌/హైదరాబాద్‌- ఆదిలాబాద్‌
*విశాఖపట్నం-తిరుపతి (పగటిపూట ఇంటర్‌ సిటీ)
*గుంటూరు - చెన్నై (పగటిపూట ఇంటర్‌ సిటీ)
*పుట్టపర్తి- షిరిడి
*హైదరాబాద్‌-పూణె
*విశాఖపట్నం- చెన్నై

సర్క్యులర్‌, డెమూ
రైళ్లకు అంగీకారం
*తిరుపతి-నెల్లూరు- చెన్నై; విజయవాడ-గుంటూరు-తెనాలిల మధ్య సర్క్యులర్‌ ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ సర్వీసులు ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు.
*సికింద్రాబాద్‌- మిర్యాలగూడ; సికింద్రాబాద్‌- మహబూబ్‌నగర్‌ మధ్య డీజిల్‌ మల్టిపుల్‌ యూనిట్‌ సర్వీసులను నడపాలని సీఎం కోరగా కాచిగూడ నుంచి ఆ రెండిటినీ ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో మమతా బెనర్జీ పేర్కొన్నారు.