బ్రహ్మణి ఉక్కులో జిందాల్కు వాటాలు?
కడప, న్యూస్టుడే: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి కడప జిల్లాలో నిర్మిస్తున్న బ్రహ్మణి ఉక్కు కర్మాగారంలో కొన్ని వాటాలను జిందాల్ కంపెనీకి అప్పగించనున్నట్లు సమాచారం. జిందాల్ యాజమాన్యం ఇప్పటికే కర్ణాటకలోని హొస్పేట్ సమీపంలో ఉక్కు కర్మాగారం నడుపుతోంది. కడపజిల్లా జమ్మలమడుగు సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రహ్మణి ఉక్కులో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. వాటాల విక్రయంపై బ్రహ్మణి, జిందాల్ వర్గాలమధ్య చర్చలు జరుగుతున్నట్లుతెలుస్తోంది. రెండు రోజుల్లో వ్యవహారం కొలిక్కివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.