చౌక ఫోన్లు తెస్తాం
మార్కెట్లోకి సోనీ ఎరిక్సన్ ఐదు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ: సామాన్యునికి కూడా అందుబాటులో ఉండేలా మరిన్ని కొత్త మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సోనీఎరిక్సన్ తెలిపింది. శుక్రవారం సోనీ ఎరిక్సన్ ఇక్కడ ఏర్పాటు చేసినఒక కార్యక్రమంలో ఆ సంస్థ ప్రచార కర్త, హిందీ సినీ నటి కరీనా కపూర్ ఎక్స్పీరియా ఎక్స్10, వివాజ్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఎక్స్పీరియా ఎక్స్10, ఎక్స్పీరియా ఎక్స్10 మినీ, ఎక్స్పీరియా ఎక్స్ 10 మినీప్రో, వివాజ్, వివాజ్ ప్రో రకాల హ్యాండ్సెట్లను సోనీ ఎరిక్సన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈమొబైల్ల ధరల శ్రేణి రూ.25,695-35,795 మధ్యలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఉన్నత శ్రేణి ఫోన్లతో పాటుగా సామాన్యునికి కూడా అందుబాటులో ఉండేలా రూ.5000 లోపు ధరల శ్రేణిలో హ్యాండ్సెట్లను మార్కెట్లోకి తేనున్నట్లు సోనీ ఎరిక్సన్ కార్పొరేట్ వైస్ప్రెసిడెంట్, ఆసియా పసిఫిక్ విభాగం అధిపతి హిరోకజూ ఇషిజుకా తెలిపారు.