కార్ల ఉత్పత్తిలో దేశంలో రెండో అతిపెద్ద కంపెనీ అయిన హ్యుండయ్ మోటార్ ఇండియా 2011-12 సంవత్సరంలో 800 సిసి సామర్థ్యం కలిగిన కారును విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.
ఈ కారును దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. త్వరలో 800 సిసి వేరియంట్ ఉత్పత్తిని కంపెనీ చేపట్టనుంది. ఇదిలాఉండగా టాటా నానో కారుకు పోటీగా కారును తీసుకువచ్చే ఉద్దేశం లేదని కంపెనీ పేర్కొంది.