ఉద్యోగస్వామ్యం, ట్రేడ్ యూనియన్ల కారణంగా వ్యాపారకార్యకలాపాలను సరిగ్గా విస్తరించలేకపోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంస్థ ఖాతాల ప్రకారం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.2,611 కోట్ల నష్టాన్ని పొందొచ్చని ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ.575 కోట్ల లాభం నమోదు చేసుకోవడం గమనార్హం. ఆదాయం సైతం 7.9% క్షీణించి రూ.32,966 కోట్లకు పరిమితం కావచ్చని తెలుస్తోంది. కాగా, సంస్థ ఇంకా అధికారికంగా ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. లాండ్లైన్ వ్యాపారాల సబ్సిడీ కింద ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్లను పొందుతున్నా కూడా నష్టం నమోదుకానుంది. అంతేకాదు బ్యాంకు డిపాజిట్ల వల్ల కంపెనీ మరో రూ.3,080 కోట్లు కూడా పొందుతోంది. అయినా నష్టాల కష్టాలు తప్పకపోవడం గమనార్హం.బీఎస్ఎన్ఎల్ మిస్డ్ కాల్ !
తొలిసారి నష్టాల్లోకి!
పడిపోయిన మార్కెట్ వాటా
త్వరిత నిర్ణయాలు లేకే కష్టాలు
సర్కారుదే ఈ పాపమంతా
దూసుకుపోతున్న ప్రైవేటు కంపెనీలుఆ కంపెనీ కొన్నేళ్ల క్రితం వరకూ టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించింది. పైగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ కూడా. ఆ తర్వాత క్రమంగా తన ప్రభను కోల్పోతూ ఇప్పుడు తొలిసారిగా నష్టాలను నమోదు చేసే స్థితికి వచ్చేసిందని విశ్లేషకులు అంటున్నారు. మరో పక్క మార్కెట్ వాటా సైతం సగానికి సగం తగ్గిపోయినట్లు స్వయానా ప్రభుత్వమే వెల్లడించింది. ఆ సంస్థే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్). మరో పక్క ఉద్యోగ సంఘాలు 20న దేశవ్యాప్త సమ్మె చేపడుతోంది. ఇలాంటి కష్టాల నడుమ కంపెనీ ప్రైవేటు కంపెనీల పోటీని తట్టుకోవడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అడ్డంకులెన్నో
'కంపెనీని ప్రభుత్వమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. బోర్డునెపుడూ స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం ఇవ్వలేద'ని దువా కన్సల్టింగ్ సీనియర్ ప్రిన్సిపాల్, వీఎస్ఎన్ఎల్ మాజీ ఛైర్మన్ బి.కె. సింగాల్ అంటారు. 'సంచార్ భవన్ నుంచే బీఎస్ఎన్ఎల్ను నడుపుతున్నార'ని ఆయన పేర్కొనడం గమనార్హం.(సంచార్ భవన్లో టెలికాం శాఖ ఉంది). భారతీ ఎయిర్టెల్ వంటి ప్రైవేటు కంపెనీలు త్వరిత నిర్ణయాలతో దూసుకుపోతూంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం వివిధ ఉద్యోగస్వామ్య స్థాయుల్లో ఎదురవుతున్న అడ్డంకుల మూలంగా వేగంగా విస్తరించలేకపోతోంది. దశాబ్ద కాలం కిందట దేశవ్యాప్త సేవలకు అనుమతి ఉన్న ఒకే ఒక కంపెనీ ఇది. అయితే విస్తరిస్తున్న మార్కెట్కు అనుగుణంగా సరైన సామగ్రిని మాత్రం కొనలేకపోతోంది. మరో పక్క ప్రైవేటు కంపెనీలు మాత్రం నెలకు లక్షల కొద్దీ వినియోగదార్లను కొత్తగా చేర్చుకుంటూ పోతున్నాయి. 2006లో జీఎస్ఎమ్ లైన్ల కోసం బీఎస్ఎన్ఎల్ వేసిన 6.3 కోట్ల లైన్ల కోసం వేసిన ప్రాథమిక టెండర్ కాస్తా టెలికాం మంత్రి రాజా జోక్యంతో 1.2 కోట్లకు పరిమితమైంది. దాని తర్వాత వచ్చిన 9.3 కోట్ల జీఎస్ఎమ్ లైన్ల టెండర్ సైతం వివాదాల కారణంగా రద్దు అయింది.
మంత్రి రాజా ![]() |
|