ఉపసంహరించిన ఆర్థిక శాఖ
ఎగుమతిదార్లు దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలపై చెల్లించిన సుంకాలను, దేశీయంగా సేకరణకు చెల్లించిన ఎక్సైజ్ సుంకాలను వారికి వాపసు చేసింది. గత ఏడాది ప్రభుత్వం ఈ డ్రాబ్యాక్ రూపేణా ఎగుమతిదార్లకురూ.5,000 కోట్లను వాపసు ఇచ్చింది. అయితే ముడిపదార్థాలతో సరకు తయారు చేసి, ఎగుమతి చేసిన వారికి, ఆ సరకును కొనుగోలుచేసిన వారి నుంచి చెల్లింపులు అందకపోతే కస్టమ్స్ చట్టాన్ని ప్రయోగించాలని నూతనంగా ఆదేశాలు జారీ అయ్యాయి. వారికి వాపసు చేసిన సుంకాల మొత్తాలను వసూలు చేయాలని కస్టమ్స్, ఎక్సైజ్ చీఫ్ కమిషనర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్&కస్టమ్స్ (సీబీఈసీ) నుంచి ఆదేశాలు అందాయి.