వాషింగ్టన్: మహ్మద్ ఘోరీ దండయాత్రలా భారత్లోకి ప్రవేశించేందుకు ఎన్నో ఏళ్ళుగా వాల్ మార్ట్ సంస్థ ప్రయత్నిస్తూనే ఉంది. బిలియన్ డాలర్ల కొద్దీ విలువైన భారతీయ రిటైల్ మార్కెట్లోకి నేరుగా ప్రవేశించేందుకు ప్రపంచ అతిపెద్ద రిటెయిర్ అయిన వాల్మార్ట్ సంస్థ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ విషయంలో తమకు సహకరించాల్సింది గా అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటి వరకూ భారత్లో అమల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబం దనలు దేశంలోకి ఆ సంస్థ ప్రవేశాన్ని అడ్డు కుంటూ వచ్చాయి.
అమెరికాకు చెందిన వాల్మార్ట్ స్టోర్స్ ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో ఉనికిని కలిగి ఉంది. దీని విక్ర యాలు ఏటా 400 బిలియన్ డాలర్ల వరకూ ఉంటా యి. భారత్లోకి ప్రవేశించే విషయంలో సహకరిం చాల్సిందిగా ఆ సంస్థ అమెరికా చట్టసభల సభ్యులతో లాబీయింగ్ చేస్తోంది. అవసరమైతే రెండు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు, సంస్థలతో దె్వైపాక్షిక చర్చలు జరపాల్సిందిగా కూడా కోరుతోంది. అమె రికా కాంగ్రెస్ సభ్యులనే గాకుండా ఆ దేశానికి చెందిన వాణిజ్య, ఆర్థిక శాఖల వద్ద కూడా తన పైరవీలు చే స్తోంది. వాల్మార్ట్ ఇప్పటికే భారతదేశంలోకి దొడ్డి దారిన ప్రవేశించింది. బిజినెస్ టు బిజినెస్ హోల్సేల్ మార్కెట్, బ్యాక్ఎండ్ సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్ బిజినెస్ల పేరిట ఇది సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతి గ్రూప్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
2007లో ఈ కంపెనీ భారతి రిటైల్తో కలసి జాయింట్ వెంచర్ను ఆరంభించింది మొదలుకొని వాల్మార్ట్ అమెరికాలో తన లాబీయింగ్ను తీవ్రతరం చేసింది. నాటి నుంచీ నేటి వరకూ ఈ విధమైన లాబీ యింగ్ కోసం ఆ సంస్థ అధికారికంగా రూ. 52 కోట్ల మేరకు వెచ్చించింది. 2010లో మొదటి త్రైమాసికం లో లాబీయింగ్ కోసం రూ. 6 కోట్లకు పైబడిన మొత్తా న్ని కేటాయించింది. లాబీయింగ్ చేయడం అమెరికాలో చట్టబద్దమే. ఈ పని కోసం వెచ్చించిన మొత్తాలను ఆయా కంపెనీలు ప్రతీ త్రైమాసికానికి తెలియజేయాల్సి ఉంటుంది.
మలీ ్టబ్రాండ్ రిటెయిల్ రంగంలోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్ అనుమతిం చవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో వాల్మార్ట్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.
వాల్మార్ట్ అధికారులు ఎప్పటినుంచో కూడా భార త్ తమకు వ్యూహాత్మకంగా ఎంతో కీలక మార్కెట్గా చెబుతూవచ్చారు. ఈ సంస్థ అంతర్జాతీయంగా మరిం తగా విస్తరించే యోచనలో ఉంది. ఇది తన ఆదా యంలో సగం కంటే ఎక్కువ మొత్తాన్ని విదేశాల ద్వారానే పొందుతోంది. ఫ్రంట్ ఎండ్ రిటెయిల్ మార్కెట్లోకి కూడా నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత్ అనుమతించగలదన్న ఆశా భావాన్ని భారతి వాల్మార్ట్ సీఈఓ రాజ్జైన్ ఇటీవల వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రగతిశీల దృక్ప థాన్ని బట్టి తాను ఈ విధంగా భావిస్తున్నట్లు తెలి పారు.