Tuesday, March 30, 2010

రూ.2300 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం

ముంబయి: రూ.2,325.21 కోట్ల విలువైన 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం ఆమోదించింది. బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే టికోనా డిజిటల్‌ నెట్‌వర్క్‌, వాహన విడిభాగాల తయారీదారు భారత్‌ ఫోర్జ్‌ ప్రతిపాదనలూ ఇందులో ఉన్నాయని అధికార ప్రకటనలో తెలిపారు. 8 అంశాలను వాయిదా వేయడంతో పాటు 6 ప్రతిపాదనలను తిరస్కరించారు.