విశాఖ ఉక్కుకు ఐఎఫ్టీడీవో పురస్కారం
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఐఎఫ్టీడీవో) ప్రపంచ మానవ వనరుల అభివృద్ధి పురస్కారం-2010ను విశాఖ ఉక్కు కర్మాగారం అందుకోనుంది. అవార్డును ఏప్రిల్ 20న లండన్లో జరగనున్న 39వ ఐఎఫ్టీడీవో సదస్సులో అందజేస్తారు.
Tuesday, March 30, 2010
విశాఖ ఉక్కు ధరల మోత
విశాఖపట్నం, న్యూస్టుడే: విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్) ధరలకు తిరిగి రెక్కలు వచ్చాయి. టన్నుకు రూ.3,000 చొప్పున పెంచేస్తూ సోమవారం కంపెనీ నిర్ణయం తీసుకుంది. పిగ్ఐరన్పై టన్నుకి రూ.2,500 చొప్పున, ఇతర లాంగ్ ప్రొడక్ట్స్పై టన్నుకి రూ.3000 చొప్పున పెంచింది. దీనికి 4% వ్యాట్ అదనం. పెంచిన ధరల ప్రకారం పిగ్ ఐరన్ టన్ను రూ.27,600కి చేరింది. 8 ఎం.ఎం., 10 ఎం.ఎం. రీబార్స్ ధర టన్ను రూ.40,560కి, 12 ఎం.ఎం. నుంచి 32 ఎం.ఎం. వరకు టన్ను రూ.40,460కి పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి మరోసారి ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పెంపు తర్వాత విశాఖ ఉక్కు ధరలు టన్ను రూ.40,000 దాటిపోయాయి. కర్మాగారం మార్చి 1న టన్నుపై రూ.1500 వరకు ధర పెంచిన విషయం విదితమే.