Wednesday, April 21, 2010

ఎస్మా పరిధిలోకి ఐటీ రంగం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగం తప్పనిసరి సేవల పరిధిలోకి వచ్చింది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) విజ్ఞప్తి మేరకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ పరిశ్రమతోపాటు ఐటి సేవలు, ఐటి ఆధారిత సేవలు మొత్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఆంధ్ర ప్రదేశ్ తప్పనిసరి సేవలు, నిర్వహణ చట్టం, 1971 పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.