ముంబయి: రిజర్వు బ్యాంకు మంగళవారం చేపట్టిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష అన్ని వర్గాలను మెప్పించింది. వూహించిన దానికంటే తక్కువ స్థాయిలో పెంపు ఉండటంతో స్టాక్ మార్కెట్ ఉరకలేసింది. పారిశ్రామిక వర్గాలు ప్రస్తుతించాయి. బ్యాంకింగ్ వర్గాలు భరోసా ఇచ్చాయి. మంగళవారం రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బ్యాంకర్లతో భేటీ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా అందరినీ ఆకట్టుకున్న ఆర్బీఐ ఇంతకీ తాజా పరపతి విధాన సమీక్షలో ఏం చేసిందంటే..స్పష్టం చేసిన బ్యాంకులు
సీఆర్ఆర్ పావు శాతం పెంపు
రెపో, రివర్స్ రెపోలదీ అదే వరుస
ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష
అంచనాల కంటే తక్కువగానే
ఆర్బీఐ కీలక రేట్ల పెంపు
24 నుంచి అమల్లోకిరుణాలు తీసుకోదల్చిన వారికి శుభ వార్త. రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఈ ఆర్థిక సంవత్సర ద్రవ్య, పరపతి విధానంలో తన కీలక రుణ రేట్లను.. బ్యాంకింగ్ పరిశ్రమ, స్టాక్ మార్కెట్ వర్గాలు వూహించిన దాని కన్నా తక్కువగానే పెంచింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు తక్షణం పెంచబోమని బ్యాంకులు భరోసా ఇచ్చాయి. ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంపైనే ఆర్బీఐ దృష్టి సారించింది. సీఆర్ఆర్, రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను పావు శాతం మేర మాత్రమే పెంచింది. పెంపు ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తుంది.
* నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 5.75 శాతం నుంచి కేవలం పావు శాతం పెంచి 6 శాతానికి పరిమితం చేసింది. దీంతో బ్యాంకులు రిజర్వు బ్యాంకు వద్ద ఉంచాల్సిన మొత్తం మరో రూ. 12,500 కోట్లు పెరుగుతుంది. అంటే బ్యాంకుల వద్ద ఆ మేరకు నిధుల లభ్యత తగ్గుతుంది.
* సీఆర్ఆర్ పెంపు ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి రానుంది.
* రెపో, రివర్స్ రెపో రేట్లనూ 0.25 శాతం పెంచింది. తాజా పెంపుతో ఇవి వరుసగా 5.25 శాతం; 3.75 శాతానికి చేరాయి.
* బ్యాంకు రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది యథాతథంగా 6 శాతం వద్దే ఉంది.
* 2010-11 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు 8 శాతం ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 5.5 శాతానికి దిగివస్తుందన్న ఇంకో అంచనా.
* 2009-10లో జీడీపీ వృద్ధి 7.2-7.5 శాతం ఉండొచ్చు.
* తదుపరి త్రైమాసిక సమీక్ష జులై 27న చేపడతారు.
* సెప్టెంబరు కల్లా విదేశీ బ్యాంకులపై చర్చా పత్రాన్ని విడుదల చేయాలని బ్యాంకు భావిస్తోంది.
![]() - దువ్వూరి సుబ్బారావు, రిజర్వు బ్యాంకు గవర్నరు |
![]() - ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర ఆర్థిక మంత్రి |
![]() -మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు |
![]() 'విధాన చర్యల వల్ల ద్రవ్య సరఫరా తగ్గుతుంది. అంటే కచ్చితంగా రేట్లు పెరుగుతాయ్. (రుణ) డిమాండు పెరిగితే గిరాకీ-సరఫరా మధ్యఅంతరం పెరుగుతుంది. అపుడు వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆర్బీఐ ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతోందని ప్రస్తుత చర్యల వల్ల అర్థమవుతోంది. ఈ చర్యల వల్ల ప్రస్తుతానికి వడ్డీ రేట్లలో మార్పు ఉండదు' -ఒ.పి. భట్, ఎస్బీఐ ఛైర్మన్ |
![]() -చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ |
'డిమాండు-సరఫరాపై రుణ రేట్లు ఆధారపడతాయ్. స్వల్పకాలంలో మాత్రం రేట్లలో మార్పు ఉండకపోవచ్చు. అయితే మా మార్జిన్లపై ఒత్తిడి కనిపిస్తోంది. -హెచ్డీఎఫ్సీ బ్యాంకు |
![]() -ఎం.వి. నాయర్, యూనియన్ బ్యాంక్ ఛైర్మన్; ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఛైర్మన్ |