Thursday, April 29, 2010

రిలయన్స్‌కు జాక్‌పాట్‌

కాంబే క్షేత్రంలో మరోచోట చమురు నిల్వలు
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని కాంబే క్షేత్రంలో మరో చమురు నిల్వను కనుగొన్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. ఈ క్షేత్రంలో కంపెనీకి ఇది నాలుగో అన్వేషణ. సీబీ - ఓఎన్‌ఎన్‌-2003/1 బ్లాకులో జరిపిన పరీక్షల్లోనే 300 బ్యారెళ్ల చమురు వెలుపలికి వచ్చినట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. అహ్మదాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బ్లాక్‌ 635 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 1,605 మీటర్ల లోతున ఉన్న చమురు నిల్వకు ధీరూభాయ్‌-47గా నామకరణం చేశారు. వాణిజ్యపరంగా చమురు లభ్యతను తెలుసుకునేందుకు సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. మొత్తం క్షేత్రం 2డీ సీస్‌మిక్‌ ఆవరించినా, అందులో 80% 3డీ సీస్‌మిక్‌ ఉందని కంపెనీ ప్రకటించింది. ఈ వివరాల ఆధారంగా మరికొన్ని వ్యూహాత్మక నిల్వలు బయటపడే అవకాశం ఉందని తెలిపింది.