Thursday, March 25, 2010

1 నుంచి పెట్రోవడ్డన

1 నుంచి పెట్రోవడ్డన
13 మహానగరాల్లో 'యూరో-|జు చమురు
హైదరాబాద్‌లో కూడా
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మరోసారి పెట్రోవాత పడనుంది. హైదరాబాద్‌ సహా ఎంపిక చేసిన 13 మహానగరాల్లో 'యూరో-IVపెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చమురు శాఖ కార్యదర్శి ఎస్‌.సుందరేశన్‌ చెప్పారు. అంతర్జాతీయ ధరలతో పోల్చుకుంటే ఈ రకం పెట్రోల్‌ 'యూరో-IIIరకం కంటే లీటరుకు రూ.0.46 ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. డీజిల్‌ లీటర్‌కు రూ.0.26 అధికంగా ఉంటుందన్నారు. ఈ భారాన్ని వినియోగదారులపై మోపనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు.