1 నుంచి విశాఖ ఉక్కు ధరలు పెంపు..!
విశాఖపట్నం, న్యూస్టుడే: విశాఖ ఉక్కు ధరలు తిరిగి ఏప్రిల్ 1 నుంచి పెరగబోతున్నాయి. ఈ సారి కాస్త భారీగానే అంటే టన్నుకు రూ.1500- 2000 వరకు ఎగబాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి విక్రయాల టర్నోవర్ లక్ష్యాన్ని అధిగమించామన్న కారణంతో శుక్రవారం సాయంత్రం నుంచీ సంస్థ కొత్తగా డెలివరీ ఆర్డర్లు ఇవ్వడం నిలిపివేసింది. ఏప్రిల్ 1 తర్వాత ధరలు పెంచాకే తిరిగి అమ్మకాలు మొదలుపెడతారని సమాచారం.దీనిపై సోమవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.