ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు
సర్వే చెప్పిన సత్యాలివి

* దాదాపు 67 శాతం పాదచారులు రోడ్లు దాటేటపుడు మొబైల్లో ఊసులు చెప్పుకుంటూ బైక్లో వెళ్లేవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారట.
* సర్వేలో పాల్గొన్న 60 శాతానికి పైగా బ్రిటిషర్లు రోడ్లు దాటేటపుడు కాల్స్ చేస్తామని స్వయానా ఒప్పుకున్నారు.
* దాదాపు 40 శాతం మంది సంక్షిప్త సందేశాలు(ఎస్ఎమ్ఎస్) ఇస్తూనే లేదో చదువుతూనో రోడ్లు దాటుతూ ఉంటామని చెప్పారు.
* 16 శాతం మంది అయితే మరీ ఘోరం. వీరు ఏకంగా ట్రాఫిక్లో ఇమెయిల్లు చదవడానికీ సిద్ధపడుతుంటారట.
* భీకర ట్రాఫిక్లో సైతం మూడింట ఒక వంతు మంది వెబ్సైట్లపై కన్నేయడమో లేదా ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారట.
* మరి కొంతమందయితే మీదకొస్తున్న కార్లను చూడకుండా.. మొబైల్లో వచ్చే సినిమానో, టీవీ షోలోనూ తలదూరుస్తున్నారట.
* దాదాపు 15 శాతం బ్రిటిషర్లు ప్రమాదం పాలు కావడమో.. లేదా త్రుటిలో తప్పించుకోవడమో జరిగిందంటే వినోదం ఎంత విషాదాన్ని తెచ్చిపెడుతోందో అర్థమవుతుంది. మరో 8 శాతం మంది ఆయా డ్రైవర్ల చేతిలో దెబ్బలు తినడమో.. లేదా తిట్లు తినడమో జరుగుతోంది.