Wednesday, February 24, 2010

జోరు తగ్గిన రైల్వే షేర్లు

జోరు తగ్గిన రైల్వే షేర్లు
నెల రోజులుగా పెరిగాయ్‌
వారం రోజుల్లో కుంగాయ్‌
సాధారణంగా రైల్వే బడ్జెట్‌ కూత వినిపించడానికి ముందు రైల్వే షేర్లన్నీ పెరిగి కూర్చుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి ప్రీబడ్జెట్‌ ర్యాలీ కనిపించలేదు. అయితే అది కాస్తంత ముందుగా అంటే నెల రోజుల ముందే కనిపించింది. ఇక బడ్జెట్‌ దగ్గర పడే కొద్దీ లాభాల స్వీకరణ జరిగింది. గత వారం రోజులుగా అదే జరిగింది. మంగళవారం కూడా ఆయా షేర్లు అదే తీరును కనబరచాయి.

కెర్నెక్స్‌ మైక్రోసిస్టమ్స్‌ షేర్లనే తీసుకుంటే నవంబరులో ఇవి మంచి జోరుతో దూసుకుపోయాయి. ఆ తర్వాత కుంగుతూ వచ్చాయి. ఫిబ్రవరి 15న రూ.181 వద్ద ఉన్న ఈ కంపెనీ షేరు ధర మంగళవారానికి రూ.160కు చేరింది. కాళిందీ రైల్‌, టిటాగఢ్‌ వ్యాగన్స్‌, టెక్స్‌మ్యాకో షేర్లది సైతం అదే బాట.(పట్టిక చూడండి).

ఎందుకు పెరగలేదంటే
ఈసారి బడ్జెట్‌ నుంచి మార్కెట్‌ పెద్దగా ఆశించడం లేదు కాబట్టి బడ్జెట్‌ అయిపోయేంత వరకూ వేచిచూడలేదు. ర్యాలీ ముందే ప్రారంభమై.. ముందే ముగిసింది.
రైల్వే బడ్జెట్లో కంపెనీలు ఏం కోరుకుంటున్నాయంటే..
* ప్రైవేటు రంగానికి ప్రాధాన్యతను పెంచడం. ఆ దిశగా పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యాన్ని(పీపీపీ) పెంచడం.
* కొత్త లైన్లు, గేజ్‌ మార్పిడి, డబుల్‌ లైన్లు, మెట్రోల వంటి అన్ని విభాగాలకు మంచి కేటాయింపులు.
* పాలక్కడ్‌(కేరళ)లో కోచ్‌ ఫ్యాక్టరీ ప్రకటన.
* కోల్‌కతాలో మెట్రో రైలు సేవల రూట్ల కొనసాగింపు కోసం రూ.10,000 కోట్ల కేటాయింపు.